కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణం

  సమాజంలో మహిళలు, యువతలు, చివరకు చిన్న పిల్లలకు కామాంధుల నుండి వేధింపులు తప్పడం లేదు. దేవాలయం లాంటి స్కూల్, కాలేజీలలో కూడా కాటు వేసేందుకు కామాంధులు వేచి ఉంటున్నారు. అక్కడ కూడా యువతులు, చిన్నపిల్లలకు సైతం భద్రత లేకుండా పోయింది. ఆడపి ల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటే గజ్జుమని వణుకుతున్నారు. ఓ కామాంధుడి వేధింపులు భరించలేక ఓ విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ పరిధిలో నివాస ముంటున్న ప్రమోద్ కుమార్, హరిత అనే దంపతులకు ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు... ప్రమోద్ కుమార్ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మృతురాలు మౌలిక రెండవ సంతానం... మౌలిక సికింద్రాబాద్ పరిధిలోని లాలా గూడలో ఉన్న తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో బిబిఏ సెకండ్ ఇయర్ చదువు తున్నది. అయితే అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అంబాజీ విద్యార్థిని మౌలిక పై కన్ను పడింది. దీంతో వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రతిరోజు నన్ను ప్రేమించ మంటూ మౌలిక వెంట పడేవాడు.. ప్రేమ మీద నమ్మకం లేని మౌలిక అతని ప్రేమను తిరస్కరించింది. అంతేకాకుండా తన వెంట పడకూడదని పలుమార్లు హెచ్చరించింది.  అయినా కూడా వాలీబాల్ కోచ్ అంబాజీ మౌలిక వెంట పడుతూనే ఉండేవాడు.. రోజురోజుకి అతని వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్థా పానికి గురైన మౌలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.... నింది తుడు అంబాజీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి తల్లి హరిత తన కూతురు చదువుతోపాటు అన్నిట్లో ఫస్ట్ ఉండేదని... క్లాసికల్ డాన్స్ కూడా బాగా చేసేదని తల్లి హరిత కన్నీరు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు తన కూతురు మామూలుగానే ఉంది మేము బయటికి వెళ్లి వచ్చేసరికి తన కూతురు శవమైం దని బోరున విలపించింది. ఒకరి మీద అనుమానం ఉంది పోలీసులకు ఫిర్యాదు చేసాం అతను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారని మృతురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది... మృతురాలి అన్న చంద్ర వర్ధన్ కాలేజ్ వాలీబాల్ కోచ్ పై మాకు అనుమానం ఉంది. వాలీబాల్ కోచ్ అంబాజీ నా చెల్లి మౌలికను ప్రతిరోజు వేధింపులకు గురి చేశాడని మా సిస్టర్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు. మా చెల్లిని కాలేజీ నుండి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మా నాన్న చిన్ని చెల్లి చదువుతున్న నారాయణ కాలేజ్ లో మెమో తేవడా నికి వెళ్లారు. మౌలిక, నేను ఇద్దరం కలిసి బజారుకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాం. నేను స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలోకి వెళ్లాను. అప్పటికి పెద్ద చెల్లె మౌలిక టీవీ చూస్తుంది. నేను బాత్రూం నుండి బయటికి వచ్చిన తర్వాత రెండు డోర్లు మూసి ఉన్నాయి.  వెంటనే నాకు అనుమానం వచ్చి తలుపులు పగల కొట్టి చూడగా మౌలిక ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో నాకు భయం వేసింది వెంటనే స్థానికంగా ఉన్న అన్నయ్య, చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచాను. డాక్టర్ వచ్చి మౌలికను పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు... మా నాన్న కోచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి మౌలిక ఆత్మహత్య చేసు కోవడానికి గల కారణాలను తీసు కుంటామని చెప్పారని మృతు రాలి అన్న తెలిపాడు.

బీఆర్ఎస్, బీజేపీ కుట్రే అంటున్న బీసీ సంఘాలు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుంద‌ని బీజేపీ  ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి ఎలా తెలుసు? అన్న ప్రశ్న  ఇప్పడు బీసీ సంఘాల నుంచి వస్తున్నది.  కాంగ్రెస్ లేస్త లేదు, బీఆర్ఎస్ స‌స్త లేదు, బీజేపీకి చూస్తే అవకాశం మంచిగుంది అంటూ  జీవోపై కోర్టు స్టే ఇవ్వ‌డానికి ఒక రోజు ముందు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్న మాట‌లేంటంటే.. కాంగ్రెస్ కోర్టులో పెద్దగా  కొట్లాడ‌దు కావాలంటే చూడండి అన్నారు. ఈ విష‌యం అంతగా ఆయ‌న‌కు ఎలా తెలుసు? అన్న‌దొక ప్ర‌శ్న కాగా.. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీసీ సంఘాల‌ కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మ‌క్కై చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. బీఆర్ఎస్ అప్ప‌ట్లోనే 50 శాతానికి మించ‌కుండా బీసీల‌కు చ‌ట్టం తీసుకొచ్చింద‌నీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వీరికి మ‌రింత సహకారం అందిస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి బీసీ సంఘాలు. త‌మ‌కు లేక లేక ఒక అవ‌కాశం వ‌స్తే మా నోటికాడ కూడు లాగేసుకున్నార‌ని తీవ్రంగా మండి ప‌డుతున్నారు బీసీలు.  వీహెచ్ అయితే  నాలుగు వారాల వాయిదా అంటే  త‌మ‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన‌గా..  ఆర్ కృష్ణ‌య్య  బీసీల నోట్లో మ‌ట్టి కొట్టార‌ని.. మేం బందుకు పిలుపునిస్తున్నామ‌ని ప్రకటించారు. ఇక హైకోర్టులో ప్ర‌భుత్వ వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ లాయ‌ర్ ర‌వి వ‌ర్మ‌.. రాష్ట్రంలో 15 శాతం కూడా లేని ఓసీల‌కు ఎందుకు అంత రిజ‌ర్వేష‌న్ ఏం చేస్కుంటారు? అస‌లు మీకు 62 శాతంతో వ‌చ్చిన స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 1990ల కాలంలో నాడు జ‌య‌ల‌లిత‌.. ఢిల్లీ వెళ్లి అక్క‌డ అప్పటి ప్రధాని పీవీ ముందు కూర్చుని నా రిజ‌ర్వేష‌న్ నాకు ఇస్తారా చ‌స్తారా అన్న‌ట్టు కొట్లాడార‌నీ, మ‌నం కూడా అలా వెళ్లి మోడీ ఇంటి ముందు కూర్చుందాం ర‌మ్మంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి గంగుల క‌మ‌లాక‌ర్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో స‌హా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌ల‌సి.. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర అంత పెద్ద ధ‌ర్నా చేస్తే.. అప్పుడు బీఆర్ఎస్ ఎక్క‌డుందో చెప్పాల‌ని నిల‌దీశారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  దేశంలోనే తొలిసారిగా మేం చిత్త‌శుద్ధితో కుల‌గ‌ణ‌న స‌ర్వే చేప‌డితే క‌నీసం పాల్గొన‌ని బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఒక అసెంబ్లీ తీర్మానం చేశాక,  అది కూడా అన్ని ప‌క్షాల మద్దతుతో ఏకగ్రీవ  ఆమోదం పొందిన‌ బిల్లును హైకోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం, స్టే ఇవ్వ‌డం ఏమిటంటున్నారు కాంగ్రెస్ నాయకులు.   ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కుగానీ, రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర‌కుగానీ పంపితే.. మూడు నెల‌ల్లోగా తేల్చేయాలి. ఒక వేళ అలా జ‌ర‌క్కుంటే ఆ బిల్లు ఆమోద‌యోగ్య‌మైన‌ట్టేన‌ని  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తేదీల‌తో స‌హా గుర్తు చేశారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క. ఇక మా చిత్త‌శుధ్దిని శంకించ‌డానికి బీఆర్ఎస్, బీజేపీలు స‌రిపోవ‌ని అన్నారు  టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. చేయాల్సిందంతా చేసి వారు ఇప్పుడు ఆడుతున్న ఈ నాట‌కాలు ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని మండిప‌డ్డారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ,  కాంగ్రెస్ 42 శాతానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఇది తెలంగాణ ఇవ్వ‌డంలో అయినా బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌లో అయినా ఒక‌టే విధానంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు మంత్రి వాకిటి. రేవంత్  త‌మ పాలిట దేవుడిలా ఈ రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకొచ్చార‌ని.. అయినా స‌రే వీరంతా క‌ల‌సి త‌మ నోటికాడ ముద్ద లాగేసుకున్నార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు ఒక లేడీ లాయ‌ర్. సుప్రీంకైనా వెళ్లి.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు కాంగ్రెస్ క‌ట్టుబ‌డితే.. తామంతా క‌ల‌సి వ‌స్తామ‌ని అన్నారు బీసీ సంఘం నేత‌లు.  హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆపేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ దిశ‌గా ఒక గెజిట్ కూడా విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల కోడ్ కాస్తా ర‌ద్ద‌య్యింది.

రోహిత్ న్యూ లుక్.. ఇంత స్లిమ్ ఎలా అయ్యాడు?

రోహిత్ శ‌ర్మ‌ ఒకింత బొద్దుగా ఉంటాడు. ఒబెసిటీ అనలేం కానీ.. స్పోర్టింగ్ ఫిగర్ అయితే కాదని అంతా ఒప్పుకుంటారు. ఫిట్ నెస్ అనుమానమే అంటారు. అలాంటి రోహిత్ శర్మ ఒక్కసారిగా స్లిమ్ గా తయారయ్యాడు. బొద్దుగా, లావుగా ఉండే రోహిత్ శర్మ  ఉన్న‌ట్టుండి ఇంత స‌న్న‌గా ఎలా మారిపోయాడంటూ ఆయన ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.  సియ‌ట్ క్రికెట్ అవార్డుల ఫంక్ష‌న్లో క‌రోహిత్ శర్మ    75 కిలోల‌ క‌రెంటు తీగ‌లా కనిపించాడు.  అదీ కేవలం రెండంటే రెండు నెలలలో. అలాగ‌ని ఆయ‌నేమీ అంద‌రిలా క‌డుపు మాడ్చుకోలేదు. ఏకంగా ఏడు పూట‌లా తింటూ త‌న ఫిట్ నెస్ సాధించిన‌ట్టు తెలుస్తోంది. అరే అంత‌లా రోహిత్ శ‌ర్మ ఏం తిన్నాడు? ఆ డైట్ ప్లాన్ మ‌న‌మూ ఒక ప‌ట్టు ప‌డ‌తాం అనుకునే వారు రోహిత్ శర్మ డైట్  ప్లానింగ్ పై ఒక లుక్ వేస్తే స‌రి. ఇంత‌కీ డైటేంటంటే..?   ఉద‌యం లేవ‌గానే ఆరు నాన‌బెట్టిన బాదంప‌ప్పులు, మొల‌కెత్తిన స‌లాడ్ ఆపై జ్యూస్ తాగ‌డం. ఇక తొమ్మిదిన్న‌ర‌కు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తాజా పండ్ల‌తో కూడిన‌ ఓట్ మిల్క్ తో పాటు ఒక గ్లాసు పాలతో స‌రిపెట్ట‌డం. ప‌ద‌కొండున్న‌ర‌కు పెరుగు, చిల్లా, కొబ్బ‌రి నీళ్లు, ప్రోబ‌యోట్రిన్స్. ఇదంతా మాణింగ్ సెష‌న్ డైట్. ఇక మ‌ధ్యాహ్నం.. ఒక‌టిన్న‌ర‌కు వెజిట‌బుల్ క‌ర్రీస్, అన్నం, ప‌ప్పు, స‌లాడ్ ఎంచ‌క్కా లాగించేస్తాడు. ఆపై . సాయంత్రం 4. 30గంట‌ల‌కు డ్రై ఫ్రూట్స్ తీస్కుంటాడు. రాత్రి ఏడున్న‌ర‌కు కూర‌గాయ‌లు పులావ్ తింటారు, ఇక ప‌డుకునే ముందు గ్లాస్ పాలు ఇదీ రోహిత్ డైట్ అండ్ స్లిమ్ సీక్రెట్  ఇదే హిట్ మాన్ డైట్. మ‌రి మీరు కూడా ఒక ప‌ట్టు ప‌డ‌తారా?రోహిత్ లా హిట్ మాన్ అయిపోతారా? ట్రై చేయండి మ‌రి.

నవీన్ యాదవ్ ద లోక‌ల్ బాయ్ ఆఫ్ జూబ్లీహిల్స్!

1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల‌ లో కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్య‌ర్ధి న్న‌ న‌వీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంత‌కీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్ట‌రీ. ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విస‌భ్య స‌భ‌గా ఉండేది. ఇక్క‌డ ఎస్సీ కేట‌గిరిలో ఒక‌రు, జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఒక‌రు ఎంపిక‌య్యారు. వారెవ‌ర‌ని చూస్తే బ‌త్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేట‌గిరి, న‌వాజ్ జంగ్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి. ఆ త‌ర్వాత 1960లో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. ఈ ఎన్నిక‌లో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంప‌న్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నిక‌లోనూ ఆమే గెలిచారు. ఆ త‌ర్వాత ఈ సెగ్మెంట్ హిస్ట‌రీ 2009లో మొద‌లైన‌ట్టు తెలుస్తుంది. ఈ ఎన్నిక‌ల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి గెలిచారు. అప్ప‌టి వ‌ర‌కూ ఇది ఖైర‌తాబాద్ సెగ్మెంట్లో ఉండేది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయ‌నే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయ‌న హైద‌రాబాద్ లోని హైద‌ర్ గూడ నివాసి. దీంతో న‌వీన్ యాద‌వ్ అన్న‌ట్టు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజ‌ర్ సైతం ఇక్క‌డి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంద‌న్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయ‌న్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్ద‌లు. ఇప్పుడు తొలిసారి న‌వీన్ యాద‌వ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డ‌ను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్య‌మేలుతున్నార‌నీ.. మీ ఇంటి త‌మ్ముడు మీరు పిలిస్తే ప‌ల‌క‌డానికి యూస‌ఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌నీ.. మీకంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని అంటున్నారాయ‌న‌. అంతే కాదు ప‌దేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయ‌లేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. త‌న‌పై పెట్ట‌ిన‌వ‌న్నీ ఫాల్స్ కేసుల‌నీ.. అవ‌న్నీ వీగిపోతాయి కాబ‌ట్టి.. చ‌దువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మ‌నిషిగా ఉంటూ.. మీకు అన్ని ప‌నులు చేసి పెడతానంటున్నారు న‌వీన్ యాద‌వ్.

ఏంటీ ఓసీల‌కు కూడా రిజర్వేషన్లా వెంకటరమణా!?

కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ కావాలంటున్నారాయ‌న‌. ఇప్ప‌టికే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ మీదున్న అప‌వాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు  బీజేపీ మీద‌ యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.   రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీఆర్ఎస్..  బీసీల‌కు వ్య‌తిరేకంగా యాభై శాతం క్యాప్ చ‌ట్టం తేగా..  తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన‌   బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఢిల్లీకి వెళ్లి అక్క‌డ నిర‌స‌న వ్య‌క్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోంద‌న్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.  కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.   మొన్న‌టికి మొన్న కామారెడ్డికి వ‌ర‌ద వ‌చ్చిన‌పుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయ‌లేను క‌దా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి.. మ‌రోమారు త‌న వితండ వాద‌న వెలుగులోకి తేవ‌డంతో.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయ‌న్న హెచ్చ‌రిక‌లు అందుతున్నాయ్. ఓబీసీల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేద‌ని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేద‌లుంటారు కాబ‌ట్టి,  తాము ఆటంక‌ప‌ర‌చ‌లేద‌న్న కామెంట్ చేశారు వీహెచ్.   56 శాతం గా ఉన్న బీసీల ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వ‌డం వెన‌కున్న శ‌క్తులు త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డ‌తాయ‌ని అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు, ఇత‌ర బీసీ సంఘాల వారు. ఇప్ప‌టికే బీజేపీ మీదున్న నింద‌లు చాల‌వ‌న్న‌ట్టు వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వంటి వారు బీజేపీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేస్తున్నార‌నీ.. ఇది విప‌రీత అర్ధాల‌కు దారి తీసి పార్టీని మ‌రోమారు పుట్టి ముంచినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు కాషాయ పార్టీ లీడ‌ర్లు. అనువుగాని చోట అధికుల‌మ‌న‌రాద‌న్న సామెత‌లు గుర్తు చేస్తున్నారు.

బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ

అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. ఆ కాలేజీలో పెద్ద మొత్తంలో సొమ్ము ఉందని తెలిసిన గుర్తు తెలియని వ్యక్తులు పక్కా స్కెచ్ లో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం కాలేజీ సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలా కాలేజీలో భారీ మొత్తంలో సొమ్ము ఉందన్న విషయం బయటకు ఎలా తెలిసిందనేది మిస్టరీగా మారింది.  ఇక దోపిడీ విషయానికి వస్తే..అబ్దుల్లాపూర్మెట్ లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ లో  గుర్తు తెలి యని దుండగులు చొరబడి కాలేజీలోని లాకర్స్ పగలకొట్టి దాదాపు కోటి రూపాయలు దోచుకున్నారు. మూడు కాలేజీలకు సంబంధించిన సొమ్ములను ఒకే చోట సేఫ్టీలాకర్ లో పెట్టి భద్రంగా తాళం వేసినా.. దుండగులు వాటిని పగుల గొట్టి సొత్తు దోచుకున్నారు. ఎక్కడా ఎలాంటి క్లూ వదలకూడదన్న ఉద్దేశంతో  200 సీసీ కెమెరాలు ఉన్న డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు.  శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం  కాలేజీకి వచ్చిన ఉద్యోగులు లాకర్ బ్రేక్ చేసి ఉండడం చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది.  కాలేజీలో అంత సొమ్ము ఒక్కచోటే గంపగుత్తగా ఉందని ఎవరెవరికి తెలుసు; లాకర్ తాళం చెవులు ఎవరి వద్దనున్నాయి. ఈ దోపిడీలో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే  పోలీసులు కాలేజీ పరిసర ప్రాంతాలలో సీసీ కెమేరాలను సైతం పరిశీలిస్తున్నారు.  

ఇచ్చిన సొమ్ముకు డబల్ అంటూ రూ.20 కోట్లకు టోకరా!

హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య అనే మహిళ తన భర్త రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏపీ కి చెందిన ఒక్క ఎమ్మెల్యే  పిఏ నుండి 2వేల కోట్లు వస్తున్నాయని... 2వేల కోట్లు కోసం కంటైనర్లు కొనాలని  వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ లను మోసం చేసి కోట్లులో డబ్బులు వసూలు చేసింది. ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పి... అమాయక మైన జనాలను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. కొంతమంది వద్ద బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మ బలికింది. ఇలా కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, మియాపూర్ మొదలగు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు కట్టు కథలు చెప్పి వారి వద్ద నుండి బంగారం, సొమ్ములు వసూలు చేసి ఏకంగా 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది.   అనంతరం పటాన్ చెరుకు మకాం మార్చేసింది. తీసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు.  దీంతో శ్రీవిద్య వారినందరినీ.. గురువారం సాయంత్రం తన నివాసానికి రమ్మని.. వచ్చిన ఎనిమిది మంది మహిళలను ఒక గదిలో బంధించి, భర్త రాజశేఖరరెడ్డి, తమ్ముడు, పనిమనిషి,  ముగ్గురితో దాడి చేయించింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై విద్య మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మాట్రిమోనియల్ సైట్లో పరిచయం.. పెట్టుబడుల పేరుతో మోసం

రూ.7.7 కోట్లు మోసపోయిన బాధితుడు  అమెరికాలో వ్యాపారం చేస్తూ ఉంటాను.. మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చేశాను. చాలా అందంగా ఉన్నారు. మీ స్మైల్   బాగా నచ్చింది... నేను మీకు నచ్చితే వివాహం చేసు కుందాం  అంటూ వలపు వల విసిరి, పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరై త్వరలోనే వివాహం అంటూ నమ్మించి.. ఆ తరువాత   క్రిప్టో, స్టార్ట్-అప్, ఫారెక్స్, స్టాక్స్ మొదలగు ఎగుమతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టొచ్చు కదా బోలోడు ఆదాయం అంటూ నమ్మించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు  నేరగాళ్లు. విదేశాల్లో వ్యాపారం లేదా ప్రోఫెషనల్స్ గా పరిచయం చేసుకుంటూ మేట్రిమోనియల్ లో ప్రొఫైల్ చూశాం అంటూ పరిచయం పెంచుకుని పెట్టుబడులు పెట్టమనే వారిని నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్  శిఖాగోయెల్ హెచ్చరించారు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బోలెడు లాభాలు అంటూ నమ్మించి నకిలీ వెబ్ సైట్ లు చూపించి.. ముందు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చినట్లుగా చూపుతారు. ఆ తరువాత.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఇంకా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి కోట్లలో దోచుకుంటారని శిఖాగోయెల్ హెచ్చరించారు.  ఇటీవలే తెలంగా ణకు చెందిన ఓ బాధితుడు మ్యాట్రిమోనీ పేరుతో 7.7 కోట్ల రూపాయలు నష్టపోయాడని పేర్కొన్న శిఖాగోయెల్.. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు.  ఎ సోషల్ మీడియా లేదా మాట్రిమోని యల్ ప్రొఫైల్ ద్వారా వచ్చిన సంబంధా లను జాగ్రత్తగా పరిశీలించి.. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతనే ముందుకు అడుగువేయాలని సూచించారు.   అలాగే పెట్టుబడులు పెట్టమంటూ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని శిఖాగోయెల్ హెచ్చరించారు. ఆన్ లైన్ లోతెలియని వ్యక్తుల తో పరిచయం పెంచుకోవద్దని సూచించారు. అలాగే  వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొదన్నారు.  ఏదైనా అనుమానం కలిగినా,  మోసపోయినా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్  1930కి కాల్ చేసి లేదా www. Cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని  శిఖా గోయల్  ప్రజలకు సూచించారు.  

ఫిమేల్ రైడర్స్.. ఫెమీరైడ్స్ సంస్థ వినూత్న ఆలోచన

మహిళల కోసం, మహిళల రక్షణ కోసం విశాఖలో ఫెమీ రైడ్స్ పేరుతో మహిళా రైడర్స్ అందుబాటులోకి వచ్చారు. ఫెమీ రైడ్స్ పేరులో ప్రారంభమైన ఈ స్టార్టప్ మహిళల కోసం మహిళలే పని చేసేలా తీర్చి దిద్దారు. రాథికా బెహరా అనే ఓ మహిళ ప్రారంభించిన ఈ స్టార్టప్ ఇప్పుడు ఎందరో మహిళలకు ఉపాధిగా మారింది. ఈ ఫెమీ రైడ్స్ సంస్థ దాదాపు 500 మంది మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఈ మహిళా రైడర్లు మహిళా ప్రయాణీకులు భద్రంగా గమ్యం చేరేందుకు దోహదపడుతున్నారు.  మహిళలు ఇప్పుడు ఫెమీ రైడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తమతమ అవసరాలకు తగినట్లుగా టూ వీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ లను బుక్ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఫెమీరైడ్స్ స్టార్టప్ మహిళలకు ట్రావెల్ రంగంలో ఉపాధి కల్పిస్తోంది.   నిస్సందేహంగా ఇది ట్రావెల్ రంగంలో కొత్త మార్పు అంటున్నారు మహిళలు. ఇప్పుడు విశాఖలో మహిళా రైడర్ల జోరు పెరిగింది.   రవాణా సదుపాయం లేక, ఆటోల్లో, ట్యాక్సీల్లో ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయలేని మహిళలకు ఈ ఫెమీ రైడ్స్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇపప్టికే హైద్రాబాద్‌, బెంగుళూరులో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ట్రావెల్‌ ఏజెన్సీ లు ఉన్నాయి. ఇప్పడు విశాఖలో కూడా మహిళల కోసం మహిళలే పని చేసేలా ఫెమీరైడ్స్ అందుబాటులోకి వచ్చింది.  ఈ ఫెమీరైడ్స్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. మిగతా ఏజెన్సీలలా మహిళారైడర్స్ కు కమిషన్ రూపంలో కాకుండా, వేతనాలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఫెమీరైడ్స్ సంస్థ  బైక్‌ రైడ్‌, ట్యాక్సీ రైడ్‌, ఆటో రైడ్‌ల సేవలు అందిస్తోంది.  

మహిళల బాత్ రూంలో సెల్ ఫోన్.. పోలీసుల అదుపులో సైట్ ఇంజినీర్?

చిత్తూరులోని అపోలో  యూనివర్సిటీలోని మహిళ టాయిలెట్ లో రహస్యంగా మొబైల్ ఫోన్ ఉంచి.. అసభ్యంగా ఫొటోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్ రూమ్ కు వెళ్లిన ఓ ఆమ్మాయి.. దీనిని గుర్తించి వెంటనే వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో   యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తుతో ఆ సెల్ ఫోన్ ను రహస్యంగా మహిళల టాయిలెట్ లో అమర్చినది ఒక సైట్ ఇంజినీర్ గా గుర్తించి ఆ సైట్ ఇంజినీర్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 1న ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. గోప్యంగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కళాశాల యాజమాన్యం పోలీసులకు గుట్టుచప్పుడు కాకుండా పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాత్రూమ్ లో మొబైల్ ఫోన్ అమర్చిన ఓ సైట్ ఇంజనీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 1న ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలు వెల్లడించేందుకు అటు పోలీసలు కానీ, ఇటు వర్సిటీ యాజమాన్యం కానీ సుముఖత చూపడం లేదు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. శుక్రవారం (అక్టోబర్ 10) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్ 9)  శ్రీవారిని మొత్తం 66,883 మంది దర్శించున్నారు. వారిలో 26 వేల  మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  4కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది.  

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆపడంలో ఆ రెండు పార్టీల కుట్ర : భట్టి

  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు తప్పక అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఢిల్లీలో మేము ధర్నా చేసిన రోజు బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ దాక్కున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్టబద్ధంగా చేయాల్సిన ప్రతి ప్రక్రియను మా ప్రభుత్వం పూర్తి చేసిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటూ కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉంటే కులగణన ఎందుకు చేయలేదు? బీసీలు అమాయకులు కాదు... రిజర్వేషన్ల పెంపు ఎంత క్లిష్టమో వారికి తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాం” అని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ అన్నారు .  బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది  బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని మహేష్‌ గౌడ్‌  నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని మహేష్‌ గౌడ్‌  చెప్పారు.

హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం : ఎన్నికల సంఘం

  స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ విడుదల చేసింది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడైంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నె 9 పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించగా, ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నాది. కోర్టు తదుపరి విచారణను ఆరు వారాలకి వాయిదా వేశారు. ఆ సమయంలో వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండవని ఎన్నికల సంఘం తెలిపింది

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసులు హెచ్చరిక

  హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నెరగాళ్లు విసురు తున్న వలలో చిక్కుకుని చాలా మంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించగానే బాధితులు ముందు వెనక ఆలోచించ కుండా పెట్టుబ డులు పెట్టేందుకు  సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు బాధితుల వద్ద నుండి దొరికి నంత దోచుకుం టున్నారు. ఇలా నగరంలో పలు కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై హెచ్చ రికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌ మెంట్‌ తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుం టున్నా రని పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని అట్టి వారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా  ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు..ప్రజలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్లాట్‌ ఫారమ్‌ను ధృవీ కరించుకోవాలని, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోకూడదని పోలీసులు సూచి స్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీ సులు విన్నపం చేస్తున్నారు.

దేశ కుబేరుల జాబితా అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ!

  రిలయన్స్ వ్యాపార వాణిజ్య అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురు  వారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ టాప్ ప్లేస్‌లో  నిలిచారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆదాయం సుమారు 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 12శాతం 14శాతం ఆదాయం క్షీణించింది. ఇదిలాఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలి కమ్యూనికేషన్ సంస్థ జియో పబ్లిక్ ఇష్యూకు రానుంది.  2026 తొలి అర్ధభాగంలో తాము ఐపీవోకు వస్తున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. మరోవైపు.. కృత్రిమమేధను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందు కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు గురించి ప్రకటన చేసింది. భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల పోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.  టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాల్గో స్థానంలో నిలవగా.. అతని సంపద 34.2 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. ఇక టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 33.2బిలియన్ డాలర్లు.

ఏపీలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

  ఏపీలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు. 1. కొల్లాబత్తుల కార్తీక్ - నంద్యాల జాయింట్ కలెక్టర్ 2. శ్రీధర్ బాబు - కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ 3. శుభమ్ బన్సల్ - పరిశ్రమల శాఖ డైరెక్టర్ 4. మనజీర్ జిలానీ - వ్యవసాయ శాఖ డైరెక్టర్ 5. అభిషేక్ గౌడ - ఏలూరు జాయింట్ కలెక్టర్ 6. రవిసుభాష్ - ఏపీపీఎస్సీ కార్యదర్శి 7. నూరుల్ - కర్నూలు జాయింట్ కలెక్టర్ 8. శివశంకర్ లోతేటి - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ 9. ఢిల్లీ రావు - పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్ 10. రాహుల్ మీనా - రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ 11. పి. రంజిత్ బాషా - ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 12. అపూర్వ భరత్ - కాకినాడ జాయింట్ కలెక్టర్ 13. మౌర్య భరద్వాజ్ - శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ 14. అరుణ్ బాబు - హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ 15. జేవీ మురళి - సీసీఏల్ఏ కార్యదర్శి 16. సహదిత్ వెంకట్ త్రివినాగ్ - గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి 17. టీఎస్ చేతన్ - సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శి 18. కొమ్మిశెట్టి మురళీధర్ - ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి 19. ప్రసన్న వెంకటేశ్ - లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ 20. బి. నవ్య - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ 21. ఎస్. భరణి - స్టెప్ కమిషనర్ 22. ప్రవీణ్ ఆదిత్య - ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ 23. తిరుమణి శ్రీపూజ - అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ 24. కేఎల్ విశ్వనాథన్ - ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ 25. గోవిందరావు - పౌరసరఫరాల శాఖ 26. ఎస్. చిన్నరాముడు - ఎస్సీ కమిషన్ కార్యదర్శి 27. జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ - ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ 28. ఎస్ఎస్ భావన - బాపట్ల జాయింట్ కలెక్టర్ 29. సి. విష్ణుచరణ్ - సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శి 30. ఎస్ఎస్ శోభిక - వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి 31. అభిషేక్ కుమార్ - ఏపీ మారిటైం బోర్డు సీఈవో

హైకోర్టు స్టే ఊహించలేదు...భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : మంత్రి పొన్నం

  బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాఫీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని పొన్నం పేర్కొన్నారు.  ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని విధాలుగా చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తమని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం అన్యాయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు.  నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

దేశంలోనే రోల్ మోడల్‌గా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ : మంత్రి నారాయణ

  దేశంలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  తెలిపారు. ఈనెల 10న సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ పరిశీలన, కార్యక్రమాల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి నారాయణ క్షుణ్ణంగా అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేపట్టారు.  తొలుత వెంకటాచలం మండలం ఈదగాలిలో కార్యక్రమం అనంతరం నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్లో  స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు మరోమారు సూచనలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఏర్పాటు చేసిన 120 కంటైనర్ షాప్ లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా వ్యాపారులతో మాట్లాడారు. సీఎంతో మహిళ వ్యాపారుల ఫోటో సెషన్‌కు సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్నింటిని సాయంత్రం లోపల పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.  తమ కల సాకారం చేస్తూ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ కు మహిళ వ్యాపారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ లో ప్రారంభోత్సవానికి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ముస్తాబయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని  తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ లో 8.4 కోట్లతో 200 షాపులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తొలివిడతలో 30 కంటైనర్లలో 120 షాపులు సిద్ధం చేశామని చెప్పారు.  మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో తొలుతగా నెల్లూరు సిటీలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్‌లో 120 షాప్ లు ప్రారంభమవు తున్నాయన్నారు. ఒక్కో షాపుకి నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా... అందులో రెండులక్షల వ్యయాన్ని కార్పొరేషన్, మెప్మాలు బరిస్తాయని తెలిపారు. మిగిలిన రెండు లక్షల్లో కంటైనర్ కి లక్షన్నర రూపాయలు, పెట్టుబడి సాయం కింద మరో 50వేలు కేవలం రూపాయి వడ్డీకే లోన్ ఇప్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.  ఆ రెండు లక్షల్లో కూడా పి-4 పథకంలో భాగంగా 120మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు నా సొంత నిధుల నుండి మొత్తం కోటీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కింద అందచేస్తున్నానని మంత్రి తెలియజేశారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, చేస్తున్నాయని తనదైన శైలిలో మంత్రి ఖండించారు. అన్నిటినీ తట్టుకుని స్మార్ట్ స్ట్రీట్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లామని చెప్పారు. దేశంలోనే ఈ స్మార్ట్ స్ట్రీట్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.  స్మార్ట్ స్ట్రీట్ లో టెక్నాలజీదే పెద్ద పాత్ర అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోల్స్ కి సీసీ కెమెరాలున్నాయని, వైఫై సౌకర్యం ఉందన్నారు. ఏదైనా అనౌన్స్ మెంట్ చేయాలంటే దీనికే స్పీకర్స్ ఉన్నాయని తెలిపారు. లైటింగ్ పోల్స్ కూడా ఇవేనన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతీదీ టెక్నాలజీ అప్డేటెడ్ అని చెప్పేందుకు గర్విస్తున్నానని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారంలో మెళుకువలు నేర్పేందుకు మెప్మా మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారన్నారు. చెన్నై బర్మా బజారుకు తీసుకెళ్లి వ్యాపారాలపై అవగాహన కూడా కల్పించామని తెలిపారు..

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

  కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళలందరికీ  ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ పాలసీని ఆమోదించింది. . ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల  శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా  ఈ నిర్ణయం  తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని  సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఈ నిర్ణయం మహిళా శ్రామికులకు పెద్ద ఉపశమనంగా మారుతుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్‌.కె. పాటిల్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, తమ రాష్ట్రం కూడా దానిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన కేబినెట్‌ సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికారిక రంగంలో అమలు సులభమైనా, అనధికారిక రంగంలో ఇది ఒక సవాలుగా నిలుస్తుందని, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్య సాధికారతకు బలమైన పునాది వేస్తుందని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే అభిప్రాయపడ్డారు. మహిళల అసలైన ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయమని ఆమె అన్నారు.