Read more!

English | Telugu

'అల్లుడు శీను'తో తమన్నా రొమాన్స్..!

 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన తొలి సినిమా 'అల్లుడు శీను'తోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే జోష్ తో రెండు సినిమాకి కూడా సిద్దమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి తమన్నా కథానాయికగా ఎంపికయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 'అల్లుడు శీను' చిత్రంలో ఐటమ్ పాట చేసిన తమన్నా, రెండో సినిమాలో ఏకంగా శ్రీనివాస్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.