Read more!

English | Telugu

మా సినిమా వలనే చాలా మంది విడాకులు తీసుకున్నారు. ఒప్పుకున్న టాప్ హీరోయిన్

బాలీవుడ్ అగ్రహీరోయిన్లల్లో  రాణీముఖర్జీ ఒకరు. 1997 లో వచ్చిన  రాజా కి ఆయేగీ భారత్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత గులాం,కుచ్ కుచ్ హోతాహై ,మన్, హలో బ్రదర్ ,వీర్ జార ,హమ్ తుమ్,పహేలీ, మంగళ్ పాండే, బంటీ ఔర్ బబ్లీ, బాబుల్ ఇలా ఎన్నో సినిమాల్లో అధ్బుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా ఆమె గోవా లో జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె  తన గత చిత్రాన్ని ఉదహరిస్తు  చేసిన కొన్ని కీలక వ్యాక్యలు ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

షారుఖ్ ఖాన్ ,అభిషేక్ బచ్చన్ హీరోలుగా రాణి ముఖర్జీ ,ప్రీతిజింతా  హీరోయిన్లు గా కరణ్ జోహార్ దర్శకత్వంలో కబీ అల్విదా కెహన  అనే మూవీ వచ్చింది. 2006 లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్నే అందుకుంది .ఇప్పుడు  ఈ మూవీ గురించి మాట్లాడిన రాణీజీ మా కబీ అల్విదా కెహన మూవీ చూసి అప్పట్లో చాలా మంది విడాకులు తీసుకున్నారు అని చెప్పింది. అలాగే ఎందుకు విడిపోయారో అనే  కారణాన్ని కూడా ఆమె చెప్పింది. కలిసి మనస్పర్ధలతో బతికే కంటే విడిపోయి సంతోషంగా ఉండటమే మంచిదనే ఉద్దేశంతోనే మా సినిమా ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది విడాకులు తీసుకున్నారని చెప్పింది. రాణీజీ చెప్పిన ఈ మాటలు  ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

అలాగే ఈ సందర్భంగా ఆ సినిమాలో తాను పోషించిన మాయ క్యారక్టర్ ని గుర్తు చేసుకున్న రాణీజీ తన క్యారక్టర్ గురించి మరో సారి అందరితో పంచుకుంది. మాయ తన భర్త రిషిని విపరీతంగా ప్రేమిస్తుంది.కాకపోతే  తన భర్త నుంచి రొమాన్స్ ని కూడా  కోరుకుంటుంది. కానీ అతనితో తనకి కావలసింది  చెప్పుకోలేదు అతనుకూడా నాకు ఏం కావాలో అని అడగడు అని తన క్యారక్టర్ పడే బాధని రాణీజీ చెప్పుకొచ్చింది. ఇక కబీ అల్విదా కెహాని కథ మెయిన్ పాయింట్ ఏంటంటే కాపురం చెయ్యడం ఇష్టం లేని  రెండు జంటలు  తమ భర్త లేదా భార్యని వదిలేసి మరొకరితో జీవించడం. ఈ లైన్ ని దృష్ఠ్టిలో పెట్టుకొని రాణి ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనలం సృష్టిస్తున్నాయి.