మోడీ, జయలలిత మీద కార్టూను.. నిరసన జ్వాల.. శ్రీలంక సారీ...
శ్రీలంక సైనిక వెబ్సైట్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్, వ్యాసం పోస్టు చేశారు. జయలలిత నరేంద్రమోడీకి రాసే లేఖలన్నిటినీ ప్రేమ లేఖలుగా అభివర్ణిస్తూ ఈ వ్యాసం, కార్టూన్ వున్నాయి. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖ వెబ్సైట్ నిర్వహిస్తోంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్సైట్లో ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం, కార్టూన్ పోస్ట్ చేశారు. దీనితో తమిళనాడులోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహింయారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చివరికి శ్రీలంక ప్రభుత్వం జయలలితకి, నరేంద్రమోడీకి సారీ చెప్పింది..