English | Telugu
డాక్టర్ అయిన హీరోయిన్
Updated : Nov 4, 2023
1998 వ సంవత్సరంలో హిందీ లో మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన దిల్ సే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి ప్రీతిజింతా. దిల్ సే తెలుగులో కూడా ప్రేమతో అనే పేరుతో హిందీ తో పాటే ఒకేసారి రిలీజ్ అయ్యింది. అలాగే ప్రీతి తెలుగులో డైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ మూవీ అయిన రాజకుమారుడు లో మహేష్ కి జోడిగా నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.ఇప్పుడు ఇన్నాళ్ళకి ప్రీతి డాక్టర్ అవ్వబోతుంది.
బ్రిటన్ కి చెందిన బర్మింగ్ హోమ్ సిటీ యూనివర్సిటీ ప్రీతి జింతా కి డాక్టరేట్ ని ప్రధానం చేసింది. నటిగా, నిర్మాతగా,బాలీవుడ్ సినిమా రంగానికి ప్రీతి జింతా చేసిన సేవలకి గాను బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ ప్రీతి కి డాక్టరేట్ ని ఇచ్చి సత్కరించింది. బర్మింగ్ హోమ్ లో శని ఆది వారాల్లో జరిగే దీపావళి ఉత్సవాల్లో కూడా ప్రీతి పాల్గొనబోతుంది.
ప్రీతి జింతా తన ఎంటైర్ సినీ కెరీర్ మొత్తంలో అన్ని భాషల్లో కలిపి సుమారు 40 చిత్రాల్ల్లోపైగానే నటించింది. సల్మాన్ తో చేసిన చోరీ చోరీ చుప్ కే చుప్ కే, షారుఖ్ తో చేసిన దిల్ సే, కల్ హో నా, వీర్ జార, హృతిక్ రోషన్ తో చేసిన కోయి మిల్ గయా, క్రిష్ లాంటి సినిమాలు ప్రీతి జింతా కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.