English | Telugu

తెలుగులో హిట్ గా నిలిచిన '2018'

2018లో సంభవించిన కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మలయాళ చిత్రం '2018'. టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. మలయాళ వెర్షన్ మే 5 న విడుదల కాగా, రూ.150 కోట్ల గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు వెర్షన్ మే 26 న విడుదల కాగా, ఇక్కడ కూడా విజయం సాధించడం విశేషం.

'2018' చిత్రాన్ని తెలుగునాట బన్నీ వాసు విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.1.80 కోట్లని అంచనా. అయితే మొదటి వీకెండ్ లోనే రెండు కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా, తెలుగులోనూ హిట్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.02 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.1.71 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.60 కోట్ల గ్రాస్ రాబట్టిన '2018'.. మూడు రోజుల్లో రూ.4.33 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. షేర్ పరంగా చూస్తే రూ.2.02 కోట్లు రాబట్టింది.

సినిమాకి పాజిటివ్ టాక్ కి తోడు, వేసవి సెలవులు కావడం.. పైగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో ఫుల్ రన్ లో '2018' సినిమా తెలుగులో మంచి లాభాలనే పొందే అవకాశముంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.