టీడీపీ గుట్టు విప్పిన 'సజ్జలోపాఖ్యానం'

* మాజీ సి ఎం దోస్తు శ్రీనివాసులు నాయుడి యవ్వారంపై నోరు మెదపరేమని సజ్జల ప్రశ్న  * మాజీ మంత్రి గంట ఆ విషయం లో హర్ట్ అయ్యారని సజ్జల వ్యాఖ్య ఇంతకీ సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పే ఆ శ్రీనివాసులు నాయుడు ఎవరు? ఆయన, అప్పటి హెచ్ ఆర్ డీ మంత్రి గంట శ్రీనివాసరావుని కూడా పక్కన పెట్టి మరీ, యూనివర్సిటీ పాలక మండళ్లను నియమించారా? ఈ విషయం లో అప్పటి సి ఎం చంద్రబాబు నాయుడు కు, గంటా శ్రీనివాసరావుకు మధ్య నిజంగానే గ్యాప్ పెరిగిందా? శ్రీనివాసులు నాయుడు నిజంగా అంత తురుమ్ ఖానా? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వివరాలన్నీ అయన మాటల్లోనే వినండి.  రాష్ట్రం లోని యూనివర్సిటీలను విద్యాపరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి పాలక మండళ్ళను నియమించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం, అలాగే ఆ పార్టీ కి వంత పడుతున్న కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డ సజ్జల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల పాలక మండలి నియామకం తొలిసారి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.  "దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 50 రిజర్వేషన్లతో యూనివర్సిటీ పాలక మండలి పోస్టులు భర్తీ చేశారు. బీసీ, ఎస్సి ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం మేరకు పాలక మండలిలో అవకాశం కల్పించారు.. పాలక మండలిలో  మహిళలకు సైతం 50 శాతం మేర అవకాశం కల్పించారు.సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశ్యం తో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 యూనివర్సిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. 116 మంది పాలకమండలి సభ్యులకు గాను 58 మంది మహిళలకు సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్దానం కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రజాస్వామ్యబద్దంగా,ఎవరైతే అప్లయ్ చేసుకున్నారో వారి అర్హతలను ఉన్నత విద్యకు సంబంధించి ప్రత్యేక కమిటి పరిశీలించింది. 390 మంది దరఖాస్తు చేసుకుంటే వారిని అన్ని విధాలా వడపోత పోసి యూనివర్శిటిల అభివృధ్దికి దోహదపడేవారిని 116 మందిని నియమించారు. మా నాయకులు సిఫార్స్ చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నియమితులైన సభ్యులలో అందరూ కూడా ఆయా రంగాలలో నిష్ణాతులే పైగా రిజర్వేషన్ లకు లోబడి నియమించబడ్డవారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఆయా రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను పాలకమండలి పదవుల్లో నియమించారు.. పాలక మండలి సభ్యులు నియామకం పై టీడీపీ నేతలు తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు," అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.  పాలకమండళ్ల నియామకాలలో సామాజిక న్యాయం పాటించడాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని, మూడు రోజుల నుంచి పసిరికా పాముల పచ్చ మీడియా తప్పుడు వార్తలు వండివారుస్తోందని, ప్రపంచ మంతా కరోనా వైరస్ గురించి ఆలోస్తుంటే పచ్చమీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని , లాక్ డౌన్ ఉందని రాజకీయ పాలక మండలి అంటూ మెడకాయమీద తలకాయలేని వార్తలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు.  "కరోనా లాంటి మహమ్మారి  నేపథ్యంలో మేము మంచి పని చేసి కూడా చెప్పలేకపోయము. కరోనా ను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పని చేయడమే తప్ప ప్రచారం అలవాటు లేదు. పాలకమండలికి సంబంధించి అన్ని పదవులు అర్హులకే కట్టబెట్టారు.యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం ఆదేశించారు.మహిళ రిజర్వేషన్లు విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం వైయస్ జగన్ ఒప్పుకోలేదు.రిజర్వేషన్లు ప్రకారం మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కవలసిందేనని సీఎం స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు.దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు.ఇప్పటి పాలకమండలి నియామకానికి ప్రత్యేకంగా ఓ కమిటిని మా ప్రభుత్వం నియమించింది.చంద్రబాబు హయాంలో అయితే  క్లాస్ మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యులు జాబితాను చంద్రబాబు ఆమోదించారు.శ్రీనివాసులు నాయుడు కు ఏ అర్హత ఉందని పాలకమండలి సభ్యులను నియమించారో కూడా తెలియదు.దీనిపై  ఎల్లో మీడియా అప్పడు  ఎందుకు వార్తలు రాయలేదు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు.ఈ విషయం అప్పట్లో అందరికి తెలిసిందే.చంద్రబాబు హయాంలో పాలకమండలి సభ్యుల నియామకాల్లో తప్పులు జరిగితే ఎల్లో మీడియా గాడిదలు కాసిందా. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుపై పచ్చమీడియా ఎందుకు నోరు మెదప లేదంటూ" సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.

సీఆర్డీఏ వర్సెస్ మందడం రైతులు

తుళ్ళూరు మండలం మందడం గ్రామ పంచాయతీ కార్యాలయంలో  సీఆర్డీఏ సిబ్బంది తో రైతుల వాగ్వివాదం కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ళు లేని నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సి ఆర్ డి ఏ అధికారులు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  గతంలోనే  పట్టాలు ఇవ్వటం కుదరదు అంటూ  కోర్టును ఆశ్రయించిన రైతులు. అభ్యంతరాలు తెలిపేందుకు కోర్టుకు రావాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చేందుకు మందడం పంచాయితీ కార్యాలయంలో కి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది. లాక్ డౌన్ ఉన్నపుడు రైతులు కోర్టుకు ఎలా వస్తారంటూ సీఆర్డీఏ సిబ్బందిని ప్రశ్నించిన రైతులు. సామాన్య ప్రజలు కూరకాయలు తెచుకోవటానికే బయటకు రానివ్వని పోలీసులు మీకు బయటకు రావటానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన రైతులు. దీంతో సీఆర్డీఏ సిబ్బంది అనివార్యంగా వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.

దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు! కిషన్‌రెడ్డి

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. ‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.  అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరంలేదు.  పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండని కిష‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు. ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుంది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

డిజిపి కార్యాలయంలో సూక్ష్మక్రిముల కిల్లర్ టన్నెల్!

తెలంగాణ డిజిపి కార్యాలయంలో సూక్ష్మక్రిములను నివారించే 3V సేఫ్ టన్నెల్ ఏర్పాటు చేశారు. 1.5 మైక్రాన్స్ నుండి 20 మైక్రాన్స్ వరకు పరమాణువుల సూక్ష్మ క్రిములను ఈ టన్నెల్ నుంచి వెళ్లితే డిస్-ఇన్ఫెక్ట్ చేస్తుంది. S-3-V వాస్కులర్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నత పోలీస్ అధికారులు పరిశీలించారు.  ఈ టన్నెల్ లోపల 20 క్షణాల పాటు ఉండటంతో అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి దూరం కావచ్చని వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరంచారు. డీజీపీతో పాట అడిషనల్ డీజీలు జితేందర్, ఉమేష్ ష్రాఫ్, రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఐజీలు సంజయ్ జైన్, నాగిరెడ్డి తదితర అధికారులు ఈ విధానాన్ని పరిశీలించారు.

ప్రధాని అఖిలపక్షంతో వీడియో కాన్ఫరెన్స్ భేటి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్ అమలు చేస్తోన్న అంశాలపై అఖిలపక్ష పార్టీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభలలో కనీసం 5 మంది ఎంపీలున్న పార్టీల నాయకులతో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు. మార్చి 24 న ప్రధాని మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది, అయితే చాలా రాష్ట్రాలు పొడిగింపును కోరాయి., COVID-19 కేసుల్లో పెరుగుదల మరియు రాబోయే వారాల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికల అభిప్రాయాలు వచ్చాయి.  దేశంలో కేసుల నమోదు సంఖ్య పెరగడంతో కరోనా వైరస్ పోరాటంపై వీడియోకాన్ఫరెన్స్‌లో చ‌ర్చించారు. క‌రోనా వైరస్‌తో  దేశంలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 149 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ అలాగే కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, బిఎస్పి నాయకుడు ఎస్సీ మిశ్రా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, TRS కేశవరావు, YSR కాంగ్రెస్ విజయసాయి రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.

నర్సీపట్నం డాక్టర్‌ ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్!

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్టు నర్సీపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాస్కులు మరియు కనీస రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యం చేయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యలు  అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీశాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యల ప్రతిపక్ష టీడీపీ ఉందని అధికార పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి, హోంమంత్రి మ‌ధ్య దూరం పెరుగుతోందా?

తెలంగాణ హోం శాఖా మంత్రి మొహమ్మద్ అలీని ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదు. ఈ విష‌యం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.  హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతి భవన్‌కు వచ్చారు. అయితే ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయనను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోయారు. ఆ త‌రువాత  ఆదివారం నాడు అదే ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో ఆరోగ్య మంత్రి ఈటేలా రాజేందర్, వ్యవసాయ మంత్రి మైనర్ నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పౌర సరఫరా కమిషనర్ సత్య నారాయణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామ కృష్ణారావు ఉన్నారు. కానీ హోం మంత్రి మొహమ్మద్ అలీ క‌నిపించ‌లేదు. ఈ సంక్షోభ పరిస్థితిలో ఆ కీలకమైన సమావేశంలో, హోమ్ మినిస్టర్  హాజరు కాలేదు. సమీక్షా సమావేశంలో పాల్గొనమని కెసిఆర్ కోరారా లేదా అనేది తెలియ‌దు. నిజంగా సిఎం, హోం మినిస్ట‌ర్ మ‌ధ్య ఏదో న‌డుస్తోందా? లేక హోం మినిస్ట‌ర్ త‌బ్లీక్ జ‌మాత్ వారితోకానీ, వారి బంధువుల‌తో కానీ క‌లిసి వుంటార‌నే భ‌యంతో దూరం పెట్టారా?  అని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తనకు ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు.  అయితే నిన్నమంగ‌ళ‌వారం నాడు ఎం.ఐ.ఎం. నేత‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాజిక‌దూరాన్ని కూడా మ‌రిచి అంత ఆప్యాయ‌త‌తో క‌లిశార‌ట‌. సి.ఎం. కేసీఆర్ స్టైల్ వేరు.

లామినేట్‌ షీట్ తో కొత్తరకం మాస్క్! ధ‌ర 50 రూపాయ‌లే!

ఓ ప‌క్క‌ కరోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. మ‌రో వైపు మాస్కుల కొరత వుంది. ఈ నేప‌థ్యంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. పైగా మాస్కుల ధరలను ఒక్కసారి పెంచేశారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల, పరిశోధన సంస్థ. కొత్తరకం మాస్క్ ను త‌యారు చేసింది. ఆసుపత్రికి చెందిన యువ ఇంజనీరింగ్‌ బృందం సందీప్‌ వెంపటి, కార్తీకేశ్‌, ఆశిష్‌తోపాటు నేత్ర వైద్యులు వినీత్‌ జోషి తదితరులు ఈ వైజర్‌ను కొత్తరకం మాస్క్ ను రూపొందించారు. కరోనా చికిత్సలు అందించే వైద్యులు, సిబ్బందికి ఈ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సందీప్‌ తెలిపారు.  లామినేషన్‌ కోసం ఉపయోగించే 150 మైక్రాన్ల ప్లాస్టిక్‌ షీట్‌ను తీసుకొని 3డీలో మాస్క్‌ నమూనాను రూపొందించారు. మాస్క్‌ను పెట్టుకునేందుకు అవసరమైన విడి భాగాల సాయంతో ఆసుపత్రిలోనే ఈ వైజర్‌ను తయారు చేశారు. దీనికి వెనుక రబ్బర్‌ బ్యాండ్‌తో మాస్క్‌ను అనుసంధానించడం వల్ల ప్రత్యేకంగా తాళ్లతో కట్టుకోవాల్సిన అవసరం ఉండదు.  ఒకసారి ముఖానికి తగిలించుకుంటే  మళ్లీ తీసేవరకు అలాగే ఉంటుంది. నుదురు నుంచి గడ్డం కిందవరకు ఈ మాస్క్‌ షీటు ఉంటుంది. దీంతో ఎలాంటి వైరస్‌ దాడి చేసే పరిస్థితి వుండ‌దు.  నిరాటంకంగా 8 గంటలపాటు వాడుకొని... తర్వాత షీట్‌ను శానిటైజర్‌ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లయినా దీనిని శుభ్రంచేసి వాడుకోవచ్చని సందీప్ చెప్పారు.  ఇప్పటివరకు 2 వేల వైజర్లను తయారు చేశారు. దీని ధ‌ర 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు సందీప్‌ వెల్లడించారు.

సింగరేణిలో గల్లంతైన కార్మికుడు! గోదావరిఖనిలో టెన్షన్!

మంగళవారం ఏప్రిల్ 7న‌ గనిలో మోటార్ రన్ చేయడానికి వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడు ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో గోదావరిఖనిలో విషాధం అలుముకుంది. విషయం తెలుసుకున్న సంజీవ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోసం అధికారులు అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగో సీమ్, ఒవటవ డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ వెళ్లినట్లు సింగరేణి సిబ్బంది తెలిపారు.  మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ ఫలితం లేదు. సంజీవ్ గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు.

షబే బారత్ జాగారం! ఇంట్లోనే జరుపుకోండి! మసీదులకు వెళ్ళొద్దు!

కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి‌ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించబడుతున్న‌ నేపధ్యంలో ముస్లింలు ష‌బేబార‌త్ సంద‌ర్భంగా సామూహిక ప్రార్ధనలు చేయ‌వ‌ద్ద‌ని జమాతె ఇస్లామీ హింద్ పిలుపునిచ్చింది. ముస్లింలందరూ గురువారం రాత్రి సామాజిక బాధ్యతతో వ్య‌వ‌హ‌రించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డ్ సీఈఓ అలీం బాషా మసీదు కమిటీలకు ముస్లింలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 9 గురువారంనాడు జరిగే షబ్ ఎ బరాత్ పెద్దల పండగ జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. ఫాతేహా ​​మొదలైన మతపరమైన ఆచారాలు ఇళ్లనుంచే నిర్వహించాలి. ముస్లిం స్మశానవాటికలో సమూహముగా ఫాతేహా ​​మొదలైనవాటిని నిర్వహించరాదని వ‌క్ఫ్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా వైరస్ శాశ్వతంగా ప్ర‌పంచం నుండి తొలగిపోయి ప్రజలందరికీ విముక్తి కలగాలని ప‌విత్ర షబే బారత్ సంద‌ర్భంగా అల్లాహ్ ను దువా చేసి వేడుకోవాల‌ని ఎం.బి.టి. నేత అంజ‌దుల్లాఖాన్ హైద‌రాబాద్‌లో పిలుపునిచ్చారు. ఈ మహోన్నతమైన, ప్రాముఖ్యత కలిగిన షబే బరాత్ పండుగను పుర‌స్క‌రించుకొని త‌మ‌ పూర్వీకులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పేద వాళ్లకు అన్నదానం చేయ‌మ‌ని ఎం.ఐ.ఎం.పార్టీ ముస్లింల‌కు సూచించింది. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ప్ర‌త్యేక ప్రార్థనలు విడివిడిగానే జరుపుకోవాలని మ‌త‌పెద్ద‌లు సూచించారు.

వచ్చే వారం రోజలు అత్యంత కీలకం! అకుంఠిత దీక్షతో ఎదుర్కొందాం!

వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  మార్చి 24న ప్రధాని మోదీ మూడువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం మూడో వారంలోకి చేరుకున్న క్రమంలో ఏప్రిల్‌ 14 తర్వాత ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి మాదిరిగానే దేశప్రజలంతా ప్రభుత్వానికి సహరించి కరోనాను పూర్తిగా అంతం చేయాలని  పిలుపునిచ్చారు. బలమైన నాయకత్వం వల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్నారు.  ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావని ఈ సందర్భంగా ఆయన  వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కారణంగా కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామన్నారు. భౌతికదూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీగీజమాత్‌ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కచ్ఛితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కలకాలం హాయిగా జీవించాలంటే ఇంకొన్ని రోజులు ఇబ్బందులను భరించాలని ప్రజలకు ఉప‌రాష్ట్ర‌ప‌తి విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా పై అంతిమ విజయం సాధించే వరకు అకుంఠిత దీక్ష ను మనం ప్రదర్శించాల్సి ఉందన్నారు.

ఊహాగానాలు వ‌ద్దు! లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకోలేదు!

ఏప్రిల్‌ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడం పై కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణుల సూచనలు చేశారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఊహాగానాలు వద్దని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. మత ప్రదేశాల్లో కార్యకలాపాలపై మే 15 వరకు ఆంక్షలతో పాటు, మే15 వరకు విద్యా సంస్థల మూసివేయాల‌ని కరోనా నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల బృందం సిఫారసు చేసింది. అయితే విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్‌ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగే అవకాశం వుంది. సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్ట‌నున్నారు. ఆల్కహాల్‌ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.

హిందూ మ‌హిళ పాడే మోసిన ముస్లింలు!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని జునా ప్రాంతంలో నివాసం ఉంటూ దుర్గామాగా పిలువబడే 65 ఏళ్ల వృద్ధురాలు ఆనారోగ్యకారణాలతో మరణించింది. ఈ సమాచారాన్ని వేరే ప్రాంతంలో ఉన్న ఆమె కుమారులకు అందించగా వెంటనే వారు ఇండోర్‌కు చేరుకున్నారు. అయితే తల్లి దహనసంస్కారాలు చేసేందుకు వారివద్ద సరిపడా డబ్బులు లేవు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో బంధువులు, స్థానికులు ఎవరూ కూడా అంత్యక్రియలకు రావడానికి సాహసం చేయలేదు. దీంతో స్థానికంగా ఉన్న ముస్లింయువకులు అక్కడికి చేరుకుని దహనసంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంతే కాదు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, మాస్క్ లు ధరించి, తమ భుజాలపై పాడెను మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనుషులంతా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహరించుకుంటున్నారు. హిందూ-ముస్లిం భాయీ భాయీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులపై మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ ప్రశంసలు కురిపించారు.

కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా?

కరోనా వ్యాప్తికి పరోక్షంగా కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ ఎందుకు కేసు బుక్‌చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొదట్లో కరోనా వస్తే పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందన్న కేసీఆర్ ఇప్పుడు అది భయంకరమైన రోగం అంటున్నారని గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటని ఆయ‌న అన్నారు. అన్నీ తనకే తెలిసినట్టు సీఎం కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చారో చూసుకుంటే ఆయనకే సిగ్గేస్తుందని, ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా ఉండదన్న కేసీఆర్... తాజాగా జూన్ మూడు అంటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. తన తప్పుడు పనులను ప్రశ్నించే వాళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కోసం వందల కోట్ల విరాళాలు వస్తున్నాయని వాటన్నింటినీ వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 63 హాట్ స్పాట్ లు....

ఆంధ్ర ప్రదేశ్ లో12గంటల వ్యవధిలో 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఎఫెక్ట్‌ మొదలైన తర్వాత అతితక్కువ కేసులు నమోదు. మొత్తం 314కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య. గుంటూరు జిల్లాలో కొత్తగా 9 కేసుల నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో నలుగురి మృతి. పూర్తిగా కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో63 హాట్ స్పాట్లు. 24గంటలు వైద్య పరీక్షలు. మూడు షిప్టు ల్లో పనిచేసేలా చర్యలు తిరుపతిలో కొత్త మిషన్ ..రోజుకు 3వేల పరీక్షలు. ఇప్పటికి లక్ష మందికి పైగా పరీక్షలు పూర్తి. 2లక్షల ర్యాపిడ్ టెస్టుల కిట్లకు ఆర్డర్. కర్నూలు లో అత్యధికంగా 74 మందికి కరోనా పాజిటివ్. నెల్లూరు 42,గుంటూరు 41,కృష్ణా29,కడప 28,ప్రకాశం 24,ప.గో.21,విశాఖ 220,చిత్తూరు 17,తూ. గో.11,అనంతపురం6 కేసులు నమోదు.

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

వేసవి సెలవులు రద్దు! లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పెంపు!

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కోర్టు లాక్‌డౌన్ ను ఏప్రిల్ 30 వరకుపొడిగించి, వేస‌వి కోర్టు సెలవులను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. న్యాయమూర్తులు ప్రస్తుత పరిస్థితిపై బార్ లీడర్లు, వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించి, ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి. ఏప్రిల్ 25న మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామ‌ని రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అప్పటి వరకూ వర్చువల్‌‌గా కోర్టులు అత్యవసర కేసులను విచారణ జరుపుతాయన్నారు. రాష్ట్రంలోని కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌నున్నారు.