హైకోర్టులో దేవినేని బెయిల్ పిటిషన్.. కడిగిన ముత్యంలా వస్తారన్న చంద్రబాబు 

మాజీమంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే ఉమాను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ఉమా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చంద్రబాబు అన్నారు.   కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్‌ చూసివస్తున్న దేవినేని కారుపై వైసీపీ  కార్యకర్తలు మంగళవారం దాడి చేయగా.. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు ఆయన్నే నిందితుడిగా చేర్చారు. పైగా  హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఉమ సహా 18 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఆయన్ను మాత్రమే అరెస్టు చేశారు. వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పుతూ.. చివరకు బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మైలవరం సివిల్‌ జూనియర్‌ జడ్జి కోర్టు ముందు హాజరుపరిచారు. నూజివీడు, గన్నవరం సబ్‌జైళ్లు ఖైదీలతో నిండిపోవడంతో చివరకు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులను పోలీసులు మోపారు. ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. ఉమాపైనే దాడి చేసి ఆయనపైనే కేసులు నమోదుచేయటంపై అభ్యంతరం తెలిపారు. పలు సాంకేతిక ఆధారాలను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంది. రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌ దాసరి సురేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమా, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీకి చెందిన ఆరుగురిపైనా కేసులు పెట్టామని చెబుతున్నప్పటికీ.. వారి పేర్లను వెల్లడించలేదు. 

ఆక‌లి చావుల త‌ర‌ఫున‌.. ష‌ర్మిల ఆర్బాట‌పు దీక్ష‌లా?

వాళ్లు ఆక‌లితో అల‌మ‌టించారు. వాళ్లు ఉద్యోగం కోసం ఏళ్ల పాటు ఎదురుచూశారు. క‌ష్టాలు పెరుగుతున్నాయి. కన్నీళ్లు ఇంకుతున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు మాత్రం రావ‌టం లేదు. నియామ‌కాల కోసం కొట్లాడి సాధించుకున్న‌ తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఆక‌లి చావులే మిగిలాయి. ఇక త‌మ వ‌ళ్ల కాదంటూ.. ఇక సెల‌వంటూ ప‌లువులు విద్యావంతులు ప్రాణాలు వ‌దులుతూ తెలంగాణ త‌ల్లికి క‌డుపుకోత క‌లిగిస్తున్నారు.  బంగారు తెలంగాణ‌లో నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల పోరుబాట ప‌ట్టారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న తెలుపుతున్నారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం దీక్ష‌కు దిగుతున్నారు. ఒక్కో వారం ఒక్కో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. వారిని ఓదారుస్తున్నారు. అక్క‌డే ఒక్క‌రోజు దీక్ష చేప‌ట్టి స‌ర్కారుకు నిర‌స‌న జ్వాల‌ తాకేలా చేస్తున్నారు. కొన్ని వారాలుగా సాగుతోంది ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష‌. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఆయా కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం.. ఓదార్చ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ, ఆమె దీక్ష చేస్తున్న విధాన‌మే అదోలా ఉందంటున్నారు. శిథిల‌మైన‌ ఇండ్లు.. చితికిన బ‌తుకులు.. ఆక‌లి మంట‌లు వాళ్ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైతే.. ష‌ర్మిల వాళ్ల ఇళ్ల ద‌గ్గ‌రే ల‌గ్జ‌రీగా దీక్ష‌లు చేస్తుండ‌టాన్ని త‌ప్పుబ‌డుతున్నారు కొంద‌రు. అట్ట‌హాసంగా దీక్షా శిబిరం వేసుకొని.. మందీమార్బ‌లం పోగేసుకొని.. బాడీగార్డుల‌ను వెంటేసుకొని.. అదేదో ప్రైవేట్ ఈవెంట్‌లా.. క్లాస్‌గా, కాస్ట్‌లీగా దీక్ష‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ష‌ర్మిల‌ దీక్షల‌పై సోష‌ల్ మీడియాలో మ‌రింత కామెంట్లు వినిపిస్తున్నాయి. దీక్ష అంటే ఏదో ఒక టెంటు వేసుకొని.. కింద ఓ కార్పెట్ ప‌రుచుకొని.. సింపుల్‌గా దీక్ష కానిచ్చేస్తుంటారు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్ర‌జ‌లు అలాంటి దీక్ష‌లే చూశారు. వాటికే అల‌వాటుప‌డ్డారు. కానీ, ష‌ర్మిల రాక‌తో దీక్ష‌ల్లోనూ రిచ్‌నెస్ చూపించ‌వ‌చ్చ‌ని అనిపిస్తోందని అంటున్నారు. ఎన్ని ల‌క్ష‌లు పెట్టి కొన్నారో.. అత్యంత మందంగా ఉండే స్పింగ్ కాయిల్ ప‌రుపుపై మేడ‌మ్ ఆసీనుల‌వుతున్నారు. ఆ ప‌రుపు మ‌ధ్య‌లో దిండ్ల‌తో మ‌రో సింహాస‌నం లాంటి సెట‌ప్‌. రెండు చేతులు ఆనించేందుకు రౌండ్ పిల్లోస్‌.. వెన‌క్కి ఒరిగేందుకు నాలుగైదు మెత్త‌ని దిండ్లు.. చిక్క‌ని నీడ‌.. చ‌క్క‌ని గాలివీచే ఏర్పాట్లతో.. ల‌గ్జ‌రీగా దీక్షాశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విలాస‌వంత‌మైన సెట‌ప్‌ను.. ఆ గ్రామ‌స్తులు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు. ఇంత కులాస‌వంత‌మైన‌ దీక్షావేదిక‌పై దొర‌సానిలా కూర్చొని.. కేసీఆర్ దొర‌త‌నం గురించి ప్ర‌శ్నిస్తే.. ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకుంటారా?   ఇదంతా అన్న జ‌గ‌న‌న్న నుంచి కాపీ కొట్టిన స్టైల్‌. కొల్ల‌గొట్టిన వేల కోట్ల అవినీతి సొమ్ముతో.. ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ సైతం ఇలాంటి ఖ‌రీదైన దీక్ష‌లే చేసేవారని గుర్తు చేస్తున్నారు. అట్ట‌హాసంగా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి.. డ‌బ్బులిచ్చి జ‌నాల‌ను త‌ర‌లించి.. జెండాల‌తో, మైకుల‌తో హోరెత్తించేవారని అంటారు. అచ్చం.. అన్న అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ.. చెల్లెమ్మ ష‌ర్మిల‌మ్మ కూడా అలాంటి ల‌గ్జ‌రీ దీక్ష‌లే చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే.. అది ఆంధ్ర‌. అక్క‌డ అలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. పేద‌రికం ఆన‌వాళ్లు అధికంగా ఉండే తెలంగాణ‌లో ఇలాంటి ఫోజులు కొడితే ష‌ర్మిల రాజ‌కీయ‌ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌చ్చు. దీక్ష‌లు అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యే అవ‌కాశ‌మూ ఉంది. తెలంగాణ కోడ‌లిన‌ని వాదిస్తే స‌రిపోదు.. ముందు తెలంగాణ మ‌ట్టి వాస‌న గ్ర‌హించాల‌ని.. చెమ‌ట ప‌ట్టిన బ‌తుకుల‌ను అర్థం చేసుకోవాల‌ని.. కొత్త‌గా వ‌చ్చిన పాత కోడ‌లికి సూచిస్తున్నారు అస‌లైన తెలంగాణ‌వాదులు. ఇందిరాపార్కు ద‌గ్గ‌ర ఉన్న దీక్షా స్థ‌ల్‌ని ఆద‌ర్శంగా తీసుకొని.. లోట‌స్ పాండ్ పోక‌డ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయేలా దీక్ష‌లు చేస్తేనే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని.. లేదంటే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు

హాయ్ గీత.. నువ్వే నా లవరన్న  యువకుడు.. కట్ చేస్తే..

అబ్బాయి..హాయ్ గీత.. ఎలా ఉన్నావ్.. అమ్మాయి ఎవరు ? అబ్బాయి  నువ్వు నాకు తెలుసు..? అమ్మాయి ఎలా తెలుసు ? ఏం తెలుసు? మళ్ళీ అబ్బాయి నువ్వు చాలా   బాగుంటావని తెలుసు.. నీ స్మైల్ బాగుంటుందని తెలుసు..అనగానే అమ్మాయి  మరి అన్ని తెలిస్తే షీ టీంకి కంప్లైంట్ చేస్తారని తెలియదా? అనగానే అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా  చెప్పానుగా బేబీ నన్ను ఎవరు పట్టుకోలేరని.. అన్నాడు ఇంట్రెస్టింగా ఉంది కదా..? ఇది తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ మధ్య జరిగే సీన్ కాదు.. సంభాషణ అంతకంటే కాదు.. సామాన్య మైన కామంతో కొవ్వు ఎక్కిన అబ్బాయికి, ఒక సాధారణమైన అమ్మాయికి మధ్య జరిగిన  వాట్సాప్ చాటింగ్ ఎప్పుడు ఈ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కామంతో, రిమ్మతెగులుతో రెచ్చిపోయాడో పోకిరీ. వాట్సాప్‌లో యువతికి మెసేజులు పంపుతూ నిత్యం వేధింపులకు దిగాడు. నువ్వు అందంగా ఉంటావంటూ మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఏం కావాలని ఆ అమ్మాయి అడిగితే కొంటెగా  గుండెల్లో చోటు అన్నాడు.. అక్కడ అయితే ఇవ్వలేను కానీ.. జైల్లో ఖాళీ ఉంటుందేమో అంటూ ఆ అమ్మాయి  ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అయినా నన్నెవరు పట్టుకోలేరు బేబీ అంటూ పలికాడు కామ గురుడు.  అయితే యువతి షీ టీం ఒక్క చాన్స్ ఇద్దామంటూ యువతి షీ టీం పేరుతో షాకిచ్చింది. ఆ తర్వాత మెసేజులు ఆగిపోయాయి. సుమారు గంట తర్వాత ఏంటి రిప్లై లేదు అని మెసేజ్ చేస్తే.. షీం టీం రిప్లై చూసి యువతి హ్యాపీ. సుమారు 48 నిమిషాల తర్వాత మళ్లీ మెసేజ్ చేసిన యువతికి షీ టీం నుంచి మెసేజ్ వచ్చింది.గంటలోనే గురుడికి షాకివ్వడంతో ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వైరల్‌గా మారింది. కట్ చేస్తే.. అయితే  రంగంలోకి దిగి కేటుగాడి పనిపట్టారు సైబరాబాద్ షీ టీం పోలీసులు. యువతిని వేధింపులకు గురిచేసిన గంటలోనే పోకిరీకి ఊహించని షాకిచ్చారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిపోయాయి. అదే ఆ మెసేజ్. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చని షీ టీం భరోసా ఇస్తూ చేసిన మెసేజ్‌కి యువతి థాంక్స్ చెప్పింది. ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ బయటికి రావడంతో వైరల్‌గా మారింది. అసలు ఆ గంటలోపే ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది. అయితే యువతి షీ టీంకి ఫోన్ చేయడం.. వెంటనే అతన్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి మరి. సో ఇదండీ మ్యాటర్ ఇక మీద ఎవరైన అమ్మాయిలను వేధించేవాళ్లు ఉంటే, అమ్మాయిలను వేదించాలని అనుకుంటే ఆ ఆలోచనని పురిటి లోనే చంపేస్తే బెటర్ మరి.. ఎందుకంటే రోజులు బాగాలేవు.. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.. సో జాగ్రత్త అలాంటివి మానుకుని భవిష్యత్తు గురించి ఆలోచించండి. 

జీతం రూపాయి.. కోట్లలో హెలికాప్టర్‌ ఖర్చు! ఇదేందయా జగన్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై పోరు సాగిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన రఘురామ.. సీఎం జగన్ తీరుపై విమర్శలు చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని చెప్పారు. రూపాయి జీతం తీసుకొనే సీఎం జగన్.. హెలికాప్టర్‌ ఖర్చు తగ్గించుకుంటే మంచిదని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. రూపాయి జీతం తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి.. హెలికాప్టర్ జర్నీలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఎంపీ రఘురామ రాజు అన్నారు. తాడేపల్లి ప్యాలస్ ను వదిలి జగన్ జనబాహుళ్యంలోకి రావాలన్నారు. అన్యాయం జరిగితే ప్రజలు పులుల్లా మారాలని రఘురామ పిలుపునిచ్చారు.  మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనసు చేసుకొని ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని కామెంట్ చేశారు ఎంపీ రఘురామ. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం లేదని ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. ఇళ్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. సీజేఐ రమణ మాతృభాషలో విచారణ జరపడం సంతోషకరమని, మాతృభాషలో వచ్చే స్పందన పరాయిభాషలో రాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. 

కవ్విస్తే.. ధిక్కరిస్తే.. రేవంత్ ఊరుకుంటాడా?

కొన్నిరోజులుగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైలెంట్‌. ఇదే అద‌నుగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తెగ హ‌డావుడి చేస్తున్నారు. అన్న ఒక‌లా.. త‌మ్ముడు ఇంకోలా. ఎవ‌రి టాలెంట్‌కు త‌గ్గ‌ట్టు వారు యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. ఒక‌రు న‌ల్గొండ‌లో రెచ్చిపోతుంటే.. ఇంకొక‌రు ఢిల్లీ నుంచి బాంబులు విసురుతున్నారు. స‌డెన్‌గా న‌ల్గొండ బ్ర‌ద‌ర్స్ ఇంత‌లా యాక్టివ్ కావ‌డానికి కార‌ణం ఏంట‌ని కాంగ్రెస్ వ‌ర్గాలే ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. రేవంత్‌రెడ్డికి ధీటుగా.. తామేం త‌క్కువ కాద‌నే మెసేజ్ ఇవ్వ‌డానికో.. రేవంత్‌ స్థాయి త‌గ్గించడానికో.. ఆయ‌న్ను బ‌ద్నామ్ చేసేందుకో.. కార‌ణం ఏదైనా కోమ‌టిరెడ్డి ఫ్యామిలీ రేవంత్‌ను కార్న‌ర్ చేసేందుకు ట్రై చేస్తోంద‌ని అంటున్నారు. మ‌రోవైపు, ప‌లువురు సీనియ‌ర్లు సైతం చాక‌చ‌క్యంగా పావులు కదుపుతూ పీసీసీ చీఫ్‌ త‌మ కంట్రోల్ దాటిపోకుండా చూసుకుంటున్నారు. అయితే, అర‌చేతిని అడ్డుపెట్టి సూర్యుని వెలుగును ఆప‌గ‌ల‌రా? అంటూ రేవంత్ అభిమానులు కౌంట‌ర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి క్వైట్ కామ‌న్‌. ఏళ్లుగా అలాంటివి జ‌రుగుతునే ఉన్నాయి. అయితే, ఇక‌పై ఇలాంటి, అలాంటివన్నీ బంద్‌. కాంగ్రెస్‌వాదులంతా క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండాల్సిందే. పార్టీ లైన్‌కు క‌ట్టుబ‌డాల్సిందే. ఎక్స్‌ట్రాలు చేస్తే తోక క‌ట్ చేస్తా. ఖ‌బ‌ర్దార్.. అంటూ పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే రేవంత్‌రెడ్డి కేడ‌ర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపుల‌న్నీ బ‌చ్చా లీడ‌ర్ల‌కేన‌ని.. మాలాంటి వాళ్ల‌ను ట‌చ్ చేయ‌లేవంటూ సీనియ‌ర్లు య‌ధావిధిగా త‌మ స్టైల్‌లో పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు.  ఇటీవ‌లే కాంగ్రెస్ సీనియ‌ర్లంతా ర‌హ‌స్య స‌మావేశం పెట్టి మ‌రీ రేవంత్‌రెడ్డి ముందు కొన్ని డిమాండ్లు ఉంచార‌ని తెలుస్తోంది. పోలోమంటూ ఎవ‌రొస్తే వారిని పార్టీలోకి తీసుకోవ‌ద్ద‌ని.. స్థానిక నేత‌లు అభ్యంత‌రం చెప్ప‌క‌పోతేనే.. వారు ఓకే అంటేనే.. కాంగ్రెస్ కండువా క‌ప్పాల‌ని చెప్పార‌ట‌. ఎంత పెద్ద లీడ‌ర్ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యే టికెట్ హామీ మాత్రం ఇవ్వందంటూ గ‌ట్టిగానే కండిష‌న్ పెట్టార‌ట‌. సీనియ‌ర్ల స‌హ‌కారం లేనిదే పార్టీని ఈజీగా న‌డ‌ప‌లేర‌నే విష‌యం తెలిసి.. వీళ్ల సంగ‌తి స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాంలే అనుకొని.. వారి డిమాండ్స్‌కు స‌రేనంటూ ఇప్ప‌టికైతే త‌ల ఆడించార‌ట పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.  డైన‌మిక్ లీడ‌ర్ నాయ‌క‌త్వం చూసి కాంగ్రెస్‌లో చేరేందుకు అన్నిపార్టీల నేత‌లు, అన్నిప్రాంతాల నాయ‌కులు ఉత్సాహం చూపిస్తుంటే.. పార్టీ సీనియ‌ర్లు మాత్రం చేరిక‌ల‌పై, చేర్చుకోవ‌డాల‌పై ఇలా కొర్రీలు పెట్ట‌డం కాంగ్రెస్‌లోనే సాధ్యం. ఆ సీనియ‌ర్ల వ‌ల్లే ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరేందుకు ఆస‌క్తి చూపిన పాల‌మూరు బీజేపీ అధ్య‌క్షుడు ఎర్ర శేఖ‌ర్‌తో పాటు డీఎస్ త‌న‌యుడు సంజ‌య్‌, గండ్ర స‌త్య‌నార‌య‌ణలాంటి వారు పార్టీ కండువా క‌ప్పుకునే స‌మ‌యం ఆల‌స్యం అవుతోంద‌ని అంటున్నారు.  మ‌రోవైపు.. లేటెస్ట్‌గా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జోరు మామూలుగా లేదు. పార్టీ పిలుపు లేకుండానే.. పీసీసీకి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే.. రాజ‌గోపాల్‌రెడ్డి ద‌ళిత బంధుపై త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ధూంధాం చేశారు. మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డితో గొడ‌వ పెట్టుకొని త‌న ఉనికిని బ‌లంగా చాటుకున్నారు. ఆ మ‌ర్నాడే మునుగోడులో ద‌ళిత బంధు కోసం ధ‌ర్నాకు పిలుపిచ్చి ర‌చ్చ రంబోలా చేశారు. ఇదంతా కోమ‌టిరెడ్డి సొంత ఎజెండా. ద‌ళిత బంధుపై కాంగ్రెస్ వైఖ‌రి ఏంటో పీసీసీ ఇంకా ప్ర‌క‌టించ‌నేలేదు. ఎలాంటి ఆందోళ‌న‌ల‌కు పిలుపివ్వ‌లేదు. పీసీసీతో త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా రాజ‌గోపాల్‌రెడ్డి ఓ రేంజ్‌లో యాక్టివిటీస్ చేస్తుండ‌టం.. రేవంత్‌రెడ్డిని డ‌మ్మీ చేసే ప్ర‌య‌త్న‌మేన‌ని అంటున్నారు. త‌న‌కు న‌చ్చిన‌ట్టు చేసుకుంటానంటూ.. పీసీసీ చీఫ్‌కు కోమ‌టిరెడ్డి చేస్తున్న ఛాలెంజ్‌గా భావిస్తున్నారు.  అటు కోమ‌టిరెడ్డి బిగ్ బ్ర‌ద‌ర్ సైతం త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ కిరికిరి స్టార్ట్ చేశారు. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేయ‌డాన్ని ఆయ‌న మొద‌టినుంచీ వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే.. ప‌ద‌విని కొనుక్కున్నారంటూ హాట్ కామెంట్లు చేసి ఇర‌కాటంలో ప‌డ్డారు. హైక‌మాండ్‌ను షంటింగ్స్ ప‌డ‌టంతో నోరు మూసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచీ సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చిన వెంక‌ట్‌రెడ్డి.. తాజాగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదంటూ.. త‌న స‌ర్వేలో ఈట‌ల‌నే గెలుస్తాడ‌ని తేలిందంటూ.. ఢిల్లీ నుంచి డైన‌మైట్లు పేల్చారు. అస‌లాయ‌న‌ను స‌ర్వే ఎవ‌రు చేయ‌మ‌న్నారు? నిజంగా స‌ర్వే చేశారా లేదా? ఆ విష‌యాల‌ను ఓపెన్‌గా ఎందుకు చెప్పాలి? పార్టీలో నిరుత్సాహం నింపే స్టేట్‌మెంట్స్ ఎందుకు చేయాలి? ఇదంతా క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం కాదా? పార్టీ లైన్‌కు వ్య‌తిరేకం కాదా?   కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని క‌వ్వించ‌డానికే ఆయ‌న‌లాంటి కామెంట్లు చేశార‌ని అంటున్నారు. రేవంత్‌ను గిల్లుదాం.. ఆయ‌న ఏం చేస్తారో చూద్దాం.. అన్న‌ట్టుగా ఉంది కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయం. కాంగ్రెస్‌లోనే ఉంటూ రేవంత్‌పై రెబల్ వాయిస్ వినిపించ‌డ‌మా? లేక‌, కాంగ్రెస్‌ను ఫుల్‌గా డ్యామేజ్ చేసి బీజేపీలోకి జంప్ అయిపోదామ‌నా? కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అస‌లు ఉద్దేశ్య‌మేంటో అర్థం కావ‌ట్లేదంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఇంత‌కుముందైతే ఇలాంటి ఇష్టారీతులు న‌డిచాయి.. మ‌రిప్పుడు పీసీసీ పీఠంపై రేవంత్‌రెడ్డి ఉన్నారు. తోక జాడించే నేత‌లకు షాక్ ఇస్తారా? సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టి.. చెప్పుచేత‌ల్లోకి తెచ్చుకుంటారా? లేక‌, చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేసి కాంగ్రెస్ ర‌థాన్ని ముందుకు దూకిస్తారా? చూడాలి.. రేవంత్‌రెడ్డి ఏం చేస్తారో..

దళిత బంధు.. టీఆర్ఎస్ కు వరమా.. శాపమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు జారారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడం కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తున్నామని, తమదైన శైలిలో కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆ జారిన మాటే, అయన మెడకు చుట్టుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన తమ లేఖలో అధికార పార్టీ ఇప్పటికే అనేక అక్రమాలకు పాల్పడుతోందని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ హుజురాబాద్ ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి, హుజురాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించడంతో పాటుగా, అధికార తెరాస విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టాలని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, కేంద్ర బలగాలను దించి ఎన్నికలు నిర్వహించాలని కూడా గొనె ప్రకాశ రావు టం లేఖలో పేర్కొన్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్  హుజురాబాద్’లో  కాకుండా మరో నియోజక వర్గంలో అమలు చేయాలని, ఆ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.  తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) మరో అడుగు ముందు కేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు సహా కొత్తగా ఏ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్జీజీ  కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో, ఉప ఎన్నికలలో గెలుపు కోసమే, దళిత బంధు పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. అలాగే, ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు నెలల్లో దాదాపు వెయ్యి కోట్లు నగదు బదిలీ చేయబోతోందని పద్మనాభ రెడ్డి తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అసలు ఈ లేఖలను పట్టించుకుంటుందా అనే విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నది కూడా ఇదే అని, ఎదో విధంగా ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి, పథకం అమలును అడ్డుకోవాలనే అయన కోరుకుంటున్నారని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేస్తున్నాయే కానీ, ఫిర్యాదులు చేయడం లేదు. నిజానికి, చివరి వరకు ఎవరూ అడ్డుకోకపొతే,  ఎవరో ఒకరితో కోర్టులో ఒక పిల్ వేయించి, తప్పించుకునే వ్యూహంతోనే ముఖ్యమంత్రి అమలు  చేయడం అసాధ్యమని తెలిసి కూడా దళిత బంధు ప్రకటించారని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది.  అందుకే, ఇప్పుడు ముఖ్యమంత్రి  కొత్త ఎత్తులకు పదును పెడుతున్నారని అంటున్నారు. అలాగే, ప్రతిపక్షాలు కూడా, దళిత బంధు  పథకాన్ని ఒకే సారి రాష్ట్ర మంతా అమలు చేయలాని, అదే చేత్తో  బీసీలు, ఎస్టీలకు కూడా పథకం వర్తింప చేయాలని డిమాండ్  చేస్తున్నాయి.  దళితులు కూడా దళిత బంధు విషయంలో అంతగా ఆశలు పెట్టుకోలేదు. ఎన్నికలకు ముందు ... కొద్ది మందికి అది కూడా తెరాస క్రియాశీల సభ్యులకు ఇస్తే ఇస్తారేమో కానీ, ఎన్నికల తర్వాత పథకాన్ని అటకెక్కిస్తారని దళిత యువకులే ప్రచారం చేస్తున్నారు. గతంలో చేసిన దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హమీలలాగానే, దళిత బంధు కూడా ఎప్పటికీ అమలు కానీ హామీల జాబితాలో చేరుతుందని అంటున్నారు. అంతే, కాకుండా దళిత బంధు,  ముఖ్యమంత్రి, ప్రభుత్వ విశ్వసనీయతను మరింత పలచన చేస్తుందని, ఫలితంగా మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెరాస ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు పోయి హుజురాబాద్’ లో గెలిఛితీరాలనే ఉద్దేశంటిఓ వేస్తున్నా అడుగులు, చేస్తున్న తప్పులు హుజురాబాద్’లో  ఏమి చేస్తాయో ఏమో కానీ, తమ నియోజక వర్గాల్లో ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. ఒక విధాయంగా చూస్తే, దళిత బంధు, ప్రతిపక్షాల కంటే తెరాస ఎమ్మెల్యేలు, నాయుకునే ఎక్కువగా భయపెడుతోంది. తెరాస నేతల్లో దాదా పుట్టిస్తోందని అంటున్నారు. 

భర్త 8 హత్యలు.. భార్య 11 హత్యలు..  

భార్య భర్తలు సమానం.. ఆడమగ సమానం.. ఉద్యోగం లోను, ఉపాధిలోను , భార్యాభర్తలు అన్ని విషయాలలో కలిసే ఉండాలి. కష్టాలు సుఖాలు ఏవైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అని మన పూర్వికులు , పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక  ఈ భార్యాభర్తలు ఆ విషయాన్నీ చాలా గట్టిగా నమ్మినట్టు ఉన్నారు. పెద్దల మాట సద్దన్నం మూట అనుకున్నారేమో..  భర్త తప్పుచేస్తే దండించాల్సిది పోయి ఆమె కూడా భర్తతో కలిసి దారుణాలకు పాల్పడింది. అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని హత్యలు చేయడంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఈ హత్యలు చేసే ఆదర్శ దంపతులు . ఇంకా చెప్పాలంటే హత్యలు చేయడంలో భర్త కన్నా భార్య ఒకడుగు ముందే ఉంది. భర్త 8 హత్యలు చేస్తే.. ఒకటి కాదు, రెండు కాదు  భార్య ఏకంగా 11 హత్యలు చేసి.. భర్తను మించిన భార్య పనిపించుకుంది. ఎందుకు వారేమైనా సైకో లా అంటే కాదు..బందిపోట్ల అంటే అంతకన్నా కాదు.. వారికీ  బంగారంపై మోజు. ఈజీ మనీ కోసం ఆ భార్యాభర్తలు గంభీర్, సెవాగ్ పాట్నర్ షిప్లో సెంచరీ సెంచరీ చేసినట్లు.. ఏకంగా వేళ్ళు మొత్తం  19 మందిని హతమార్చారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. దుండిగల్‌లో వరుస హత్యల కేసును  ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఒంటరి మహిళలను దారికాచి హత్య చేస్తున్న క్రూర దంపతుల కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే.. అది సంగారెడ్డి జిల్లా. జిన్నారం మండలం. మాదారం గ్రామానికి చెందిన స్వామి. అతని వయసు 27 సంవత్సరాలు. అతని భార్య. ఆమె వయసు 26  ఈజీ మనీ కి అలవాటు పడ్డారు. దీని కోసం వారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా  రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలు కనిపిస్తే వాళ్ళే వీరి టార్గెట్మా.. వాళ్ళకి యమాటలు చెప్పి, చిన్నగా వాళ్ళని ముగ్గులోకి దించి.  వారిని నమ్మించి మసిబూసి మారేడుకాయ చేసి జిన్నారం అడవుల్లోకి తీసుకు వెళ్తారు. ఇక అంతే అక్కడికి వెళ్ళాక వాళ్ళ  దగ్గరనుంచి డబ్బు, బంగారం లాక్కొని  కిరాతకంగా హత్యచేస్తారు. ఈ విధంగా  భార్యాభర్తలిద్దరూ బంగారం కోసం 15 మందికి పైగా మహిళలను హత్య చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే  ఈనెల 25న మల్లంపేటలోని కూలీ అడ్డా నుండి భామిని(35)అనే మహిళను జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి భార్యాభర్తలు హత్యచేశారు. స్వామిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించిగా    సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం, డబ్బు కోసమే 15 మందికి పైగా మహిళలను హత్య చేసారని పోలీసులు తెలిపారు. భర్త 8 హత్యలు భార్య 11 హత్యలు చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతామని పోలీసులు తెలిపారు. మహిళలపై మాములుగానే ఒక వైపు స్టూడెంట్స్, మరో వైపు ఇంట్లో తల్లిదండ్రులు. మరో వైపు ఆఫీస్ లో యజమానులు. చైన్ స్నాచింగ్ బ్యాచ్ మరో వైపు ఇటువంటి వాళ్ళు వరుసగా దాడులు చేస్తున్నారు.. ఇక ఆడవాళ్లు ఈ సమాజంలో బతకాలంటేనే భయమేస్తుంది.. ఇటువంటి సమాజంలో మహిళలు బతుకుతునందుకు తల వంచుకుంటుంది ఈ మహిళా సమాజం.. ఇంకెప్పుడు స్త్రీ స్వేచ్ఛ సమాజం అవతరించేది.. 

ఏపీ శాసనమండలి రద్దు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు కాబోతోందా? కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందా?.. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏడాదిన్నర క్రితం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. జనవరి 27, 2020న అసెంబ్లీలో పాసైన తీర్మానాన్ని.. మరుసటి రోజే కేంద్రానికి పంపించింది జగన్ రెడ్డి సర్కార్. శాసనమండలి రద్దుపై సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉండటంతో  రద్దు కావడం ఖాయమని అంతా భావించారు. కాని ఏపీ సర్కార్ ఫైల్ ను మోడీ సర్కార్ పెండింగులో పెట్టింది. తాజాగా ఏపీ శాసనమండలి రద్దు అంశం పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు.  2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. మాడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులు అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలికి పంపించారు. అయితే పెద్దల సభలో వైసీపీకి బలం లేకపోవడంతో ఆ బిల్లులకు అక్కడ ఆమోదం లభించలేదు. బిల్లులపై చర్చించి సెలక్ట్ కమిటీకి పంపించారు మండలి చైర్మన్. దీంతో తమకు బలం లేని మండలి అవసరం లేదని భావించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మండలి ఇలాగే తిరస్కరిస్తూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించి  మండలి రద్దుకే మొగ్గుచూపారు. మండలి తీరుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ జనవరి 27, 2020న శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు.  శాసనసభ ఆమోదించిన మండలి రద్దు తీర్మాణాన్ని కేంద్రానికి పంపినా... అక్కడ పెండింగులో పడింది. శాసనమండలి రద్దుపై చాలా సార్లు కేంద్రానికి జగన్ విన్నవించినా ఆ ఫైల్ ముందుకు కదలలేదు. ఇంతలోనే కొవిడ్ మహమ్మారి కల్లోలంతో మండలి రద్దు అంశం పక్కకు పోయింది. ప్రస్తుతం మాత్రం మండలిలో సీన్ మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు పెద్దల సభలో టీడీపీకి మెజార్టీ ఉండగా.. ఇప్పుడు మాత్రం అధికార వైసీపీకే మెజార్టీ ఉంది. గత రెండేండ్లలో భర్తీ అయిన సీట్లతో వైసీపీకి లీడ్ వచ్చింది. దీంతో శాసనమండలి రద్దుపై జగన్ వైఖరి మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో మండలి రద్దుకు పట్టుబట్టిన జగన్.. ఇటీవల కాలంలో దాని గురించి మాట్లాడకపోవడంతో.. ఆయన వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. శాసనమండలిని రద్దు చేసి తీరుతానని చెప్పిన సీఎం జగన్.. మడమ తిప్పినట్టేనా అంటూ సెటైర్లు కూడా వేశారు నర్సాపురం ఎంపీ రఘురామ రాజు. శాసనమండలి రద్దుపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే రాజ్యసభలో ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ శాసనమండలి రద్దు అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్రం చెప్పడంతో.. తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి జగన్ మండలి రద్దుకే మొగ్గు చూపుతారా లేక.. చాలా హామీల్లో మడమ తిప్పినట్లే.. శాసనమండలి విషయంలోనూ మాట మారుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీలో ముదిరిన కోల్డ్‌వార్‌! హుజురాబాద్ లో ఈట‌ల‌కు గండం? 

నిఖార్సైన పార్టీ. సైద్దాంతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేసే పార్టీగా చెప్పుకునే బీజేపీలో కుహానా రాజ‌కీయాలు పెరిగాయి. క‌రుడుక‌ట్టిన కాషాయ వాదుల్లోనూ వ‌ర్గ పోరు వాస‌న‌లు వ‌స్తున్నాయి.  తెలంగాణ‌లోనూ కమ‌ల‌నాథులు ఆధిప‌త్య పోరుకు దిగుతున్నారు. బీజేపీలో కుమ్ములాట‌లు ఇప్పుడు హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిగా మారింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా బాగుండు.. బీజేపీలో ఈ లొల్లేందంటూ రాజేంద‌ర్ తెగ‌ వ‌ర్రీ అవుతున్నార‌ట‌. తాజాగా బ‌య‌ట‌ప‌డిన ఈట‌ల బావ‌మ‌రిది మ‌ధుసూద‌న్‌రెడ్డి వాట్సాప్ చాట్‌తో బీజేపీలో ఆధిప‌త్య‌పోరు ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలుసొస్తోంది.  ఒక‌ప్పుడు వెంక‌య్య‌నాయుడు, బంగారు ల‌క్ష్మ‌ణ్‌, ద‌త్తాత్రేయ‌, విద్యాసాగ‌ర్‌రావు, కిష‌న్‌రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్‌.. ఇలా బీజేపీ ప్ర‌ముఖులంతా ఒక్క‌మాట మీద ఉంటూ పార్టీని పైకి తీసుకురావ‌డం కోసం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసేవారు. ఇప్పుడు పార్టీ ఏక‌తాటి మీద లేదంటున్నారు. కిష‌న్‌రెడ్డి తెలంగాణ బీజేపీలో మొద‌టినుంచీ కీల‌క నేత‌గా ఉన్నారు. ఇప్పుడూ ఉంటున్నారు. టీబీజేపీలో కిష‌న్‌రెడ్డి ఆధిప‌త్యం కాద‌న‌లేనిది. జాతీయ నాయ‌క‌త్వంతో నేరుగా సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గ‌ల స్థాయి. క‌శ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్య‌త‌ల‌నూ ప‌ర్య‌వేక్షించిన స‌త్తా. అలాంటి కిష‌న్‌రెడ్డికి.. నిన్న‌గాక మొన్న పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన బండి సంజ‌య్‌కి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌ని తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కుడు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడి..  ల‌క్కీగా ఈసారి ఎంపీగా గెలిచిన బండి సంజ‌య్‌ను ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా చేయ‌డం.. త‌న‌ను కాద‌ని ఆయ‌న సొంతంగా దూకుడు రాజ‌కీయం నెరుపుతుండ‌టం కిష‌న్‌రెడ్డికి కంట‌గింపుగా మారింద‌ని అంటున్నారు. కొంత‌కాలంగా వారిద్దరి మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌ని చెబుతున్నారు.  ఇటీవ‌ల జీహెచ్ఎమ్‌సీలో లింగోజీగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ కోల్డ్‌వార్ మ‌రింత ముదిరింది. బీజేపీకి చెందిన‌ సిట్టింగ్ కార్పొరేట‌ర్ చ‌నిపోవ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అయితే, ఆ బైపోల్ ఏక‌గ్రీవం చేయాల‌ని కోరుతూ కొంద‌రు బీజేపీ నాయ‌కులు మంత్రి కేటీఆర్‌ను క‌లవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈజీగా గెలిచే స్థానంలో.. త‌మ‌కు బ‌ద్ద‌శ‌త్రువైన టీఆర్ఎస్ మ‌ద్ద‌తు కోర‌డం దేనికంటూ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఇదంతా బండిని ఇర‌కాటంలో ప‌డేసేందుకు.. కిష‌న్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో జ‌రిగిన కుట్ర అంటూ వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. బీజేపీకి టీఆర్ఎస్ స‌పోర్ట్ చేసినా కూడా.. ఆ సిట్టింగ్ సీటును కాషాయం చేజారిపోవ‌డం.. కాంగ్రెస్ కొల్ల‌గొట్ట‌డం కొస‌మెరుపు. ఆనాటి నుంచి కిష‌న్‌.. సంజ‌య్‌ల మ‌ధ్య‌ వైరం మ‌రింత ముదిరింద‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌తో అది తారాస్థాయికి చేరింద‌ని చెబుతున్నారు. ఈట‌ల‌ను బీజేపీలో చేరేలా చేయ‌డంలో కిష‌న్‌రెడ్డిదే కీరోల్‌. ఢిల్లీ నుంచి స్పెష‌ల్ ఫ్లైట్‌లో వ‌చ్చి.. ఈట‌ల‌తో చ‌ర్చించి.. జాతీయ పార్టీతో మాట్లాడించి.. ఢిల్లీలో కాషాయ కండువా క‌ప్పే వ‌ర‌కూ.. మినిట్ టు మినిట్ ఫాలో చేసింది కిష‌న్‌రెడ్డినే. ఈట‌ల బీజేపీలో చేర‌డంలో రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాత్ర చాలా చాలా ప‌రిమితం. అందుకే, ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం విష‌యంలోనూ బండి.. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నార‌ట‌. సంజ‌య్ వ‌ర్గం ఈట‌ల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు.. బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్‌లోనే ఉన్నా ఆ కార్య‌క్ర‌మానికి కావాల‌నే హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. మీరు మీరు చూసుకోండి.. మ‌ధ్య‌లో నేనెందుక‌న్న‌ట్టు బండి సంజ‌య్ సైడ్ అవుతున్నార‌ట‌. మ‌రీ, పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటూ హుజురాబాద్‌లో అడుగుపెట్ట‌క‌పోతే బాగుండ‌ద‌నుకున్నారో ఏమో.. ఇటీవ‌ల ఓ రోజు ఇలా వ‌చ్చి.. ఈట‌ల‌కు హ‌లో చెప్పి.. అలా వెళ్లిపోయారు. మ‌ళ్లీ క‌నిపిస్తే ఒట్టు. అయితే, ముందుచూపు కాస్తంత ఎక్కువే ఉన్న బండి.. వ్యూహాత్మ‌కంగా హైద‌రాబాద్ టు హుజురాబాద్ పాద‌యాత్ర ప్ర‌క‌టించి బంతిని త‌న కోర్టులోకి లాక్కున్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల గెలిస్తే.. అది కిష‌న్‌రెడ్డి ఖాతాలో ప‌డ‌కుండా త‌న అకౌంట్‌లో వేసుకునే ప్ర‌య‌త్నం ఓవైపు.. పాద‌యాత్ర ఆసాంతం వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో పాటు పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహం మ‌రోవైపు.   ఈట‌ల‌పై కిష‌న్‌రెడ్డి మ‌నిష‌నే ముద్ర వేసి సంజ‌య్ వ‌ర్గం సైలెంట్‌గా ఉంటుండ‌టంతో ఈట‌ల తెగ ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. త‌న స్థాయి వాడు కాక‌పోయినా.. బాస్ కాబ‌ట్టి ఎంత‌కాద‌నుకున్నా బండి నేతృత్వంలోనే ఆయ‌న ప‌ని చేయాల్సి ఉంటుంది. అయితే, అన్నివ‌ర్గాల‌ను గుప్పిట్లో పెట్టుకొని మాంచి దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా నిల‌వాలంటే.. ఈట‌ల రాజేంద‌ర్‌కు సానుభూతితో పాటు మీడియా స‌పోర్ట్ అత్యంత కీల‌కం. ఇక బీజేపీ జాతీయ నేత‌గా మారిన వివేక్ వెంక‌ట‌స్వామికి చెందిన V6 ఛానెల్‌, వెలుగు పేప‌ర్‌లో ఈట‌ల‌కు ఎంత క‌వ‌రేజ్ ఉంటే.. అంత మైలేజ్ వ‌స్తుంది. అయితే, ఇన్నాళ్లూ వివేక్‌-బండి సంజ‌య్‌లు ఓ వ‌ర్గంగా ఉండేవారు. కానీ, ఈట‌ల కోసం కిష‌న్‌రెడ్డి రంగంలోకి దిగ‌డం.. బీజేపీ పెద్ద‌ల‌తో ప‌దే ప‌దే చ‌ర్చించాల్సి రావ‌డం.. జాతీయ నేత‌గా ఉన్న వివేక్ అందులో భాగ‌స్వామ్యం కావాల్సి రావ‌డం.. ఈ క్ర‌మంలో వివేక్.. సంజ‌య్‌కు దూర‌మై.. కిష‌న్‌కి ద‌గ్గ‌ర‌య్యార‌ని అంటున్నారు.  ఇలా బండి సంజ‌య్ వ‌ర్గం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ‌.. బీజేపీ మీడియా మ‌ద్ద‌తు స‌రైన స్థాయిలో లేక‌పోవ‌డం.. ఈట‌ల‌ను అస‌హ‌నానికి గురి చేస్తోంద‌ని చెబుతున్నారు. వైర‌ల్‌గా మారిన ఈట‌ల‌ బామ్మర్ది వాట్సాప్ చాట్‌లోనూ అదే ఆవేద‌న క‌నిపించింది. మ‌రి, క‌మ‌ల‌నాథులు కోల్డ్‌వార్ ఈట‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో..

డేంజర్ లో హైదరాబాద్ ..

గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య. రోజు రోజుకి ఎక్కువవుతోంది. మళ్ళీ ఆందోళనలో వైద్య అధికారులు. ప్రజలు మళ్ళీ  అప్రమత్తం అవ్వాలని కోరుతున్నారు. కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రికి రోజుకు 50వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి. కొంత కాలంగా కరోనా ఉపశమనం ఉచిందని ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు తమ పనులను తాము ఎదావిదిగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకొంత మంది ఐతే కరోనా లేదు ఏమిలేదని.. వచ్చిన తమను ఏం చేయదు అన్నట్లు కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. ప్రజలు తమ పని తాము చేసుకుపోతున్నారని. కరోనా కూడా సాపాకింద నీరులా తన పని తీను చేసుకుంటూ పోతుంది. తాజాగా తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి వరుసగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కరోనా బాధితుల తాకిడి మరోసారి ఎక్కువైంది. కరోనా వార్డు బాధితులతో ఇప్పటికే నిండిపోయింది. గాంధీకి రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్న పరిస్థితి నెలకొంది. వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. కాగా గతంలో వర్షాలు పడి వరదలు వచ్చినట్లు కరోనా కేసులు ప్రవాహం పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా హైదరాబాద్ లో బోనాలు అని.. పార్టీ మీటింగ్స్ అని ప్రజలు తిరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో మూడు సార్లు కరోనా కేసులు వంద దాటాయి. గత శనివారం 147 కరోనా కేసులు నమోదు అవగా... బుధవారం 99 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక తాజాగా 108 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా... 578 మంది కోలుకున్నారు. ఏది ఏమైనా గతం లో వచ్చిన పరిస్థితి వస్తే ఎదురుకోవడానికి ముందు ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

జీతాలకే గతిలేదు.. కేంద్రానికి కట్టేదెలా? జగనన్న బండి గడిచేదెలా? 

అసలు లేదు మొగుడా అంటే పెసర గారెలు కావాలన్నాడంట వెనకటికి ఒకడు. ఇప్పుడు కొత్త అప్పు ఇవ్వమంటే కుదరదంటారు.. ఒకవైపు ప్రకటించిన పథకాలకు డబ్బులు కావాలి.. ఇంకోవైపు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం ఇవ్వడం గగనమైపోయింది. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే సరేసరి నెలల తరబడి జీతాలు పెండింగ్ పడిపోయాయి. సమాచార శాఖలో పని చేసే అవుట్ సోర్సింగ్ వారికే మూడు నెలలు పెండింగ్ పడ్డాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు కాబట్టి.. కొత్త అప్పు కుదరదన్నారు. ఇంకోవైపు ఇప్పటిదాకా ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్ అన్నట్లు డబ్బులు అటు ఇటు తిప్పేశారు జగనన్న. ఇప్పుడు అది కూడా కుదరకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే డబ్బులు ఆ పథకాలకే వాడేలా బ్యారికేడ్స్ పెట్టేస్తోంది. ఇక ఆ ముచ్చట కూడా జరగదు. ఇవన్నీ కాక..మీరు పరిమితికి మించి తీసుకున్న 4500 కోట్లు వెంటనే తిరిగి చెల్లించేయండని ఒక నోటీసు ఇచ్చిపారేసింది కేంద్రం. ఇది సాధ్యమేనా.. ఆదాయం లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. డబ్బులు పందేరం చేయడంలో సక్సెస్ అయ్యారు. అసలు ఇప్పుడు కొత్తగా అప్పులు కావాలని అడుగుతుంటే.. అప్పు కట్టేయమని చెప్పడంలో కేంద్రం ఉద్దేశమేంటని వైసీపీ ప్రభుత్వ నేతలు మండిపడుతున్నారు. వాటీజ్ దిస్ నాన్సెస్స్ అంటుంటే.. అటు కేంద్రం ఏమో మీరు చేసిందే నాన్సెన్స్ అందుకే చెబుతున్నాం.. ఇప్పటికైనా కళ్లు తెరవండని చెబుతుందంట. మన అదినేత ఏమో వినడం గాని..చూడటం గాని ఉండదు కదా.. ఆయన ఏది అనుకుంటే అదే జరగాలి. ఇప్పుడు అలా జరిగేలా లేదు. అన్నీ అడ్డంకులే. మరోవైపు ఆ రఘురామకృష్ణరాజు ఒకడు తలనొప్పిగా తయారయ్యాడు. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ దెబ్బకు.. ఇప్పుడు లోపలకు పోవాల్సి వస్తుందా అనే టెన్షన్ ఒకవైపు పీకుతుంటే.. ఇంకోవైపు ఈ ఆర్ధిక కష్టాలొకటి.  అందుకే ఈ మధ్య కొత్తగా ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఇస్తున్నట్లుగా ఫుల్ పేజీ యాడ్స్ మాత్రం ఇచ్చేస్తున్నారు. అవి కింద మాత్రం రాలేదంటున్నారు. ముందు కొద్దిగా..తర్వాత కొద్దిగా..దశలవారీగా డబ్బులొచ్చినదానిని బట్టి వేస్తున్నారు. జీఎస్టీ డబ్బులొక్కటే ప్రధాన ఆదాయం..ఆ తర్వాత మద్యం అమ్మకాలు..ఇవన్నీ వాస్తవంగా ఈ పథకాలు లేకపోతే..ప్రభుత్వం నడపటానికి సర్దుకోవచ్చు. కాని ముందు పథకాలకు ఇచ్చేసి.. ఆ తర్వాత ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలు, రోజువారీ ఖర్చులు పెండింగ్ పెట్టేస్తున్నారు.  ఇప్పుడు వరుసబెట్టి మీద పడ్డ ఆంక్షలతో జిమ్మిక్కులు చేయడం కుదరదు..మేజిక్ చేయడం అసలే కుదరదు. ముందు ఆ 4500 కోట్లు ఎక్కడ నుంచి కడతారో చూడాలి. కట్టకపోయినా ఆశ్చర్యపోవనవసరం లేదు. కోర్టులనే లెక్క చేయనోళ్లు కేంద్రాన్ని మాత్రం లెక్క చేస్తారనుకోవడం పొరపాటే. 

మమతా ఢిల్లీ యాత్ర సక్సెస్ అయినట్లేనా?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన,అనుకున్నట్లుగా జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించలేదు కానీ, చలనం అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీలో జోష్ పెంచింది. ఆయన మీద మాత్రం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన ప్రభావం ఘనంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక విధమైన  సంతోషం మరో విధమైన విస్మయం వ్యక్తపరుస్తున్నారు.  పార్లమెంట్ లో యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో జరిగే చర్చల్లో రాహుల్ గాంధీ సహజంగా పాల్గొనరు. పార్లమెంట్‘లో అనుసరించవలసిన వ్యూహం పై చర్చించే యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలకు ఆయన హాజరు కారు.  భాగస్వామ్య పార్టీల నాయకులతో చర్చించే ఏ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. కోఆర్డినేషన్  వ్యవహరాలను పార్టీ ఫ్లోర్ లీడర్స్,ఇతర నాయకులు చూసుకుంటారు.కానీ, మమతా బెనర్జీ ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన మంగళవారం రాహుల గాంధీ, యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.నిజానికి  రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు, మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతి రోజు యూపీఏ వ్యూహ కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ,ఎప్పుడూ ఆవైపు కన్నెత్తి చూడలేదు. అలాంటిది మంగళవారం సమావేశానికి హాజరయ్యారు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు.  పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వం పై వత్తిడి పెంచేందుకు విపక్షలన్నీ ఏకమవ్వాలని అన్నారు. అవసరం అయితే, ప్రభుత్వ మొండి వైఖరిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన జోక్యం కోరదామని సూచించారు. మరో వంక   విపక్షాలను  ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారనే సంకేతాలు పంపేందుకు, ఏఐసీసీ కార్యాలయం, యూపీఏ కోఆర్డినేషన్ సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన ఫోటోలను విడుదల చేసింది. అయితే, రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు ఎంత కాలం ఉంటుందనేది, ఇప్పుడే చెప్పలేమని సమావేశానికి హాజరైన యూపీఏ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అలాగే, ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు జరుగుతున్నప్రయత్నాలలో రాహుల్ గాంధీ క్రియశీల పాత్రను పోషించాలని, గాంధీ కుటుంబ విధేయ ఎంపీ ఒకరు తమ మనసులోని మాటను మీడియా  ముందుంచారు. అయితే, ప్రతిపక్షాలను ఏకం చేయడం, రాహుల్ గాంధీకే కాదు, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా. ఎవరికీ కూడా    అనుకున్నంత సులభంగా అయ్యే పనికాదు. అందుకే. అదే పనిలో నిమగ్నమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అయినా శరద్ పవార్, మమతా బెనర్జీ అయినా మరొక రైనా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.  జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న పార్టీలు, నాయకులు కొంచెం వెనకా ముందుగా అయినా, ప్రధాని మోడీ ని ఒంటరిగా ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ పార్టీకీ అయ్యే పని కాదనే నిజాన్ని గ్రహించారు. అన్ని పార్టీలు ఏకమైతేనే కానీ, మోడీని గద్దె దించడం సాధ్యం కాదన్న సత్యాన్ని తెలుసుకున్నారు. అదే విషయం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో మరో మారు స్పష్టమైంది. అయితే, మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనతో విపక్షాల ఐక్యతా ప్రస్థానంలో తోలి అడుగు పడిందని మాత్రం చెప్పవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ, చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అంతే మోడీని గద్దేదించేందుకు ఏర్పడే కూటమికి   ఎవరు  నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని, మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే, విపక్షాల ఐక్యత కోసం పిల్లి మెడలో గంటకట్టే బాధ్యతను తాను తీసుకుంటానని ముందు కొచ్చారు. ఆ విధంగా దీదీ ఢిల్లీ పర్యటన, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఒక ముందడుగా పరిశీలకులు భావిస్తున్నారు.  

ప్రాంక్ వీడియో యాంకర్‌తో ఫైటింగ్ చేసిన యజమాని.. 

సోషల్ మీడియా వచ్చాక కొందరి వ్యక్తులకు హద్దు అదుపులేకుండా పోయింది. మనకు తెలియకుడండానే మన సంస్కృతి పై దాడి చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలు కూడా రోడ్డు పైకి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రాంక్ వీడియోస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్లకు మరి హద్దులు లేకుండా పోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న విషయాల వాళ్ళ పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఒక ఫ్రాంక్ యూట్యూబ్ యాంకర్  ఓ మొబైల్ షాపులో వెళ్లాడు. అక్కడ యజమానితో గొడవకు దిగాడు.దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన షాపు ఓనర్ యాంకర్‌పై దాడికి దిగాడు.   ఇక వివరాల్లోకి వెళితే ప్రాంక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకు తెలిసిందే. చాలామంది రోడ్లపై, షాపింగ్ మాల్స్, పబ్లిక్‌ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఈ ప్రాంక్‌లతో పబ్లిక్ కాస్త ఇబ్బందులకు గురైనా.. ఆ తర్వత అవి ప్రాంక్ అని తెలిసి కాస్త నవ్వుకుంటారు. ఎంత ఫ్రాంక్ ఐన పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతుంటారు. అయితే హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ యాంకర్ చేసిన ప్రాంక్ వీడియో కలకలం రేపింది. ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది.  హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. జగదీశ్ మార్కెట్‌లో యాంకర్ ఓమొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కాస్తా పెద్దదిగా అయ్యింది. దీంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. ఇది ఫ్రాంక్ వీడియో అని..అక్కడ కెమెరా ఉందని..కావాలని చేస్తున్నామని యాంకర్ చెప్పినా..యజమాని వినిపించుకోలేదు. ఎందుకంటే ఎవడి ఫ్రాస్ట్రషన్ లో వాడు ఉంటారు.. ఈ ఫ్రాంక్ వీడియోస్ చేస్తే వాళ్ళు అది కూడా గమనించాలి. అది గమనించి ఫ్రాంక్ చేస్తే ప్రాబ్లెమ్ ఉండదు.. ఏది తెలుసుకోకుండా రంగంలోకి దిగితే ఇలాగే రచ్చ రచ్చ అవుతుంది. అయితే ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. ఇక ఆ  విషయం అక్కడితో ఆగకపోగా చివరికి విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.  

మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. హోరెత్తుతున్న తెలంగాణం..

మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే మా ఎమ్మెల్యే చేయాలంటూ యావ‌త్ తెలంగాణ ప్ర‌జానికం గొంతెత్తి నిన‌దిస్తోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రావాలి.. ఇదే వారి ల‌క్ష్యం. ఉప ఎన్నిక వ‌స్తేనైనా త‌మ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌నే ఆశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా ద‌ళిత బంధు అమ‌ల‌వుతుంద‌నే అత్యాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా గొల్ల‌-కురుమ‌ల‌కు గొర్లు పంచుతార‌నే దురాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా కులాల వారీగా క‌మ్యూనిటీ హాళ్లు.. అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అద్దాల్లాంటి రోడ్లు.. అంద‌మైన బ‌స్టాండ్లు.. సుంద‌ర‌మైన‌ పార్కులు.. అంద‌రికీ రేష‌న్ కార్డులు.. కొత్త పింఛ‌న్లు.. గ్రామానికి లక్ష‌లు.. మండలానికి కోట్లు అంటూ నిధులు వ‌ర‌ద పారుతుంద‌నే కుట్ర‌, కుతంత్రాల‌తో ప్ర‌జ‌లంతా త‌మ ఎమ్మెల్యే రాజీనామా కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ఉప ఎన్నిక రావాలంటూ మ‌న‌సా-వాచా-క‌ర్మ‌నా కోరుకుంటున్నారు. ఇప్ప‌టికైతే సోష‌ల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు గానీ.. త్వ‌ర‌లోనే ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో ఉద్య‌మించ‌డానికీ సిద్ధ‌మ‌వుతున్నారు. డౌట్ ఉంటే.. మీ ప‌క్క‌నున్న ఏ ఒక్క‌రినైనా అడిగి చూడండి.. వారి ఎమ్మెల్యే రాజీనామా చేయాలో వ‌ద్దో.. ఉప ఎన్నిక రావాలో వ‌ద్దో.. దిమ్మ‌తిరిగే ఆన్ష‌ర్‌ వ‌స్తుంది అట్నుంచి.  ఒక్క సిరిసిల్ల‌, సిద్ధిపేట మిన‌హా తెలంగాణ‌లోని 117 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే నినాదం. చివ‌రాఖ‌రికి గ‌జ్వేల్ ప్ర‌జ‌లు సైతం ముఖ్య‌మంత్రి అయిన త‌మ ఎమ్మెల్యే కేసీఆర్ రాజీనామా చేయాలి.. అప్పుడే ఎర్ర‌వెల్లితో పాటు గ‌జ్వేల్ ప్రాంత‌మంతా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని డిమాండ్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. వారిదేమీ గొంత‌మ్మ కోరిక కాదు. అది మాన‌వ స‌హ‌జం. త‌మ ప్రాంతానికి కేసీఆర్ కొడుకో, అల్లుడో ఎమ్మెల్యేగా ఉంటే బాగుండున‌ని ఇన్నాళ్లూ అసూయ‌ప‌డ్డారు. కేటీఆర్‌, హ‌రీష్‌లు ట‌ర్మ్‌కు ఓసారి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని కోరుకున్నారు. కానీ, అంత అవ‌స‌రం లేద‌ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. హుజురాబాద్‌ను చూసి త‌త్వం బోధ‌ప‌డింది. అభివృద్ధి ఎంత సింపులో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఎమ్మెల్యేల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి రానివ్వ‌డం లేద‌నే ఏడుపు అవ‌స‌రం లేదు. కేసీఆర్ త‌మ‌ను పట్టించుకోడ‌నే మూతిముడుపు అక్క‌ర్లేదు. జ‌స్ట్‌.. ఒక్క సంత‌కం. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఒక్క సంత‌కం చేస్తే చాలు. వెంట‌నే ఉప ఎన్నిక వ‌చ్చేస్తుంది. అర‌చేతిలో అభివృద్ధి క‌నిపిస్తుంది. కాళ్ల కాడికి.. అడిగింది లేద‌న‌కుండా త‌న్నుకొస్తుంది. హుజురాబాద్‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతుండ‌టంతో.. ఆ ప‌నులు, పందేరాల‌ను చూస్తున్న తెలంగాణ ప్ర‌జానీకం.. త‌మ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల‌ని.. త‌మ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంద‌ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి చేయ‌లేని డెవ‌ల‌ప్‌మెంట్‌ను రాజీనామాతో చేసి చూపించ‌వ‌చ్చ‌ని.. అవ‌స‌ర‌మైతే ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మిమ్మ‌ల్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామ‌ని.. ఓట‌మి భ‌యం అవ‌స‌రం లేదంటూ ఓట‌ర్లు త‌మ ఎమ్మెల్యేల‌కు అభ‌యం ఇస్తున్నారు. ఆ మేర‌కు కొన్ని ప్రాంతాల్లో క‌ర‌ప‌త్రాలు సైతం పంచుతున్నారు. ఇక ప్రజా వ్య‌తిరేక‌త అధికంగా ఉన్న చోట్ల‌.. రాజీనామా డిమాండ్ మ‌రింత ద‌ద్ద‌రిల్లుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా.. ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.  అయితే, ప్ర‌జ‌లు ఎంత అమాయ‌కులు. కేసీఆర్ చేసే మాయ‌లమ‌రాఠీ గారడీ విద్య‌లు వాళ్ల‌కింకా పూర్తిగా బోధ‌ప‌డ‌లేదు. అది హుజురాబాద్ కాబ‌ట్టి.. అక్క‌డ పోటీ చేస్తున్న‌ది ఈట‌ల కాబ‌ట్టి.. ఆ ఎన్నిక ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ దొర‌త‌నానికి స‌వాల్ విసిరింది కాబ‌ట్టి.. అంత చేస్తున్నారు కానీ.. అన్నిచోట్లా వేల కోట్లు కుమ్మ‌రించ‌డానికి కేసీఆర్ ఏమైనా అమాయ‌కుడా? అభివృద్ధి కాంక్షితుడా? అంటున్నారు. డౌట్ ఉంటే.. ఇటీవ‌లే జ‌రిగిన నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల హామీల‌ను ఓసారి గుర్తు చేస్తున్నారు. డిగ్రీ కాలేజీ అంటూ, మార్కెట్ యార్డు అంటూ.. మండ‌లాని ఇన్ని కోట్లు అంటూ.. చేతికి ఎముకే లేన‌ట్టు బ‌హిరంగా స‌భ‌లో హామీలు గుప్పించారు సీఎం కేసీఆర్‌. నిజ‌మే అనుకొని సాగ‌ర్‌లో కారును గెలిపించారు. తీరా గెలిచాక‌.. ఇప్పుడేమైంది? అద‌నంగా ఒక్క పైసా కూడా రాలే. ఒక్క హామీ నెర‌వేర‌లే. ద‌టీజ్ కేసీఆర్‌. ఇలాంటి ట‌క్కుట‌మారం య‌వ్వారాల్లో ఆయ‌న దిట్ట అంటారు. అయితే, మిగ‌తా ఏ హామీ నెర‌వేరినా.. నేర‌వేర‌కున్నా.. ఎక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చినా.. గొర్లు పంచే హామీ మాత్రం సీఎం కేసీఆర్‌ త‌ప్ప‌క నెర‌వేరుస్తున్నారు. ఓట‌ర్ల‌ను గొర్రెల్లా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అయినా.. అంద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు వస్తాయి కానీ, అభివృద్ధి ఎలా జ‌రుగుతుంది? జ‌నాలు ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్ అవుతున్నార‌బ్బా...?  

ఈటల రాజేందర్ బామ్మర్ది వాట్సాప్ చాట్ లీక్.. బండి సంజయ్ షేక్ 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇటీవలే పాడి కౌశిక్ రెడ్డి... ఓ బీజేపీ కార్యకర్తలో మాట్లాడిన ఆడియో లీకై సంచలనంగా మారింది. చివరకి అది కౌశిక్ రెడ్డి పార్టీ మారడానికి కారణమైంది. తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాట్ ఒకటి లీకై నియోజకవర్గంలో  వైరల్ గా మారింది. ఈటల రాజేందర్ భార్య జమునా రెడ్డి సోదరుడైన మధుసూధన్ రెడ్డి .. ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారు. రాజేందర్ పాదయాత్ర ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈటలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కూడా మధుసూదన్ రెడ్డే చూస్తారని చెబుతారు.  హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటెల రాజేందర్ పాదయాత్రకు సంబంధించి  కొండవీటి మధు సుధన్ రెడ్డి..  ఈటల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దళితులను  తిడుతూ అందులో మెసేజ్ చేశారు మధుసూధన్ రెడ్డి. దళిత బంధు స్కీమ్ తో ఓడిపోతామని భయం వ్యక్తం చేశారు. అంతేకాదు రాజేందర్ కు బండి సంజయ్ సపోర్ట్ చేయడం లేదని చెప్పాడు మధుసూదన్ రెడ్డి. కిషన్ రెడ్డి అండ  తమకు ఉందన్నారు. వివేక్ వెంకట స్వామి, వీ6 మీడియా సపోర్టుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు మధుసూదన్ రెడ్డి. ఈటెల రాజేందర్ పౌల్ట్రీ పార్టనర్ ద్వారా బయట పడ్డ ఫోన్ చాట్.. ఇలా ఉంది..  మధుసూదన్ రెడ్డి : నరేష్ గానికి మొన్న 50 లక్షలు పంపించిన అయినా వాని పని ఇలా ఉంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న నరేష్ డామినేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ...మన పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు..డబ్బులు వాడు వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు మధుసూదన్ రెడ్డి : వాడికి ఫోన్ చేసి మాట్లాడిన...వాడు మీడియా వాళ్లకు ఇచ్చినా అంటుండు... రేపు అందరిని కనుక్కొని చెప్పు నాకు ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఒకే అన్న.. కాల్ చేసి కనుక్కొని చెప్తా మధుసూదన్ రెడ్డి : ఒకే ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఫోన్ చేయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఆ నరేష్ గాడు మీడియా వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు(వాట్సప్ సంభాషణ తరువాత) మధుసూదన్ రెడ్డి : జమ్మికుంట వాళ్లకు కూడ డబ్బులు పంపించు..కేశవన్న కు ఒక్కసారి ఫోన్ చేయి మధుసూదన్ రెడ్డి : నారాయణగూడలో 10 కోట్లు తీసుకోని ఫార్చూనర్ కారులో వెళ్లి  ..4 కమలాపూర్ లో మిగిలిన 6 జమ్మికుంటలో ఇచ్చేయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఓకే అన్న... డబ్బులు అందాయి...మహేష్ వచ్చాడు...ఫోన్ చేశా మీకు...వాట్స్ ప్ కాల్ కలవటంలేదు మధుసూదన్ రెడ్డి : దళిత బంధు మీద గ్రామాల్లో అభిప్రాయం ఏమిటి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : బాగుందన్న మధుసూదన్ రెడ్డి : ఓకే..దళిత బందు ఏమైనా ప్రభావం చూపిస్తుందా..హుజురాబాద్ ప్రజలు ఏం అనుకుంటున్నారు...ఎస్సి ఓట్లు 40 వేలు ఉన్నాయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : 45 వేల వరకు ఉన్నాయి అన్న...కుటుంబానికి 10 లక్షలు అనేసరికి కొంచం తెరాస వైపే మొగ్గు చూపుతున్నారు...మనం కొంచం టర్న్ చేయాలన్న మధుసూదన్ రెడ్డి : మాదిగ కొడుకులు చాలా చిన్న వాటికి ఆశ పడతారు వాళ్ళను నమ్మలేంరా...జాతీయ నాయకులు రాగానే టర్న్ అవుతుంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ :  అవునన్న...అమిత్ షా రావాలి మధుసూదన్ రెడ్డి : వస్తాడు..వీడు బండి సంజయ్ పట్టించుకోట్లేడు...కావాలని మొహం చాటేస్తున్నాడు...చూద్దాం ఈటల పౌల్ట్రీ పార్టనర్ : రాజేందర్ అన్నకు V6 వివేక్ మద్దతు పలకడం బండి సంజయ్ కి నచ్చట్లే అన్న...వివేక్ ను మనం కొన్ని రోజులు పక్కన పెట్టాలి...V6 కూడ పెద్ద కవరేజ్ ఇవ్వట్లేదు మధుసూదన్ రెడ్డి : వివేక్ నుండి మనకు కిషన్ రెడ్డి మద్దతు ఉంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అవునన్న...కిషన్ రెడ్డితో ఉంటేనే మంచిది...మనకు జేపీ నడ్డా అమిత్షా వాళ్ళ మద్దతు ఉంటది మధుసూదన్ రెడ్డి : అవును మధుసూధన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న ఈ వాట్సాప్ లీక్ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతోంది. దీన్ని అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు స్పీడ్ పెంచారు. దళితులను కించపరిచారంటూ.. ఆ వర్గాలతో ఆందోళనలు చేయిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ తో రాజేందర్ కు విభేదాలు ఉన్నట్లుగా ఉన్న చాట్.. బీజేపీని షేక్ చేస్తోంది. ఈటల పాదయాత్రను బండి సంజయ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభం రోజున సంజయ్ లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా బయటపడిన వాట్సాప్ చాట్ తో రాజేందర్ తో బండి సంజయ్ తో విభేదాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.   

వివేకా కేసులో అనుమానితుడు మిస్సింగ్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతోంది. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. అదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి . వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన సునీల్ కుమార్ కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.  వివేకా హత్య కేసులో విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు సునీల్ కుమార్ యాదవ్. ఆ తర్వాతి నుంచి పులివెందులలోని సునీల్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారన్న సమాచారంతో సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.  వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు. ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం కనిపించకుండా పోవడం కీలకంగా మారింది. ఏ క్షణంలోనైనా సునీల్, డ్రైవర్ దస్తగిరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ దూకుడుతో వివేకా హత్యకేసు అనుమానితుల్లో టెన్షన్ పెరుగుతోంది. 

ప్రొఫెసర్ కామక్రీడ.. చివరికి తేడ.. 

సమాజంలో నిత్యం మహిళలు సమస్యలు ఎదురుకుంటున్నారు. వారిపై రోజు రోజు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అటు ఇంట్లోనూ ఇటు సమాజంలోనే మహిళలకు సేఫ్టీ ఉండడం లేదు. గుడి, బడి, ఆఫీస్, రోడ్డు  ఇలా ఎక్కడ పడితే అక్కడ మగాళ్లు మృగాళ్లు గా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు, ఉపాధ్యాయులు ఉండడం విచారకరం. తాజాగా ఒక ప్రొఫెసర్ తన మహిళా సహోద్యోగిని లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అందులోనూ ఈ ఘటన సీఎం జగన్ ఇలాకా లో జరగడం సంచలనంగా మారింది. వివరాల్లోకి  వెళితే.. అది ఆంధ్రప్రదేశ్. సీఎం సొంత జిల్లా కడపలోని. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ ప్రబుద్ధ  ప్రొఫెసర్ రాసలీలల బాగోతం బయటపడింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఒక డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి  ఆయనకు  46  సంవత్సరాలు.. అతని బుద్ధి ఎలాంటిదో లేక ఆరోజు అతనికి అలా అనిపించిందో ఏమో గానీ అతని మైండ్ లో ఒక పాడుబుడ్డి పుట్టింది. వెంటనే ఆ విషపు ఆలోచన అమలు చేయాలనుకున్నాడు. అందుకు  ఒక పథకం వేశాడు. అదే డిపార్టుమెంట్ కి చెందిన మహిళా ప్రొఫెసర్ ని ఆదివారం కాలేజ్ కి రమ్మని తెలిపాడు. ఆదివారం సెలవు కదా అని అడిగితే..  మరో సారి ఆర్డర్ వేసినట్లు అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పని ఉందని తప్పకుండా రావాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఆమె పై అధికారి అందులో  ప్రొఫెసర్ రమ్మంటే రాను అని ఎదురు చెప్పలేక ఆమె సరే అని తల ఊపింది.  క్యాంపస్ కి వెళ్లిన ఆమెను  ప్రొఫెసర్ తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ.. అక్కడక్కడా చేతులు వేయడం ప్రారంభించాడు. అప్పటికే  ప్రొఫెసర్ వ్యవహారం పసికట్టిన  ఆమె అడ్డుచెప్పడంతో ఇక  ప్రొఫెసర్ తన కోరిక తెరిచాకపోతే ఉద్యోగం పోతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మహిళా ప్రొఫెసర్ తన ఫోన్ లో ఆ మాటలను రికార్డ్ చేసి సహోద్యుగులకు పంపడంతో ఈ విషయం వెలుగు చూసింది. అక్కడితో  ప్రొఫెసర్ మరిన్ని రాసలీలలు బయట పడ్డాయి. అంతకు ముందు తమను కూడా ఇలాగే వేధించాడని  ఇతర ఉద్యోగినిలు కూడా తెలపడంతో అతడిపై  విశ్వవిద్యాలయం ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు.  

రేవంత్ రెడ్డికి ఐదు శాతం ఓట్లే.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్లతో కలకలం  

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండటంతో ఉప ఎన్నిక షెడ్యూల్ రాకున్నా... ఎన్నికల వాతావరణం పీక్ స్టేజీకి వెళ్లింది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్ పాదయాత్రతో జనంలో తిరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మంత్రులు ఊరూరు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ కొంత వెనకబడి ఉన్నా.. కార్యకర్తల సమావేశాలతో స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో జోష్ మీదున్న కాంగ్రెస్.. హుజురాబాద్ లో సత్తా చాటాలని భావిస్తోంది.  హుజురాబాద్ లో అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాడుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీరో అనేలా కోమటిరెడ్డి కామెంట్ చేయడం తీవ్ర దుమరం రేపుతోంది. హుజూరాబాద్‌ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.  తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు కోమటిరెడ్డి. అయితే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలుస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈటల గెలుస్తుందని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ కు డిపాజిట్ రాదన చెప్పడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన వెంటనే అసమ్మతి స్వరం వినిపించారు కోమటిరెడ్డి. పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో పార్టీకి డిపాజిట్ తీసుకొచ్చి తన సత్తా చూపించుకోవాలని కూడా అన్నారు. తాజాగా ఢిల్లీలోనూ అదే అర్థం వచ్చేలా మాట్లాడి కాంగ్రెస్ లో కాక రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ సాగుతోంది. వెంకట్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ పెద్దలతోనూ మాట్లాడారు. దీంతో ఆయన కాషాయ గూటికి చేరుతారని అంతా భావించారు. కాని అది జరగలేదు. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా... గాంధీభవన్ కు మాత్రం వెళ్లడం లేదు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు కూడా హాజరుకాలేదు. ఇక పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో వెంకట్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి ఆయన మంతనాలు సాగించడం ఇందుకు బలాన్నిచ్చింది.  తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న కామెంట్లు .. వాళ్లు కాంగ్రెస్ దూరమయ్యేలా ఉన్నాయంటున్నారు. అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని చెప్పడం ద్వారా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరబోతున్నాననే సంకేతం ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు కొంత కాలంగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించగా.. రెండో రోజులుగా మాత్రం సీన్ మారిపోయింది. మంత్రి జగదీశ్ రెడ్డితో జరిగిన వివాదంపై వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన సోదరుడికి అండగా నిలిచారు. దీంతో త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  

ఏపీలో 52, తెలంగాణలో 39 లోక్ సభ సీట్లు?  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లు ఉండగా.. తెలంగాణలో 17 స్థానాలున్నాయి. అయితే త్వరలో ఏపీలో లోక్ సభ స్థానాలు 52కు, తెలంగాణలో 39 పెరగబోతున్నాయనే సమాచారం వస్తోంది. దేశంలో లోక్ సభ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 543 లోక్ సభ సీట్లుండగా.. వాటిని వెయ్యికి పైగా పెంచడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా ఈ విషయం తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. దీంతో లోక్ సభ సీట్లు పెరగనున్నాయనే వార్త  దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  '2024 లోపు లోక్ సభ స్థానాలను 1000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని బీజేపీలో ఉన్న నా సహచర ఎంపీల ద్వారా తెలిసింది. కొత్త పార్లమెంట్ భవనం 100 సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒకవేళ వెయ్యి స్థానాలకు పెంచితే అంతకంటే ముందు ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి. కీలకమైన ఈ అంశంపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.'' అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను ప్ర‌స్తుత‌మున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశ‌గా మోదీ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తోంద‌ని, దీనిపై జ‌నాభిప్రాయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తివారీ త‌న ట్వీట్ లో అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా త‌న వాద‌న‌కు నిద‌ర్శ‌నంగా.. కొత్త‌గా క‌డుతున్న పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టాను వెయ్యి మందికి స‌రిప‌డేలా క‌డుతున్న వైనాన్ని ఆయ‌న ఉద‌హ‌రించారు.  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో ఎందుకు 1000 మంది ఎంపీలు ఉండదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా త‌మ జ‌నాభాకు అనుగుణంగా చట్ట స‌భ‌ల స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకుంటూ పోతుంటే.. మ‌నం ఇంకా ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా జరుగుతున్న ప్రచారంతో ఆ దిశగా మోడీ సర్కార్ సీరియస్ గానే వర్కవుట్ చేస్తుందని చెబుతున్నారు.  మనదేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలున్నాయి.  ఇందులో 530 సీట్లను రాష్ట్రాలకు కేటాయించగా.. మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెర‌గ‌కుండా  ఉంటూ వ‌స్తోంది. 1977 నుంచి సీట్ల సంఖ్య అలాగే ఉంది. కాని అప్పుడు  మన దేశ జనాభా కేవలం 55 కోట్లే. ప్రస్తుతం దేశ జనాభా 135 కోట్లు దాటింది. కాని లోక్ సభ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. 2009లో పునర్విభజన చేశారు. కాని లోక్ సభ నియోజకవర్గాల పరిధి మాత్రమే మారింది.. కాని సీట్లు సంఖ్య పెరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ గతంలో అన్నారని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ కంటే ముందు జితిన్ ప్రసాద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  మోడీ స‌ర్కారు ప్ర‌తిపాదిస్తున్న మాదిరిగా లోక్ స‌భ సీట్లు వెయ్యికి పెరిగితే.. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు సంఖ్య ఇప్పుడున్న సంఖ్య కంటే రెట్టింపు కానున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం 80 లోక్ సభ సీట్లుండగా.. కొత్త ప్రతిపాదనతో అది 193కు పెరగనుంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 117కు పెరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు 42 ఉండగా.. పెరిగితే 92 కావొచ్చంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా.. 94కు పెంచాలని మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుందని సమాచారం. ప్రస్తుత జనాభా ఆధారంగా తమిళనాడు 77, రాజస్థాన్ లో 65 లోక్ సభ సీట్లు ఉండనున్నాయి. మధ్య ప్రదేశ్ లో 68, కర్ణాటకలో 67క. గుజరాత్ లో 60కి లోక్ సభ సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక  తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లు కూడా డబుల్ కన్నా ఎక్కువ కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లుండగా... మోడీ సర్కార్ ప్రతిపాదన ప్రకారం 52కు పెరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ‌లో ఉన్న 17 సీట్లు 39కు పెరుగుతాయి.  లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను దాదాపుగా డ‌బుల్ చేసే దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌తిపాద‌న‌ల వ‌ల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు లాభమనే చర్చ జరుగుతోంది . అదే సమయంలో యూపీ, బీహార్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో పెరిగే సీట్లు బీజేపీకి ప్రయోజనమనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, ఉత్తరాదిలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం వంటి అంశాలను పరిశీలిస్తూ మోడీ సర్కార్ తాజా స్కెచ్ వేస్తుందని చెబుతున్నారు. అయితే లోక్ సభ సీట్ల పెంపుపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన ట్వీట్ పై కేంద్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీజేపీ కూడా మాట్లాడలేదు. దీంతో మోడీ సర్కార్ మదిలో ఈ ప్రతిపాదన ఉందా లేదా అన్నదానిపై పూర్తి స్పష్టత రావడం లేదు.