బస్సులో బాంబు పేలుడు.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని ప్రావెన్స్ లో ఓ ప్రయివేటు బస్సులో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 11 మంది మరణించగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని పనిచేసే కూలీలు తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రతి రోజు అర్దరాత్రి ఓ ప్రయివేటు బస్సు బస్ స్టాండ్ లో ఉంటుంది. రోజు లాగానే కూలీలు బస్కు ఎక్కగా ఇంతలో బస్సులో అమర్చిన బాంబు పేలింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే  ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదని.. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి అల్మీష్ ఖాన్ చెప్పారు.

రామోజీరావును ఎక్కడ కూర్చోబెడతారో?

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందరికి ఆహ్వానాలు పంపుతున్న నేపథ్యంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఆహ్వానం అందిస్తారా? లేదా? అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ డౌట్లను బ్రేక్ చేస్తూ చంద్రబాబు నిన్న రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీరావును స్వయంగా ఆహ్వానించారు. ఆ డౌట్ అయిపోయింది.. ఇప్పుడు ఇంకో డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు రామోజీరావును ఎక్కడ కూర్చోపెడతారా అని. ఎందుకంటే రామోజీ రావుకు జాతీయస్థాయిలో ఎంత గుర్తింపు ఉందో మనందరికి తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో గెలుపొంది మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆఖరికి ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా రెండో వరుసలో కూర్చోగా రామోజీరావుకు మాత్రం మొదటివరుసలో స్థానం దక్కింది. ఈ ఒక్క విషయం చాలు రామోజీ రేంజే ఏంటో ఉదహరణ చెప్పడానికి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు రామోజీరావుకు ఏస్థానం కల్పిస్తారా అనేదే అందరి సందేహం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడింటిలో ప్రధాన వేదికపై చంద్రబాబు, ప్రధాని మోడీతో పాటు మరో పదిహేను వీవీఐపీలు ఆసీనులుకానున్నారు. మిగిలిన రెండు వేదికల్లో పార్టీ ప్రముఖులు ఆసీనులు కానున్నారు. మరి ఈ మూడు వేడుకల్లో ఖచ్చితంగా రామోజీరావుకు ప్రధాన వేదికపై స్థానం ఉంటుంది అని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. మరి ఈ మూడు వేదికల్లో ఏ వేదికపై స్థానం కలుగుతుందో శంకుస్థాపన వరకూ ఆగాల్సిందే.

ఇకనైనా విమర్శలు ఆపకపోతే తన్ని తగలేస్తాం.. కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు కోపమొస్తే ఎలా తిడతారో అందరికి తెలిసిందే. చాలా సూటిగా.. నిక్కచ్చిగా.. ఏమాత్రం భయం కాని.. తడబాటు కాని లేకుండా  తిడతారు. మరి తండ్రి పోలికలు కొన్నైనా కొడుకుకు రాకుండా ఉంటాయా. ఇప్పుడు కేటీఆర్ కూడా తన తండ్రిలాగే ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కేటీఆర్ నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకోసం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి గాను కేటీఆర్ ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పై ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ప్రతిపక్షాలు నిరూపిస్తే వెంటనే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వచ్చే మూడేళ్లలో కనుకు తెలంగాణ ప్రజలందరకీ తాగునీరు అందిచకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని అన్నారు. అంతేకాదు ప్రతిపక్ష నేతలు ఇలాగే ఆరోపణలు కొనసాగించడం మంచిది కాదుని.. వారు మమ్మల్ని గౌరవిస్తే మేము వారినీ గౌరవిస్తాం. లేకుంటే వారిని తన్ని తగలేస్తాం అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాతో పాటు హరీశ్ రావు కూడా లాగాడు.. గవర్నర్ తో రేవంత్ రెడ్డి

టీటీడీపీ ఫైర్ బ్రాండ్, యువనేత రేవంత్ రెడ్డికి ధైర్య ఎక్కువని అందరికి తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కూడా రేవంత్ రెడ్డిని ధైర్యవంతుడని మెచ్చుకున్నారు. ఎందుకంటారా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రైతుల ఆత్మహత్యల విషయపంపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ ను కలిశారు. ఈనేపథ్యంలో గవర్నర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మొత్తానికి ధైర్యవంతుడివేనని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా రేవంత్ రెడ్డి  గవర్నర్ కుర్చీని లాగిన సంఘటనను గుర్తుచేసి ఈ వ్యాఖ్య అన్నట్టు తెలుస్తోంది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు నాతో పాటు హరీశ్ రావు కూడా కుర్చీ లాగారు.. కానీ మీరు హరీశ్ రావును మర్చిపోయి నన్ను మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అని సరైన సమాధానమిచ్చాడు. అంతేకాదు రేవంత్ రెడ్డి తరుపున టీడీపీ నేతలు మాట్లాడాలని చూశారు కాని గవర్నర్ మాత్రం.. నా గురించి రేవంత్ రెడ్డికి తెలుసు.. రేవంత్ గురించి నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు.

బైరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయినట్లున్నారే?

  రాయలసీమ పరిరక్షణ సమితి అదినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకి ముందు హైదరాబాద్ లో కొంచెం హడావుడి చేసి రాయలసీమ ప్రజలందరి దృష్టిని ఆకట్టుకొని, సార్వత్రిక ఎన్నికలలో రాయలసీమ వ్యాప్తంగా తన సమితి తరపున అభ్యర్ధులను నిలబెట్టి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొన్నారు. కానీ ఒక హత్య కేసులో ఇరుక్కోవడంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ కేసు సంగతి ఏమయిందో తెలియదు కానీ మళ్ళీ బయటకి వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందినవారయినప్పటికీ సీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వాదిస్తున్నారు. రాయలసీమవాసుల కష్టంతో అభివృద్ధి చేసిన హైదరాబాద్ ని ఒక చంద్రుడు (కేసీఆర్) తన్నుకుపోతే, ఇప్పుడు మరో చంద్రుడు (చంద్రబాబు నాయుడు) రాయలసీమకు దక్కవలసిన రాజధానిని విజయవాడకు తరలించి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కనుక రాయలసీమవాసులెవ్వరూ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరుకారాదని, ఒకవేళ వెళ్లిన్నట్లయితే వారు రాయలసీమ ద్రోహులుగా భావిస్తామని హెచ్చరించారు. దసరా పండుగరోజు అంటే అమరావతి శంఖుస్థాపన జరిగేరోజు రాయలసీమ వాసులకు చీకటి రోజని అన్నారు.

రామోజీరావుకి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం

  అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ ‘ఈనాడు‘ సంస్థల అధినేత రామోజీరావును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు, రామోజీ ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్ లో వెళ్లిన చంద్రబాబుకు  రామోజీరావు స్వాగతం పలికారు, అనంతరం రామోజీరావును పట్టు శాలువాతో సత్కరించిన చంద్రబాబు... రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని అందజేశారు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో రామోజీకి ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ ఆహ్వానించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆహ్వానపత్రిక అందజేసిన సమయంలో రామోజీతోపాటు ఆయన సతీమణి రమాదేవి, కుమారుడు కిరణ్, కోడలు శైలజాకిరణ్ ఉన్నారు.

హార్దిక్ పటేల్ పై ఎఫ్ఐఆర్, అరెస్ట్

  పటేళ్లకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటేల్ పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిజర్వేషన్లు కోసం యువకులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అవసరమైతే పోలీసులను చంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హార్దిక్ పటేల్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హార్దిక్ పటేల్ పై విద్రోహం కింద కేసు నమోదు చేసినట్లు సూరత్ డీసీపీ మార్లండ్ చౌహాన్ తెలిపారు. రాజ్ కోట్ లో జరిగిన భారత్, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు

రేపు సాయంత్రం ‘కళ్లు చిదంబరం‘ అంత్యక్రియలు

  ప్రముఖ సినీనటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ కేర్ ఆస్పత్రిలో చేరిన కళ్లు చిదంబరం... చికిత్స పొందుతూ మరణించారు. సుమారు 300 సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం వయసు 70ఏళ్లు, ఈయన అసలు పేరు కొల్లూరు చిదంబరం, అయితే ‘కళ్లు‘ సినిమాలో తొలిసారి నటించడంతో కళ్లు చిదంబరంగా ప్రాచుర్యం పొందారు. అనేక విజయవంతమైన సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం... విశాఖ పోర్టులో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ... నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చారు, 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించిన కొల్లూరు చిదంబరం... తన మొదటి సినిమా ‘కళ్లు‘నే ఇంటి పేరుగా మార్చుకుని గుర్తింపు పొందారు, ఆయన నటించిన సినిమాల్లో కళ్లు, అమ్మోరు, పెళ్లిపందిరి, మనీ, చంటి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు, ఏప్రిల్ 1 విడుదల సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి, కళ్లు చిదంబరం అంత్యక్రియలు రేపు సాయంత్రం విశాఖపట్నం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

పిలవలేదనే ఫ్రస్ట్రేషన్ లో బొత్స.. అందుకే చంద్రబాబు పై విమర్శలా?

కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి చేరి చాలా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేత బొత్స సత్యనారాయణ. తన రాజకీయానుభవంతో జగన్ సైతం తన మాట వినేలా.. తన కుడి భుజంలా తయారయారు. అయితే అదే పార్టీలో ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని.. తమనే శాసిస్తున్నాడని మూతి విరుపులు విరిచే వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో నేతలను ప్రశ్నించిన మాదిరి ఇప్పుడు సీఎం చంద్రబాబును కూడా ప్రశ్నిస్తున్నారు బొత్సా. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందిచడానికి చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బొత్స.. చంద్రబాబు కేసీఆర్ కలిసి ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జగన్ తాను శంకుస్థాపనకు రానని.. ఆహ్వనం పంపించవద్దని.. తగు అంశాలతో కూడిన లేఖ రాసిన నేపథ్యంలో.. జగన్ రాసిన లేఖకు సమాధానం చెప్పలేదని.. ఏ ఒక్క అంశానికి సమాధానం ఇవ్వలేదని తప్పుబట్టారు. అంతేకాదు ఏపీ రాజధానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదు.. కానీ ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంతో ఏపీని సింగపూర్ కు కట్టబెట్టడంపై వ్యతిరేకిస్తున్నామని మండిపడుతున్నారు. అయితే బొత్స అనవసరంగా ఎందుకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా అంటే అసలు విషయం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటంటే ఏపీ శంకుస్టాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడమే కారణమంట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకంటే తక్కవు పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిని కూడా చంద్రబాబు ఆహ్వానించారట. కానీ ఇప్పుడు కీలకమైన పదవిలో లేకపోవడంతో బొత్సను చంద్రబాబు ఆహ్వానించలేదట. అయితే తన పాత పదవి చూసైనా చంద్రబాబు తనని ఆహ్వానిస్తారని చూసినా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో బొత్స చంద్రబాబును విమర్సిస్తున్నారని అనుకుంటున్నారు.

అరవై దాటితే సలహాలే ఇవ్వాలంటున్న జైరాం

  పొలిటికల్ లీడర్స్ రిటైర్మైంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, 70ఏళ్ల తర్వాత ఎంత గొప్ప నాయకులైనా రాజకీయాల నుంచి రిటైర్ కావాలని, 60 ఏళ్లు దాటితే సలహాలకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు మార్పులు జరుగుతున్నాయన్న జైరాం... కొత్త టీమ్ ను ఎంచుకోవడంతో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ న్యూ టీమ్ ఎంపిక పూర్తికాగానే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని, వచ్చే మార్చినాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అన్నారు. రాహుల్ టీమ్ లో యువకులకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరముందని, 30 నుంచి 40 ఏళ్ల వయసులోపు వారికే చోటివ్వాలని ఆయన సూచించారు

వరంగల్, నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్ధులు వీళ్లే

  వరంగల్ పార్లమెంట్, నారాయణఖేడ్ అసెంబ్లీ బైపోల్ అభ్యర్ధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ ను తిరిగి నిలబెట్టుకోవడంతోపాటు నారాయణఖేడ్ ను తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న అధికార పార్టీ... ఆ మేరకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా తిరుగుతూ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపడుతున్న అధికార పార్టీ నేతలు... ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు, అయితే వరంగల్, నారాయణఖేడ్ అభ్యర్ధులను కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని, నారాయణఖేడ్ లో పోటీచేసి ఓడిపోయిన భూపాల్ రెడ్డికే తిరిగి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూపాల్ రెడ్డిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్పటికీ... ఇటీవల కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్ ఇవ్వరాదని పార్టీ డిసైడైందని అంటున్నారు. అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానానికి రవికుమార్, దయాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అయితే రవికుమార్, దయాకర్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయవచ్చని అంటున్నారు.

చంద్రబాబు ఆహ్వానం.. కేసీఆర్ అన్నా.. కేటీఆర్ అంకుల్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న వైరం అందరికి తెలిసిందే. రాష్ట్రం విడిపోక ముందు వీరిద్దరి మధ్య ఉన్న వైరం ఒక ఎత్తైతే.. రాష్ట్రం విడిపోయి ఆతరువాత ఓటుకు నోటు కేసు తర్వాత ముదిరిన వైరం ఒక ఎత్తు. ఈ నేపథ్యంలో ఒకరి మీది ఒకరు ఒక రేంజ్ లో డైలాగులు వేసుకున్నారు. అందులో కేసీఆర్ అయితే మరీ కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో తిట్టేస్తూ ఉంటారు. అంత కచ్చితంగా.. అంత సూటిగా తిట్టేస్తుంటారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయంగా ఎన్ని గొడవలు ఉన్నా కాని ముఖాముఖి కలిసినప్పుడు మాత్రం రాజకీయ నేతలు బానే ఉంటారు అని చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఇక్కడి పరిస్థితి వేరు ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు కేసీఆర్.. అందులో వారిద్దరు మధ్య ఉన్న వైరం. అలాంటప్పుడు వాళ్లు కలిస్తే ఎలా ఉంటుంది?.. ఎలా సంభాషించుకుంటారు? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. దీనిలో భాగంగానే చంద్రబాబు,కేసీఆర్ ను కలుస్తున్నారు అన్నప్పుడు కూడా అందరికి అలాంటి అనుమానాలే వచ్చాయి. అయితే అనుమానాలన్నింటికి వీరిద్దరూ సమాధానం చెప్పారు. చంద్రబాబు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి మరీ పిలుస్తా అని చెప్పిన ప్రకారం నిన్న ఆయన ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి పలుసందర్బాల్లో అన్నా అని సంబోధించి అందరిని ఆశ్చర్య పరిచారు. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా రావాలని చంద్రబాబు కోరితే.. అన్నా మీరు స్వయంగా వచ్చి ఆహ్వానించారు.. తప్పకుండా వస్తా అని సమాధానమిచ్చారు. అంతేకాదు రాజధాని పర్యటన పక్కా అని  నువ్వు చెబుతావా? లేక నన్ను చెప్పమంటావా? అని సరదాగా చంద్రబాబు కేసీఆర్ ను అడిగితే కేసీఆర్ మీరే చెప్పండన్నా అని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. చివర్లో కేటీఆర్ ను కూడా ఆహ్వానం అందింది కదా అని అడుగగా కేటీఆర్ కూడా అందింది అంకుల్ అని చెప్పడం గమనార్హం. మొత్తానికి ఎలా కలుస్తారా? ఎలా మాట్లాడుకుంటారా? అని అందరూ ఎదురుచూస్తుండగా వారందరికి ఈ తెలుగు ముఖ్యమంత్రులు షాకిచ్చారు.

ఏపీ కోసం మోడీకి రాహుల్ స్పెషల్ లెటర్

  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్ర విభజన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఆ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రాహుల్ కోరారు, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ పై కేంద్రం ప్రకటన చేయాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖలో రాహుల్ రిక్వెస్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని, దాన్ని సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రాహుల్ అన్నారు.

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రేప్ చేస్తే ఏంచేయగలం.. బీజేపీ నేత ఈశ్వరప్ప

రాజకీయ నాయకులు మహిళల అత్యాచారాలపై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటైపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కర్ణాటకు చెందిన నేత కె.జె జార్జ్ ఇద్దరు కలిసి రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని నలుగురైదుగురు కలిసి రేప్ చేస్తేనే దానిని గ్యాంగ్ రేప్ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆతరువాత తేరుకొని సారీ చెప్పారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మరోనేత  కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి బుక్కయ్యారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఒక మహిళా జర్నలిస్ట్ ఈశ్వరప్పని మహిళా అత్యాచారాలపై ప్రశ్న అడుగగా.. దానికి ఆయన ఇపుడు మీరు నా ఎదుట నిలబడి ప్రశ్నలడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకెళ్లి రేప్ చేస్తే ప్రతిపక్షంగా మేమేం చేయగలం అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఆ జర్నలిస్ట్ ఒక్కసారిగా ఖంగుతిని అక్కడికక్కడే ఈశ్వరప్పకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఈశ్వరప్ప సారీ చెబుతూ తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని వివరణ ఇచ్చారు.

తెలంగాణ సెక్రటేరియట్ లో దొంగలు పడ్డారు

  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో చోరీ జరిగింది, సచివాలయం డి బ్లాక్ లోకి ప్రవేశించిన దొంగలు... అక్కడ ఉండే జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లిపోయారు, ఇవాళ జనరేటర్ బ్యాటరీ లేకపోవడాన్ని గుర్తించిన సెక్రటేరియట్ సిబ్బంది... పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సచివాలయంలో దొంగతనం జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటేరియట్ లో సిబ్బంది సహకారం లేకుండా అసలు లోపలికి ప్రవేశించడమే సాధ్యంకాదని, సచివాలయ సిబ్బంది సహకారంతోనే బయటివాళ్లు లోపలికి వచ్చుంటారని, లేక సిబ్బందిలోనే ఎవరైనా ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

చంద్రబాబు రామోజీని స్వయంగా పిలుస్తారా? పవన్ ను అవమానించినట్లేనా?

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన పిలుపుల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పిలుపుల వ్యవహారం ఏమో కాని దీనివల్ల చంద్రబాబుకు రాజకీయ విభేధాలు తలెత్తుతాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ను స్వయంగా పిలిచారు చంద్రబాబు అలాగే జగన్ ను కూడా పిలవచ్చు కదా అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రామోజీరావుకు ఆహ్వానం అందించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో విభేదాలు తెలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రామోజీరావును చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ పార్టీలకు మద్దతుగా ఉండి వాళ్ల ప్రచారంలో తోడుండి వాళ్ల గెలువడానికి ఒకింత ముఖ్యభూమికను పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతి అందరికి తెలిసిన విషయమే.. మరి అలాంటి పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రుల చేత ఆహ్వానం పంపించి ఇప్పుడు రామోజీరావును కలిసి ఆహ్వానిస్తే చంద్రబాబు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎంటో చంద్రబాబుకు తెలిసిందే. మరి అలాంటప్పుడు చంద్రబాబు రామోజీరావును స్వయంగా ఆహ్వానించి పవన్ తప్పు చేస్తారా అన్న ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ భేటీ.. అన్నయ్యతో రాజకీయ విధానాలు వేరు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం తన అన్న చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను ఇంటికి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్రూస్లీ సినిమాలో నటించినందుకు గాను చిరంజీవికి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అన్నయ్య చిరంజీవి, తన విధానాలు వేరైనప్పటికీ సినిమాల పరంగా తనకు అన్నయ్య అంటే తనకు గౌరవం అని.. తాను సినిమాల్లోకి రావడానికి, తనకు జీవితం కారణం చిరంజీవేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్యను చాలాసార్లు కలిశానని, ప్రత్యేకంగా కలవలేదని చెప్పారు. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడుతూ తనకు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని ఉందని.. కానీ షూటింగ్ ఉండటం వల్ల చెప్పలేకపోతున్నానని.. శంకుస్థాపనకు వెళ్లేది.. వెళ్లనిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

చంద్రబాబుకి సోనియాగాంధీ కృతజ్ఞతలు

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ మంత్రులు అందరికి ఆహ్వాన పత్రికలు అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలకు ఆహ్వానాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు సోనియాగాంధీని కూడా ఆహ్వానించారు. దీనికి సోనియాగాంధీ తనను శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినందుకుగాను చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతు లేఖ రాశారు. అంతేకాదు ఏపీ నూతన రాజధాని అమరావతి పరిఢవిల్లాలని.. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం లాంటి మంచి పని చేస్తున్నందుకు చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ అమరావతికి రెండువేల సంవత్సరాలకు ముందు నుండే ఘన చరిత్ర ఉందని.. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృధ్ధి చెందాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరగా కేసీఆర్ తాను తప్పకుండా వస్తానని చెప్పారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు కూడా ఆహ్వానపత్రికను అందజేశారు.

భారత్ లో 9మంది ఐసిస్ కోసం పనిచేస్తున్నారు

  హైదరాబాద్ నగరంలోని టోలి చౌక్ అనే ప్రాంతానికి చెందిన అఫ్శా జబీన్ అనే 38 ఏళ్ళు వయసుగల మహిళ దుబాయిలో ఉంటూ ఐసిస్ ఉగ్రవాదుల ముఠాలో భారత్ యువకులను చేర్పించే ప్రయత్నాలు చేస్తునందున అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇంటలిజన్స్ అధికారుల విచారణలో ఆమె భారత్ లో మొత్తం తొమ్మిది మంది యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఇద్దరు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్ లకు చెందినవారని ఆమె తెలియజేసింది. అయితే ప్రస్తుతం వారివల్ల ఎటువంటి ప్రమాదం లేదని, వారి కదలికలపై నిఘా పెట్టమని ఇంటలిజన్స్ అధికారులు మీడియాకి తెలిపారు.   చాలా కాలంగా దుబాయ్ లో ఉంటున్న అఫ్శా జబీన్ తనను తాను బ్రిటిష్ దేశాస్తురాలిగా చెప్పుకొనేది. ఇంటర్నెట్ ద్వారా ఇస్లాం మతానికి సంబంధించిన మత గ్రంధాలను, వివరాలను సేకరించే ప్రయత్నంలో ఆమెకు హైదరాబాద్ కు చెందిన సలాం మోహినుద్దీన్ అనే కెమికల్ ఇంజనీర్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుండి ఆమె గమ్యం పక్కదారి పట్టింది. వారిరువురూ కలిసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో భారత్ యువతీ యువకులను చేర్పించేందుకు సామాజిక వెబ్ సైట్లలో అందుకోసం అనేక గ్రూపులు సృష్టించి యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. వారిరువురూ ఇంకా ఎంతమందిని ప్రభావిద్తం చేసారో తెలియదు కానీ ప్రస్తుతం తొమ్మిది మంది ఐసిస్ ఉగ్రవాదుల మద్దతుదారులు భారత్ లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అఫ్శా జబీన్ ఇంటలిజన్స్ అధికారులకి తెలియజేసారు.