రేపటి నుంచి  వారాహియాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర రేపటి నుంచి(అక్టోబర్ 1) ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.మరోవైపు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగసభ జరగనుంది. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి మూడు విడతలు పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా ఎవరూ జన సమీకరణ చేయాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్. అదీ గోదావరి జిల్లాల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన వారందరూ ఓట్లేస్తారా లేదా అన్నదానిపై పవన్ కల్యాణ్ తనకు తానే సెటైర్లు వేసుకున్నా.. ఆయన జనాకర్షణ మాత్రం మాస్. అయితే గతంలోలా కాదు .. ఈ సారి ఆయన  వారాహి యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టించనుంది.  ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ఆయనను  ఓ సామాజికవర్గానికి పరిమితం చేయాలని.. ఆయనకు మద్దతు ఉంటుందని భావిస్తున్న వర్గంలో చీలిక కోసం ఇలాంటి ఎదురుదాడి వైసీపీ చేస్తోందన్న భావన బలంగా ఏర్పడుతోంది. 

మహానాయకుడి అరెస్టు మాటల కందని మహా విషాదం!

నాకు వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్రమే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చ లేని మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చెయ్యడం మాటల కందని మహా విషాదమనే చెప్పాలి.  కక్ష సాధించడం కోసం అన్యాయంగా గొప్ప నాయకుడిని జైలులో పెట్టి సీఎం జగన్‌రెడ్డి తన కళ్ళల్లో నిప్పులు పోసుకొన్నారు. గంద సింధూరం రాజమార్గాన పోతుంటే కుక్కలు ఎన్ని మోరిగితే ఏమవుతుంది అన్న సామెతగా, పస లేని, పనికి మాలిన ఆరోపణలతో చంద్రబాబుకు మసి పూయగలవా జగన్ రెడ్డి? చంద్రబాబు ఒక శిఖరం. ఆ శిఖరాన్ని అందుకోవాలంటే జగన్‌రెడ్డికి  పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్మోసకారి మాయోపాయాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ప్రజలు. తెలుగువారే కాదు, అన్నీ దేశాలలో ఆత్మీయంగా అభిమానించే ఆదర్శనాయకుడు చంద్రబాబు. పడగొట్టిన రాష్ట్రాన్ని గొడ్డు చాకిరీ చేసి నిలబెట్టినా ప్రజలు ఓడించారు. అయినా ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి ప్రతిపక్షనాయకుడిగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై మాజీ సీయం చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. ఆయన హోదా, వయసు, పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను సిఐడి తుంగలో తొక్కడం జగన్ రెడ్డి ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటులో రూ.270 కోట్ల ప్రభుత్వ నిధులను డొల్ల కంపెనీలు నెలకొల్పి పథకం ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి పొందారన్నది సిఐడి ఆరోపణ.  2015-16లో జరిగిందంటున్న అవినీతిపై వైసీపీ వచ్చాక 2021లో కేసు నమోదైంది. సిఐడి కొంత మందిని అరెస్ట్‌ చేసి ఛార్జిషీట్‌ వేసింది. నిందితులు బెయిల్‌పై  విడుదలయ్యారు. హైకోర్టులో విచారణ పూర్తి అయి తీర్పు రిజర్వ్‌ అయింది. మొదట  ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు అనూహ్యంగా ఇప్పుడు ఎలా తెర మీదికి తెచ్చారు? రిమాండ్ రిపోర్టులో  సీఐడి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఒక తప్పుడు కేసు పెట్టి  చంద్రబాబును అన్యాయంగా  ఇరికించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా, ప్రాధమిక సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ 2021 డిసెంబరులో కేసు నమోదు చేశారు. కానీ కేసు ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి చార్జిషీట్‌ వేయకుండా, సాక్ష్యాలు లేకుండా... చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటి?  దాదాపు రెండేళ్ల తర్వాత అది కూడా 36 మంది అధికారులు బయట ఉండగా ఎలాంటి పురోగతి లేని కేసులో ఎలాంటి సాక్ష్యాలు బయటపడని 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిపై సాక్ష్యాలు లేకుండానే 37వ నిందితుడిగా చంద్రబాబును అరెస్టు చేయడం ఎంత దారుణం?                      చంద్రబాబు వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం, దేశంలో అందరికంటే అనుభజ్ఞుడైన మచ్చలేని  ప్రజానాయకుడు ఆయన. తెలుగు ప్రజలు అందరికంటే ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఏడు పదులు దాటిన వయస్సు అందులో 45 ఏళ్ళు ప్రజాజీవితమే. రెండు దఫాలు మంత్రిగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్ళు ప్రతిపక్షనేతగా, విభజన అనంతరం ఏర్పడ్డ నవ్యాంధ్రకు అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు నవ్యాంధ్రలో నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడుగా 1956 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘ అనుభవంతో ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు లేడు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్దమైన జీవన శైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకొన్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చి దిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు, దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం అని చెప్పాలి. నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకొని దార్శనికత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం, ఆయన ఆదర్శ విధానాలు నేటి యువతకి స్పూర్తి దాయకం. చంద్రబాబు అంటే విజన్, ఆయన విశ్రమించని మిషన్, ఆయనొక  పెర్ఫార్మర్, ఒక రిఫార్మర్. విశ్రాంతి అవసరం లేని, సమయం తెలియని నాయకుడు. కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగే అవిశ్రాంత పధికుడు. మోటివేటర్, యువతకు మార్గదర్శకుడు. అనన్య పాలనా దక్షుడు.  ప్రతినిముషం  ప్రజలకోసం పరితపిస్తున్న నాయకుడు. నిరంతరం జనంలోనే, జనంతోనే, దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేషన్‌తో పాలించిన నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టే కారణం. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్,  మెడికల్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చెయ్యడంతో ఆర్ధికవ్యవస్థ బలోపేతమైంది. చంద్రబాబునాయుడు అహోరాత్రులు చేసిన కృషి ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ చంద్రబాబుని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చంద్రబాబును ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్‌లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చెయ్యడం గర్వకారణం. ఇండియా టుడే పత్రిక చంద్రబాబును ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీయంగా సత్కరిస్తే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబుతోనే ప్రారంభం అయింది.                   హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలని ఆ మధ్య అహ్లు వాలియా అనడం అంటే ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా ప్రసిద్ధి పొందిన చంద్రబాబు ఖ్యాతి ఎలాంటిదో అర్ధం అవుతుంది. చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ నిర్మాణం. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈనాడు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణమని చెప్పాలి. బెంగుళూరు, ముంభైతో పోటీ పడి ఐటి రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి. జంట నగరాలకు తోడు సైబరాబాద్‌ను సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు.    రాజకీయంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి, తెలుగుజాతికి ఎంతటి ప్రాముఖ్యత, ప్రాభవం తెచ్చారో అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అంతే గుర్తింపు తెచ్చారు. వినూత్న ఆలోచనలు, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతరం ఆయన శ్రమించారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు భావి తరాల గురించి ఆలో చిస్తాడు. దేశాభివృద్ది కానీ, రాష్ట్రాభివృద్ది కానీ, స్వార్ధ, సాధారణ నాయకులతో సాధ్యం కాదు. అందుకే జాతి కోసం శ్రమించే వారిని, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న వారిని గుర్తించకపోతే ఆ జాతి ఎప్పటికీ పెదగానే మిగిలిపోతుంది. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం.  అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ఆయనది చెరగని ముద్ర ఆయన పట్టుదల. అంకితభావం. ఆయన కృషి అనన్య సామాన్యం. ఆయన పోరాటం అసిధారా వ్రతం. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాజకీయాల అవసరాలు కన్నా ప్రజలే ముఖ్యమని, ప్రజలే ముందని చెప్పిన, నమ్మిన రాజనీతిజ్ఞుడు చంద్రబాబు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది గొప్ప చరిత్ర, అధికారంలో వున్నా, లేకున్నా, ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు వెళ్ళినా, ఎప్పుడైనా కుటుంభంతో విదేశాలకు వెళ్ళినా, ఆఖరికి విమాన ప్రయాణంలో వున్నప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాల పైనే దృష్టి పెడతారు. ప్రతి పనిని పవిత్ర యజ్ఞంగా భావిస్తారు. లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకొనేందుకు నిరంతర శ్రమ, వ్యూహం వుండాలి అంటారు. అందుకే నవతరం రాజకీయ నాయకులకు ఆయనొక పాఠ్యగ్రంధం అని చెప్పాలి.   జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. నేషనల్ ప్రoట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కేంద్ర పెత్తనానికి ఎలా కళ్ళెం వేశారో యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసిన వారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తాను రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు.  రాష్ట్రపతులుగా శ్రీ కెఆర్ నారాయణయన్,శ్రీ అబ్దుల్ కలాం ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంద్రను అభివృద్ది చేయడానికి చంద్రబాబు తనను తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి రాష్ట్ర ఆదాయం పెంచాలని, యువతకి ఉపాధి కల్పించాలని చంద్రబాబు తపన పడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి. చంద్రబాబు పిలుపుకు స్పందించి 29 గ్రామాల నుండి 28 వేల మంది రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం గర్వకారణం.  ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు,  కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కిపైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న దృఢ సంకల్పంతో దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్‌ను సస్య శ్యామలం చేసే భారీ ప్రాజెక్టు పోలవరంను 70 శాతం పూర్తిచేశారు. పట్టిసీమ పూర్తీ చేసి కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం అనే ఆదర్శాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు. పారిశ్రామిక ప్రగతి పరుగుల వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది. ఆయన హయాంలో వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే చంద్రబాబు పాలనా దక్షతే దానికి కారణం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విన్నూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. సమ్మిళిత, సుస్థిరత అభివృద్దే లక్ష్యoగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 11.2శాతం సాధించారు. చంద్రబాబు దీర్ఘకాలం అదికారంలో కొనసాగి వుంటే హైదారాబాద్ వంటి నగరాన్ని నవ్యాంద్రలోను నిర్మించేవారు.విశాఖపట్నాన్ని ఒక సిలికాన్ వ్యాలీగా, అమరావతిని సకల విద్యలకు కాణాచిగా, తిరుపతి శ్రీ సిటీని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చే వారు. అందుకే జాతికోసం, జగతికోసం, ప్రగతి కోసం 73 ఏళ్ల లోనూ నిరంతరం శ్రమిస్తున్న మహానాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం మాటల కందని మహా విషాదం. అక్రమంగా,అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చెయ్యడంపై దేశవ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా బాబు కోసం మేము అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వారందరికి అభినందనలు.   నీరుకొండ ప్రసాద్   సీనియర్ జర్నలిస్ట్

గ్రూపుల గోలకు చెక్.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హైకమాండ్ వ్యూహాలు!

తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తడబాటు లేకుండా సూటిగా ముందుకు సాగుతోంది. అసమ్మతులు, అసంతృప్తుల రణగొణధ్వనులను పార్టీ హైకమాండ్ లెక్క చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో తమ స్టేక్ తీసుకోవాలన్న కృత నిశ్చయంతో హై కమాండ్ ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే సహజంగానే కాంగ్రెస్ లో గ్రూపులు సంస్కృతి ఎక్కువ. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే తెలంగాణలో ఆ సంస్కృతి మరికొంచెం అధికం. తెలంగాణ కాంగ్రెస్ లో  పార్టీ క్యాడర్ కంటే నాయకుల సంఖ్యే ఎక్కువ అంటుంటారు. రాష్ట్రంలో ప్రతి నాయకుడూ ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిననే భావిస్తుంటారు. 2014 ఎన్నికలలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. సమష్టితత్వం లోపించడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించిన కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడింది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలను హైకమాండ్ రేవంత్ రెడ్డికి అప్పగించే వరకూ జారుడుబండ మీద బ్యాలెన్స్ కు విఫలయత్నం  చేసిన చందంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం నుంచి పతనానికి దిగజారుతూ వచ్చింది. ఏ ఎన్నిక  జరిగినా ఓటమి కోసమే పోటీ చేస్తున్నదా అన్నట్లుగా ఆ పార్టీ విజయాల గ్రాఫ్ ఉంది. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. నేతల అసంతృప్తి, అసమ్మతిల సంగతి పక్కన పెట్టి రేవంత్ క్యాడర్ లో జోష్ నింపడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టికి విజయం సిద్ధించకపోయినా గట్టి పోటీ అయితే ఇచ్చిందనడంలో సందేహం లేదు. దీంతో హైకమాండ్ రేవంత్ పై గురి కుదిరింది. దీంతో  సీనియర్ల మంటూ కొందరు నాయకుులు అడుగడుగునా రేపుతున్న రచ్చకు గట్టి చెక్ పెట్టే దిశగా అధిష్ఠానం గట్టి చర్యలు తీసుకుంది. నేరుగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అసమ్మతి గళాలను దారిలోకి తీసుకువచ్చింది.  ఇప్పుడు ఎన్నికల ముంగిట సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కనిపించే రచ్చ పెద్దగా కానరావడం లేదంటే అది హైకమాండ్ సీనియర్లకు చెక్ పెట్టిన కారణమేనని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల విషయంలో సీనియర్లెవరూ పెద్దగా మాట్లాడటం లేదు. మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇంకా మరి కొందరూ తమతో పాటు తమ కుటుంబ సభ్యులకూ టికెట్లు ఇవ్వాలనీ, అలాగే తమ అనుచరులకూ టికెట్లు కేటాయించాలంటూ మొదట్లో ఒకింత హడావుడి చేశారు. అయితే అలాంటి వారందరినీ హైకమాండ్ గట్టిగా చెప్పింది. పార్టీ టికెట్ మీకా మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా మీరే తేల్చుకోండి అంటూ విస్పష్టంగా చెప్పేసింది. ఎంత కాలం నుంచి పార్టీలో ఉంటున్నామన్నది కాదనీ, ప్రజలలో ఉన్న ఆదరణ, నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు ఇవే టికెట్ల కేటాయింపునకు ప్రాతిపదిక అని కుండబద్దలు కొటేసింది. దీంతో సీనియర్ల హైకమాండ్ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో విజయం విషయంలో ఎంత సీరియస్ గా ఉందన్నది అర్థం చేసుకుని మౌనం వహించారు. అలాగే పార్టీలోకి చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. చేరికలను అడ్డుకుంటే సహించేది లేదన్న హెచ్చరిక జారీ చేసింది.   నల్లగొండ జిల్లాలో ఇక ఎవర్నీ చేర్చుకోమని ఏకపక్షంగా ప్రకటన చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్ ఇస్తూ ఆయన ఇష్టానికి విరుద్ధంగా వేముల వీరేశంకు పార్టీ కండువా కప్పి చేర్చుకుంది.   పార్టీలోకి వచ్చి చేరేవారికి గెలిచే, గెలిపించే సత్తా ఉంటే వారి కోటాలో రెండేమిటి.. మూడు టికెట్లైనా ఇవ్వడానికి రెడీయే అన్న సంకేతాలను పంపింది. బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లి హనుమంతరావుకు, ఆయన కుమారుడికి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వారు కోరుకున్న మల్కాజ్ గిరి, మెదక్ లలో పెటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  తనకూ తన కుమారుడికీ టీకెట్లు ఇస్తే తన వంతుగా మరో నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తనదేనని మైనంపల్లి గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ అందుకు సై అందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.    తెలంగాణలో అసమ్మతి, అసంతృప్తులకు కళ్లెం వేయడమే కాకుండా, సీనియర్లం మా మాటే శాసనం అంటూ ఇంత కాలం చక్రం  తిపిన వారికి కళ్లెం వేసి గెలుపు గుర్రాలకే టికెట్లు, మరో మాటకే అవకాశం లేదు అన్నట్లుగా కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నిలబడటంతో  కాంగ్రెస్ కు విజయానికీ మధ్య  నిలిచే గ్రూపుల గొడవ ఇప్పుడు పార్టీలో కనుచూపుమేరైనా కనిపించడం లేదు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలలో ఈ గ్రూపుల లొల్లి ఆ పార్టీల గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా తెలంగాణలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోందని అంటున్నారు. 

ఏపీలో నోరూల్.. ఓన్లీ అరెస్టులు, వేధింపులు!

ఏపీలో పాలన ఉందా అంటే ఉంది. మరి ఎక్కడా అంటే గాలి మాదిరి అది రాష్ట్ర ప్రజల కంటికి కనిపించదు. నాలుగేళ్ళ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాల వలన లబ్ది పొందిన ప్రజల గురించి గట్టిగా రెండు నిమిషాలు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. క్యాబినెట్ నిర్ణయాలపై కానీ, అసెంబ్లీ వేదికగా కానీ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నారో చెప్పింది చూడలేదు. మైకు దొరికితే టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు, గత ప్రభుత్వం అంతా అవినీతే అంటూ ఆరోపణలు. అమరావతి భూమి కుంభకోణం నుండి ప్రతి అంశంలో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రస్తుతం చంద్రబాబును అరెస్ట్ చేయించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఆరోపిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులలో ఆరోపణలపై కూడా ఇప్పటి వరకూ ఒక్క ఆధారం బయటపెట్టింది లేదు. మొన్నటి వరకూ ఆరోపణలతో పబ్బం గడిపిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తుంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్టు, లోకేష్ అరెస్టు ఊహాగానాలపైనే చర్చ సాగుతున్నది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? కేసు కొట్టేస్తారా.. విచారణకు ఆదేశిస్తారా? లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారా? ముందే లోకేష్ కు బెయిల్ దక్కుతుందా? ఈ ఇద్దరితో ఈ అరెస్టుల పరంపర ఆగుతుందా? ఒకవేళ చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేస్తే టీడీపీను నడిపించేదెవరు? ఇలా పలు రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందుతున్నాయా? రబీ సీజన్ మొదలైనా రైతులకు విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఏమైనా ఇస్తున్నారా? రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు జమవుతున్నాయా? ఆరోగ్య శ్రీ అసలు నడుస్తున్నదా? ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయా.. ఇలా ప్రజల సమస్యలపై ఎక్కడా ఎలాంటి చర్చలు లేవు.. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం లేదు.  రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో  జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉండడం లేదని, వైద్య పరీక్షలకు కూడా బయటకి పంపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడిక్కడ జిల్లా వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ లలో కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలలో ఒక్క బస్తా కూడా ఎరువు దొరకడం లేదు. బయట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంకా మాట్లాడితే అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా 99 శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదు. అసలు ఆయా శాఖల మంత్రులకు కూడా వారి శాఖ ఏమిటో, వారి బాధ్యత ఏమిటో తెలుసా అంటూ అనుమానమేనన్న సమాధానం పరిశీలకుల నుంచి వస్తున్నది. అసలు ఆ మంత్రులంతా ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పరు. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులపై మాట్లాడేందుకు మాత్రం అందరూ కట్టగట్టుకొని వరసబెట్టి టీవీల ముందుకు వచ్చేస్తారు. సహజంగా సీఎం వారం రోజులు రాష్ట్రంలో లేరంటే వచ్చీ రాగానే పాలనపై దృష్టి పెడతారు. గత వారంలో రాష్ట్ర పాలన ఎలా సాగింది? ప్రసుత రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అసలే అప్పుల పాలు చేసిన రాష్ట్రం కనుక ఏదైనా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పనులు చేయాలంటే ముందున్న అవకాశాలేంటి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, జగన్ విదేశీ యాత్ర  ముగించుకొని వచ్చిన తర్వాత ఈ తరహా సమావేశాలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. కనీసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశించినట్లుగా కూడా దాఖలాలు లేవు. కానీ, జగన్ రాష్ట్రానికి వచ్చాక చంద్రబాబు అరెస్టుపై వివరణ ఇవ్వడం, రానున్న ఎన్నికల కోసం ప్రజలను మెప్పించడం ఎలా అనే అంశాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇంచార్జిలు, కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే వైసీపీకి రాష్ట్ర పాలన, ప్రజల సంక్షేమం కంటే ప్రత్యర్థులపై కక్షసాధింపు, రానున్న ఎన్నికల కోసం ప్రజలను ఎలా మాయ చేయాలనే దానిపైనే ఆసక్తి కనబడుతుంది.

ఫ్యాలెస్‌లో సైకో చెవులు చిల్లులుపడేలా..‘మోత మోగిద్దాం’!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ.. వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టాలంటూ ప్రజలకు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. చంద్రబాబు నాయుడుగారికి మద్దతుగా మోత మోగిద్దాం పేరిట సెప్టెంబర్ 30వ తేదీ అంటే శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు ఫ్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా.. ఏదో ఓ రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపు నిచ్చింది.  ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రజలకు టీడీపీ సూచించింది. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఇంట్లోనో.. ఆపీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా.. బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేకుంటే విజిల్ వేయండి. ఓ వేళ రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియలో షేర్ చేయండంటూ పోస్టర్‌లో స్పష్టం చేసింది. .  ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామన్నారు.   మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ట్వీట్ చేశారు. చంద్రబాబు  మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేశారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబు పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్లకి చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా ఫర్వాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి అంటూ ప్రజలకు విజ్జప్తి చేశారు.  మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ తనదైన శైలిలో స్పందించారు. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకి మద్దతుగా.. సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకోకి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి.. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంటూ.. ఆయన ప్రజలకు సూచించారు.    ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్  కుంభకోణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. ఆగస్ట్ 9వ తేదీన ఆయన్ని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలు చేపడుతుండగా.. బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ తదితర నగరాల్లో ఆందోళనలు కొనసాగుతోన్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, జర్మనీ, యూరప్ తదితర దేశాల్లో సైతం తెలుగు వారు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నారు.

పాపం బాలినేని.. పొగబెట్టినా బయటకెళ్లలేని పరిస్థితి?

పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, బంధువు. పార్టీలోనేమో  ఆయన పరిస్థితి కరివేపాకు చందం. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని ఉండలేని పరిస్థితి. మొత్తంగా బాలినేని పరిస్థితి ప్రత్యర్థి పార్టీ నేతలకు కూడా రాకూడదని అంటూ జాలిపడుతున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. ఆ బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులు.. కాలరెగరేసుకుని బయటకు వచ్చినా  పార్టీలో ప్రాధాన్యత విషయంలో షరామామూలు పరిస్థితి.. గత నాలుగేళ్లుగా బాలినేని పరిస్థితి పార్టీలో ఇలాగే కొనసాగుతోంది.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌ కీలక నేత. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బాలినేనికి ప్రాధాన్యత  సంగతి అటుంచి కనీస గౌరవం, మర్యాదా కూడా లేకుండా పోయింది.   జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేనికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు ఆయన మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట వచ్చారు. బహుశా అందుకే  తొలి క్యాబినెట్ లో ఆయనకు అవకాశం దక్కింది. కానీ  మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి జగన్ తప్పించారు. అదే సమయంలో అదే ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ ను కేబినెట్ లో కొనసాగించారు.  దీనిపై బాలినేని మనస్తాపానికి గురయ్యారు. దానిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. బుజ్జగించారు. బాలినేని సర్దుకు పోయారు. ఇఖ అక్కడ నుండి వైసీపీలో ఆయనను పక్కన పెట్టేయడం ఆరంభమైంది. ఇది కాస్త తారాస్థాయికి చేరడంతో బాలినేని ఆ మధ్య అసంతృప్తికి లోనయ్యారు. కారణామేంటా అని ఆరాతీస్తే.. సొంత జిల్లాలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కినుకు వహించారని తేలింది. ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో కూడా ఆయనకు తెలియకుండానే అన్నీ  జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పుకుని ఆవేదనకు గురయ్యారు.  అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పట్లో బాలినేని అసంతృప్తికి కారణం వైవీ సుబ్బారెడ్డే అని అందరికీ తెలిసిందే. నిజానికి సుబ్బారెడ్డి, బాలినేనికి ఇద్దరికీ సీఎం జగన్ తో బంధుత్వం ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేసారు. కానీ, తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. అధిష్టానం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో బాలినేని అలకబూని మీడియాకెక్కారు. దీంతో అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో అప్పటికి అది సమసిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి బాలినేనికి అదే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిలను  పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరికలాంటి అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే, పరిస్థితి చూస్తే మాత్రం బాలినేనిరి  పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్నది. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరుగుతోందని కూడా అంటున్నారు. బాలినేనిని పక్కన పెట్టడం అనే కార్యక్రమం అంతా  సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డిని ఈజిల్లాకు ఇన్ చార్జ్ గా నియమించారు. కానీ, బాలినేనికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన అధిష్టానం.. బాలినేనే జిల్లాను చూసుకుంటారని కూడా చెప్పారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం తేడాగా కనిపిస్తుంది. మొన్నటి వరకూ వైవీ సుబ్బారెడ్డి బాలినేనికి బల్లెంలా తయారైతే ఇప్పుడు విజయసాయిని స్వయంగా అధిష్టానమే పంపించడం చూస్తుంటే జగన్ కే  బాలినేని జిల్లాపై పెత్తనం చేయడం ఇష్టంలేదన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.  అయితే పలుమార్లు అవమానించినా బాలినేని మాత్రం పార్టీని పట్టుకు వేలాడడం ఆయన అనుచరులకు సుతరామూ నచ్చడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. చూడాలి ఇప్పటికైనా బాలినేని ఆయన దారి ఆయన చూసుకుంటారా? లేక మళ్ళీ బుజ్జగింపులకు తలొగ్గి పార్టీలోనే కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది.

అనేక యుద్ధముల ఆరితేరిన మూర్తి..స్పూర్తి చంద్రబాబు!

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు గొప్ప స్థాయి  ఉన్న నాయకుడు. రాజకీయానుభవం కానీ, పరిపాలనా అనుభవం కానీ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. ప్రజల పట్ల అంకితభావం, కష్టపడే తత్వం ఆయనకే వుంది. చంద్రబాబుకి అవినీతి మకిల అంటించాలని రాజకీయ ప్రత్యర్ధులు చాలా మంది కోర్టుల్లో కేసులు వేసి ఆయాస పడ్డారే తప్ప అవినీతిని నిరూపించలేక పోయారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎవరెన్ని కేసులు వేసినా ఆయన నిస్వార్ధ గుండె బెదర లేదు. విలువలుతో కూడిన రాజకీయాలు, సుపరిపాలన, జవాబుదారీతనం ఆయనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తాము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కాబటి ఎదుటి వారిని మాత్రం ఎందుకు వదిలి పెట్టాలన్న దురుద్దేశ్యంతో  రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం కోసం ఆధారాలు లేని అక్రమకేసు పెట్టి అరెస్టు చేసి వేధిస్తున్న వాస్తవాలు ప్రజలు గుర్తించాలి.  కేవలం కక్ష సాధించడం కోసం అధికారాన్ని ఉపయోగించి ఆధారాలు లేక పోయినా అక్రమంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చెయ్యక పోయినా పెద్ద శిక్ష వేశారని, జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు, కుట్రలు, కేసులు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడుపై అభియోగం మోపే టప్పుడు అందుకు తగ్గ విశ్వసనీయ ఆధారాలు చూపకకుండా పోలీసులు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కల్పితమైన కేసు అని మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు, బాహాటంగా ప్రకటించాయి. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రెండేళ్ల కిందట కేసు పెట్టారు.  చంద్రబాబును అరెస్టు చేసి 16 రోజులు అవుతున్నా అయన తప్పు చేసినట్లు ఆధారాలు చూపలేక అవస్థలు పడుతున్నారు సిఐడి వారు. చంద్రబాబును ఎక్కడ తప్పు పట్టాలో తెలియక, ఏ ప్రశ్నలు అడగాలో అర్ధకాక ఫైళ్లు చూసుకొంటున్నారు సిఐడి అధికారులు. దీనిని బట్టి ఈ కేసు ఎంత కుట్ర పూరితమైనదో అర్ధం అవుతుంది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలలో 45 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బలహీనతలతో తలదించి ఎరుగని, ఎవరి కాళ్ళకు మొక్కని నాయకుడు. ప్రజలు తలఎత్తుకొనేలా పాలించి, అందరి కోసం ఒక్కడై అహర్నిశలు చెమడోడుస్తున్న నాయకుడు ఆయన .ఆంధ్రాభ్యుదయం కోరి అవమానాలు భరిస్తున్న నాయకుడు. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా చంద్రబాబు. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికుడు. గాంధీజి ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన అరుదైన నాయకుడు చంద్రబాబు. ఎన్‌టిఆర్... తెలుగువారి ఆత్మ గౌరవ చిహ్నం అయితే, చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాస ప్రతీకగా నిలిచారు. తెలుగు ప్రజల ఉద్దరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మహర్షి చంద్రబాబు. తెలుగు ప్రజలను ప్రగతి పధం వైపు నడిపించే సమర్ధ నాయకుడు. ఎదురు దెబ్బలు..పాఠాలుగా, గాయాలు.. గుణపాఠాలుగా, సమస్యలను,సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకొన్న ఆసిధారా వ్రతుడు, గెలుపోటములకు పొంగి, కృంగిపోని స్థిత ప్రజ్ఞుడు, అవిరామ యోధుడు, అలుపెరుగని ధీరుడు చంద్రబాబు.                        అతడే ఒక సైన్యం, అతడే ఒక స్ఫూర్తి. నేటి తరానికి ఆయనొక మార్గదర్శి. సరికొత్త లక్ష్యాల తీరాల వెంట ఎగిరే విహంగం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణం వైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో జయాపజయాలు, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం. మనోధైర్యం చంద్రబాబు సొంతం. నాలుగున్నర దశాబ్దాలుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను ఒంట పట్టించుకుని అతి  చిన్న వయసులోనే మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అధిరోహించి చరిత్ర సృష్టించారు. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు చంద్రబాబు. మీ రాజకీయ అనిభవం, మార్గదర్శకత్వం పట్ల ఆకర్షితులవుతున్నాం, మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక, ఇండియాకి మార్గదర్శకులౌతారని యు,జి.కి కాకు కన్సల్ జనరల్ జపాన్ అన్నారు.                      దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత నవ్యాంధ్రను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల చంద్రబాబు పోరాట పటిమ అసాధారణ మైనది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబునాయుడు ఒకరు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. సీఎం అంటే ప్రజలందరికీ చిరపరిచితంగా ఉంటారనే ధోరణి తెచ్చింది చంద్రబాబే. ఆయన 9 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారారు. వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించారు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. గతంలో చాలామంది భారతీయ రాజకీయ వేత్తలను కలుసుకొన్నాను కానీ, ఆచరణాత్మకమైన, దృఢమైన, పారదర్శక కార్యక్రమాలను అమలు చేసిన మీలాంటి వారిని కలుసుకోవడం నూతన ఉత్తేజం అన్నారు కేన్నత్, మెంబర్ హౌస్ ఆఫ్ లార్డ్స్ యు.కె  రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ఘనత చంద్రబాబుది. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చంద్రబాబు వ్యవహరించి దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేయడంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకిక వాదానికి కట్టుబడి బయట నుంచి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో తన వంతు పాత్ర నిర్వహించారు.  దళిత నేత జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. స్వర్జ చతుర్భుజి కింద ఫోర్‌ లైన్‌ రోడ్లు నిర్మించడానికి ఆధ్యుడిగా నిలిచారు. ఐటీ రంగం అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో చంద్రబాబునాయుడు దూరదృష్టితో ఆలోచించి ఆ రంగాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ, సైబరాబాద్‌ను నిర్మించారు. ఆయన సాంకేతిక విద్యారంగంలో తెచ్చిన విఫ్లవాత్మకమైన మార్పుల కారణంగా లక్షలాది మంది తెలుగువారు దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. దీనివల్ల దేశానికి విదేశీమారక ద్రవ్యం పెద్దఎత్తున వస్తోంది. రాష్ట్రంలో సైతం యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. భారత జాతికి మార్గదర్శకులుగానే కాక మిత్ర దేశాల స్నేహ సంబంధాలకు దోహద పడే సమర్ధవంతమైన భారత ప్రధాన మంత్రికాగల నేతను మీలో చూస్తున్నాం అన్నారు.[రవి కరుణ నాయకే ,మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీలంక] అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన నిలిచారు. నిరంతరం ప్రజల సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. వస్తున్నా మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించారు. ఇంటి పెద్ద సమర్ధుడైతే ఆ కుటుంబం అన్ని విధాలా ముందంజ వేస్తుంది. అలాగే సమర్థవంతమైన నాయకుడుంటే ఆ ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పట్టుదల, సేవాతత్వం వంటి లక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు. రాష్ట్ర విభజనతో తెలుగుజాతి ప్రాభవం జాతీయ స్థాయిలో తగ్గింది. మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే ప్రజలకు మొదట గుర్తుకొచ్చింది చంద్రబాబునాయుడే. ఆయన ఆలోచనలు, దార్శనికతే మనలను ఖండాంతరాలకు తీసుకెళ్లింది. దావోస్ సదస్సులకు గడ్డ కట్టే చలిలో కూడా వెళ్ళి పలువురు దేశాధినేతలను కలుసుకొంటు పెట్టుబడులు పెడతారో లేదో తెలియక పోయినా వాళ్ళకు ప్రజెంటేషన్లు ఇస్తూ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు. మీ గొప్ప మార్గదర్శక స్పూర్తికి ప్రతి సమావేశంలోనూ మరీ ముగ్దుడనౌతుంటాను అన్నారుఎస్.ఐ గూచ్ హై కమీషనర్,కెనడా. భారతదేశ రాజకీయ నాయకులేవరికి దక్కని గుర్తింపు, అంతర్జాతీయ ప్రశంసలు పొందారు చంద్రబాబు. అటువంటి గొప్ప నాయకుడిపై తప్పుడు కేసుపెట్టి ఆనందిస్తూ క్యారెక్టర్ లేని గాలి మంద గాలి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు సమర్ధత, నమ్మకంతో 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఒకవైపు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌, మరోవైపు రాజధాని లేదు. అయినా మొక్కవోని దీక్షతో బస్సులో నుంచే పాలన సాగించారు. 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటుతో పాలన మొదలుపెట్టి కేవలం 5 ఏళ్లల్లో దేశంలో ఎక్కడా అమలుకాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో దీనినొక కేసు స్టడీగా తీసుకున్నారు. నీతి ఆయోగ్ కూడా భూసమీకరణ విధానాన్ని అభినందించింది. పోలవరాన్ని రికార్డు సమయంలో 70% నిర్మించారు. పట్టిసీమ ద్వారా 40 వేల కోట్ల విలువైన పంటను కాపాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, ఫైబర్‌గ్రిడ్‌ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తన మేధస్సు, అపార అనుభవాన్ని ఉపయోగించి దేశ, దేశాలు తిరిగి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారు.  ఆంధ్రప్రదేశ్‌ను శ్రేయోదాయక అభివృద్ది దిశగా నడిపించేందుకు చంద్రబాబు తనను తాను ఆంధ్రప్రదేశ్‌కి సమర్పించుకొన్నారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన నాలుగున్నరేళ్లుగా  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై గాంధేయ మార్గంలో ఏడు పదులు దాటిన వయస్సు లోనూ  ప్రజల కోసం అలుపెరుగని  పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎన్నో సంక్షోభాలు, ఎన్నో కుట్రలు, ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న పార్టీని దెబ్బతీయడానికి అనేక పార్టీలు, వ్యక్తులు చెయ్యని ప్రయత్నం లేదు. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని ప్రగల్బాలు పలికిన వారే ఫినిష్ అయ్యారు. అక్రమ కేసు పెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు కంటున్న జగత్ కిలాడీకి  ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారు. మరొక ఆరు నెలల్లో తాడేపల్లి ఏడుపుల పల్లిగా మిగలబోతుంది. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన అవినీతి పరులు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అమృతం లభించే వరకు పాల సముద్రాన్ని మధిస్తూ వెళ్లడమే కార్యసాధకుల లక్షణం. ఆ కోవకు చెందిన వారే చంద్రబాబు నాయుడు కూడా. నిర్వరామ శ్రామికుడు అలుపెరుగని పోరాట యోదుడు, దేశం గర్వించదగిన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు,  అటువంటి నాయకుడిని ఎటువంటి ఆధారాలు చూపకుండా కక్షతో అక్రమ కేసుపెట్టి వేదిస్తున్నది జగన్ ప్రభుత్వం. అటువంటి నాయకుడుని కాపాడుకోవాల్సింది ఆంధ్రులే. మరోసారి తప్పటడుగు వేస్తే ఆంధ్రులకు అధోగతే.                                                                                    నీరుకొండ ప్రసాద్    సీనియర్ జర్నలిస్ట్

ఈ సంక్షోభంలో తెలుగుదేశం పార్టీకి ధీమా, ధైర్యం భువనేశ్వరి, బ్రాహ్మణి!

అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాల కారణంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కూడా జగన్ సర్కార్ కేసుల పేర వేధింపులకు గురి అవుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ ను ఏపీ సీఐడీ చేర్చింది. అయితే లోకేష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హై కోర్టు విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. అరెస్టు అవకాశం లేదు అన్నదే లోకేష్ కు దొరికిన ఊరట. అయితే విచారణ పేరిట లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగించేలా ఏపీ సీఐడీ వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. స్కిల్ కేసులో గత 20 రోజులుగా చంద్రబాబును, ఆ అరెస్టు కారణంగా నారా లోకేష్ ను ప్రజలతో మమేకం కాకుండా నిలువరించిన జగన్ సర్కార్.. ఇక ముందు కూడా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్రజల వద్దకు వెళ్లేందుకు అడ్డంకులు సృష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో   ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించిన, దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అవుతున్నా ఖాతరు చేయని జగన్ సర్కార్ కు వెనుక నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా జగన్  భుజం మీద నుంచి  బీజేపీ అగ్రనాయకులు మోడీ, షాలు తుపాకి గురిపెట్టారని చెబుతున్నారు. వారు వ్యూహాత్మకంగా ఒకదాని వెంట ఒకటిగా అమలు చేస్తున్న కుట్రలలో భాగంగానే చంద్రబాబు అరెస్టు జరిగిందనీ, నారా లోకేష్  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో వచ్చే కొన్ని రోజుల వరకూ చంద్రబాబు, లోకేష్ ఇరువురూ కూడా ప్రజలతో మమేకమయ్యేలా పర్యటనలు చేసే అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, అలాగే చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలను, పార్టీ శ్రేణులనూ వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు, అరెస్టుకు వ్యతిరేకంగా వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాలను జగన్ సర్కార్ పతనం దిశగా నడిపించేందుకు.. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఒక నేత అవసరం ఉందన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతున్నది. ఒకరు ముందు నిలబడితే.. తామే పార్టీని గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రహ్మణి రూపంలో పార్టీకి ముందుండి నడిపించగల నాయకత్వం లభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబు అరెస్టుతో ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోని పలు దేశాలలో కూడా నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. చంద్రబాబును నిర్బంధించి 20 రోజులు గడిచిపోయినా జనం ఆగ్రహావేశాలు ఇసుమంతైనా తగ్గలేదు సరికదా రోజు రోజుకూ ఇనుమడిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఏపీలో ఎమర్జెన్సీ స్థాయి నిర్బంధాలను కూడా లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు.   అదే సమయంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మనిలు రాజమహేంద్రవరం వేదికగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిరువురూ ఇప్పుడు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడుతున్నారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా ఇరువురూ కూడా సూటిగా, ఎటువంటి తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, మేం ఉన్నామనీ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. నేతలలో ధైర్యం నింపుతున్నారు. ఇరువురూ మాటలకే పరిమితం కాకుండా  చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇస్తున్నారు. వారు మీడియాతో  మాట్లాడిన  సందర్భాలలో కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతూ పరిణితిని చాటుకున్నారు.   ప్రధానంగా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సంక్షోభాలను అధిగమించి పార్టీని ముందుండి నడిపించగల సమర్ధ నాయకురాలిగా అందరిలోనూ విశ్వాసాన్ని కలిగించాయి.  రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన పరిణితి, నిర్భీతి, నిష్కర్షగా మాట్లాడగలిగే వాగ్ధాటి ఉన్న నేతగా అంతా బ్రాహ్మణిని గుర్తించారు.  నారా బ్రాహ్మణి  తెలుగుదేశం తరఫున ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఇదే సరైన తరుణమని పరిశీలకులు కూడా అంటున్నారు.   రాష్ష్ట్రంలో దుర్మార్గ పాలన గురించీ, జగన్ ప్రభుత్వ అరాచకత్వం గురించి ఆమె సామాజిక మాధ్యమంలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.  ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నాయకులతో ఆమె చర్చలు జరుపుతున్నారు.  జనసేనతో పొత్తు సమన్వయానికి సంబంధించి కూడా ఆమె నేతలకు, శ్రేణులకూ దిశా నిర్దేశం చేస్తున్నారు. జనసేన నేతలతోనూ చర్చిస్తున్నారు.  అదే విధంగా నారా భువనేశ్వరి ప్రసంగాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  పార్ఠీ శ్రేణుల్ని ఉద్దేశించి ఆమె ప్రసంగాలు వారిని కదిలిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ఇద్దర్నీ బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా  టీడీపీని  అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణి దిగ్విజయం దిశగా పార్టీని నడిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు ధీమా, ధైర్యం వ్యక్తం చేస్తున్నాయి.   

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో భారీ చేరికలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే కొందరు బహిరంగంగా ప్రకటించగా మరికొందరు ముహూర్తం కోసం వేచి ఉన్నారు.   కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌ చొరవతో  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో  చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక తరహా ఫార్ములాను అనుసరించాలని ఈ చర్చల సారాంశం. ఈ ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ ప్రచారంతో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మామూలే. ప్రస్తుతం అటువంటి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు.  అందరికంటే ముందే బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన కేసీఆర్ అసంతృప్తి వాదుల మీద ఫోకస్ పెట్టకపోవడంతో  కాంగ్రెస్ పార్టీకి అవకాశాలెక్కువయ్యాయి. బిఆర్ఎస్ లో రెండో శ్రేణి నేతల మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 17వతేదీన హైదరాబాద్ తుక్కుగూడ వేదికగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రజాకర్ష పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే తన కుమారుడు రాహుల్ తో ఎఐసీసీ అగ్ర నేత మల్లి ఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మల్కాజ్ గిరిలో తుక్కుగూడ తరహా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు సమాచారం. అప్పుడు బిఆర్ఎస్ లో టికెట్ రానివారితో బాటు ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అనేక సర్వేలు కూడా  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకంటున్నాయి. 

బీర్ఎస్ కు ఆంధ్రా సెటిలర్స్ దూరం.. ఇది కన్ఫర్మేనా?

జోష్ మీదున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని  ఇప్పటికే టెన్షన్ పెడుతున్నది. బీఆర్ఎస్ నేతలు పైకి గాంభీర్యంప్రదర్శిస్తున్నా రోజురోజుకీ బలోపేతం అవుతున్న కాంగ్రెస్ ఆ పార్టీని గాభరాపెడుతోంది.  నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బలంగా ఉన్నట్లు కనిపించిన బీజేపీ..  ఇప్పుడు చతికిల పడింది.  దీంతో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు గంపగుత్తగా ఆ పార్టీకే దఖలు పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటికే పార్టీ మారిన కొందరు దిగ్గజ నేతలు సొంగ గూటికి అంటే హస్తం పంచకు చేరారు.  దీంతో బీఆర్ఎస్ లో  టెన్షన్ ఒకింత తీవ్రంగానే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి కూడా బీఆర్ఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది.    గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయంలో ఓ నాలుగైదు అంశాలు కీలక పాత్ర పోషించాయి. బీజీపీ, కాంగ్రెస్ మధ్య ఓటు బ్యాంకు చీలిపోవడం, ఆంధ్రా సెటిలర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తు కలిసిరాకపోవడం, తెలంగాణ సెంటిమెంటును రగిలించడంలో కేసీఆర్ సక్సెస్ కావడం వంటివి ఆ అంశాలు అవే 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) కు అధికారాన్ని అందించి అందలం ఎక్కించాయి. అయితే ఇప్పుడు ఇందులో ఏదీ  బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ చతికిల పడింది. కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా దూసుకొచ్చింది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారడంతో సెంటిమెంటుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకుకు స్వయంగా బీఆర్ఎస్సే గండి కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ ఏపీలోని జగన్ సర్కార్  అక్రమంగా అరెస్టు చేసిన  నేపథ్యంలో  తెలుగుదేశంతో పాటు  ఏపీ నుండి అమెరికా వరకూ  ప్రతి తెలుగువాడూ తీవ్రంగా స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా నిరసనలకు దిగుతున్నారు.  ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని చంద్రబాబు సానుభూతిపరులు, అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలోని ఉద్యోగులు, ఆంధ్రా మూలాలు ఉన్న సెటిలర్లు, టీడీపీ అభిమానులు పలువురు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు.    హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు వందలాది కార్లతో ర్యాలీ, ఫెనాన్షియల్ డిస్ట్రిక్ లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయటం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై నిరసనల నేపథ్యంలో పలుచోట్ల తెలంగాణ పోలీసులు వారిని నిలువరించిన, వారిపై దౌర్జన్యం చేసిన  వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అయితే, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా ఏపీ సీఎంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం.. బాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఎందుకు నిరసనలు చేస్తారు?  కావాలంటే మీ రాష్ట్రం పోయి చేసుకోండి   అంటూ వ్యాఖ్యానించారు. తమకు చంద్ర‌బాబు కేసుకు సంబంధం ఏంట‌ని, ఇక్క‌డ ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సోషల్ మీడియాలో  ఆయన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. బాబు గురించి హైదరాబాద్ లో ఎందుకు ఆందోళన అన్న మంత్రి కేటీఆర్ కు నెటిజన్లు ఏపీలోని తాడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ  కార్యాలయం ముందు  సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. తాడేపల్లిలో  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి ధర్నాలు ఎందుకు చేసారో చెప్తారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆంధ్రా టెన్షన్ మొదలైందా అనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణలో 5 శాతం ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకు ఉంటుందని అంచనా. వీరిలో ఎక్కువ శాతం తెలుగుదేశం  సానుభూతిపరులే . అది గమనించే ఇన్నాళ్లు కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తూ వచ్చారు. కానీ  ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో  కేటీఆర్ సెటిలర్ల ఆగ్రహానికి గురయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడం, ఎల్బీ న‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా ధర్నాలో పాల్గొనడం వంటి సంఘటనలు జరిగాయి. అయినా సరే ఏపీ గొడవ ఇక్కడెందుకు అంటూ  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే  బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ప్రతికూలంగా మారాయి.  అసలే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు కేటీఆర్ వ్యాఖ్యలు గోరు చుట్టుమీద రోకటి పోటులా మారియి.  బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల వ్యతిరేకత  గట్టి ప్రభావమే చూపే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈ మౌనం.. ఏ వ్యూహం

తెలంగాణలో ఎన్నికలు ఎప్పడు? ఎంతో కాలంగా షికారులు చేస్తున్న ఈ ఊహాగానాలకు తెరపడింది. ఇంకా కొందరిలో కొన్ని అనుమానాలున్నా, సందేహాలు చాలా వరకు తొలిగి పోయాయి. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  జమిలి, మినీ జమిలి ప్రస్తావన లేకుండా ముగిసిపోవడంతో  తెలంగాణ సహా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో అసెంబ్లీ గడువు ముగుస్తున ఐదు రాష్ట్రాల్లో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న భరోసా ఏర్పడింది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఎందుకో కానీ తెలంగాణలో ఉహించినంతగా ఎన్నికల సందడి కనిపించడం లేదు.   తెలంగాణ శాసన సభ గడవు, వచ్చే సంవత్సరం, (2024)  జనవరి 1తో ముగుస్తుంది. కనుక ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త శాసన సభ కొలువు తీరాల్సివుంది. అంటే  ఈ సంవత్సరం చివర్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  మరో వంక  ఇప్పటికే  ఎన్నికల సన్నాహకాలు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహక పనులు చకచకా చక్కబెడుతోంది.  ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్ బూతుల గుర్తింపు, అధికారులు, సిబ్బంది శిక్షణ ఇత్యాది సన్నాహక క్రతువులన్నీ చాలా వరకు పూర్తయ్యాయి.  పోలీసు బదో బస్తు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటువంటి వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నగరా మోగించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.  వచ్చే నెల (అక్టోబరు) మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ లెక్కన 2018 లో జరిగినట్లే( 2018 డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది) డిసెంబర్ మెదటి లేదా  రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. అంటే ఎన్నికలకు ఇంకా నిండా  వంద రోజులు అయినా లేవు  అయినా కారణాలేమిటన్నది ఇతమిద్థంగా తెలియదు కానీ రాష్ట్రంలో  ఇంతవరకు ఎన్నికల సందడి పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా తొందరపడి ఒక కోయినా అన్నట్లుగా  ముందుగానే నాలుగు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే  అనూహ్యంగా   స్తబ్ధత కనిపిస్తోంది.  అభ్యర్థిత్వాలు ఖరారు అయిన వారు ప్రచార సన్నాహాలు ఆరంభించలేదు. అసమ్మతి గళాలు ఆగడం లేదు. అన్నిటినీ మించి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీర్  అటు జాతీయ రాజకీయ పరిణామాలపై స్పందించడం లేదు. ఇటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా అయన  మౌనం వీడటం లేదు. చివరకు, కొద్ది మంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ  టికెట్లు ఇవ్వడంతో అనేక నియోజక వర్గాల్లో అసమ్మతి భగ్గుమంటున్నది. భంగపడిన ఆశావహులు  ఆందోళనల బాట పట్టారు.  అయినా ముఖ్యమంత్రి  స్పందించడం లేదు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  అగ్ర నేత రాహుల్ గాంధీ.  బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించినా కేసీఆర్  మౌనమే నా భాష అన్నట్లుగా ఉన్నారు.  అందుకే ఇప్పడు  రాష్ట్రంలో కేసీఆర్  మౌనం వెనక వ్యూహం ఏమిటి? అన్నది చర్చనీయాంశగా మారింది. అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే, ఆ మౌనం వెనక ఏదో దాగుందని  లేదంటే కేసీఆర్ అంత సైలెంట్ గా ఉండరని అంటున్నారు.  అయితే ఆ వ్యూహం ఏమిటన్నది మాత్రం అంతుబట్టడం లేదని అంటున్నారు. 

కాంగ్రెస్ లో మళ్లీ చేరికలలొల్లి.. రేవంత్ ది ఓవరేక్షన్ అంటూ సీనియర్ల విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ  చేరికల లొల్లి మొదలైంది. పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్న వేళ.. పార్టీలో చేరికలు రాష్ట్ర పార్టీలో విభేదాలకు కారణమౌతున్నాయి. ముఖ్యంగా తెరాస హైకమాండ్ తో విభేదించి.. ఆ పార్టీకి రాజీనామా చేసి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడంతో మళ్లీ రాష్ట్ర పార్టీలో సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. మైనంపల్లి పార్టీలో చేరకముందే తనకూ, తన కుమారుడికీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నారనీ, ఆ తరువాతే ఆయన హస్తిన వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారనీ చెబుతున్నారు. ఈ విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు  ఇంత కాలం పార్టీని నమ్ముకుని సేవలందించిన వారిని కాదని, కొత్త వారిని అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనంపల్లిని స్వయంగా హస్తినకు తోడ్కొని పోయి మరీ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించిన విధానాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు.  కేవలం మూడు రోజుల వ్యవధిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడికి టికెట్ కన్ఫర్మ్ హామీనీ, పార్టీలో వారి చేరికనూ పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి తన స్థాయిని మించిన చొరవ చూపారని సీనియర్లు విమర్శలు గుప్పించారు.   రేవంత్ రెడ్డి తీరు ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కే విధంగా ఉందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి వీలుపడదు. కానీ ఇందుకు మినహాయింపుగా ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి విషయంలో కన్సిడరేషన్ ఉంటుంది. అంతే కానీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి చేరేవారికి ఆ మినహాయింపు వర్తించే అవకాశం లేదు.  అంటే ఎట్టి  పరిస్థితుల్లోనూ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రాహుల్ లలో ఒకరికి మాత్రమే టికెట్ రావలి. కానీ రేవంత్  తన పలుకుబడి ఉపయోగించి మైనంపల్లి, ఆయన కుమారుడు ఇద్దరికీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుగా టికెట్లు ఇప్పించారని సీనియర్లు అంటున్నారు.   మైనంపల్లి కుటుంబానికి మెదక్, మల్కాజిగిరి టికెట్లు కేటాయించినట్లే తమ కుటుంబాలకు చెందిన వ్యక్తులకూ ఇవ్వాలని ఢిల్లీ హైకమాండ్ పై రాష్ట్ర పార్టీ సీనియర్లు ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.   ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్ల కోసం అప్లై చేసుకున్న కీలక నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ల కుటుంబాల నుంచి రెండు టికెట్లు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. అయితే వీరి విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.  అయినా అసలు తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూపు విభేదాలకూ, అసమ్మతికి పెట్టింది పేరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించిన తొలి నాళ్లలో కాంగ్రెస్ లో విభేదాల సంస్కృతి పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ సీనియర్లంతా తమ విభేదాలను పక్కన పెట్టి రేవంత్ కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. ఓ దశలో రేవంత్ కూడా విసిగిపోయి పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే హై కమాండ్ రేవంత్ కు మద్దతుగా గట్టిగా నిలబడటం.. అదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో హస్తం హవా చూపడంతో  సీనియర్లు దిగి వచ్చారు. అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునే ఆశలు సజీవంగా ఉండటానికి కారణం పీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం అందరినీ సమన్వయ పరచుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన కృషే కారణమని చెప్పాల్సి ఉంటుంది. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి వారిని రాజకీయ పోరాటానికి సమాయత్తం చేయడంలో లోకేష్ పాత్రను ఎవరైనా సరే తక్కువ చేసి చూపే అవకాశం లేదు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని బహిరంగంగా వ్యతిరేకించినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైనా హై కమాండ్ పట్టించుకోలేదు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా అసమ్మతి రాగం ఆలపించి హైకమాండ్ పై ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సరికదా? ఒక దశలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ హై కమాండ్ వెనుకాడలేదు.  రాష్ట్రంలో అధికారం కోసం అందరూ రేవంత్ నాయకత్వంలో సమష్టిగా కృషి చేసి తీరాల్సిందేనన్న విస్పష్ట సంకేతాలను ఇచ్చింది. అంతే కాకుండా కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలన పర్యవేక్షిస్తుండటంతో ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత ప్రస్ఫేటంగా కనిపించింది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్ కప్పులో మైనంపాటి తుపాను చెలరేగింది. ఇలా పార్టీలోకి చేరి అలా రెండు టికెట్లను మైనంపాటి తన్నుకుపోవడాన్ని, అందుకు రేవంత్ దగ్గరుండి మరీ లైన్ క్లియర్ చేయడాన్నీ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తున్నది.  

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు భారీ ఊరట

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. ఈ కేసులో  లోకేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్  దాఖలు చేసిన  సంగతి విదితమే. ఈ కే సులో ఏపీ సీఐడీ లోకేష్ ను ఏ 14గా పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై శుక్రవారం (సెప్టెంబర్ 29)న ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా లోకేష్ కు 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో లోకేష్ ను అరెస్టు చేసే అవకాశం లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఈ సందర్భంగా విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు సూచించింది.  కాగా వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగానే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో తనను ఏ14గా చేర్చి, అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ లోకేష్ ముందస్తు బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారు. మంగళగిరి సీఐడీ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్కిల్ కేసులో తన తండ్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధంగానే తననూ అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేస్తామంటా సీఐడీ చీఫ్, కొందరు వైసీపీ నేతలూ బహిరంగ ప్రకటనలు చేయడాన్ని లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదనీ, సంబంధిత మంత్రిగా తాను అప్పట్లో లేననీ, ఐఆర్ఆర్ వ్యవహారంలో తానే హోదాలోనూ జోక్యం చేసుకోలేదనీ పేర్కొన్న లోకేష్ తనపై ఈ కేసులో పెట్టిన కేసు చెల్లదని పేర్కొన్నారు.   తాను యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాననీ, దానిని అడ్డుకోవడానికే అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనీ లోకేష్ పేర్కొోన్నారు.  జగన్ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం సీఐడీని పావుగా ఉపయోగించుకుంటోందన్నారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం   అంగుళం స్థలాన్ని కూడా సేకరించలేదనీ, ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదనీ లోకేష్ పేర్కొన్నారు, 

చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ కు మోడీ,షా అండ?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టుపై తెలుగురాష్ట్రాలే కాదు, యావద్దేశం నిరసనలతో అట్టుడికి పోతున్నది. న్యాయనిపుణులు సైతం ఆయన అరెస్టు అక్రమం అని చెబుతున్నా..గత 20 రోజులుగా ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. కోర్టులలో వాదనలు, వాయిదాల పర్వం కొనసాగుతోంది. మొత్తంగా కుట్రపూరితంగా చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కానీ.. చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ రెడ్డి కక్ష పూరిత వైఖరి, వేధించాలన్న పట్టుదలకు తోడు.. అంతకు మించి కుట్ర కోణం ఉందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వై రల్ అవుతున్న ఒక పోస్టును తెలుగువన్ పాఠకులు, వీక్షకుల కోసం యథాతథంగా.. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న బలమైన కారణం జగన్‌రెడ్డి ‘ప్రతీకారం’ అని మాత్రమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులుగా చలామణి అవుతున్న వారి విశ్లేషణల్లో కూడా అంతకుమించి కొత్త కోణం వెలికి రావటం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ ‘న్యాయమే’ననే వైసీపీ నాయకులు, తొత్తు మేధావులు కూడా చంద్రబాబు ఏదో అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికే ప్రయాస పడుతున్నారు. చంద్రబాబును ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా పరిమితంగా పరిగణిస్తే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఇంతకు మించి పరిణతి ప్రదర్శించలేవు. గత ఏడు దశాబ్దాల భారత చరిత్రలో, నాలుగు దశాబ్దాల  తెలుగు రాష్ట్రాల భూత, భవిష్యత్, వర్తమానాల్లో ఏ కాలంలోనూ చంద్రబాబు లేని సమాజాన్ని ఊహించడం  సాధ్యం కాదు. అటువంటి చంద్రబాబు అనే ఒక ‘వ్యవస్థ’ను కూకటివేళ్లతో శాశ్వతంగా పెకలించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఉపరితల విశ్లేషణలను పక్కనబెట్టి, రాజకీయ సామాజిక తంత్రంలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ (Inoculum Effect) ను ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో గమనిస్తే, పొంచి ఉన్న ప్రమాదాలు, చీకటి కోణాలు వెలుగు చూస్తాయి. చంద్రబాబు అరెస్ట్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల ప్రేరేపణతోనే జరిగింది అనటంలో సందేహం లేదు. ఏడు పదులు పైబడిన వయస్సులో కూడ చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, అలుపులేకుండా గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేయటం, ప్రజల్లో అంతులేని ఆదరణ పొందుతుండటం గురించి సొంత పార్టీ నేతల నుంచి, జనసేన నుంచే గాక ఇంటలిజెన్స్ ద్వారా కూడా కేంద్రానికి సమాచారం ఉంది. నిజానికి చంద్రబాబు, తెలుగుదేశం కనుమరుగైతే గాని, భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోకి అడుగు పెట్టలేదని మోదీకి, అమిత్ షాకు కూడా విస్పష్టంగా అర్థమైంది. పోనీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొంటే కేవలం కొన్ని సీట్లతో సరిపెట్టుకోవలసిందే. కానీ, ఆంధ్రలాంటి ప్రకృతి వనరులు అపారంగా ఉన్న ధనిక రాష్ట్రం నుంచి గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి వీలు ఉండదు. ఆ అవకాశం జగన్‌రెడ్డి వంటి తొత్తులు ముఖ్యమంత్రులుగా ఉంటేనే సాధ్యం. లేదా బీజేపీనే స్వయంగా రాష్ట్ర పగ్గాలు పడితే ఇక ఆకాశమే హద్దు. ఒకసారి తెలుగుదేశం స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే ఆ తరువాత వైసీపీ నుంచి రాష్ట్రానికి సులభంగా విముక్తి కలిగించవచ్చు. జగన్‌రెడ్డి కేసులు కేంద్రం చేతిలో ఉన్నంత కాలం అతడిని ఉంచటమా, పీకేయటమా అన్నది బీజేపీకి మంచి నీళ్లు తాగినంత సులువు. కాబట్టి సమస్యల్లా చంద్రబాబు, తెలుగుదేశమే.చంద్రబాబును, తెలుగుదేశాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి ఆ స్థానంలో బీజేపీ రావాలంటే పన్నాల్సిన పన్నాగాలను జగన్‌కే అప్పచెప్పింది కేంద్రం. సామాజిక సిద్ధాంతాలలో ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అనే సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం– ఏదైనా తీవ్రమైన సామాజిక చర్యకు ఒడిగట్టే ముందు అతి తక్కువ స్థాయిలో దానిని (తాము భవిష్యత్తులో చేపట్టబోయే దానిని) సూచనగా ప్రజలలోకి వదులుతారు. ప్రజల్లో వచ్చే స్పందనను జాగ్రత్తగా అంచనా వేస్తారు. ముందు ప్రజల్లో కొంత అలజడి, వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుందని గ్రహించి పోలీసులను, అవసరమైతే పారామిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచుతారు. మొదటిసారి పొంగులా వచ్చి చల్లారిన తరువాత, వెంటవెంటనే తీవ్ర చర్యలకు దిగుతారు. ప్రజలు గతంలో చేసిన ప్రతిఘటన రెండవసారి చేయలేరు. వారు క్రమంగా ఈ తీవ్ర చర్యలకు అలవాటు పడిపోతారు. అంటే మశూచి వ్యాధి రాకుండా ముందుగా ఇచ్చే వాక్సిన్ లాంటిది అన్నమాట. అందువల్ల దీనికి ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’ అని పేరు వచ్చింది. ఉదాహరణకు గుజరాత్ అల్లర్లు..  అవి అక్కడి అప్పటి ప్రభుత్వ సహకారంతోనే జరిగాయి. మోడీ తిరిగి అధికారంలోకి వచ్చారు. గుజరాత్ అల్లర్లలో ముస్లింలు దారుణ హింసకు గురైనా, ముస్లింలకు ప్రభుత్వం కావాలనే రక్షణ కల్పించకుండా దారుణాలు జరిపించినా, హిందువులు మోడీని హీరోగా భావించారు. అందుకే నేటిదాకా బీజేపీయే గుజరాత్‌ను పాలిస్తున్నది. నాడు గుజరాత్ అల్లర్లలో ఏమి జరిగిందో ప్రజలకు తెలియపర్చాలని బీబీసీ చేసిన ప్రయత్నానికి కేంద్రం ఎలా అడ్డుపడిందో తెలిస్తే గాని మనకు ఈ రాష్ట్రంలో రాబోయే రావణ కాష్టం గురించిన ఒక అంచనా, ఆలోచనా రాదు. తమకు వ్యతిరేకంగా ఏమైనా రాస్తారనిపిస్తే ఆ మీడియాని సమూలంగా నాశనం చేసి, కేసులు పెట్టి వేధించే విషయంలో మోదీకి, జగన్‌కు, కేసీఆర్‌కు తేడా ఏమీ లేదు. వీరంతా కన్నుమూసే వరకూ అధికారంలో ఉండాలని కోరుకునేవారే. అందుకు అవసరమైతే దేనికైనా సిద్ధపడతారు. వీరు అవినీతి దురంధరులు కానీ తాము ఎంతో నిజాయితీపరులమని, తమ వ్యతిరేక వర్గంలోని వారే భయంకర అవినీతిపరులని ప్రచారం చేస్తుంటారు. నెహ్రూ, గాంధీ, సోనియా అవినీతికి పాల్పడి దేశాన్ని నాశనం చేసారని మోడీప్రచారం చేస్తే, చంద్రబాబు అంత అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడని జగన్ అంటారు. గతంలో జగన్, రాజశేఖర రెడ్డి అవినీతి బాగోతాలు వెలుగుచూసినప్పుడు తొలుత నిర్ఘాంతపోయిన తెలుగు ప్రజలు అనంతరకాలంలో నిరంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తూన్నా పెద్దగా స్పందించటం మానేశారు. పైగా అందరు నాయకులు అవినీతిపరులే, వీళ్ళకోసం మనం ఎందుకు పోరాటాలు చేయాలి అని నిశ్చయించుకొంటారు. ఇలాగే  చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి నాయకులపైన నిజాయితీ లేనివారిగా ముద్ర వేస్తే వారు అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీయవచ్చు అన్నదే బీజేపీ, వైసీపీ పథకం. అందులో భాగంగానే పవన్ పైన ‘దత్తపుత్రుడు’, ‘ప్యాకేజీ పుత్రుడు’ వంటి ఆరోపణలు. ఎప్పుడైతే అవి పనిచేయట్లేదు అనే భావన కలుగుతుందో అప్పుడు ‘ఇనాక్యులమ్ ఎఫెక్ట్’లో రాజకీయ తంత్రానికి తెరలేపుతారు. ఇందులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ముందు ముందు లోకేష్‌ను అరెస్ట్ చేస్తామని, ఉగాది తరువాత తెలుగుదేశం ఉండదని బొత్స సత్యనారాయణ వంటివారు అనటం వెనకాల ఇదే సిద్ధాంతం ఉంది. అది ఆషామాషీగా అన్నది కాదు. ఉన్నత పోలీస్ అధికారులతో సహా అందరూ ఏకపక్షంగా ప్రవర్తించటానికి కారణం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వారికి అందుతున్న ఉప్పే. న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కత్తి పట్టడం తప్ప వేరే మార్గం లేదనడానికి కారణం కూడా చూచాయగా ఇందుకు సంబంధించిన కొన్ని శకునాలు ఆయనకు అర్థం కావటమే. సొంత బాబాయిని చంపించి నిర్భయంగా తిరుగుతున్నవాడిని మోడీకి దత్తపుత్రుడిగా అభివర్ణించిన విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మాటలను విస్మరించడానికి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రజలు, రాజకీయ నాయకులు భయపడటం నిష్కారణమేమీ కాదు.

షిక్కటి చిరునవ్వుల మర్మమేంటి?..ష్ గప్ చుప్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద చిరు నవ్వు చెరగదు. కానీ, ఆ చిరు నవ్వుల వెనక, ఏమి దాగుంది? అ నవ్వుల మర్మం ఏమిటి అనేది   కొద్ది మందికి తప్ప అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు  ఆయన రక్త సంబంధీకులు, బంధు వర్గమే. జగన్ చిరునవ్వుల వెనక ఎలాంటి కుట్రలు, కుయుక్తులు  పురుడు పోసుకుంటున్నాయో గుర్తించ లేమని అంటారు. అది బాబాయ్ మర్డరే, అయినా, తల్లీ చెల్లిని ఆర్థికంగా, రాజకీయంగా సైలెంట్ గా దెబ్బ తీయడమే అయినా  జగన్ రెడ్డి  తన చేతికి  మరకలు అంటకుండా నవ్వుతూనే కానిచ్చేశారని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ  రాష్ట్రంలో వీస్తున్న  చంద్రబాబు ప్రభంజనాన్ని ఎదుర్కునేందుకు జగన్ రెడ్డి మరో మారు సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే చిరునవ్వులు చిందిస్తూనే, తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షడు,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజలలో తిరగకుండా చేసేందుకు జగన్ రెడ్డి  కుట్రలకు  తెర తీశారని అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే, ఆయన్ని జైలుకే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు.  అదలా ఉంచితే ఓ వంక చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే, మరో వంక జగన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ప్యాలెస్ లో గుట్టు చప్పుడు కాకుండా, గప్ చుప్’గా తమ పొలిటికల్ అండ్ పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారని అంటున్నారు.   ముందుగా అసెంబ్లీ తంతు విషయానికి వస్తే  సమావేశాలు మొదలైన రోజునే  పొమ్మన కుండా పొగ పెట్టి తెలుగు దేశం సభ్యులను బయటకు పంపి  అడ్డు తొలగించుకున్నారు. ఇక అక్కడి నుంచి, సభ్యత, సంస్కారం, సభా మర్యాదలను పక్కన పెట్టి, చంద్రబాబు సహా సభలో లేని సమాధానం చెప్పుకునే అవకాశం లేని సభ్యులను ఉద్దేశించి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సభలో లేనివారిపై ఆరోపణలు కూడదన్న సభా నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. జగనన్న మెప్పు కోసం మంత్రి రోజా, మరి కొందరు జగన్ ను ఇద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేశారు.  జబర్దస్త్’ రోజుల నుంచీ  రోజాకు అది  అలవాటైన విద్యే అనుకోండి. సరే అది పక్కన పెడితే..   ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ రెడ్డి గప్ చుప్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగించారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఆమోదించిన జీపీఎస్‌ బిల్లులో  33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించ వచ్చనే నిబంధన వచ్చి చేరింది, అంటే, వయసుతో సంబంధం లేకుండా 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మెడ పట్టి బయటకు గెంటే విధంగా  కంపల్సరీ రిటైర్మెంట్  క్లాజును తీసుకొచ్చింది. నిజమే, సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌ పెన్షన్‌ నిబంధనలతోపాటు రివైజ్డ్‌ స్టేట్‌ పెన్షన్‌ రూల్స్‌-1980లోని 44వ నిబంధన ప్రకారం... ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు, అయితే ఇంత కాలం కేవలం కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధనను  తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంలో నానా యాగీ చేసిన జగన్ రెడ్డి ఇప్పడు గుట్టు చప్పుడు కాకుండా,  జీపీఎస్‌ బిల్లులో చేర్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన  వారం రోజుల్లో   సీపీఎస్‌  రద్దు చేస్తామని మాటిచ్చి ఇప్పడు జీపిఎస్ బిల్లు తీసుకురావడమే  ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం. అలాంటిది, అందుకు అదనంగా ఇప్పడు .. వయసుతో పనిలేకుండా ఉద్యోగుల  మెడ మీడకు  సర్వీసు కత్తిని తెచ్చారు. మరో వంక  ఎవరికీ తెలియకుండా  ఎవరికీ  చెప్ప కుండా ఛార్టర్డ్ ఫ్లైట్ లో దిగిన  వివాదస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి  జగన్ రెడ్డి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఎలాంటి అధికారిక హోదాలేని ఆయనకు... పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ ఆయనకు విందు ఏర్పాటు చేసింది. సుమారు రెండుగంటలకు పైగాన అయన ప్యాలెస్ లో  ఉన్నారు. ఏ అధికార హోదా లేని ఒక వ్యాపార వేత్తకు ప్రభుత్వం రాచ లాంఛనాలతో స్వాగతం పలకడం ఏమిటి?  ఆయనతో ఏమి చర్చించారు?  దీపం ఉండగానే  ఇల్లు చక్కపెట్టుకునే ఉద్దేశంతో అధికారంలో ఉండగానే,  ఆదానీకి మరిన్ని మేళ్ళు చేసేందుకు జగన్ రెడ్డి సిద్డమయ్యారా? అనే సందేహాలు పరిశీలకుల్లో  వ్యక్త మవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రం, దేశం మొత్తం  అదే విషయంపై దృష్టిని కేద్రీకరించిన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే  జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మింగేసే  పెద్ద స్కెచ్ ఏదో వేసినట్లే  అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. అవును  ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవ్వులు చిందించారు  కానీ  పెదవి విప్పలేదు ఒక్క మాట మాట్లాడ లేదు. అందుకే ఈ చిరు నవ్వుల  మర్మమేమీ, అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది ? అదే ఇప్పడు రాష్ట్రం ముందున్న  పెద్ద ప్రశ్న.

బటన్ నొక్కినా సొమ్ములేవీ?.. ఏపీకి ఇక జగన్ వద్దు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన కేవలం కక్ష సాధింపులకు, బటన్ నొక్కి ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చన్న భ్రమలకే పరిమితమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. అధికారాన్ని మొత్తం విపక్షాలపై కేసులు, వేధింపులకు మాత్రమే వినియోగించిన జగన్ రెడ్డి.. ఎన్నికలు ముందుకు వచ్చే సరికి బటన్ నొక్కడానికీ, ఒక వేళ నొక్కినా ఆ మేరకు లబ్ధి దారుల ఖాతాలలో జమ కావడానికి నిధులు లేక బిత్తర చూపులు చూస్తున్నారు. గతంలో బటన్ నొక్కిన పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా పూర్తిగా నగదు జమకాలేదు కానీ ఇప్పుడు మరో కొత్త బటన్ నొక్కేందుకు రెడీ అయిపోయారు. వాహనమిత్ర పేరులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో పది వేల రూపాయల చొప్పున జమ చేస్తామంటున్నారు. అయితే ఆయన బటనైతే నొక్కు తారు కానీ అందుకు సంబంధించి సొమ్ములు మాత్రం ఖాతాలలో పడేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక ఇప్పుడు తాజాగా ఆయన వాహన మిత్ర పేరుతో ఏపీలో ఆటోలు, కార్లపై  ఆధారపడే వాళ్లకు సొమ్ములు జమ చేస్తామంటున్నారు. అది కూడా రెండు లక్షల మందికి. అంటే జగన్ దృష్టిలో రాష్ట్రంలో వాహనాలు నడపడం ద్వారా జీవనోపాధి పొందేవాళ్లు రెండు లక్షల మంది మాత్రమేనా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే అదలా ఉంచితే.. వాళ్లకైనా జగన్ బటన్ నొక్కగానే సొమ్ములు వారి ఖాతాలలో జమ అవుతాయా అంటే మాత్రం ఔనన్న సమాధానం రావడం లేదు. బటన్ నొక్కుకుంటే వెళ్లడమే ముఖ్యమంత్రి పని.. అందుకు సంబంధించి సొమ్ములు జమ అవుతాయా? అయితే ఎప్పుడు అవుతాయి? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నెల కిందట జగన్ బటన్ నొక్కి పదేరం చేశానని చెప్పుకున్న  ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు ఆయా లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదు. కానీ పీజురీయింబర్స్ మెంట్ కోసం జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మాత్రం కొట్లలో ఖర్చయ్యింది. పందేరం చేయని డబ్బుల కోసం సభలెందుకు అంటారా?   మరి జగన్ మాట్లాడేందుకూ, విపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు వేదిక కావాలి కదా? అందుకు. బటన్ నొక్కే కార్యక్రమం కోసం మాత్రమే జగన్ రెడ్డి ప్యాలెస్ దాటి బయటకు వస్తారు.  తన ప్రభుత్వ పథకాలను చెప్పుకోవడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయరు. ఎందుకంటే విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  జనాలకు సొమ్ములు పందేరం చేస్తున్నామంటే కనీసం లబ్ధిదారులైనా తన సభకు వస్తారన్న ఉద్దేశంతోనే జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు మాత్రమే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు కూడా దారికి ఇరువైపులా పరదాలు కట్టుకుని.. తాను, లేదా తన పార్టీ ఎంపిక చేసిన వారు మాత్రమే సభకు హాజరయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ వేదిక ఎక్కుతారు. ఇక అక్కడ ఆయన వాగ్ధాటిని అడ్డుకునే వారెవరూ ఉండరన్న ధైర్యంతో ప్రభుత్వ కార్యక్రమం అని కూడా గుర్తించకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తారు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించేస్తారు. తన విమర్శలను కనీసం సభకు వచ్చిన వారు వింటున్నారా? బటన్ నొక్కడం అయిపోగానే.. ప్రసంగం ప్రారంభించగానే వెనుదిరిగి వెళిపోతున్నారా అన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోరు. తన ప్రసంగం తాను కొనసాగించేసి మమ అనేస్తారు. అంతే ఆయన పబ్బం గడిచిపోతుంది. మళ్లీ మరో బటన్ నొక్కుడ కార్యక్రమంలో తప్ప ఆయన బయట కనబడరు.  బటన్ నొక్కినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు జమ కాలేదు. అలాగే కాపు నేస్తం అంటూ బటన్ నొక్కారు. ఆ నిధుల విషయం కూడా అతీగతీ లేదు. అడుగుదామంటే బెదరింపులు.  ఇక అమ్మఒడికి ఆయన ఎప్పుడో బటన్ నొక్కేశారు. అందుకు సంబంధించిన సొమ్ముల కోసం అమ్మలు ఎదురు చూస్తూనే ఉన్నారు. విడతల వారీగా అప్పుడో కొంత మంది, ఇప్పుడో కొంత మంది అన్నట్లుగా నిధులు అక్కౌంట్లలో జమ అవుతున్నాయి.   ఇక వాహనమిత్రకు ఆయన బటన్ నొక్కి మాత్రం లబ్ధిదారులకు చేకూర్చే ప్రయోజనం ఏముంటుందని జనం అంటున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో  మహిళలకు అందాల్సిన చేయూత పథకం కోసం బటన్ నొక్కాల్సి ఉంది.  అది ఎప్పుడు అన్న విషయంలో స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీకి జగన్ ఎందుకు అంటూ కొత్త కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఔను జనం కూడా అదే అంటున్నారు. ఏపీకి జగన్ ఎందుకు? అవసరం లేదు అంటున్నారు.  

కాలం చెల్లిన రూ.2000 నోటు!.. ఖాతాలలో డిపాజిట్ కు ఇక ఒక్క రోజే గడువు

రెండు వేల రూపాయల నోట్ల చెలామణికి  శుక్రవారంతో గడువు ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నవంబర్ 18న రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అప్పట్లో అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పటికి చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. కొత్తగా 500 రూపాయలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టింది.  సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ఈ ఏడాది నవంబర్ 18కి ఏడేళ్లు పూర్తి అవుతుంది. అయితే పెద్ద నోట్ల రద్దు అంటూ మళ్లీ పెద్ద నోటు రెండువేల రూపాయలను ప్రవేశ పెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. రెండు వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే  రెండు వేల రూపాయల నోటు ప్రవేశ పెట్టిన లక్ష్యం నెరవేరిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి చెలామణిని రద్దు చేసింది. వాటిని ఖాతాలలో జమ చేసుకోవడానికి చివరి గడువుగా సెప్టెంబర్ 30ని నిర్ణయించింది. దీంతో ఇక శుక్రవారం (సెప్టెంబర్ 2 నుంచి రెండు వేల రూపాయల నోటకు కాలం చెల్లినట్లే.   ఇప్పటికీ ఇంకా  ఎవరి వద్దనైనా రెండు వేల రూపాయల నోటు భద్రంగా ఉండి ఉంటే దానికి తమ ఖాతాలలో జమ చేసుకోవడానికి తుది గడువుకు ఇక ఒక్క రోజే ఉందన్నమాట. ఆ తరువాత ఎంత భద్రంగా దాచుకున్నా రెండు వేల రూపాయల నోటు విలువలేని రంగుకాగితం మాత్రమే అవుతుంది.  

ఉండవల్లి..ఊసరవెల్లి!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి ఊసరవెల్లిగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఆయన జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు తెలిసిన వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రువు విమర్శించారు. స్కిల్ కేసు విచారణను సీబీఐ చేపట్టాలని కోరుతూ ఉండవల్లి హైకోర్టులో కేసు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించి జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ అక్రమ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడం జగన్ కుట్రలో భాగమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందుగా అరెస్టు చేసేసింది. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామనీ, విచారణలో బయటకు వచ్చే అవకాశాలున్నాయనీ అంటూ కోర్టుల్లో చెబుతోంది. సెక్షన్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అరెస్టు అక్రమమని విస్పష్టంగా తేలిపోతున్నదని సీఐడీ చీఫ్ ఊరూరా తిరుగుతూ మీడియా సమావేశాలలో చెబుతున్న మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.  అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించారు.  జగన్ సర్కార్ చంద్రబాబు జనంలో మమేకం అవ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో పన్నుతున్న కుట్రలకు ఉండవల్లి సహకారం అందిస్తున్నారు.  చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో విమర్శలు చేసిన ఉండవల్లి ఈ నాలుగున్నరేళ్లలో జగన్ మద్యం విధానాలపై ఒక్కసారి కూడా నోరు మెదపలేదు?  ఇసుక దోపిడీపై మాట్లాడింది లేదు.  రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఉండవల్లి మౌనం వహించారు. అయితే నిలవని కేసు విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాత్రం ఏకంగా సీబీఐ విచారణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఉండవల్లి తీరు మొదటి నుంచీ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇబ్బందులలో పడినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. తనకు మాత్రమే సాధ్యమైన అసంబద్ధ లాజిక్ తో జనాలను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా ఉంది.  సమైక్య వాదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రాష్ట్ర విభజన సమయంలో బిల్డప్ ఇచ్చిన ఉండవల్లి.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తూ వచ్చారు.   మార్గదర్శిపై పోరాటం అంటూ రచ్చ చేసే ఉ:డవల్లి జగన్ అరాచక పాలనపై ఒక్క సారి కూడా నోరెత్తలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మాట్లాడింది లేదు. ఏటువంటి ఫిర్యాదూ లేని మార్గదర్శిపై పోరాటం అనే ఉండవల్లి వేల మంది ఆరోపణలూ, ఫిర్యాదులూ చేస్తున్నా అగ్రిగోల్డ్ సమస్యపై ఎందుకు మాట్లాడరన్న ప్రశ్నకు ఆయన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు లేకుండా నోరెత్తరని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు.  ఉండవల్లికి ఒక నిశ్చితాభిప్రాయం ఉన్న దాఖలాలు లేవనీ, విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న ఆయన ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి మద్దతు దారుగా, ఏపీలో ఆయన పార్టీకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే కేసీఆర్ తో భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. ఇరువురి మధ్యా జరిగిన చర్చలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ భేటీ తరువాత ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో బీఆర్ఎస్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తన రాజకీయగురువు వైఎస్ కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకే కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన ఉండవల్లి.. విభజన వాదానికి కర్త, కర్మ, క్రియా అయిన కేసీఆర్ తో చేతులు కులిపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి మేధావి ముసుగులో జగన్ కుట్ర రాజకీయాలకు వంత పాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అమరావతిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల జపంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ విధానాలపై పల్లెత్తు మాట అనకుండా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా నమోదు చేసిన సిల్క్ కేసులొ సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే ఆయన విశ్లేషణలూ, విమర్శల వెనుక ఉన్నది జగనేనని స్పష్టమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు.