Read more!

English | Telugu

మనం’డైరెక్టర్ విక్రమ్ మిస్సింగ్


 
‘మనం’ సినిమా సూపర్ హిట్. చూసిన వాళ్ళు, నిర్మించిన వాళ్లు ఫుల్ ఖుష్. కథ బాగుంది. డైరెక్టర్ బాగా తెరకెక్కించారు అని చూసిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు. కానీ ఆ కాంప్లిమెంట్స్ అందుకోవాల్సిన డైరెక్టర్ గారేరి...
మలయాళ దర్శకుడు ప్రియ దర్శన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన విక్రమ్ కుమార్ ‘మనం’ సినిమాను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని చూసిన ప్రతివారు మెచ్చుకుంటున్నారు. ప్రిమియర్ మొదలుకుని, షో చూసిన సినీ ప్రముఖులు, మీడియా అంతా మనం అక్కినేనికి నిజమైన నివాళి అని కీర్తిస్తోంది. మరి ఇంతటి కళాఖండాన్ని తెరపై తీర్చిదిద్దిన డైరెక్టర్ విక్రమ్ ఈ విజయాన్ని ఆస్వాదించటంలో ఎందుకు తెరమరగయ్యారు. ఇది ఆయన నిరాడంబరతో, మరొకటో కాదంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
చిత్ర షూటింగ్ అనంతరం హీరో నాగార్జునతో, దర్శకుడు విక్రమ్‌కు విబేధాలు ఏర్పడ్డాయని టాకు. ఎడిటింగ్, రిలీజింగ్, ప్రమోషన్ వంటి పనులన్నీ నాగార్జున దగ్గరుండి చూసుకున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఇవి పూర్తిగా అవాస్తవం కాదు అనడానికి నిదర్శనం విక్రమ్ ‘మనం’ సినిమా విడుదల ముందూ, తర్వాత కూడా ఎక్కడా కనిపించకపోవడం. మరో వైపు విక్రమ్ కుమార్ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించిన  మీడియా వర్గాలకు ఆయన  వింత సమధానాలు చెప్పున్నాడనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ‘మనం’ సినిమా గురించి తాను చెప్పేది ఏమిలేదని, ఆ సినిమాయే తానేమిటో చెపుతుందని, ఇంటర్వ్యూలు కావాలంటే ఆ చిత్రం లో నటించిన నటీనటులతో చేసుకోండి అని చెబుతున్నాడట. ఈ వార్తలు, విక్రమ్ కనిపించకపోవడం,  ఆయన మీడియాకు అందకుండా ఉండటం చూస్తే వ్యవహారం  గందరగోళంగానే వుంది అనిపిస్తోంది ఎవరికైనా.