Read more!

English | Telugu

విక్రమసింహ కంటే మనం సూపర్

 

 

రోబో సినిమా నుంచి రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి యావత్ సినీ పరిశ్రమ గుర్తించింది. ఇక టాలీవుడ్ కూడా ఈ విషయానికి మినహాయింపు కాదు. రజనీ సినిమా విడుదల అవుతుంది అంటే ఏ ప్రముఖ హీరోలు కూడా ఆ సమయంలో తమ సినిమా విడుదల చేయటానికి సంకోచిస్తారు. అలా రజనీ సినిమా సమయంలో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుదలై ఓపెనింగ్స్‌లో తేడా వచ్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి. నాగార్జన కూడా విక్రమసింహ విడుదల సమయంలో మనం చిత్రం విడుదల గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించుకున్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో రజనీ సినిమాలకు 30 కోట్లకు పైగా మార్కెటు ఉండటం ఇందుకు కారణం.


కానీ వరల్డ్‌వైడ్ 2000 లకు పైగా థియోటర్లలో విడులైన రజనీకాంత్ విక్రమసింహ చిత్రం థియేటర్ల వద్ద ఈ సారి జనం పెద్దగా కనిపించలేదట. అదే మనం థియేటర్ల వద్ద ఆడియెన్స్ ఎక్కువగా వుంటే విక్రమసింహ టికెట్ కౌంటర్ల దగ్గర జనం అంతంత మాత్రంగా ఉన్నారట. కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి, ఎంతో పబ్లిసిటీ ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన విక్రమ సింహ మన అక్కినేని వారి మనం ముందు నిలబడలేక పోయింది అనే అనిపిస్తోంది. యానిమేషన్ ప్రక్రియతో రజనీ కుమార్తె సౌందర్య చేసిన ఈ చిత్రానికి ఇక్కడ కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదని టాక్.