Read more!

English | Telugu

రికార్డు స్థాయిలో కార్తికేయ

 

"స్వామి రారా" చిత్రం ద్వారా మంచి సక్సెస్ ను అందుకున్న నిఖిల్, స్వాతిలు మరోసారి ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి మన ముందుకు రాబోతున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం "కార్తికేయ". వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

రోజు రోజుకి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి..."ఈ సినిమా కోసం వేచిచుస్తున్నాను" అని అనడంతో "కార్తికేయ"పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ప్రముఖ జెమిని టీవీ దాదాపు 1.3 కోట్లు పెట్టి ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారం. ఇప్పటి వరకు నిఖిల్, స్వాతి కెరీర్ లో వాళ్ళ సినిమా ఇంతటి రేంజులో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.

ప్రజలకు చికిత్స అందించడానికి వెళ్ళిన వైద్య బృందం ఓ దేవాలయానికి సంబంధించిన విషయంలో ఎందుకు కలుగజేసుకుందనేది ప్రధానాంశం. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.