నిప్పులు చిమ్మే సూర్యుడి మధ్యన మర్యాద పురుషోత్తముడు!

* రామజన్మభూమి లోగో ఆవిష్కరించిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  * ఉవ్వెత్తున ఎగిసిన హిందూ జాతీయ వాదానికి, వాస్తవానికి రాజీవ్ గాంధీనే ప్రధాని హోదాలో బీజం వేశారనే వాదన ఇప్పటికీ 10, జనపథ్ లో వినిపిస్తూ ఉంటుంది  * తల్లి ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ అయిష్టంగానే ప్రధాని బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత యధాలాపంగా రామజన్మభూమి అంశం లో ఆయన తీసుకున్న నిర్ణయాలు -తర్వాతి ఉద్యమాలకు ఆక్సిజన్ అందించటం అందరికీ తెలిసిన విషయాలే  శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా రిలీజ్ చేసిన రామజన్మభూమి లోగో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హనుమజ్జయంతి సందర్భంగా ట్రస్ట్ ఈ లోగో ను రిలీజ్ చేసింది. ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు కనిపించేలా ఆకర్షణీయంగా లోగో ను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాషాయ రంగులతో ఈ లోగో కు మరింత వన్నె తెచ్చారు. అయోధ్య లో శ్రీ రామ మందిర పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ఈ ట్రస్ట్, ఏప్రిల్ 2 వ తేదీన ఆలయ నిర్మాణానికి శంకు స్థాపన కూడా చేసింది. ఈ సందర్భంగా,అయోధ్యలో ఒక పండుగ వాతావరణం ఆ రోజు నుంచీ నెలకొంది.   శతాబ్దాల పోరాటం తర్వాత జరగబోతున్న ఈ మహత్కార్యం వెనుక ఎవరెవరు, ఏ స్థాయిలో తమ సేవలందించారో అయోధ్య వాసులు, సాధు సంతులు గుర్తు చేసుకోవటం మొదలెట్టారు.  అయోధ్య వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అంతిమ తీర్పులో- ప్రధాన న్యాయమూర్తిగా హోదాలో  రంజన్‌ గొగోయి, ఆ స్థానంలోకి రానున్న ఎస్‌.ఎ.బాబ్డే లతో సహా పంచసభ్య ధర్మాసనం నిర్విరామంగా నలభై రోజులు వాదోపవాదాలు విని ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కూడా కావడం అసాధారణ ప్రక్రియ. ఆ రీత్యా తీర్పుపై సమీక్షలు, పునర్విచారణలు అంత తేలికగా అనుమతి పొందలేకపోవచ్చు. బ్రిటిష్‌ పాలనలో నూట నలభై ఏళ్ల కింద మొదలై, స్వాతంత్య్రానంతరం డెబ్బై ఏళ్ల కిందట మరింత క్లిష్టమై, నూట పాతికేళ్లుగా కోర్టుల ముందు తిరుగుతున్న ఒక వివాదం, ఇంత వేగంగా తేల్చి చెప్పడం నిజంగానే గతంలో ఎరగని విషయం. ఇందులో జయాపజయాల ప్రసక్తి లేదనీ అందరూ తీర్పునకు కట్టుబడి శాంతిని కాపాడాలని ప్రధాని మోడీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ అంటున్నారు. శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని నొక్కి చెబుతూనే తీర్పునకు సంబంధించిన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ వున్నారు. దానికి సమస్య జటిలతతో పాటు తీర్పు లోని సంక్లిష్టత మిశ్రమ స్వభావం కూడా కారణమని చెప్పాలి. అయోధ్య వివాదం ఏయే దశల్లో ఎన్ని మలుపులు తిరిగిందీ కుదుపులు తెచ్చింది చాలా వివరంగా వచ్చింది గనక మళ్లీ ఏకరువు పెట్టడం అనవసరం. వివాదాస్పద స్థలంలో రామమందిరం కూలగొట్టి బాబర్‌ మసీదు కట్టించాడు గనక అక్కడే రామ మందిరం కట్టాలన్నది సంఘ పరివార్‌ ప్రధాన నినాదం. 1949 నుంచి తాళాలు పడి వున్న వివాదాస్పద స్థలం తాళాలు తెరిపించి ఆ తాళం దాని చేతికి ఇచ్చింది అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ గాంధీ. ఉత్తరోత్తరా 1992 డిసెంబర్‌ ఆరున మసీదు కూల్చివేతకు అవకాశమిచ్చింది పి.వి నరసింహారావు. సాధు సంతుల పేరిట ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది అద్వానీ బృందం. ఇదీ క్లుప్తంగా చరిత్ర. 'భిన్న విశ్వాసాల మధ్య ఘర్షణ వస్తే పరస్పరం సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. లేదంటే కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలి'. అని ఈ కాలమంతటా కూడా వామపక్షాలు లౌకిక వాదులూ చెబుతూ వచ్చారు. ఆ సమయంలో పరివార్‌ అందుకు సుతరామూ అంగీకరించలేదు. విశ్వాసాలు, కోర్టు తీర్పులకూ రాజ్యాంగ నిబంధనలకు అతీతమని వాదించారు అద్వానీ. అలా అంటూనే కోర్టుకు ఇచ్చిన మాట తప్పి కూల్చివేతకు కారకులైనారు.  1992 తర్వాత పాతికేళ్లకు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విశ్వాసాలు వున్నాయనే నిజం ఆధారంగా తీర్పు నివ్వడం పెద్ద విశేషం. కూల్చివేయబడిన మసీదు గోపురాల మధ్యనే రాముడు జన్మించాడని హిందువులు బ్రిటిష్‌ వారి కాలం నుంచి విశ్వసిస్తున్నారని కోర్టు విశ్వసించింది. మసీదు ప్రాంగణంలో 'రామ్‌ చబూత్రా'కు అది పరిమితం కాదని నొక్కి చెప్పింది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కంచె వేసిన కారణంగా వారు చబూత్రాకు పరిమితమైనారని అభిప్రాయపడింది. ఆనాటి నుంచి వారిలో ఆ విశ్వాసం వున్నదనే విషయాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు కూడా కాదనడం లేదని పేర్కొంది. మరో వంక ఆ స్థలంపై తమకు యాజమాన్యం వుందనే వక్ఫ్‌ బోర్డు వాదన కూడా రాముడు పుట్టాడన్న నమ్మకానికి ప్రతిబింబం వంటిదేనని రెంటినీ ఒకటిగా చెప్పింది. అయితే ఈ విషయంలో సమతుల్యతతో వ్యవహరించాలంటూ మరోవైపు నుంచి కూడా కొన్ని నిర్ధారణలు చేసింది. బాబర్‌ కాలంలో మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదనీ, దాని కింద దొరికిన అవశేషాలు ఇస్లామేతర కట్టడానికి సంబంధించినవనీ సుప్రీం కోర్టు తీర్పులో చెప్పింది.అయితే అవతలి పక్షం వాదిస్తున్నట్టు అది రామాలయం అనడానికి గాని, దాన్ని కూల్చి ఇది కట్టారని చెప్పడానికి గాని ఆధారం లేదని పురావస్తు నివేదికల అధ్యయనంతో నిర్ణయానికి వచ్చింది. అలాగే అక్కడ మసీదు లేదనీ ప్రార్థనలు జరగడమేలేదని చెప్పడం కూడా వాస్తవం కాదని పేర్కొంది. అదే ప్రాంగణంలో గతం నుంచి ఇరు మతాల ప్రార్థనలు జరుగుతుండగా 1949లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి పెట్టడం, 1992లో కూల్చివేత వారి విశ్వాసాలకు విఘాతమని కూడా స్పష్టీకరించింది. ఈ పూర్వ రంగంలో 2010న అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్‌లల్లా విరాజ్‌మాన్‌లకు సమానంగా కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు తర్క విరుద్ధమన్నది ధర్మాసనం చేసిన కీలకమైన నిర్ధారణ. బహుశా ఇప్పటికే అక్కడ తాత్కాలిక ఆలయం వుండటం, ముగ్గురూ ఒకే చోట మనడం సాధ్యం కాదు గనక ఏదో విధంగా ముగింపు పలకాలన్న భావన కూడా దీని వెనక వుండొచ్చు. రామ్‌లల్లా తరపున రామజన్మభూమి న్యాస్‌ను న్యాయపరమైన కోణంలో పరిగణించవచ్చు గాని చట్టపరమైన ప్రతిపత్తితో చూడలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ నిజమైనప్పటికీ వివాదానికి శాశ్వత పరిష్కారంగా వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను మొత్తంగా రామ మందిర న్యాస్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయిదు మాసాలలో అక్కడ మందిరం కట్టాలని, ఇందు కోసం ఒక ట్రస్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పింది. సున్నీ బోర్డుకు కేంద్రం లేదా రాష్ట్రం అయోధ్య లోనే ప్రముఖమైన చోట అయిదు ఎకరాలు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలన్నారు. ఇది మసీదు కూల్చివేతకు పరిహారంగా భావించాలన్నమాట. కేసులో మూడోవాదిగా వున్న 'నిర్మొహి అఖాడా' స్థూలంగా హిందూ పక్షమైనా ఆలయానికి అనుమతినిస్తే దానికి ఆధ్వర్యం వహించాల్సింది తామేనని చేసిన వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. అఖాడాకు నిర్వహణ పాత్ర మాత్రమే వుందని, వారికి రేపు ఏర్పాటు చేసే ట్రస్టులో ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్దేశించింది. 1045 పేజీలున్న ఈ తీర్పులో ధర్మాసనం విభిన్న కోణాలను సాక్ష్యాలనూ వాదోపవాదాలను తను పాటించిన నిబంధనలను సుదీర్ఘంగా పొందుపర్చింది.  అలాగే, అయోధ్య విషయం లో రాజీవ్ గాంధీ, పీ వీ నరసింహా రావు లు ప్రధానమంత్రుల హోదాలో పోషించిన పాత్ర, అలాగే- విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ హయాం లో పుట్టిన ఉద్యమ వేడి తీవ్రత లను కూడా ఈ రోజు అందరూ నెమరు వేసుకుంటున్నారు.

శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాల వెనుక రహస్యం...

తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు కూడా జరగడంలేదు.. శ్రీవారి అఖండ దీపం కొండెక్కిపోయింది..2 వేల అయిదు వందల ఏళ్ళ తర్వాత శ్రీవారి ఆలయం మూసివేశారు..వసంతోత్సవాల సందర్భంగా నైవేద్యాలు వెంటవెంటనే పెట్టి తీరని అపచారం చేశారు..కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి భక్తులకు దర్శనాలు నిలిపివేసిన నాటినుంచి ఇలాంటి ఎన్నో వదంతులు, దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం చూస్తూనే, వింటూనే ఉన్నాం.  ఇవన్నీ కేవలం వదంతులేనని భక్తులెవరూ వీటిని నమ్మవద్దని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, పెదజీయర్ స్వామీజీలు కూడా ఎన్నడూ లేని విధంగా మీడియా ముఖంగా వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా తెలిసినవే. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామికి  అన్ని సేవలు జరుగుతున్నాయని, కొన్ని వేల సంవత్సరాల అనంతరం తిరుమల ఆలయాన్ని మూసివేశారంటూ వస్తున్న వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్నినమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని, వసంతోత్సవాల సందర్భంగా మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దని సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు అని హెచ్చరించారు. శ్రీవారి ఆలయంలోని అఖండ దీపం కొండెక్కిపోయింది అని పుట్టిన వదంతులపై పెదజీయర్ స్వామీజీ కూడా స్వయంగా మీడియాలో వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడే ప్రశ్న తలెత్తే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇన్ని వదంతులు, దుష్ప్రచారాలు జరుగుతున్నా, అందరికన్నా ముందుగా వీటిని అరికట్టాల్సిన  టీటీడీ అధికారిక చానల్ ఎస్వీబీసీ మాత్రం మొద్దు నిద్ర పోతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. కొందరైతే అసలు ఈ వదంతుల వెనుక సదరు ఛానల్ ‘పెద్ద’ హస్తం కూడా లేకపోలేదనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి ఆలయంపై ఈ స్థాయిలో దుష్ప్రచారాలు  రావడం వెనుక ఎస్వీబీసీ సిఈఓ యలమంచలి వెంకట నగేష్ పాత్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ సిఈఓగా నియమితులైన సదరు వ్యక్తికి గత ఏడాది మే నెలతోనే పదవీ కాలం ముగిసిందనీ తన పదవీ కాలాన్ని మరి కొంత కాలం పొడిగించాలని అయన చేసుకున్న విన్నపాలు, నడిపిన లాబీయింగ్ పని చెయ్యకపోవడం వల్ల జగన్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగి ఉండవచ్చన్న అనుమానాలు కూడా తీసివేయలేమని అభిప్రాయపడుతున్నారు.

యు.ఎస్. కంపెనీలు ఖచ్చితంగా చైనాను వదిలివేస్తున్నాయి!

చైనా-అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధంలో యు.ఎస్ కంపెనీలు ఇక చైనాను వదిలివేయ‌నున్నాయి. గ‌త రెండేళ్లలో వందల బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో అమెరికా అవుట్‌సోర్సింగ్ కోసం ఇత‌ర ప్రాంతాల‌పై దృష్టి పెట్టింది. చైనాలో వున్న అమెరిక‌న్ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు క‌రోనా  మహమ్మారికి మరింత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గ‌త 30 ఏళ్ళ అమెరికా-చైనా వాణిజ్య బంధానికి ఇక తెర‌ప‌డ‌నుంద‌ని కెన్నెత్ రాపోజా విశ్లేషించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కన్సల్టింగ్ సంస్థ కిర్నీతన  వార్షిక రీషోరింగ్ ఇండెక్స్ను విడుదల చేసింది,  యు.ఎస్. దేశీయ తయారీ 2019 లో గణనీయంగా ఎక్కువ వాటాను సాధించింది, చైనా నుండి అవుట్‌సోర్సింగ్ దిగుమతులు త‌గ్గాయి. సౌత్ ఏషియా దేశాల ద్వారా అవుట్‌సోర్సింగ్ దిగుమ‌తులు పెంచుకోవ‌డానికి అమెరికా సిద్ధం అవుతోంది. చైనా-అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇత‌ర ఏషియ‌న్ దేశాలు లాభ‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌ట్టికే అమెరికా ప్ర‌త్యేమ్నాయంగా 14 మంది ఆసియా ఎగుమతిదారులు గుర్తించింది.   చైనాలో వున్న అమెరిక‌న్‌ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు తమ ఉత్ప‌త్తుల‌పై పునరాలోచనలో పడ్డాయి, సుంకాల నేప‌థ్యంలో ఇక ఆగ్నేయాసియాకు మకాం మార్చడానికి తమ చైనా భాగస్వాములను ఒప్పించాయి. "మూడు దశాబ్దాల క్రితం, యు.ఎస్. వ్యాపార‌సంస్థ‌లు చైనాలో ఉత్ప‌త్తి ప్రారంభించాయి. అవుట్ సోర్సింగ్ ద్వారా ఇక్క‌డ ఉత్ప‌త్తి వ్య‌యం త‌క్కువ‌గా ఉండ‌టం ఒక కారణం. వియత్నాం నేతృత్వంలోని చిన్న చిన్న‌ ఆగ్నేయాసియా దేశాలతో పాటు మెక్సికో ద్వారా అవుట్‌సోర్సింగ్‌ ఉత్ప‌త్తులు పెర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి మరియు మార్చి ప్రారంభంలో కంపెనీలు ఫ్యాక్టరీ మూసివేత కారణంగా ఆన్లైన్లో సరఫరాను పొందలేకపోయాయి, U.S. లో వ్యాపారాన్ని నిలిపివేసింది. చైనా కుదుట ప‌డితే  COVID-19 వ్యాధితో యు.ఎస్. ఘోరంగా దెబ్బతింది.  యు.ఎస్ అనారోగ్య బేలో చిక్కుకుంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగే సామాజిక మరియు ఆర్థిక న‌ష్టం తీవ్ర‌త పూర్తి స్థాయి ఇంకా తెలియదు, కిర్నీ నివేదిక ప్ర‌కారం  చైనా వాణిజ్యానికి పూర్వ ద‌శ వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఇబుప్రోఫెన్, హజ్మత్ సూట్లు, రబ్బరు చేతి తొడుగులు, సర్జికల్ మాస్క్లు, వెంటిలేటర్ల ను చైనా చైనా ఎగుమ‌తి చేస్తోంది.   యు.ఎస్. రీషోరింగ్ ఇండెక్స్ ను అంచనా వేయడానికి, చైనా, తైవాన్, మలేషియా, ఇండియా, వియత్నాం, థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హాంకాంగ్, శ్రీలంక మరియు కంబోడియా నుండి తయారు చేసిన వస్తువుల దిగుమతి పెరుగుతోంది. 14 ఆసియా దేశాల నుండి తయారు చేయబడిన అన్ని దిగుమతుల విలువ 2018 లో 816 బిలియన్ డాలర్ల నుండి 2019 లో 757 బిలియన్ డాలర్లకు తగ్గింది.  కిర్నీ ప్రకారం, చైనా నుండి దిగుమతులు క్షీణించాయి.  ఇది సుంకం వ్యయాల కారణంగా అత్యధికంగా 17% వద్ద పడిపోయింది. కార్పొరేట్ పెట్టుబడులకు యు.ఎస్ ఆకర్షణీయంగా ఉండటానికి ఏకైక మార్గం చైనాతో సమానంగా దాని ఖర్చులను పొందడం. కార్మిక వ్యయాలపై చైనాతో పోటీ పడలేనప్పటికీ, యుఎస్ కార్పొరేట్ పన్నులపై, సమృద్ధిగా మరియు అర్హత కలిగిన బ్లూ కాలర్ శ్రమశక్తిపై పోటీ పడవచ్చు మరియు పర్యావరణ నిబంధనలను అమలు చేయడం ద్వారా కంపెనీలను సాంకేతిక పరిజ్ఞానం మరియు కన్సల్టెంట్లపై అధికంగా ఖర్చు చేయమని బలవంతం చేయదు. వారి బాటమ్ లైన్. అధ్యక్షుడు ట్రంప్ తన సుంకాలను చైనా వ‌స్తువుల‌పై విప‌రీతంగా పెంచారు. U.S. దిగుమతిదారు ఇప్పుడు మేడ్ ఇన్ చైనా కోసం ఎక్కువ చెల్లిస్తున్నందున U.S. కంపెనీ యొక్క చైనా భాగస్వాములు బాధపడుతున్నారు. ఇది చైనాను ఎగుమతి కేంద్రంగా ఉపయోగించడం వల్ల కలిగే ఖర్చు ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. కిర్నీ చైనా డైవర్సిఫికేషన్ ఇండెక్స్ (సిడిఐ) యుఎస్ తయారీ దిగుమతులు చైనా నుండి మరియు జాబితాలోని ఇతర ఆసియా దేశాలకు మారడాన్ని ట్రాక్ చేస్తుంది. చైనా ఇప్పటికీ ప్ర‌ధాన ఎగుమ‌తి భాగ‌స్వామి అయిన‌ప్ప‌ట్టికీ  ట్రంప్ నిర్ణ‌యాల‌వ‌ల్ల ఎగుమ‌తి వాటాను ఎక్కువగా కోల్పోతోంది. 2013 లో, సిడిఐ యొక్క బేస్ ఇయర్, చైనా అన్ని యు.ఎస్-బౌండ్ ఆసియా-ఆధారిత తయారీ వస్తువులలో 67% కలిగి ఉంది. 2019 రెండవ త్రైమాసికం నాటికి, దాని వాటా 56% కుప్పకూలింది, ఇది 1,000 బేసిస్ పాయింట్లకు పైగా తగ్గింది. చైనా నుండి మారిన యు.ఎస్. దిగుమతుల్లో 31 బిలియన్ డాలర్లలో, 46% వియత్నాం చేత గ్రహించబడింది, కొన్నిసార్లు అదే చైనా సరఫరాదారులు ప్రధాన భూభాగాన్ని విడిచిపెట్టారు. ఆ మార్పు ఫలితంగా వియత్నాం 2019 కు వ్యతిరేకంగా 2019 లో U.S. కు అదనంగా billion 14 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. కిర్నీ ఈ సంవత్సరం తన నియర్-టు-ఫార్ ట్రేడ్ రేషియో (ఎన్టిఎఫ్ఆర్) ను ప్రవేశపెట్టింది. ఇది మెక్సికోలో సమీప తీర ఉత్పత్తి వైపు యు.ఎస్. దిగుమతుల కదలికను ట్రాక్ చేస్తుంది. NTFR ను మెక్సికన్ తయారు చేసిన వస్తువుల వార్షిక మొత్తం డాలర్ విలువ యొక్క నిష్పత్తిగా లెక్కించారు, ఇది చైనాతో సహా ఆసియా 14 నుండి తయారు చేసిన దిగుమతుల డాలర్ విలువతో విభజించబడింది. 2013 నుండి, NTFR 36% మరియు 38% మధ్య స్థిరంగా ఉంది-ఆసియా నుండి యు.ఎస్. ఉత్పాదక వస్తువుల యొక్క ప్రతి డాలర్కు, మెక్సికో నుండి సుమారు 37 సెంట్ల ఉత్పాదక దిగుమతులు ఉన్నాయి. మెక్సికో 38% నుండి 42% కి చేరుకుంది. డాలర్-విలువ ప్రాతిపదికన, మెక్సికో నుండి యుఎస్ కు మొత్తం ఉత్పాదక దిగుమతులు 2017 మరియు 2018 మధ్య 10%, 278 బిలియన్ డాలర్ల నుండి 307 బిలియన్ డాలర్లకు, 2018 మరియు 2019 మధ్య మరో 4% పెరిగి, మొత్తం దిగుమతి విలువ 320 బిలియన్ డాలర్లకు పెరిగింద‌ని కిర్నీ నివేదిక తెలుపుతోంది.

తెలంగాణాలో 471కి పెరిగిన పాజిటివ్ కేసులు!

ఈ రోజు కొత్త‌గా మ‌రో 18 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారు 388 మంది వున్నారు. క‌రోనా బారిన ప‌డి  ఇప్ప‌ట్టి వ‌ర‌కు 12 మంది మృతి చెందారు. తెలంగాణాలో క‌రోనా క‌ట్ట‌డికీ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి ఈటెల తెలిపారు. ఏప్రిల్ 24 క‌ల్లా క‌రోనా బాధితులంతా కోలుకుంటార‌ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అవ్వాల‌ని మంత్రి మ‌రోసారి పిలుపునిచ్చారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 175 పాజిటివ్‌ కేసులు న‌మోదైయ్యాయి. అందుకే హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని మంత్రి తెలిపారు.  హైదరాబాద్‌లో వైరస్ వేగంగా ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు.  హాట్ స్పాట్స్ ప్రాంతాలను పూర్తిగా జీహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  జీహెచ్ఎంసీ సర్కిళ్ళ వారీగా అధికారులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇష్యూ చేశారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన 15 ప్రాంతాలపై ఉత్తర్వులు జారీచేశారు జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు. రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ వంటి ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తలపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 89 మంది కంటైన్‌మెంట్ క్లస్టర్లు ప్రాంతాలలోనే నమోదవడంతో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

విపత్కర తరుణమిది.. అందుకే రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు

• సంయమనంతో వ్యవహరిద్దాం... లాక్ డౌన్ తరవాతే మాట్లాడదాం • రూ. వెయ్యి ఆర్థిక సాయాన్ని వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి • పేద ప్రజలకు అండగా నిలుద్దాం... కరోనా నియంత్రణలో ప్రధాని చెప్పిన సూచనలు పాటిద్దాం • రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయింది. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు మన పార్టీపరంగా అండగా నిలుద్దాం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే అంశంపై ఒక ప్రణాళిక అనుసరిద్దాం అన్నారు. ప్రధాన మంత్రి సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు.  గురువారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై పవన్ చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను తెలియచేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవాకార్యక్రమాలను పార్టీ అధ్యక్షులకు తెలిపారు. చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థికపరమైన ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయించడంపై  పీఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అలాగే వైద్యులకు మాస్కులు, పి.పి.ఈ.లు తగిన విధంగా సమకూర్చని సమస్యపైనా స్పందించాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడంపై శ్రీ తోట చంద్రశేఖర్ గారు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా, సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నాయకులు, జనసైనికులు ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నారు” అన్నారు. పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా వైరస్ వ్యాప్తి ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో కాదు అంతర్జాతీయంగా ఉత్పన్నమైన విపత్తు ఇది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రజలకు అవసరమైన భరోసా కల్పించలేకపోతోంది. మంత్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించకుండా పర్యటనలు చేస్తున్నారు. రైతుల సమస్యలు మన దృష్టికి వచ్చాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పేద కుటుంబాలకు అండగా ఉండాలి, కనీసం ఒక పేద కుటుంబానికి సాయం చేయండి అని చెప్పారు. మన పార్టీ నాయకులు పలు చోట్ల కూరగాయలు ఇస్తున్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బందికీ, పేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎలా అండగా ఉండాలి అనే విషయంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అని పార్టీ అధ్యక్షులు స్పష్టం చెప్పారు. వారు చేసే సూచనలకు అనుగుణంగా నిబంధనలు అనుసరిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలి” అన్నారు. పి.ఏ.సి. సభ్యులు నాగబాబు మాట్లాడుతూ “ఇది చాలా క్లిష్టమైన సమయం. పేద ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు ఇస్తూ జనసేన కార్యకర్తలు అభినందనీయమైన సేవలు చేస్తున్నారు. రిస్క్ తో కూడుకున్న సమయం ఇది. అయినప్పటికీ మన పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. వీటిని మరింత పకడ్బందీగా చేయాలి” అన్నారు. వివిధ అంశాలను శ్రీ తోట చంద్రశేఖర్, శ్రీ టి. శివ శంకర్, శ్రీ బొలిశెట్టి సత్య, శ్రీ మధుసూదన్ రెడ్డి, డా. హరిప్రసాద్, శ్రీ బి.నాయకర్, శ్రీమతి పి.యశస్విని తదితరులు కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు.

'ఫేక్ న్యూస్'పై కార్యాచరణ ప్రారంభించాం: తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ

'ఫేక్ న్యూస్’ పై ఓ కార్యాచరణ ప్రారంభించామని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ‘కరోనా’ను ఓ మతానికి ఆపాదించవద్దని, పాత వీడియోలను ప్రస్తుతం జరిగిన ఘటనలుగా చూపిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. పాత వీడియోలను గుర్తించేందుకు 10 మంది రీసెర్చర్స్ ఉన్నారని, ‘ఫ్యాక్ట్ చెక్’ యాప్ ద్వారా తప్పుడు వార్తలను గుర్తించ వచ్చని, ‘ఫ్యాక్ట్ లీ’ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీలో 95 శాతం మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోం’ పద్ధతిలో పనిచేస్తున్నారని వివరించారు.

ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం

ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 14 కి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. ప్రధాని మోడీ కూడా అఖిల పక్ష భేటీ లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయాలని ప్రధాని నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రమేయం లేకుండా ఒడిశా లో లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. తమ రాష్ట్రానికి రైళ్లు, విమాన సర్వీసులు నెలాఖరు వరకూ నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. మరి మిగతా రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్ బాటలో పయనిస్తాయో లేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తాయో చూడాలి.

అనంతపురంలో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

ఏపీలో కరోనా పై పోరు కాస్తా.. డాక్టర్లు వర్సెస్ ప్రభుత్వం పోరులాగా మారేలా ఉంది. మాస్కులు, పీపీఈ కిట్స్ విషయంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వకుంటే వైద్యం చేయలేమంటూ జానియర్ డాక్టర్లు చెబుతుండగా.. ఐసోలేషన్ వార్డులో వైద్యం అందించే సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది వెనకంజ వేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.

నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌ర జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి!

కరోనా భూతంపై యుద్దం చేయ‌డానికి భార‌త‌మాత ముద్దు బిడ్డ‌లెంద‌రో ముందుకొచ్చి విరాళాలు ఇస్తూ సేవ చేస్తున్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరినీ మించి టాటా గ్రూపు అతి పెద్ద మనసుతో త‌మ‌కు సంబంధించి మొత్తం ఆస్థిని కూడా ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని ర‌త‌న్‌టాటా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే దేశం కోసం మొత్తం ఆస్థిని ధార‌బోస్తానంటున్నాడు ఈ భార‌త మాత ముద్దు బిడ్డ‌.  టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్లు మొత్తం 1500 కోట్ల విరాళం ప్రకటించాయి. దేశం వీరిని చేతులెత్తి మొక్కుతోంది. అయితే దేశానికి సేవ చేయ‌డానికే వ‌చ్చ‌మంటున్న మ‌న నేత గ‌ణం 545 ఎంపీ, 245 రాజ్యసభ స‌భ్యులు, 4120 ఎమ్మెల్యేలు మొత్తం 4910 మంది వున్నారుగా!  ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా,  మీరెందుకు విరాళాలు ఇవ్వ‌డం లేదు? మీరు దేశానికి సేవ చేయ‌డానికి రాలేదా?  నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌రం జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి! ఇప్ప‌ట్టికైనా మీరు స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌లు ఛీ కొడ‌తారు గుర్తుంచుకోండి. మ‌న నేత‌ల గురించి దేశం ఏంత‌ ఖ‌ర్చు పెడుతోంది. వీళ్ళు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి పెట్టే ఖ‌ర్చు ఎంత‌? ఒక‌సారి ఆవివ‌రాల్లోకి వెళ్తే.... * ప్ర‌స్తుతం ఒక్కో శాస‌న‌స‌భ్యుడికి ఏడాదికి జీతం, అల‌వెన్సులు మొత్తం క‌లిపి 27 ల‌క్ష‌ల 60 వేల రూపాయ‌లు వ‌స్తున్నాయి. అలాగే జీతం, అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రికి 50 ల‌క్ష‌ల 52 వేల రూపాయ‌లు, స్పీకర్, మండలి చైర్మన్‌కు 49 ల‌క్ష‌ల‌ 32 వేల రూపాయ‌లు, మంత్రులకు, చీఫ్ విప్, విప్‌లకు 48 ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుంటున్నారు. * ఒక్కో పార్ల‌మెంట్ స‌భ్యుడికి సంవ‌త్స‌రానికి వ‌చ్చే జీతం మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని 60 ల‌క్ష‌ల 95 వేల రూపాయ‌లు. ఎంపీల జీతభత్యాల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 106 ప్రకారం దేశంలోని ఎంపీలకు జీతభత్యాలను నిర్ణయిస్తూ 1954లో చట్టం చేశారు. 1968లో రూ.400, 1985లో రూ.1000, 1996లో రూ.1500, 2001లో రూ.4000, 2005సంవత్సరంలో రూ.12,000, 2008లో రూ.16,000, 2010లో రూ.50వేలకు జీతాలు పెంచినారు. వీటితోపాటు ఆఫీసు, డైలీ, వైద్యం, ప్రయాణం, నియోజకవర్గాల ఆలవెన్సులు అదనంగా చెల్లిస్తున్నారు. అంతే కాదు వివిధ కార్పోరేష‌న్‌ల ఛైర్మ‌న్లు, కుప్ప‌లు తెప్ప‌లుగా వున్న రాజ‌కీయ స‌ల‌హాదారుల జీతాలు, అల‌వెన్సుల‌ను  ఒక్కో ప్ర‌భుత్వం ఒక్కోవిధంగా స‌మ‌ర్పించుకుంటోంది.  * క‌రోనా బాధితుల‌కు అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్ల కొర‌త తీవ్రంగా వుంది. వీటిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ ఏడాది జీత‌భ‌త్యాల‌ను విరాళంగా ఇచ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ముందుకురావాలి.  అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య 50 వేల లోపే ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం 14 వేల వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో 10-12 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో 10 మందికి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి వారినే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి తరలించి వెంటిలేటర్‌ను అమర్చుతారు.  శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ.. కరోనా వైరస్ బారిన పడిన వారికి మాత్రమే ఈ వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది.  ఒక్కో వెంటిలేటర్‌కు రూ.5-10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.  * ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి కనిష్టంగా ఐదుకోట్ల రూపాయలతో మొదలుపెట్టి,  గరిష్టంగా పాతిక, ముప్పైకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  అదే ఎం.పి. ఎన్నిక‌ల‌కు ముప్పై కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. ఈ ఖ‌ర్చంతా కేవ‌లం త‌మ కోసమే పెట్టుకున్నారు మ‌న నేత‌లు. డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి గెలిచారు ఒక‌రు. డ‌బ్బు ఖ‌ర్చు చేసి అంత డ‌బ్బు పోగొట్టు కున్నా ఓడిపోయారు మ‌రొక‌రు. ఓడినా, గెలిచినా అంత డ‌బ్బు పోయినా వారి జీవ‌న‌శైలిలో ఎలాంటి మార్పు వుండ‌ద‌నేది మ‌నంద‌రం ప్ర‌తి ఎన్నిక‌ల్లో చూస్తూనే వున్నాం.  త‌మ కోసం అంతంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డానికి వెన‌కాడ‌ని ఈ నేత‌గ‌ణం, ప్ర‌స్తుతం వున్న ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ జేబుల్లో ఎందుకు చెయ్యి పెట్ట‌డం లేదు. త‌మ ఖ‌జానాల్లోంచి డ‌బ్బును ఎందుకు బ‌య‌టికి తీయ‌డం లేదు? క‌నీస మాన‌వ‌త్వం నేత‌ల‌కు ఉండ‌దా? కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల కోసం ఖ‌ర్చు పెట్టి ఆ త‌రువాత రెండు చేతుల‌తో సంపాదించుకోవ‌చ్చ‌నే ఎన్నిక‌ల్లో ఇష్టంతో ఖ‌ర్చు పెడ‌తారా? ఇప్పుడు ఖ‌ర్చు చేస్తే ఆ డ‌బ్బు తిరిగిరాద‌నేగా ఆ దిశ‌గా నేత‌లు ఆలోచించ‌డం లేదా! నేత‌ల‌కు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌, జ‌వాబుదారీత‌నం లేదా? ఇంకెప్పుడు ప్ర‌జా సేవ చేస్తారు? * మీ డ‌బ్బు మీకు తోడుగా రాద‌ని క‌రోనా వైర‌స్ నిరూపించింది. ఈ వైర‌స్ నీడ‌లో మీరూ వున్నార‌న్న సంగ‌తి మ‌రువ‌వ‌ద్దు. ఒక వేళ మీకు క‌రోనా రాద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం మీకు ఉండ‌వ‌చ్చు. కానీ మీ చుట్టుప‌క్క‌ల ఎవ‌రికి వ‌చ్చినా మీకూ చావు త‌ప్ప‌దు జాగ్ర‌త్త‌...  క‌రోనా వైర‌స్ మంచి సందేశం ఇస్తోంది. అది ఏమిటంటే మీరే కాదు, మీ ప‌క్క‌నున్న‌వారు కూడా బాగా వుండాలి. లేక‌పోతే మీ ప‌ని గోవిందా! అది విష‌యం. కాబ‌ట్టి మీరు దాచి పెట్టిన సంప‌ద‌ను ఇప్ప‌ట్టికైనా తీయండి. మ‌హా అయితే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయ‌నుకోండి. క‌రోనాతో పోటీచేస్తున్నామ‌ని భావించి ఖ‌ర్చుపెట్టండి. ఒక్కో ఎమ్మెల్యే క‌నీసం ఐదు కోట్లు, ఎంపి ప‌ది కోట్ల రూపాయ‌లు బ‌య‌టికి తీయండి. లేదా భారీ ఎత్తున వెంటిలేట‌ర్లు కొని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు దానం చేయండి. రాజ‌కీయ నేత‌ల్లారా క‌ళ్లు తెర‌వండి. క‌రోనా భూతాన్ని చూసైనా భ‌య‌ప‌డండి. ప్ర‌పంచం మొత్తం వ‌ణికిపోతోంది. అయినా మ‌న నేత‌ల‌కు చ‌ల‌నం లేదు.  * మ‌న దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ వుంది అని అనుకుంటున్నారా? అందుకు కార‌ణం ఏమిటి? అస‌లు 130 కోట్ల జ‌నాభా వున్న మ‌న దేశంలో ఇంత వ‌ర‌కు కేవ‌లం 35 వేల మందికి మాత్ర‌మే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ట‌. ఇది వాస్త‌వ ప‌రిస్థితి. క‌నీసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకునే సామ‌ర్థ్యం కూడా మ‌న ద‌గ్గ‌ర లేదు. అందుకే నేత‌ల్లారా మీ ద‌గ్గ‌రున్న డ‌బ్బు తీయండి. దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రండి. కరోనా మహమ్మారితో పోరాడటానికి ఈ ప్రజా ప్రతినిధులందరూ కలిసి మీ ఏడాది జీత‌భ‌త్యాల్ని విరాళంగా ఇవ్వండి. అలా చేయ‌కుండా, సిగ్గు లేకుండా ప్రతిసారీ దేశంలోని మధ్యతరగతి ప్రజలను సహాయం చేయమని విజ్ఞప్తి చేయ‌డం మీ దివాళాకోరుత‌నానికి అద్దం ప‌డుతోంది. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా క‌ళ్లు తెర‌వండి. ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండి నిజ‌మైన ప్ర‌జా సేవ చేయండి. ప్ర‌జా సేవ అంటే కేవ‌లం ప‌ద‌వులు, హోదా అనుభ‌వించ‌డ‌మే కాదు అవ‌స‌రం అయిన‌ప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి వారి ప‌క్షాన‌ నిల‌బ‌డాలి.

కరోనా జన్యుక్రమం అధ్యయనంలో వెల్లడైన అంశాలు

'ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక.. గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు! చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడ్రా' .. 'అతడు' సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన ఈ డైలాగ్‌ గుర్తుందా? ఒక్కసారి మన ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్‌ కూడా ఇలాగే పద్ధతిగా, పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం తన పని తాను చేసుకుపోతూ మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందట!  కంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని ఆనుపానులన్నీ తెలియాలి. దాని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ వివరాలు తెలుసుకోగలిగారు. సుశిక్షితులైన సైన్యంలా కొవిడ్‌-19 వైర్‌సలోని ప్రొటీన్లు పనిచేసే తీరు.. మన కణాలను దెబ్బతీసే విధానం.. రోగనిరోధక శక్తిని అడ్డుకొనే వ్యూహం నివ్వెరపరిచేలా ఉన్నాయని వారు అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 41 ఏళ్ల ఒక వ్యక్తి నుంచి ఈ వైర్‌సను సేకరించిన శాస్త్రజ్ఞులు దాని జన్యుక్రమాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించి పరిశోధనలు చేశారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. కొవిడ్‌ 19 వైరస్‌ జన్యుక్రమంలో కేవలం మూడు వేల అక్షరాలు (జన్యుపరిభాషలో లెటర్స్‌) మాత్రమే ఉంటాయి. అదే మానవ జన్యుక్రమంలో 300 కోట్ల అక్షరాలుంటాయి. అలాంటి మనను కూడా ఈ వైరస్‌ గడగడలాడిస్తోందంటే దాని వ్యూహం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. హైజాకర్స్‌..  కొవిడ్‌ 19 అయితే.. మన శరీరంలోని కణాల్లోకి తీగలాంటి ఆర్‌ఎన్‌ఏను చొప్పిస్తుంది. ఈ ఆర్‌ఎన్‌ఏలో మొత్తం దాని జన్యుక్రమమంతా ఉంటుంది. తద్వారా వైరస్‌ మన శరీరంలో త్వరత్వరగా వ్యాపించగలుగుతోంది. అయితే మన రోగనిరోధక వ్యవస్థ కూడా వైర్‌సపై పోరాటం చేస్తుంది కదా? దాన్నుంచి ఎలా తప్పించుకుంటుంది? అంటే.. పక్కా ప్రణాళికతో అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కొవిడ్‌-19లో మొత్తం 29 ప్రొటీన్లు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో మరొకటి పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. తొలుత ఆ 29 ప్రొటీన్లలో 16 ప్రొటీన్లు గొలుసుకట్టుగా ఏర్పడి మానవ కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వీటిలో ఒక ప్రొటీన్‌ (ఎన్‌ఎ్‌సపీ3) మన కణాలకు శక్తిని అందే మార్గాలను కత్తిరిస్తుంది. ఎన్‌ఎ్‌సపీ 4 అనే ప్రొటీన్‌.. వైరస్‌ చుట్టూ ఒక బుడగలాంటి పదార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో రోగనిరోధక శక్తిని అందించే కణాలు వైర్‌సపై దాడి చేయలేవు. ఇక ఎన్‌ఎ్‌సపీ5 అనే ప్రొటీన్‌ గొలుసుకట్టుగా ఉన్న ప్రొటీన్‌లను విడగొడుతుంది. అప్పుడు మిగిలిన ప్రొటీన్లు అన్నీ విడిపోయి తమ తమ పనులు చేసుకోవటం మొదలుపెడతాయి. ముఖ్యంగా.. ఎన్‌ఎ్‌సపీ7, ఎన్‌ఎ్‌సపీ8లు వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కాపీలను తయారుచేయటం మొదలుపెడతాయి. మన శరీరంలో అతి తక్కువ సమయంలో వైరస్‌ సంఖ్య పెరగటానికి ఇవే కారణం. కణకేంద్రకంపై దాడి.. ప్రతి కణానికి కేంద్రకం కీలకం. అది బలహీనమైతే కణం చనిపోతుంది. కరోనా వైర్‌సలోని 29 ప్రొటీన్లలో అత్యంత కీలకమైన ఎన్‌ఎ్‌సపీ 9 ఇదే పనిచేస్తుంది. మన కణాల్లోకి ప్రవేశించి కేంద్రకంపై నేరుగా దాడి చేస్తుంది. దీనితో కణంలోని ఇతర ప్రాంతాలకు సంకేతాలు అందవు. ఈ ప్రొటీన్‌ ఒక వైపు దాడి చేస్తుంటే మరో వైపు ఎన్‌ఎ్‌సపీ 10, ఎన్‌ఎ్‌సపీ 16 ప్రొటీన్లు మన రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని తట్టుకొనేలా- వైర్‌సలోని ఆర్‌ఎన్‌ఏను కాపాడుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఎన్‌ఎ్‌సపీ 12 ప్రొటీన్లు కొత్త వైర్‌సను తయారుచేస్తూ ఉంటుంది. ఇక్కడ అడ్డుకోగలిగితే వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చనేది శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ ప్రక్రియను అడ్డుకొనే మందులను వైర్‌సపై పరీక్షిస్తున్నారు.  గొలుసు కట్టు.. కోవిద్‌ 19లో ఉన్న 29 ప్రొటీన్లలో- 16 గొలుసుకట్టుగా ఏర్పడి కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వీటిలో ఒక ప్రొటీన్‌ (ఎన్‌ఎ్‌సపీ3 ) మన కణాలకు శక్తిని అందే మార్గాలను కత్తిరిస్తుంది. ఎన్‌ఎ్‌సపీ 4 అనే ప్రొటీన్‌ వైరస్‌ చుట్టూ ఒక బుడగలాంటి ప దార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో రోగనిరోధక శక్తిని అందించే కణాలు వైర్‌సపై దాడి చేయలేవు. ఇక ఎన్‌ఎ్‌సపీ5 అనే ప్రొటీన్‌ గొలుసుకట్టుగా ఉన్న ప్రొటీన్‌లనువిడగొడుతుంది. మిగిలిన ప్రొటీ న్లు అన్నీ విడిపోయి తమ పనులు మొదలుపెడతా యి. ఎన్‌ఎ్‌సపీ7, ఎన్‌ఎ్‌సపీ8లు వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ కాపీలను తయారుచేయటం మొదలుపెడతాయి.  వైరస్‌ సంఖ్య వేగంగా పెరగటానికి ఇవే కారణం.  క్వాలిటీ కంట్రోల్‌.. కొవిడ్‌ 19కి ఉన్న మరొక ప్రత్యేకత క్వాలిటీ కంట్రోల్‌. ఎస్‌ఎన్‌పీ 12 కొత్త వైర్‌సను తయారుచేస్తుంటే.. ఎన్‌ఎ్‌సపీ 14 అనే ప్రొటీన్‌ దానిలో తప్పులు ఏవైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటుంది. ఒక అక్షరం తేడా పడితే సరిదిద్దుతూ ఉంటుంది. ఇలా తయారైన నాణ్యమైన వైర్‌సలను ‘ఎస్‌’ అనే ప్రొటీన్‌ బయటకు విడుదల చేస్తుంది. కొవిడ్‌ 19 వైరస్‌ బయట కనిపించే బొడిపెలాంటి ఆకృతి ఆ ప్రొటీన్‌దే! దీనితో పాటు ఏసీఈ2 అనే మరో ప్రొటీన్‌ మానవ కణాలలో ప్రవేశించడంలో కీలక  పాత్ర పోషిస్తుంది.  శత్రువుకు బయట నుంచి సాయం లభించకపోతే విజయం సాధించినట్లే! వైర్‌సలోని ఓఆర్‌ఎఫ్‌ 6 అనే ప్రొటీన్‌ ఈ పనే చేస్తుంది. మానవ కణాలు బయటకు ఎటువంటి సంకేతాలు పంపకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అంటే ఒక వైపు వైరస్ సంఖ్యలో వ్యాపిస్తుంటే శరీర కణాలకు రోగ నిరోధక వ్యవస్థకు మధ్య ఉండే లింక్ తెగిపోతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు వైరస్ ముందు కొద్ది కాలం పోరాడి ఆ తర్వాత నశించిపోతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అర్చకులకు రూ.5,000 ప్రభుత్వ సాయం

నెలవారీ జీతం, ధూప దీప నైవేద్యం ద్వారా లబ్ధి పొందని వారికి ఈ పధకం వర్తిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన - చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పధకం వల్ల  2,500 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది.

కరోనా మృతదేహాల అంత్య‌క్రియ‌ల‌కు తెలంగాణ మార్గదర్శకాలు!

కరోనాతో చనిపోయిన శవాల్లో వైరస్ ఉంటుంది. అయితే ఈ వైర‌స్‌ బయటకు వ్యాపించకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసి డిస్ మాటిల్ చేయాలి.   మ‌తాచారాల‌ను బ‌ట్టి  హిందూ, ముస్లిం, క్రైస్తవుల ప‌ద్ధ‌తి వేరు వేరుగా వుంటుంది.  హిందువులు మెజార్టీ శవాలను అగ్నికి ఆహుతి చేస్తారు. ముస్లింలు  భూమిలో పాతిపెడతారు. క్రైస్తవులు భూమిలోనే పెట్టేలో పెట్టి ఖననం చేస్తారు.  హిందూ, ముస్లిం, క్రైస్తవ ఈ మూడు సంప్రదాయాలకు విలువనిస్తూ కరోనాతో చనిపోయిన వారి అంత్య‌క్రియ‌ల‌పై తెలంగాణా ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అన్ని మతాల విషయంలో కరోనా మృతదేహాల నిర్వహణ తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుందని అధికారులు స్ప‌ష్టం చేశారు.   ప్రస్తుతం తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. అందులో ఒకరు ముస్లింమేతరుడు. 1. కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు.  2. కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది. 3.మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది. 4.హిందూ కరోనా మృతదేహాలను దహనం చేస్తారు. 5. ముస్లిం క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారు.

ఢిల్లీ క్యాంప్‌లో ఇరుక్కున్న 32 మంది ఏపి విద్యార్థులు!

ఇట‌లీ నుంచి వ‌చ్చి ఢిల్లీలో క్వారెంటైన్ పూర్తి చేసుకున్నా, త‌మ ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ఏపి భ‌వ‌న్ అధికారులు ఇంకా ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఏపి చెందిన 32 మంది విద్యార్థులు సందిగ్ధంలో ప‌డ్డారు. ఇట‌లీ నుంచి ఇండియా వ‌చ్చినా, ఢిల్లీ నుంచి స్వంత ఊర్ల‌కు వెళ్ల‌డానికి జాప్యం జ‌రుగుతోంద‌ని ఏపి విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.   క్వారెంటైన్ పూర్తి కావ‌డంతో ఇట‌లీ నుంచి వ‌చ్చిన స్టూడెంట్స్  ఇటలీ నుండి వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 270 మంది భారతీయ విద్యార్థులను మార్చి 15 న ప్ర‌త్యేక విమానంలో న్యూఢిల్లీ తీసుకువ‌చ్చారు. 31.03.2020 వరకు న్యూ ఢిల్లీలోని ఐటిబిపి చావ్లా క్యాంప్, బిఎస్ఎఫ్ క్యాంప్‌లోని క్వారెంటైన్‌లో వుంచారు. విద్యార్థులందరూ తమ క్వారెంటైన్‌ పూర్తి చేశారు.  అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత  అనుమతితో అంద‌రు విద్యార్థులు తమ త‌మ రాష్ట్రాలకు వెళ్తున్నారు. నేడు తెలంగాణ విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో బస్సులో బయలుదేరుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన 32 మంది విద్యార్థులు క్వారెంటైన్ శిబిరం నుండి బయలుదేరారు. వారు తమ స్వస్థలాలకు వెళ్ళ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు.

గల్ఫ్‌లో కరోనా దెబ్బ‌కు ఖైదీల విడుదల!

సాధార‌ణంగా పండుగ సంద‌ర్భాల్లోనో, లేక ప్ర‌త్యేక సంతోష‌క‌ర‌మైన సంద‌ర్భాల్లో ఖైదీల‌ను విడిచిపెట్ట‌డం గ‌ల్ఫ్ దేశాల్లో ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుత‌మున్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి నిర్మూలనలో భాగంగా జైళ్లలో శిక్ష అనుభ‌విస్తున్న‌ ఖైదీలను గల్ఫ్‌ దేశాలు విడుదల చేస్తున్నాయి.  ఒమన్‌లోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 599 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఒమన్‌ సుల్తాన్‌ షేక్‌ హైతం బిన్‌ తారిఖ్‌  హుకుం జారీ చేశారు. ఇందులో 366 మంది విదేశీ ఖైదీలుండగా.. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నార‌ట‌. అయితే తెలుగు వారు ఎంత మంది వున్నార‌నేది తెలియాల్సి వుంది. సౌదీ అరేబియా కూడా 250 మంది విదేశీ ఖైదీలను విడుదల చేసింది. మిగిలిన గల్ఫ్‌ దేశాలు కూడా కరోనా కారణాన ఖైదీలను విడుదల చేస్తున్నాయి. ఇరాన్ 85 వేల మంది ఖైదీల‌ను విడుద‌ల చేసింది. వీసా నేరాలపై పట్టుబడిన కొంత మంది భార‌తీయుల్ని దుబాయి, షార్జా పోలీసులు ఉదారంగా వదిలేశారు.

తుమ్మితే సత్యం అనేవాళ్లు! ఇప్పుడు సచ్చాంరా...

ఎవరైనా తుమ్మితే సత్యం అనేవాళ్లు.. ఇప్పుడు ఎవరైనా తుమ్మితే సచ్చాంరా అని అంటున్నారని మంత్రి హరీష్ రావు నవ్వుతూ వ్యాఖ్యానించారు.  కరోనా.. కరోనా.. అంటే ఓ ముసలావిడ ఏమందంటే.. కరోనా పేరు మంచిగ ఉందిగాని బిడ్డా.. ఈ చంపుడు మంచిగా లేదని అన్నదని హరీష్‌రావు చెప్పారు.  కరోనాకు మందులేదని, ఎవరి ఇంట్లో వాళ్లు ఉండడమే దీనికి మందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ కరోనా అదుపులో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ కరోనా అదుపులో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.  కేవలం 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపు చేయలేకపోతోందని, అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఆందోళ‌న క‌లుగుతుంద‌ని మంత్రి అన్నారు.

ఎయిర్ అంబులెన్సులున్న దేశం, ఇప్పుడు ఇండియా మందుల కోసం ఎదురు చూస్తోంది...

ఇండియా జనాభా 130 కోట్లు.. అమెరికా జనాభా 35కోట్లు..వైశాల్యం లో మనదేశం కంటే ఎంతో పెద్దది అమెరికా, బాగా ధనవంతులు ఉన్న దేశం, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడ చాలా ఎక్కువ,ఎంత ఎక్కువంటే అక్కడ ఓ మనిషి నెలరోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో,ఇక్కడ ఐదుగురు ఉండే రెండు కుటుంబాలు బతుకుతాయి, విశాలమైన ఇల్లు, ఇంటి ఇంటికి మధ్య దూరం కూడ ఎక్కువ.బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ కార్లు, క్వాలిటీ తో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్, ఆధునిక సాంకేతిక వ్యవసాయం‌,వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్,ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఎయిర్ అంబులెన్సులు,చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు,16ఏళ్ళు దాటితే తల్లి దండ్రులతో సంబంధం లేకుండా బతికే ఫ్రీడమ్ ,పెళ్ళికి ముందే డేటింగ్ పేరుతో చేసే సహజీవనం, అబ్బో ఓకటేమిటిలే అదో భూతల స్వర్గం,మాది అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకునే అక్కడి పాలకులు,,, మరి నేటి పరిస్థితి? 35కోట్లు ఉన్న జనాభాని కంట్రోల్ చేయలేక, రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్ధలం లేక, వాళ్ళని పూడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకి వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్లకి కావాల్సిన ఎక్యూప్మెంట్లు దొరక్క, శవాలని ఎక్కడ పూడ్చాలో అర్థం కాక,చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి. మరి ఇండియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు,  కానీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, విదేశాలనుంచి వచ్చే వాళ్ళని రాకుండా ఆపేయడం,ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి‌, ఒకరినుండి ఇంకొకరికి కనెక్షన్ లేకుండా లాక్ డౌన్ పెట్టడం, కాస్త కఠినంగా వ్యవహరించైనా, బాధ్యత లేనోళ్ళని కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులకు, చుట్టు పక్కల వాళ్ళకి పరీక్షలు చేసి, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం.  ఒక్కసారి ఆలోచించండి 135 కోట్ల జనాభా ఉన్న ఇండియా లో, ఇప్పటికి రోగుల సంఖ్య 4అంకెలు దాటకపోవడం అంటే చిన్న విషయం కాదుగా. మరణించిన వాళ్ళ సంఖ్య కూడా 2అంకెలు దాటలేదు అన్ని సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న మనదేశంలో, ఈ సంఖ్య చాలా తక్కువే. అమెరికా,లండన్ ,ఇటలీ, స్పెయిన్ హలాంటి దేశాలతో పోలిస్తే,  మనం ఎన్నో వేల రెట్లు నయం, అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మనవైపు చూస్తోంది, ఈ వ్యాధి ఇండియాలో వస్తే, శవాలగుట్టలు చూస్తాము అని వాగిన నోర్లే, ఈరోజు నోరెళ్ళబెట్టి మనవైపు చూస్తున్నాయి, అంతేకాక ఈరోజు మన మందులకోసం 30దేశాలు క్యూ లో వెయిట్ చేస్తున్నాయి ఇది మనకు తెలీని మనదేశ గొప్పతనం.

ఢిల్లీ మర్కజ్‌ కేసుల్లో 1,425 మందికి నెగిటివ్‌!

మర్కజ్‌ నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో 1,425 మందికి కరోనా లేనట్లు వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వారందరికీ వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం సర్కారుకు నివేదిక అందజేసింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,089 మంది ఉన్నారు. వారు 2,421 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరిగారు. దీంతో మొత్తం 3,510 మందిని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు గుర్తించాయి. వారిలో ఇప్ప టివరకు 2,364 మంది శాంపిళ్లను సేకరించారు. ఇంకా 603 శాంపిళ్ల పరీక్షలు చేయాల్సి ఉందని నివేదిక తెలిపింది.  తెలంగాణాలో బుధవారం సాయంత్రానికి 125 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలు 60 వేల ఇళ్లకు తిరిగి 3.5 లక్షల మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాయి. వారికెవరికైనా జలుబు, జ్వరం, దగ్గు ఉంటే వెంటనే క్వారంటైన్లో ఉండాలని చెబుతున్నారు.  తీవ్రమైతే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వారికేమైనా విదేశీ ప్రయాణ చరిత్ర ఉందా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో సంబంధాలు ఉన్నాయా? కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కలిశారా? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వైరస్‌ అనుమానిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లాంటి తదితర వివరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది సేకరించింది. కాగా, తొలుత ఇక్కడ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఆయా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో వైరస్‌ సామూహికంగా వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్‌ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ఏపీ లో నిన్న రాత్రి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. "రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి" అని అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 9 మంది చికిత్స అనంతరం కరోనా నెగటివ్ నిర్దారణ అయి, డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం  474 క్వారంటైన్  సెంటర్లను నిర్వహిస్తోంది. కరోనా విపత్తును ఎదుర్కోవటానికి ఈ సెంటర్లలో 46,872 పడకలను సిద్ధం చేశారు. రమారమి 24,537 అనుమానితులను స్వీయ గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రస్తుతం 5,635 మంది  ఈ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.