English | Telugu

ఎన్టీఆర్ రూట్ మార్చాడు..!

గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ రూట్ మార్చినట్లు సమాచారం. రొటీన్ మాస్ సినిమాలను పక్కన పెట్టేసి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలతో తెరపై కనిపించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగా ఇటీవల దర్శకుడు క్రిష్ చెప్పిన ఓ సబ్జెక్టు ను ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో బిజీగా వున్న ఎన్టీఆర్, ఆ తరువాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ మూవీ సెట్స్ పైకి వెళుతుందట. క్రిష్ ఇప్పుడు బాలీవుడ్‌లో ‘గబ్బర్' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే టాలీవుడ్‌ వైపు ఫోకస్ పెట్టాలని క్రిష్ అనుకున్నట్లు ఆయన క్లోజ్‌ ఫ్రెండ్స్ చెబుతున్నారు. అంతా ఓకే అయితే.. వీళ్ల కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ పట్టాలకెక్కనుంది.