English | Telugu

తెలుగునాట కళ్లుచెదిరేలా 'ఆదిపురుష్' బిజినెస్!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఆయన రేంజ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. తాజాగా 'ఆదిపురుష్'తో మరోసారి ఆయన తన రేంజ్ ఏంటో తెలియజేశాడు.

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రూ.170 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు టీసిరీస్ బ్యానర్ లోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న 'స్పిరిట్' చిత్ర నిర్మాణంలో సైతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఓ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.