English | Telugu

'బడ్డీ'.. సందీప్ కిషన్ కాదు, అల్లు శిరీష్!

గతేడాది 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంతో ఆకట్టుకున్న అల్లు శిరీష్ ఈ ఏడాది 'బడ్డీ' అనే చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకుడు. నేడు(మే 30) శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ని విడుదల చేశారు.

నిజానికి 'బడ్డీ' చిత్రాన్ని గతంలో సందీప్ కిషన్ హీరోగా ప్రకటించి, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి సందీప్ ప్లేస్ లోకి శిరీష్ ఎంట్రీ ఇచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు శిరీష్. తాజాగా విడుదలైన 'బడ్డీ' ఫస్ట్ లుక్ కూడా మరో విభిన్న చిత్రమనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉంది. ఇక ఈ మూవీ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. 'బడ్డీ'ని చంపడానికి ఒకతను కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం, రౌడీ గ్యాంగ్ నుంచి దానిని రక్షించడానికి శిరీష్ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలతో.. శిరీష్, బడ్డీ పాత్రలను పరిచయం చేసిన తీరు మెప్పించింది. ఇక గ్లింప్స్ చివరిలో 'కేజీఎఫ్', 'విక్రమ్' సినిమాల రేంజ్ లో బడ్డీ మిషన్ గన్ తో షూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా, స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ లో ఆర్య హీరోగా 'టెడ్డీ' అనే చిత్రాన్ని రూపొందించింది. 2021 లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు శిరీష్ నటిస్తున్న ఈ 'బడ్డీ' సినిమా, ఆ 'టెడ్డీ'కి సీక్వెల్ అని తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.