English | Telugu

కొవిడ్ కేర్ సెంట‌ర్‌కు అమితాబ్ రూ. 2 కోట్ల విరాళం!

ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ సెంటర్‌కు అమితాబ్ బచ్చన్ రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. 300 పడకలతో కూడిన ఈ సదుపాయం ఈ రోజు (మే 10) ప్రారంభం కానున్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అమితాబ్ కంట్రిబ్యూష‌న్‌కు ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలిపారు. సిక్కుల‌ను లెజెండ‌రీగా అమితాబ్ అభివ‌ర్ణించారు. కోవిడ్ కేర్ సెంటర్ కోసం ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఆయ‌న‌ ఏర్పాటు చేశారు.

అకాలీదళ్ పార్టీ జాతీయ ప్రతినిధి కూడా అయిన మంజిందర్ సింగ్ సిర్సా సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ ఫెసిలిటీకి రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. సిర్సా త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో, "సిక్కులు లెజెండరీ, వారి సేవకు వందనం.. ఇవి అమితాబ్ బచ్చన్ శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ ఫెసిలిటీకి రూ. 2 కోట్లు అందించినప్పుడు చెప్పిన మాటలు. ఢిల్లీ ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న‌ప్పుడు, దాదాపు రోజూ ఈ ఫెసిలిటీ పురోగతి గురించి అమితాబ్ నాకు కాల్ చేసి ఆరా తీస్తూ వ‌చ్చారు. అని రాశారు.

రాకాబ్ గంజ్ గురుద్వారాలో ఈ సౌకర్యం సోమవారం (మే 10) ప్రారంభమవుతోంది. ఇందులో 300 పడకలు, ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌, డాక్ట‌ర్లు, పారామెడిక్స్, అంబులెన్సులు ఉంటాయి. రోగులకు ఉచితంగా అన్ని సేవలు అందించబడతాయి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.