English | Telugu

మరోసారి హాస్పిటల్‌లో చేరిన దిలీప్ కుమార్

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.

శ్వాసకోస సమస్యలతో బాధప‌డుతోన్న దిలీప్ కుమార్‌ ను ఇటీవల జూన్ 6 న కుటుంబసభ్యులు అదే ఆసుపత్రిలో చేర్పించారు. రెండు వారాల క్రితం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను మళ్లీ ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జ్ అయిన రెండు వారాల్లోనే దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.

దిలీప్ కుమార్ మొదటిసారి 1944లో వెండితెరకు పరిచయమయ్యారు. కోహినూర్, మొఘల్-ఎ-అజామ్, దేవదాస్ తో పాటు పలు చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ న‌టుడిగా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998 లో కిలా అనే సినిమాలో నటించారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.