Read more!

English | Telugu

తాతా పుట్టినరోజునాడైనా మహానాడుకి వెళ్తాడా !


నందమూరి తారకరామారావు 91 జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంతా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అందించారు. హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురూ  ఎన్టీఆర్ ఘాట్ వద్ద కలిసి కనిపించారు. ఇలా వీరు ముగ్గురూ కలిసి కనిపించడం, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేతులు పట్టుకుని కలిసి నడవడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. ఇక బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కుటంబంతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు.


అయితే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం బాగానే ఉందనిపిస్తున్నా, టిడిపీ పార్టీతో మాత్రం అంతగా పొసగటం లేదేమో అనిపిస్తుంది. తెలుగు దేశం పార్టీ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 33వ మహానాడుకి ఆయన వెళ్లకపోవడమే ఇందుకు కారణఁ. రెండో రోజైనా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు వెళ్తారా అనే  అనుమానం అందరిలో మెదులుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ ఈ సారి యంగ్ టైగర్ టిడిపీ పార్టీ తరపున పాల్గొనలేదు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటో ఇప్పటి వరకూ తెలియరాలేదు. అయితే ఎన్నికల ముందు చంద్రబాబుతో విభేదించిన హరికృష్ణ కూడా మహానాడుకు హాజరు అయ్యారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు అయినా మహానాడుకు వెళ్తారా లేదా అనే ఆసక్తి నెలకొని వుంది.