వైసీపీకి ఊహించని షాక్.. రాజధాని వ్యూహం బెడిసికొట్టింది!!

ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. అమరావతి భారీ నిర్మాణాలకు అనుకూలం కాదంటూ ఐఐటీ మద్రాస్‌ పేర్కొందని బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అమరావతిలో ఖర్చు ఎక్కువని, భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ మద్రాస్‌ పేరుతో మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. కొన్ని పత్రికలలోనూ ఐఐటీ మద్రాస్‌ పేరుతో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ కథనాలను ఐఐటీ మద్రాస్‌ వర్గాలు ఖండించాయి.  రాజధానిగా అమరావతి సురక్షితం కాదని నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్‌కు రాజధాని రైతుల మెయిల్‌ చేయగా...అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్‌ రిప్లయ్‌ ఇచ్చింది. అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పడం.. నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని పేర్కొంది. అమరావతిపై అలాంటి నివేదిక ఇవ్వాలంటే మెటీరియాలజీ విభాగం ఉండాలని, తమ సంస్థలో అలాంటి విభాగమే లేదని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు తెలిపాయి. దీంతో అమరావతిపై నెగెటివ్‌ ప్రచారం చేయాలన్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసికొట్టిందని అమరావతి జేఏసీ తెలిపింది. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

అమరావతి పోరాటం..  29 గ్రామాల పోరాటం కాదు.. 5 కోట్ల ఆంధ్రుల పోరాటం

అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావాన్ని ప్రకటించారు .ఆయన కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు చంద్రబాబు. జగన పాలనలో అభివృద్ధి కనుమరుగవుతొందని ఆయన విమర్శించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందే సమయంలో ఈ పిచ్చి తుగ్లక్ పాలనతో వచ్చే అభివృద్ధిని ఆపేసి అరాచకానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎవరైతే ఆందోళన చేస్తారో వారందరని తిడుతున్నారని, నిన్నా,మొన్న పవన్ కళ్యాణ్ ని కూడా విపరీతంగా తిట్టారని ఆయన మండిపడ్డారు.  రాజధాని కోసం జరుగుతున్న పోరాటం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలది మాత్రమే కాదని రాష్ట్రమంతటా మద్దతు లభిస్తోందని ఆయన వెల్లడించారు. అణచాలనుకుంటే అణగిపోయే ఉద్యమం కాదని పోరుబాటలో సాగుతున్న అమరావతి రైతులను చంద్రబాబు అభినందించారు. వారు చేసే పోరాటం ఇరవై తొమ్మిది గ్రామాల పోరాటం కాదని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేసే పోరాటమని చంద్రబాబు తెలియజేశారు. ఈ ఉద్యమం కోసం రాష్ట్రం మొత్తం ముందుకు వస్తున్నారని, దానికి మనస్పూర్తిగా వాళ్ళని అభినందింస్తున్నానట్లు తెలియజేశారు.ఈ ఉద్యమానికి స్పూర్తి ఇచ్చింది రైతులేనని, ఈ పోరాటం ప్రారంభించిన మిమ్మల్ని సర్కార్ అణగదొక్కాలకుంటున్నట్లు తెలియజేశారు. రైతులకు ఎళ్ళప్పుడు అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులకు శ్రీకారం...

అయోధ్య కేసు అయిపోయినప్పటినుంచి అందరి ధ్యాస మందిర నిర్మాణం పైనే ఉంది. హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ తేదీలు వచ్చేశాయి. ఆలయం నిర్మాణం ఎలా చేపడతారన్న విషయాలను బయట పెట్టింది. ఆలయం నిర్మించేందుకు, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం మీద అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ రెండో తేదీ లోగా ఈ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మందిర నిర్మాణ కమిటీ లో 11 మంది విశ్వ హిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతి నిధులు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు మందిర నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో మందిరం నిర్మించాలని తలపెట్టారు. ప్రభుత్వాల నుంచి కాకుండా దేశం నలుమూలల్లో ఉన్న ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని కూడా నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులకు తేదీలు రావడం పట్ల హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే రోజు రెండు సమావేశాలు.. ఏపీ సర్కార్ ఊహించని అడుగులు!!

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.

పవన్ వేస్తోన్న అడుగులతో చంద్రబాబుకి తిప్పలు!!

అమరావతి పై ఇవాళ్టి భేటీలో బీజేపీ-జనసేన పార్టీలు ఏ నిర్ణయం తీసుకోనున్నాయి అని అందరిలో ప్రశ్నల మొదలయ్యాయి. ఢిల్లీలో ఇటీవల కమలదళం పెద్దలతో భేటీ అయిన జనసేనాని బిజెపితో కలసి పోరాడేందుకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ్టి సమావేశం తర్వాత జనసేన కాషాయ సేనగా మారుతుందని భావిస్తున్నారు కొందరు నేతలు . ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే బీజేపీ రాష్ట్ర నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపిలో బిజెపి అవకాశం కోసం గట్టిగా ఎదురు చూస్తొంది, నాయకులున్నా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోంది బీజేపీ. పవన్ లాంటి వ్యక్తి తోడూ దొరికితే కమలం మరింత దూకుడు చూపిస్తుందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి ఆందోళనతో అట్టుడుకుతుండడంతో పొత్తుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు కొందరు నేతలు.ఏ పార్టీ అయినా బీజేపీ తోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని,కలిసి నడిస్తే దేనినైనా సాధించవచ్చని కొందరు కాషాయ నేతలు వెల్లడిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వైపే చూస్తున్నాయన్నాయని ఈ నేపధ్యంలో జనసేన, బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ బిజెపి నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు.  ఏపిలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం టిడిపి అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇటీవల జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలోనూ మెజార్టీ నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా పవన్ కళ్యాణ్ ఆలోచన మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు సమాచారం.జనసేన బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపి, జనసేన బిజెపి కూటమి మధ్య చీలి పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. 

రాజకీయ అరంగ్రేటం చేయబోతున్న నేతల వారసులు...

రాజకీయాలు అంటేనే వారసుల విషయంలో చాలా పెద్ద స్థానం ఉంటుంది. తమ ఆస్తులను వారసులకు ఇస్తారో లేదో తెలియదు కానీ పొలిటికల్ కెరీర్ ను మాత్రం పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవటానికి నేతలు వారసులను రంగంలోకి దింపుతుంటారు . ఈ నేపధ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వారసుల అరంగేట్రానికి ప్లాట్ ఫాంగా మారాయి. అన్ని జిల్లా ల్లోనూ రాజకీయ వారసులు బరిలో ఉన్నారు. కింది స్థాయి నుంచి పెద్ద నేతగా ఎదగటానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు రాజకీయ వారసులు. తమ పొలిటికల్ కెరీర్ పునాది గట్టిగా వేసుకోవటానికి మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను రాజకీయ వారసులు బరిలోకి దిగుతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుటుంబం బరిలోకి దిగింది. ఆయన కోడలు లావణ్యను 39 వ డివిజన్ నుంచి పోటీకి దింపారు. గతంలో సోమారపు సత్యనారాయణ గోదావరిఖని మున్సిపల్ ఛైర్మన్ గా రామగుండం ఎమ్మెల్యేగా పని చేశారు. ఇప్పుడు తన కుటుంబం నుంచి కోడలిని బరిలోకి దించగా.. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీ నుంచి స్థానిక ఎమ్మెల్యే తన కోడలిని బరిలోకి దించారు. ఇరవై ఒకటో వార్డు నుంచి మమతారెడ్డి పోటీలో నిలిచారు. అయితే ఆమెతోపాటూ ఐదుగురు పోటీకి నామినేషన్ లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి నామినేషన్ లను ఉపసంహరించుకునేలా పావులు కదపడంతో దాసరి మమతారెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల్లో తన మార్క్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. తన అక్క కోడలిని కరీంనగర్ మున్సిపాలిటీ 46 డివిజన్ నుంచి బరిలోకి దించుతున్నారు. గతంలోనూ ఆమె ఈ డివిజన్ నుంచి గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలో మరి కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీలు మున్సిపల్ వార్డు మెంబర్ల వారసులు కూడా బరిలో నిలవడం విశేషం.మొత్తానికి నేతలు తమ వారసులను బరిలోకి దింపే పనిలో పడ్డట్టు సమాచారం.

బీజేపీ-జనసేన పార్టీల దోస్తీ.. భయపడేది లేదంటున్న వైసీపీ!!

ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇరు పార్టీ నేతల మధ్య కీలక సమావేశం జరుగుతోంది. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి హోటల్ లో జరుగుతోన్న ఈ భేటీ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజు హాజరుకాగా.. జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ, ప్రజా సమస్యలు, అమరావతి అంశాలపై వీరు లోతుగా చర్చిస్తున్నారు. బీజేపీ, జనసేనలు చేతులు కలపడంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం.. బీజేపీ-జనసేన కలిసినా తమకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేస్తోంది.

రోజురోజుకు పెరుగుతున్న సముద్రాల ఉష్ణోగ్రత...

2019 లో మానవజాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బృందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారెన్ హీట్లకు వరకు పెరిగిందని ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని పేర్కొన్నారు. పెరుగుతున్న భూతాపానికి ఇదొక సజీవ సాక్ష్యమని తెలిపింది. ఇలాగే సముద్రాలు వేడెక్కుతూ పోతే 2300 ల సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగడుగులు పెరుగుతాయని వివరించింది. దీంతో పెద్ద మొత్తంలో భూభాగాలూ నీటమునిగిపోతాయని హెచ్చరించారు ఆ బృందం. అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు కూడా బాగా వేడెక్కాయని వివరించారు.  సముద్ర ఉపరితలం పైనే కాకుండా ఉపరితలానికి 6500 ల అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని వెల్లడించారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగింది. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చుకుంటాయని 4 శాతం వరకు జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకూ ఉండటమేనని దీనికి కారణమని తెలిపింది ఆ బృందం. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపం బాగా పెరిగిపోతుందని వివరించింది. ఆస్ట్రేలియాలో అడవులు తగలబడడానికి కారణం కూడా భూతాపం పెరగడమేనితెలిపినట్లు సమాచారం. ఈ బృందం నివేదికల ప్రకారం అయినా మానవులు జాగ్రత్తలు పడకపోతే ముందుముందు దారుణమైన విపత్తులు ఏదుర్కొవాల్సి పరిస్థితి వస్తుందని సమాచారం.

మరోసారి వాయిదా పడనున్న నిర్భయ నిందితుల ఉరి...

నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి న్యాయం జరగకపోవడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్భయ దోషులకు ఉరి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయటం సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు దరఖాస్తు చేశాడు.రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు నిందితుడు.జైలు నిబంధనల ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లి ప్రభుత్వం కోర్టుకు వివరించింది.కావున నిర్భయ దోషులను ఈ నెల 22 న ఉరి తీయలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు తీహర్ జైలు అధికారులు. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధతను రాష్ట్రపతి తిరస్కరించినా నిబంధనల ప్రకారం దోషులను ఉరి తీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.  నిర్భయ దోషులు కుంటి సాకులతో రోజులు పొడిగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధను వీలైనంత త్వరగా తిరస్కరించాలసిందిగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నిర్భయ తల్లి ఆశాదేవీ కోరారు. లాయర్లు దోషులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను 7 ఏళ్ళుగా పోరాడుతున్న తన కూతురుకి న్యాయం జరగలేదని భారత న్యాయ వ్యవస్థ నిజంగానే గుడ్డిదని ఆశాదేవి ఆవేదనను వ్యక్తం చేశారు.నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయటంలో ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండి పడ్డారు. ట్రైల్ కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఎట్టి పరిస్థితిలో నలుగురు దోషులను జనవరి 22 నే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తానికి నిర్భయ దోషులు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళకు మరణ శిక్ష అమలు చేయడం కాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ నిందితులకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న కోర్ట్ పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.

అప్పుడు విశాఖ వైపు కన్నెత్తి చూడని జగన్.. ఇప్పుడు మంచి చేస్తాడంటే నమ్మాలా?

కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

పవన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... పార్టీ బ్రతకాలని లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.

అమరావతి పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌!!

రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌ అయింది. మహిళలపై లాఠీచార్జ్‌ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకుంది. అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్ తొలగించాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తమపై దాడులు చేస్తున్నారని, శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధానిలో పోలీసు చట్టాల అమలుపై హైకోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించింది. కర్ఫ్యూ వాతావరణం ఎందుకు ఉందని హైకోర్టు నిలదీసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

రాజధాని గ్రామాల్లో పోలీసులకు త్రాగడానికి నీళ్లు లేవు.. కూర్చోడానికి బెంచి లేదు

అమరావతిలో ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు కూడా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు చేశారు. రైతులు, మహిళలపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రతీకారంలో ఆయా గ్రామాల వాసులు పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని కనిపిస్తే చాలు టీ , టిఫిన్లు ,భోజనాలు అడిగితే ఇవ్వమని మొఖం మీదే చెబుతున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా లేవు పొమ్మంటున్నారు. పోలీసులకు ఎటువంటి అమ్మకాలు చేయబోమని దుకాణాల యజమానులు కూడా చెప్తున్నారు.  అమరావతి పోలీసులు వర్సెస్ ఆందోళనకారుల మధ్య విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఊళ్లలో సేద తీరేందుకు వేసిన బల్లలపై వాడి పారేసిన ఇంజినాయిల్ కనిపిస్తుంది. ఊళ్లలో మోహరించిన పోలీసులు ఉన్నతాధికారుల ఉత్తర్వులంటూ 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. అందుకు నిరాకరిస్తున్న గ్రామ ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నలుగురు కలిసి మాట్లాడుకోకుండా అమలు చేసిన 144 సెక్షన్ పై వినూత్న నిరసన తెలిపారు. ఊళ్లో జనాన్ని కూర్చోనివ్వని పోలీసులకు.. వాళ్లను కూడా కూర్చోనివ్వకుండా బల్లలపై ఆయిల్ పోశారు. ఇప్పటికే అమరావతి ప్రాంతాల్లో పోలీసులకి నీళ్లు కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు గ్రామస్తులు.

సంక్రాంతి దెబ్బకు టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

సంక్రాంతి కి సొంతూళ్ల కు వెళ్లే వారితో పట్నం కాస్త పల్లె బాట పట్టినట్లు తలపిస్తుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పంతంగి, కొర్లపాడు టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం పంతంగి టోల్ గేట్ వద్ద గత రెండు రోజుల నుండి రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు పెద్దఎత్తున బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి కొనసాగడంతో అదనంగా 16 మందిని టోల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు వాహనదారుల వద్దకే వెళ్లి త్వరత్వరగా పంపిస్తున్నప్పటికి టోల్ గేట్ల వద్ద రద్దీ కొనసాగుతుంది. అయితే పంతంగి టోల్ గేట్ తో పాటు కొర్లపాడు దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా  విజయవాడకు వెళ్లాలంటే ఇటు పంతంగి కావచ్చు అదే విధంగా కొర్లపాడు చిల్లపల్లి టోల్ గేటు వద్ద భారీగా ట్రాఫిక్ ఆగింది.  సంక్రాంతి పండగ సెలవులు ఉండటంతో వాహనాల రద్దీ ఇప్పటికే లక్ష వరకు వెళ్లినట్టుగా టోల్ సిబ్బంది అధికారుల యాజమాన్యం తెలుపారు. ఇక ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొని త్వరగా వెళ్లేలా చెప్పారు అధికారులు. ఇలా చేస్తే వాహన దారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా  ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ రూట్లకు సంబంధించి పంతంగి టోల్ గేట్ వద్ద 16  లైన్స్ ఉండగా.. ఇందులో పది లైన్లు ప్రధానంగా విజయవాడకు వెళ్లేందుకు ఏర్పాటు చేసారు. అందులో ఫాస్ట్ ట్యాగ్ కు  సంబంధించి ఐదు లైన్ లను వేరుగా పెట్టారు. అయితే వాటిలో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ మిగతా లైన్లలో రద్దీ అయితే కొనసాగుతుంది.

ఎస్వీబీసీ చైర్మన్‌గా జర్నలిస్ట్ స్వప్న!!

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్ పర్సన్ గా జర్నలిస్ట్ స్వప్నను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎస్వీబీసీలో వివాదాస్పద పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లంచాలు తీసుకొని కొందరికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆయన ఓ మహిళా ఉద్యోగితో ఫోన్ లో శృంగార సంభాషణలు చేసినట్టు ఆడియో కలకలం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్న స్వప్న.. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ పబ్ లో అశ్లీల నృత్యాలు.. 22 మంది యువతులు అరెస్ట్!

పబ్బులో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు కొందరు యువత. మందు కిక్ లో ఉన్న యువకులకు మగువను ఎరగావేసి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టాట్ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు చేసిన రైడ్ లో 22 మంది యువతులని అరెస్ట్ చేశారు. పబ్ లో అశ్లీల నృత్యాలు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు యువతీ, యువకులు పబ్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 మంది యువతులను అదుపులో తీసుకుని ప్రైవేట్ బస్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.  అయితే పోలీసులకు పట్టుబడిన యువతులు అర్థరాత్రి హల్ చల్ చేశారు. తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని.. తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారని.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లను లాక్కొని క్రింద పడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే మొన్నటికి మొన్న నగరంలోని లిస్బన్ పబ్ వ్యవహారం కూడా బయటపెట్టారు పోలీసులు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో రైడ్ చేసి పలువురు యువతీ యువకులను అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా పబ్ కి వచ్చే యువకులకు అమ్మాయిలను ఎరగా చూపించి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకోని.. గర్ల్ ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు మందు మగువని చూపుతూ క్యాష్ చేసుకుంటున్నారు పబ్ నిర్వాహకులు.

హై పవర్ కమిటీ మూడవ సమావేశం.. తుది నిర్ణయం!

మూడు రాజధానుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నేడు మూడో సారి సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై చర్చించిన హైపవర్ కమిటీ సీఎం జగన్ తో సమావేశమై కీలక అంశాలపై మంతనాలు జరిపింది. నేటి మీటింగ్ లో చాలా అంశాల పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి మూడు రాజధానుల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది.అమరావతి రాజధాని మార్పుపై ఇప్పటికే హైపవర్ కమిటి రెండుసార్లు భేటి అయ్యింది. జనవరి 20 వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. ఆ తరువాత కేబినెట్ భేటీ, అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపి రాజధానిపై తేల్చేసేందుకు సర్కారు రెడీ అవుతుంది.  ఈ సమయంలో ఒక వైపు అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు..మరో వైపు చంద్రబాబు జోలిపట్టి ఉద్యమము సాగిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఏపీలో వేడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో రాజధానిపై త్వరగా ఓ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపి అసెంబ్లీలో జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశముంది.  జనవరి 18 న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది.  ఇప్పటికే జియన్ రావు కమిటి, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటి వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకూడదని అభిప్రాయ పడిన కమిటి రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది. ఇటు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్టు అందజేసింది. జియన్ రావు కమిటి , బీసీజీ రిపోర్ట్ లను అధ్యయనం చేసేందుకు కేబినెట్ మంత్రులతో నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ మూడోసారి సమావేశం కానుంది. తొలి సమావేశంలో జియన్ రావు కమిటి , బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హైపవర్ కమిటీ రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. కేబినెట్ భేటీలో నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక నేటి సమావేశంతో చాలా అంశాల పై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రాలు, రాజకీయాల గురించి కీలక చర్చలు... కేసీఆర్ తో జగన్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ నేడు భేటీ కానున్నారు. ఆ భేటీలో నీళ్ల పంపకాల అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నా.. రాజకీయ అంశాలపై కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మూడున్నర నెలల తరవాత జరుగుతున్న ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మూడున్నర నెలల క్రితం కృష్ణా ,గోదావరి నదుల అనుసంధానంపై జగన్ , కేసీఆర్ చర్చించారు, అధికారుల స్థాయిలోనే సంప్రదింపులు జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి ప్రణాళికలు రూపొందించారు. ఒక దానికి ఆమోద ముద్ర వేసి రెండు రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నదుల అనుసంధానంపై ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని గత సమావేశాల్లో అనుకున్నా.. అడుగు కూడా పడలేదు. ప్రతిపాదనలు దాదాపుగా అయిపోయినట్టేనని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం అవుతున్న సీఎంలు ఈ ప్రతిపాదనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.  గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మరో వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇవన్నీ కూడా భేటీలో చర్చిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లేలా పరస్పర అంగీకారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విభజన చట్టంలోని అంశాలను.. షెడ్యూల్ 9 - 10 సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, కార్పొరేషన్ లో ఉమ్మడి ఆస్తుల అంశాల పై జగన్ కేసీఆర్ చర్చించే అవకాశముంది. అటు కేంద్రం పట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. ఇవి సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అటు సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపగా..టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అయితే ఎన్ఆర్సీ విషయాల్లో ఇరువురు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సీఏఏ , ఎన్ఆర్సీల పై తమ విధానం ప్రకటించే అవకాశముంది. ఇటీవల కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైనట్లుగా తెలుసింది. తిరుమలలో సీఎం జగన్ సన్నిహితులు మిథున్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక ఈరోజు జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రమాదమా? ప్లాన్ చేశారా?.. యాక్సిడెంట్ లో నయీమ్ మేనకోడలు మృతి 

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మృతి చెందారు. అయితే ఆ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి అద్దంకి జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందుగా వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సన్నిహితుల గృహ ప్రవేశానికి వెళ్లి.. అక్కడి నుండి మిర్యాలగూడకు వెళుతుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు అధికారులు.  ఈ ప్రమాదం నిజంగా లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేసిన ప్రమాదమా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లింది. షాహీనా పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని నయీమ్  దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టినవేనని తెలుస్తుంది. ఈ ఆస్తుల పరంగా ఎన్నో వివాదాలు  ఉన్నాయి. ఆ వివాదాల్లో ఎవరైనా షాహీనాను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదానికి ప్లాన్ చేశారా..? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.