Read more!

English | Telugu

తెలుగునాట కళ్లుచెదిరేలా 'ఆదిపురుష్' బిజినెస్!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఆయన రేంజ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. తాజాగా 'ఆదిపురుష్'తో మరోసారి ఆయన తన రేంజ్ ఏంటో తెలియజేశాడు.

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రూ.170 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు టీసిరీస్ బ్యానర్ లోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న 'స్పిరిట్' చిత్ర నిర్మాణంలో సైతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఓ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.