resolution in telangana assembly

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదని తెలిపారు. ప్రస్తుతం పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి అన్నారు.  లోక్ సభలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని, అయితే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని కోరారు.  అలాగే జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాల్సిన అవసరముందన్నారు. ఇక డీలిమిటేషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన  ఏంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.  మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా జనాభా ప్రాతిపదికన  నియోజకవర్గాల  పునర్విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిథ్యం ఉందనీ, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ ప్రాతినిథ్యం 19 శాతానికి పడిపోతుందన్నారు.  

no respite to vidadala rajani in high court

హైకోర్టులో విడదల రజినికి లభించని ఊరట

వైసీపీ నాయకురాలు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట లభించలేదు. అవినీతి కేసులో విడదల రజని దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం (మార్చి 27) విచరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. బెయిలుపై కనీసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విడదల రజని విజ్ణప్తిని తోసిపుచ్చింది.   మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ  అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో  మంత్రి హోదాలో విడదల రజిని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా విడదల రజిని,  రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేసిన పల్లె జాషువా, రజిని సమీప బంధువు విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణులు సహ నిందితులుగా ఉన్నారు.  

good days to ap industrial sector

జగన్ హయాంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడు పరుగులు

ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. అంతేనా అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేవం కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో పరిశ్రమల రంగానికి మహర్దశ పట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి  తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. అదే సమయంలో గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది లాలూ గ్రూపు గురించి.  గతంలో అంటే 2014-2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. అప్పట్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటుకు సుప్రసిద్ధ వ్యాపార దిగ్గజం లాలూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందు కోసం అప్పటి చంద్రబాబు సర్కార్ ఆ కంపెనీకి భూమిని కేటాయించింది. ఏపీఐఐసీ ద్వారా సదరు భూమిని స్వాధీనం చేసుకున్న లులూ షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. ఈ లోగా  2019  ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టారు. అంతే.. వైసీపీ పాలనలో లులూకు అంతగా ప్రోత్సాహం లభించడం సంగతి అటుంచి వేధింపులు మొదలయ్యాయి.  దీంతో లులూ గ్రూప్ తన ప్రాజెక్టును రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది.   ఆ ప్రాజెక్టును ఆ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో   తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలో పారిశ్రామిక రంగం దశ తిరిగింది. దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టడం ప్రారంభమైంది. చంద్రబాబు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నది. దీంతో లులూ గ్రూపు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లులూకు స్వాగతం పలికారు.  జనవరిలో లులూ గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో అనుకున్నట్లుగానే విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు లులూ చైర్మన్ ప్రతిపాదించగా, చంద్రబాబు వెంటనే ఓకే చెప్పారు. అంతే కాకుండా గతంలో లులూకు కేటాయించిన భూమిని తిరిగి కేటాయిస్తూ   పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో తీర్మానం చేశారు. దీంతో నాడు జగన్ కారణంగా తరలిపోయిన లులూ తిరిగి రాష్ట్రంలోనికి అడుగుపెడుతున్నది. 

One of the five richest people has moved abroad.

ఐదుగురు అత్యంత ధనవంతుల్లో ఒకరు  విదేశాలకు 

విదేశాలకు వలస వెళ్లడం అంత ఆష మాషి  కాదు. స్వంత గూడు వదిలి విదేశాల్లో  స్థిరపడాలనుకోవడం అంత మామూలు విషయం కాదు.  భారత్ లో మిత వాద రాజకీయాలు,  విభజించి పాలించే రాజకీయాలు దేశంలోని అత్యంత సంపన్నులు విదేశాల్లో సెటిల్ కావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  ఓ వైపు పన్నుల ఒత్తిడి , రాజకీయ కక్ష్య సాధింపు చర్యల కారణంగా మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది. వేలాది మంది కోటీశ్వరులు దేశ సరిహద్దులు దాటి పర్మినెంట్ గా విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహించి కొటక్  ప్రయివేటు ఈవై  సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ వివరాలను వెల్లడించింది.  మనదేశంలోని జీవన ప్రమాణాలతో పోలిస్తే విదేశాల్లో మెరుగ్గా ఉండటంతో  అక్కడ స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతీయేడు 25 లక్షల మంది విదేశాలకు ఎగుమతి అవుతున్నారు.  పిల్లా పాపలతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువైంది.  స్వాతంత్రానికి పూర్వం కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే సంస్కృతి ఉంది. అనేక నియమ నిబంధనలతో బాటు ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్లే వారు.  ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాలతో పోలిస్తే అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల్లో పెట్టు బడులు పెట్టి వ్యాపారం చేసే సంస్కృతి వెళ్లూనుకుంది.  సూపర్ రిచ్  ఇండియన్స్ కు గోల్డెన్ వీసా రావడం వల్ల  పెద్దగా కష్టపడకుండానే విదేశాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. గోల్డెన్ విసా అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఒకరు. సినిమాల  నుంచి రాజకీయాలకు  వెళ్లాలనుకున్న రజనీకాంత్ కి యునైటెడ్ అరబ్ ఎమ్మిరేట్స్ గోల్డెన్ విసా ఇవ్వడంతో తమ అభిమాన నటుడు భారత్ ను వదిలేస్తారా అని అభిమానులు ఆందోళన చెందారు. గోల్డెన్ విసా జాబితాలో చిరంజీవి, షారూఖ్ ఖాన్,  సానియా మిర్జా, అల్లు అర్జున్ , త్రిష, మోహన్ లాల్ , మమ్ముట్టి తదితరులు ఉన్నారు. 2019లో గోల్డెన్ విసాను కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది.  ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ధనవంతులకు శాశ్వత నివాస విసా అని చెప్పొచ్చు. కళాకారులకే ఉద్దేశించి గోల్డెన్ విసా ఇప్పుడు కళాకారులకు అతీతంగా సూపర్ రిచ్ ఇండియన్స్ కు వరప్రదాయినిగా మారింది.  సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోవటం అంటే  మూలధనం తరలిపోయినట్టు అని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లడం అంటే ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్లాలంటే రెండున్నరకోట్ల రూపాయలు తీసుకెళ్లాలి. అదే   ప్రవాస భా రతీయుడైతే ఏకంగా పది కోట్ల వరకు తీసుకెళ్లవచ్చు. దీనివల్ల మన దేశంలో పెట్టు బడులు పెట్టే వారి సంఖ్య తగ్గి అభివృద్ది సూచికపై ప్రభావం పడుతుంది. నిరుద్యోగ సమస్య తాండవం చేసే అవకాశం లేకపోలేదు. మన దేశ సంపద తగ్గి విదేశాలకు సంపదను తరలించినట్టు అవుతుంది.  ఒక వ్యక్తి నివాసం మారితే సంపద మారినట్టు కాదని కొటక్ మహీంద్రా ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ అభిప్రాయానికి ఏకీ భవించడం లేదు. 2023లో అల్ట్రా ఎన్ హెచ్ ఐలు 2. 83 లక్షల మంది ఉంటే వీరి సంపద విలువ నికరంగా  రూ 283 కోట్లు ఉంది. 2028 వరకు వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుతుంది.  వీరి సంపద రూ. 359 లక్షల కోట్లకు చేరొచ్చని సర్వే వెల్లడించింది. సర్వేలో 66.66 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీళ్లంతా తాము విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తికనబరిచిన వారే కావడం గమనార్హం.

jagan not changer even after humiliating defeat

.. అయినా జగన్ మారలేదు.. ఆయన పార్టీ తీరు మారలేదు!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కక్ష సాధింపు, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడటమే పాలన అన్నట్లుగా సాగింది. చట్టాలకు తిలోదకాలిచ్చేసి ఇష్ఠారీతిగా  చెలరేగిన వారందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం ముందు నిలబడకతప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా కొందరు ముందస్తు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు. ఇంత జరిగినా వైసీపీ అధినేత జగన్ మారలేదు. ఆయన పార్టీ తీరు మారలేదు. గతంలో ప్రత్యర్థి పార్టీలపై అనుచిత భాషలో విరుచుకుపడిన వారికి జగన్ పదవులు, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. జగన్ అరాచక, అభివృద్ధి నిరోధక పాలనకు తోడు, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత భాషా ప్రయోగం కూడా జగన్ పార్టీ ఘోర ఓటమికి కారణం అనడంలో సందేహం లేదు. అయితే జనం ఓటుతో బుద్ధి చెప్పినా, కనీసం విపక్ష హోదాకు కూడా జగన్ కి, జగన్ పార్టీకీ అర్హత లేదని తేల్చేసినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా భాష విషయంలో ఆయన ఇసుమంతైనా రాజీపడటం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో పార్టీ పదవులు దక్కాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం కూటమి నేతలపై బూతులు, అనుచిత భాషలో విరుచుకుపడేవారికే పదవులు అని జగన్ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ అనుచిత భాషా ప్రయోగంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉంటే అది అదనపు అర్హతగా భావిస్తున్నారు. తాజాగా వైసీపీ యూత్ వింగ్ కు కొత్తగా నియమితుడైన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  బైరెడ్డి సిద్దార్థరెడ్డి కోసం జగన్ పార్టీ యూత్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు సృష్టించారు. ఇంతకీ ఇంత హడావుడిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి పదవి ఎందుకు కట్టబెట్టారంటే.. ఆయన అధికార కూటమిపై విమర్శలతో విరుచుకుపడటమే. అంతేనా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అంటూ వార్నింగ్ ఇవ్వడమే. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మంగళవారం (మార్చి 25)న తెలుగుదేశం కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (మార్చి 26) ఆయనకు పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతకీ ఈ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా పని చేశారు. ఆడుదాం ఆంధ్ర పేర పెద్ద ఎత్తున జరిగిన నిధుల దుర్వినియోగంలో అప్పటి టూరిజం, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు సిద్ధార్ద్ రెడ్డిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై ఆయన నేడో రేపో కేసులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికే వైసీపీలో పెద్ద పీట లభిస్తుంది. పదవుల విషయంలో అగ్రతాంబూలం దొరుకుతుంది.  

andhrapradesh police use frone technology to control crime

నేరాల అదుపునకు డ్రోన్ టెక్నాలజీ.. ఏపీలో సమర్ధంగా వినియోగం

ఆంధ్రప్రదేశ్ లో నేరాల అదుపునకు, నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తున్నది  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ లో నేరాలను అదుపు చేయడమే కాక, నియంత్రించవచ్చని పదే పదే చెబుతూ వస్తున్నారు. దీంతో పోలీసు శాఖ ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేస్తున్నది. గంజాయి సాగును గుర్తించడంలో ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇప్పుడు.. పేకాటరాయుళ్లను అదుపు చేయడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తోంది. అత్యంత రహస్యంగా చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఈ  వీడియోను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం (మార్చి 27) సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. లక్షలాది మంది వీక్షించారు. పోలీసు శాఖ డ్రోన్ లను నేరాల అదుపులో వినియోగించుకుంటున్న తీరును ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ప్రకారం విజయనగరంలోని ఓ మారుమూల ప్రాంతంలోవాహనాల గ్యారేజీని వేదికగా చేసుకుని ఓ లారీలో కూర్చుని పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సహాయంతో గుర్తించిన పోలీసులు అతి తేలికగా వారున్న ప్రదేశానికి చేరుకుని లారీ ఎక్కి మరీ పేకాట రాయుళ్లను అదుపులోనికి తీసుకున్నారు.  సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల అదుపు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందనడానికి ఇదే తార్కాణంగా నెటిజనులు అంటున్నారు. 

brs pleanary not in warangal

గులాబీ పార్టీ సన్ స్ట్రోక్ .. ప్లీనరీ వేదిక మార్పు?

లక్షల మందితో వరంగల్‌లో ప్లీనరీ నిర్వహించి క్యాడర్‌లో జోష్ నింపాలని ఫిక్స్ అయింది గులాబీ పార్టీ. అయితే వారికి వాతావరణం, పరిస్థితులు అనుకూలించడం లేదంట. దాంతో సభను వాయిదా వేస్తే మరింత పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, అందుకే సభాస్థలి మార్చడానికి ఫిక్స్‌ అయ్యారంట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి పాతికేళ్లు అవుతుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది. వరంగల్ లో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను సైతం నాయకులు పరిశీలించారు. అయితే ఎండల తీవ్రత, వరి కోతల టైమ్ కావడంతో వరంగల్ సభ సభకు జనాన్ని సమీకరించడం అసాధ్యమని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం. అందుకే సభా స్థలిని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ప్రాంతం అయితే అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చేందుకు రోడ్డు మార్గం సైతం అనుకూలంగా ఉంటుందని సభా స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలోనే అధికారంగా సభా స్థలి మార్పును ప్రకటిస్తారంట. ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ. దీనికి తోడు వరికోతలు సైతం ముమ్మరంగా సాగుతాయి. రైతు జనమంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. దాంతో వరంగల్ అనుకూలంగా ఉండదని సభకు జనాన్ని తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్లీనరీ సభకు 5 లక్షలకుపైగా జనాన్ని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపాలంటే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఒక వేళ సభను సక్సెస్ చేయకపోతే క్యాడర్ మరింత నైరాశ్యంలో పడటంతో పాటు ..రాబోయే స్థానిక, మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలపైనా ఎఫ్టెక్ పడే ప్రమాదం ఉంది. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన  ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రేటర్‌ నుంచి జనాన్ని తరలించడం సులభం అవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే సభ భారీ సక్సెస్ అవుతుందని అంచనాకు వచ్చిందంట. గ్రేటర్ లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20వేల మందిని తరలించేందుకు ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు టార్గెట్ విధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకు 5 వేలు టార్గెట్ పెట్టినా సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారంట.  వరంగల్ బీఆర్ఎస్‌కి సెంటిమెంట్. ఉద్యమ కాలం నుంచి సందర్భం ఏదైనా తొలిసభ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకే మొదట్లో వరంగల్ లో సభ నిర్వహించాలని భావించారు. గత ఏడాది సైతం ప్లీనరీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లీకులు ఇచ్చారు. కానీ సభ నిర్వహించలేదు. ఈ సారి సైతం నిర్వహిస్తామని సభకు హరీష్‌రావు స్ధల పరిశీలన కూడా చేశారు. కానీ పార్టీ నేతల నిర్ణయం మేరకు జన సమీకరణకు అనుగుణంగా లేకపోవడం, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు మార్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా పార్టీ సభ స్థలి మార్పు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది.

where is ippala

ఇంతకీ ఇప్పాల ఎక్కడ.. సిస్కో పక్కన పెట్టేసిందా? పంపించేసిందా?

టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ  మంత్రి శ్రీధ‌న్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది. నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు. ఒప్పందం విషయం పక్కన పెడితే.. తెలంగాణ సీఎం సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిన సమయంలో సిస్కో బృందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఎక్కడా కనిపించలేదు. సిస్కో  సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేష్ ను కలిసిన బృందంలో కనిపించారు. అంతే కాదు మంత్రి లోకేష్ ముందు నిలిచి మాట్లాడారు. మామూలుగా అయితే ఈ విషయానికి ఏమంత ప్రాధాన్యత ఉండదు కానీ ఈ ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా అత్యంత అసహ్యంగా, జుగుప్సాకరంగా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన ఇప్పాల రవిచంద్రారెడ్డి పోస్టులపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో సభ్యుడిగా మంత్రి లోకేష్ తో భేటీ కావడం తెలుగుదేశం వర్గాలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరో, ఎలా ఉంటారో లోకేష్ కు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన పోస్టులు, ఆ పోస్టులలో వాడిన భాష కారణంగా తెలుగుదేశం నేతలు, శ్రేణులకు ఇప్పాలను గుర్తించడం పెద్ద కష్టం కాదు. లోకేష్ తో సిస్కో బృందం భేటీకి సంబంధించిన విజువల్స్ లో ఇప్పాల కనిపించడంతో తెలుగుదేశం  శ్రేణులు భగ్గు మన్నాయి. దీంతో విషయం తెలిసిన లోకేష్ వెంటనే స్పందించారు. సిస్కోకు లేఖ రాశారు. రాజకీయాలకూ, వ్యాపార బంధాలకూ ముడిపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదని చెబుతూనే సుతిమెత్తగా ఇప్పాల నిర్వాకాలను ప్రస్తావిస్తూ అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భాగస్వామిని చేయవద్దని సూచించారు.  ఇది జరిగిన రెండు రోజులకు ఇదే సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయ్యింది. అయితే ఆ సందర్భంగా ఇప్పాలను మాత్రం దరి చేరనీయలేదు. కాగడా పెట్టి వెతికినా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిని సిస్కో బృందంలో ఇప్పాల రవిచంద్రారెడ్డి కనిపించలేదు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఇప్పాలను దూరం పెట్టాలని సిస్కోకు సూచిస్తే.. ఆ సంస్థ మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచే ఇప్పాలను తప్పించేసినట్లుందని పురిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సిస్కో ఇప్పాలను తప్పించేసిందా? తొలగించేసిందా? అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది. 

Wedding canceled due to baldness.. Young doctor commits suicide due to depression

బట్టతల కారణంగా పెళ్లి క్యాన్సిల్.. మనస్థాపంతో యువ వైద్యుడి బలవన్మరణం 

వయసు మీద పడుతున్నా తనకు  పెళ్లి కావడం లేదన్న మనో వ్యధతో సికింద్రాబాద్  లో ఓ  యువవైద్యుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే  గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మాల్ బతుకుదెరువు కోసం  దశాబ్దాల క్రితమే సికింద్రాబాద్  వచ్చి స్థిరపడ్డాడు. అయితే చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ను బాగా చదివించి డాక్టర్ చేశాడు. బస్తీ దవాఖానాలో డాక్టర్ గా పని చేస్తున్న పురోహిత్  కిషోర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుక కూడా  ఘనంగా జరిగింది.  అప్పటివరకు విగ్ ధరించి మేనేజ్ చేసిన పురోహిత్ పూజారీ ఈ వేడుకలోనే  తన బట్టతల బయటపడటంతో అమ్మాయి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు వెతుకుతున్నప్పటికీ పురోహిత్ పూజారీకి అమ్మాయిని ఇవ్వడానికి  ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం అతడికున్న బట్టతల. రాకరాక వచ్చిన ఈ సంబంధం కూడా నిశ్చితార్థం తర్వాత   క్యాన్సిల్ కావడంతో అబ్బాయి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . బొల్లారం రైల్వే స్టేషన్  సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వేస్టేషన్ వద్ద రైలు క్రిందపడి చనిపోయాడు. గుర్తింపు కార్డులో పురోహిత్ పూజారీ డిటైల్స్ ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను అధిగమించిన ఈ యువ డాక్టర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.   

CBN TOUR POLAVARAM

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 27) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు.  ఈ సందర్భంగా ఆయన పరిహారం, పునరావాసం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముందుగా ఈ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.  అంతకు ముందు పోలవరం వ్యూపాయింట్ ను పరిశీలిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.  తాజా సమీక్షలో   పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో తాగు, సాగునీటికి కొరత లేకుండా పోతుందని చంద్రబాబు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరంపై ప్రత్యేక  దృష్టి పెట్టి పనులను పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతి సోమవారం ఆయన పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు సందర్శన చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పోలవరం పనులను నిలిపివేసింది. జగన్ హయంలో పోలవరం పడకేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం పరుగులు తీస్తున్నది. నిర్దుష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత చంద్రబాబు పోలవరం సందర్శించడం ఇది మూడో సారి. దీనిని బట్టే ఆయన పోలవరం పూర్తికి ఇస్తున్న ప్రాధాన్యత అవగతమౌతుంది. 

mithunreddy gets respite in highcoutr

హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది.  ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.  మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.   కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు  డిమాండ్ చేశారు.   దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

trump impose twenty five percent tax on cars impors

కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా విదేశీ కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంచుతే నిర్ణయం తీసుకున్నరు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై ఈ పాతిక శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. జఅయితే అమెరికాలో తయారైన కార్లపై మాత్రం ఎటువంటి సుంకం ఉండదు.  ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 3 నుంచి అమలులోకి రానుంది.  దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.  అయితే ఈ తాజా సుంకం నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, ఆటో మేకర్ సరఫరా చైన్ ను దెబ్బతీస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.  

technical problem in up cm yogi flite

యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు తృటిలో  ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  వివరాలిలా ఉన్నాయి.   యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు యోగి ఆదిత్యనాథ్ ఆగ్రా నుంచి ప్రత్యేక విమానంలో  బయలుదేశారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఆగ్రా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.  ఆ తరువాత అధికారలు ఢిల్లీ నుంచి మరో విమానం రప్పించారు.   విమానంలో సాంకేతిక లోపం కారణంగా లక్నోలో సీఎం యోగి పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది. ఇలా ఉండగా యూపీ సీఎం యోగి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.   సాంకేతిక సమస్యకు కారణాలేమిటన్న దానిపై ఫ్లైట్ ఇంజినీర్లను ప్రశ్నించారు.   

buolding co;;apse in bhadrachalam

భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  

బెట్టింగ్ యాప్ లపై రేవంత్ రెడ్డి సీరియస్ 

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిండు అసెంబ్లీలో   బాసటగా నిలిచారు.   బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్నవారు  రెచ్చిపోతున్నారన్నారు.  తమ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపేక్షించబోదన్నారు.  పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.  ప్రస్తుతం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 

ఠారెత్తిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!?

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు. రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 

నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు

బిఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.  నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో   సోషల్ మీడియా వేదికగా  తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ  నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌  ఎక్స్‌  లో షేర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు   ఏ 1గా మన్నె క్రిశాంక్‌, ఏ 2 గా కేటీఆర్‌, ఏ 3గా కొణతం దిలీప్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు  ఏ1 గా కొణతం దిలీప్‌ కుమార్‌ , ఏ2గా మన్నే క్రిశాంక్‌, ఏ 3గా కేటీఆర్‌, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.   పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.