English | Telugu

2018 మూవీ ఇష్యూ... కేర‌ళ థియేట‌ర్లు బంద్‌!

టొవినో థామ‌స్ హీరోగా న‌టించిన సినిమా 2018. కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఆద్యంతం భావోద్వేగభ‌రితంగా రూపొందించారు డైర‌క్ట‌ర్‌. ఈ సినిమాను ఇటీవ‌ల తెలుగులో విడుద‌ల చేశారు. కొన్న‌దానికి ప‌దింత‌ల లాభం తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో జూన్ 7 నుంచి ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇది కేర‌ళ థియేట‌ర్ ఓనర్స్ ని అప్‌సెట్ చేసింది. అందుకే జూన్ 7, 8న ప్రొటెస్ట్ చేయ‌నున్నారు. ఇంత త్వ‌ర‌గా ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. థియేట‌ర్స్ లో 2018కి బ్ర‌హ్మాండ‌మైన ర‌న్ ఉంది. ఇప్పుడు క‌నుక ఓటీటీలో విడుద‌ల చేస్తే వ‌చ్చేవారు కూడా రారు. అందుకే కేర‌ళ థియేట‌ర్ ఓన‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. సినిమా విడుద‌లైన ఐదు వారాల్లోపే ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌.

అయితే జూన్ 7 నుంచి ఈ సినిమా ఓటీటీల్లో అందుబాటులో ఉంటుంద‌ని డిజిట‌ల్ ప్లాట్‌ఫార్మ్ మే 28నే అనౌన్స్ చేసింది. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, హిందీలోనూ అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అప్పుడు దీని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కాక‌పోతే ఇప్పుడు సినిమాకు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. 200 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌సూళ్లున్నాయి. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సార‌మైతే ఆ రికార్డు క్రియేట్ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఒక వెర్ష‌న్‌. ఐదేళ్ల క్రితం కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ఆ నేప‌థ్యంలో తెర‌కెక్కిందే 2018. ఇప్ప‌టివ‌ర‌కు మోహ‌న్‌లాల్ న‌టించిన పులిమురుగ‌న్ కేర‌ళ‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా రికార్డుల్లో ఉంది. ఈ రికార్డును కూడా 2018 తుడిచిపెట్టేసింది. జూడ్ ఆంటోని జోసెఫ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్ప‌టిదాకా 170 కోట్లు క‌లెక్ట్ చేసింది. కుంచెకో బొబ్బ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, ఆసిఫ్ అలీ, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ అప‌ర్ణ బాల‌ముర‌ళి, అజు వ‌ర్గీస్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.