Read more!

English | Telugu

హిజ్రాగా సార్ట్‌ హీరో కుమారుడు.. షాక్‌లో బాలీవుడ్‌!

ఒక స్టార్‌ హీరో కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే.. ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా మొదటి సినిమాను లవ్‌ సబ్జెక్ట్‌తో చేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలా మంది హీరోల కుమారులు ఇదే ఫాలో అయ్యారు. అయితే కొందరు మాత్రం యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని ఎంపిక చేసుకున్నారు. ఎవరైనా తన ఎంట్రీ చాలా గ్రాండ్‌గా వుండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ఖాన్‌ కుమారుడు కూడా ఒక ప్రేమకథా చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమీర్‌ ఖాన్‌ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు జునైద్‌ ఖాన్‌.. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించనున్న ‘మహారాజ్‌’ చిత్రంతో నటుడిగా వెండితెరపైకి అడుగుపెట్టనున్నాడు. అతడి సరసన సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి నటిస్తోంది. సాయిపల్లవికి కూడా ఇది బాలీవుడ్‌ తొలి చిత్రం.

జునైద్‌ ఖాన్‌ గత కొంతకాలంగా థియేటర్‌ నాటకాల్లో నటిస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. తన తదుపరి నాటకంలో చేసే పాత్రతో అందర్నీ సర్‌ప్రైజ్‌ చెయ్యబోతున్నాడు. తన తదుపరి థియేటర్‌ ప్లే ‘స్ట్రిక్ట్‌లీ అన్‌కన్వెన్షనల్‌’లో ట్రాన్స్‌వుమన్‌ (హిజ్రా) పాత్రలో నటించనున్నాడు జునైద్‌.  15 నవంబర్‌ 2023 సాయంత్రం ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. జునైద్‌ఖాన్‌ ఈ నాటకంలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని, అతడి పాత్రల్లో ఒకటి ట్రాన్స్‌ వుమన్‌ పాత్ర అని తెలిసింది. ట్రాన్స్‌ వుమన్‌ పాత్ర విషయానికి వస్తే, జునైద్‌ ఆడవారి సాంప్రదాయ దుస్తులు ధరించి విగ్‌తో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాడు. ఈ నాటకంలో జునైద్‌ పోషించే  రెండో పాత్ర ఏమిటనేది తెలియరాలేదు.