జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవీణ్ కుమార్ రెడ్డి

      చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఎ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న కొత్తకోట లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షం లో ఆయన జగన్ పార్టీలో చేరారు. విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ‘తన స్వార్ధ ప్రయోజనాల కోసం చంద్ర బాబు పార్టీని నాశనం చేశారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసినవారిని బయటకు వెళ్ళగొట్టారు’, అని ప్రవీణ్ ఈ సందర్భంగా అన్నారు. భారత దేశం లో ఏ నాయకుడు చేయలేని సంక్షేమ పధకాలను వై ఎస్ అమలు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్ర మఖ్య మంత్రి కావడానికి అందరూ కృషి చేయాలని ప్రవీణ్ కార్యకర్తలను కోరారు.   ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన కొత్తలో తంబళ్ళపల్లి లో ఆ పార్టీ ఓడిపోయిందని, తమ కుటుంబానికి టికెట్ ఇచ్చాకే ఇక్కడ ఆ పార్టీ గెలిచిందని ప్రవీణ్ గుర్తు చేశారు. ఇక తెలుగు దేశం పార్టీ కనుమరుగవుతుందని ప్రవీణ్ అన్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు అయి, జగన్ ను జైలుకు పంపారని ఆయన అన్నారు.

గుజరాత్ ఎన్నికల ప్రభావం ఎవరిపై ఎలాగ ఉంటుంది?

  ఈనెల 20వ తేదిన ఇద్దరు ప్రముఖరాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. ఒకరు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కాగా, మరొకరు భావిభారత ప్రధాని కావాలని సర్వంసిద్దం చేసుకొని ఎదురుచూస్తున్న రాహుల్ గాంధీ. ఈనెల 20వ తేదిన వెలువడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయినవి కాబోవు. వాటి ఫలితాలు డిల్లీ వరకు ప్రభావం చూపించబోతున్నాయి. ఏవిదంగా అంటే, ఈ ఎన్నికలలో నెగ్గినవారికి డిల్లీ దర్బార్ ఎర్ర తివాచి పరిచి ఆహ్వానం పలబోతుంటే, ఓడినవారికి ఆ సదవకాశం కోల్పోవచ్చును.   ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలో జరిగిన ఎన్నికలకి సారద్యం వహించిన రాహుల్ గాంధీ అక్కడ ఓటమి చవిచుసాక, ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఎన్నికలివి. అందువల్ల, ఇక్కడ గెలవడం అతనికి ఏంతో అవసరం. లేదంటే, అది అతని రాజకీయ భవిష్యత్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎంతయినా ఉన్నాయి. ఈ గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గానీ గెలిస్తే, అతనికి మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగి, కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేక కనీసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా ఆ కీర్తి అంతా ఆటోమేటిక్ గా అతని ఖాతలోనే జమ చేయబడుతుంది. అప్పుడు, అతను ‘ప్రధానమంత్రి పదవి రేసులో’ మొదటి ‘హర్డిల్’ దాటినట్లే అనుకోవచ్చును. అంతే గాక, అతను ప్రధానపదవికి ఎంట్రాన్స్ పరీక్ష పాస్ అయినట్లే అనుకోవచ్చును. గానీ, అది అతని ప్రధాన అర్హత ఎంతమాత్రం కాబోదు. ఎందుకంటే, అందరికి తెలిసిన విషయమే, అతని ప్రధానఅర్హత ‘సోనియా గాంధీ కొడుకు’ అనే హోదా వల్లవచ్చిందే తప్ప, అతని అనుభవం లేదా తెలివితేటలు వగైరాల వల్ల వచ్చినది మాత్రం కాదు. అందువల్ల, ఈ ఎన్నికలలో గెలుపు అతనికి కేవలం ఒక అదనపు అర్హతని ఇచ్చి, ప్రధానమంత్రి పదవి మరికొంత సౌకర్యంగా అందుకొనే వీలుకల్పిస్తుంది.   ఒకవేళ, ఈ ఎన్నికలలో గానీ (అతను సారద్యం వహించిన) కాంగ్రేసు పార్టీ ఓడిపోయినట్లయితే, తరువాత రాబోతున్న సాధారణ ఎన్నికల బాద్యతలు తీసుకోవడానికి అతనికి జంకు యేర్పడవచ్చను. మూడు వరుస పరాజయాలకి బాద్యతవహించిన రాహుల్ గాంధీ చేతిలో మళ్ళీ వచ్చేసాధారణ ఎన్నికల సారద్య బాద్యతలు కూడా పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.   “ఒక మారుమూల రాష్ట్రంలోనే పార్టీని గెలిపించలేక పోయినవాడు, రేపు దేశం మొత్తం మీద జరిగే ఎన్నికలలో పార్టీని ఏవిదంగా గెలిపించగలడూ?” అని గాని కాంగ్రెస్ పార్టీ నిర్మొహమాటంగా ఆలోచన చేసినట్లయితే, ఖచ్చితంగా అతనికి బాద్యతలు అప్పగించదు. ఒకవేళ, అప్పగించినట్లయితే, అది తన చరిత్రలోనే అతిపెద్ద రిస్కుకి సిద్దపడి ఇచ్చిందని భావించాల్సి ఉంటుంది.   అప్పుడు కూడా కాంగ్రెస్పార్టీ మెజార్టీ సాదించలేక చతికిలబడితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే భావిభారత ప్రధాని కావలనుకొంటున్నరాహుల్ గాంధీకి చాల ఇబ్బందికరమయిన పరిస్తితి ఏర్పడవచ్చును, గానీ, భజనపరులతో నిండిన కాంగ్రెస్ పార్టీలో అతను ప్రధానిపదవి చెప్పటడం పెద్ద అసాద్యమయిన పనిమాత్రం కాదు. సిగ్గువిడిచయినా సరే, ఆ పదవిచేపడుదామని అతను గానీ అనుకొంటే చాలు, పార్టీలో అన్నిద్వారాలు వాటంత అవే తెరుచుకుపోయి అతనికి స్వాగతం చెపుతాయి. ముందే అనుకొనట్లుగా అతని దక్షత, అనుభవం వంటివి కాక ‘సోనియాగాంధీ కుమారుడు హోదా’లోనే అది సాద్యం అవుతుంది.   ఇక, నరేంద్ర మోడీ ఈ ఎన్నికలలో విజయం సాదిస్తే, అతను గుజరాత్ లో తిరుగులేని నాయకుడిగా తనను తానూ మరోమారు నిరూపించుకోవడమే గాకుండా, బిజెపి తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా జాతీయస్థాయికి ఎదిగే అవకాశం కూడా పొందుతాడు. తద్వారా, మళ్ళీ రాహుల్ గాంధీకి మరోమారు జాతీయ స్థాయిలోకూడా సవాలుగా మారుతాడు.   అయితే, మోడీ రాష్ట్రంలో పొందుతున్న మద్దత్తు దేశవ్యాప్తంగా పొందగాలుగుతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడే ఊహించలేము. ఒక వేళ పొందితే, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ‘తానే పార్టీ, పార్టీయే తానూ’ అన్నరీతిలో సాగుతున్న అతను జాతీయస్థాయిలో కూడా అదేరీతిలో చక్రంతిప్పే ప్రయత్నం చేయవచ్చును. బిజెపి అగ్ర నాయకత్వం తన అభిజాత్యాన్ని పక్కన బెట్టి అతనికి పార్టీ పగ్గాలు అప్ప్గగించగలిగితే, అప్పుడు అతను పార్టీకి పునర్ వైభవం తెచ్చే అవకాశం కూడా ఉంది. అంతేగాకుండా, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసి, ఉత్తర దక్షిణ భారతంలో రెండుచోట్ల కూడా పార్టీకి అధికారం తెచ్చిపెట్టవచ్చును. గానీ, ఈ లెక్కలన్నీ బిజెపి వచ్చే సాదారణ ఎన్నికలో మెజారిటీ సాదించగలిగితేనే వేసినవి మాత్రమే. ఒకవేళ యన్.డి.యే. సంకీర్ణం ఏర్పాటు చేయ వలసి వస్తే, అప్పుడు లెక్కలు వేరేవిదంగా ఉండవచ్చును. యన్.డి.యే. లో అతను తనకు అనుకూలంగా ఎందరిని తిప్పుకోగాలడనే దానిపై అతని ప్రధానమంత్రి పదవి అధిష్టించే అవకాశాలు ఆదారపడి ఉంటాయి.   ఇక, నరేంద్ర మోడీ గుజరాత్ లో ఓడిపోయినా లేక గుజరాత్ లో సంకీర్ణం వచ్చినా అతని ప్రభావం కొంతమేర తగ్గవచ్చును. అతను గెలవలేకపోయినా కూడా, కాంగ్రెస్ ఒంటరిగా గెలిచే అవకాశం కూడా ఎంతమాత్రంలేనట్లు కనిపిస్తోంది కనుక, గుజరాత్ లో కేషుభాయి పటేల్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేస్తే అది విచ్చినం అయ్యేవరకు మోడీ తీవ్రంగాశ్రమించి, మళ్ళీ అధికారం కైవసం చేసుకోవచ్చును. అక్కడ అతని ఓటమి, అతనికి డిల్లీ తలుపులు మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, అతని నియంత్రత్వ ధోరణి నచ్చని వారు బిజెపిలో చాలమందే ఉన్నారు. అతను గుజరాత్లో ఓడినట్లయితే, అతను డిల్లీకి రాకుండా ఆపేందుకు అటువంటివారు విశ్వప్రయత్నం చేయక మానరు. అయినా, గుజరాత్ లో ఓడిన మోడీ, ముందు మళ్ళీ గుజరాత్ లోనే పోగోట్టుకొన్న తన అధికారాన్ని దక్కించుకోవాలని తాపత్రయపడతాడు గానీ, డిల్లీ వెళ్లాలని అనుకోడు కదా!   అందువల్ల, గుజరాత్ ఎన్నికలు అతనికి చాలా కీలకమే. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిపార్టీల మద్య యుద్ధం జరుగుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, అది నిజానికి రాహుల్ గాంధీకీ నరేంద్రమోడికీ మద్య జరుగుతున్న బీకరపోరు మాత్రమే. ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్దుల రాజకీయ భవిష్యత్ నిర్నయించే నిర్ణయాత్మకమయిన యుద్ధం గుజరాత్ ఎన్నికలు గనుక దాని ఫలితాలు వారిద్దరికీ చాల కీలకమే కానున్నాయి.

అన్నగారి ఊసులేదు..నర్సిమన్న పేరూ లేదు...

                  ఈ నెల 27 వ తేది నుండి 29 వ తేదివరకు తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో మన కిరణ్ కుమార్గారి ప్రభుత్వం, తెలుగుజాతి గర్వపడే ఇద్దరు మహానుభావులను రాజకీయ కారణాలతో పక్కకుబెట్టి విమర్శలు మూటగట్టుకొంటోంది. వారు స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు మరియు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. పరిచయమే అవసరంలేని మహనీయులు వారిరువురూ.   తెలుగుజాతి గర్వపడే మేధావి స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారయితే, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు నిలిచేరు. దేశం చాల క్లిష్టమయిన పరిస్థితుల్లో ఉన్నపుడు ప్రధానమంత్రిగా పగ్గాలుచేపట్టిన స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు, తన అపారమయిన తెలివి తేటలతో దేశాన్ని సురక్షితంగా ఆర్దిక సమస్యలనుండి గట్టెకించడమేగాకుండా, తన మైనార్టీ ప్రభుత్వాన్ని కడదాకా పడిపోనివ్వకుండా చాకచక్యంగా నడుపుతూ ఆర్దిక సంస్కరణలకు రూపుదిద్దారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన ఆయన స్వయంగా ఎన్నో రచనలు చేసారుకూడా. దాదాపు 8 బాషలపై పూర్తీ సాధికారతగల ఆయన తన గొప్పలు తానూ ఎన్నడూ చెప్పుకోనీ ఒక మౌనమునీస్వరునిగా పేరుగాంచారు. తెలుగుజాతి గర్వపడే అటువంటి పెద్దమనిషి పేరు తలుచుకోవడానికూడా నేడు కిరణ్కుమార్ ప్రభుత్వం జంకుతోంది అంటే తెలుగు ప్రజలకి అంతకంటే అవమానం ఏముంటుంది.   అదేవిదంగా తెలుగు బాషకి నిలువెత్తు స్వరూపంగా భాసిల్లిన స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదని అందరికి తెలుసు. తెలుగు బాషపై అపారమయిన మమకారం చూపించిన ఆయనకీ తెలుగు మహాసభలలో చోటు దొరకలేదు.   ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.లో తెలుగుజాతికి చెందిన అనేకమంది పేర్లు ఉన్నపటికీ, వీరిద్దరి పేర్లు లేకపోవడంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆ జీ.ఓ.కాపీలను మీడియా ముందే చించి చెత్త బుట్టలో పడవేసి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఇప్పటికయినా కొంత విజ్ఞత అలవరుచుకోవాలని కోరారు. రాజకీయాలు తెలుగుబాషని ఏవిదంగా కబలిస్తున్నాయో తెలుసుకొనేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.  

టిఆర్ఎస్, వైఎస్ లఫై బాబు ఫైర్

  కరీంనగర్ జిల్లాలో పాద యాత్ర సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు టిఆర్ఎస్ పార్టీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లఫై తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్ఎస్ ను తిరకాసు పార్టీగా అభివర్ణించిన బాబు, పనిలో పనిగా వైఎస్ ఫైన కూడా విమర్శలు చేశారు. వైఎస్, తన అల్లుడికి 1.46 లక్షల ఎకరాల భూమిని కట్టబెట్టారని బాబు విమర్శించారు.   తెలుగు దేశం పార్టీ తెలంగాణా కు వ్యతిరేకం కాదని, తాను ప్రత్యెక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని బాబు వివరించారు. ఇక ముందు కూడా తాను తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడనని బాబు స్పష్టం చేశారు.   అలాగే, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలఫై వరాల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతులకు రోజుకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని, రైతుల రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం లకు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్తికి మద్దతు ధర నాలుగు వేల రూపాయలు ఉండేటట్లు చూడాలని బాబు డిమాండ్ చేశారు.   రైతుల విషయంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు దారుణంగా ఉందని బాబు విమర్శించారు.

కొత్త పార్టీని స్థాపించే ఆలోచనే లేదు : రజనీకాంత్

       తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలంటే నిరాసక్తత వ్యక్తం చేసిన ఆయన, ఆ రంగంలో తనకు ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవని అన్నారు.   కొంత మంది రజని అభిమానులు ఇటీవల ఆయనను కలిసి తమిళ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరిన విషయం తెలిసిందే. దీని ఫై ఆయన వ్యాఖ్యానిస్తూ, తాను నేతగా పనికి రానని, తన వ్యక్తిత్వంలో నాయకుడు లేదని కుండ బద్దలు కొట్టారు.   తాను ఈ స్థాయిలో ఉండడానికి తమిళ నాడు ప్రజలే కారణమని, వారికి తానెప్పుడూ ఋణపడి ఉంటానని రజనీకాంత్ అన్నారు. మూడు రోజుల క్రితం 63 వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన, గతంలో జి.కే. మూపనర్ పార్టీకి మద్దతు పలికి, ఆ పార్టీ అధిక సీట్లు గెలవడానికి సహాయపడ్డారు.

సోనియాను ప్రశ్నించినందుకే జైలులో జగన్ ?

        వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని , కాంగ్రెస్ పభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికే తమ నేత జగన్ ను జైలులో పెట్టారని ఆయన అన్నారు.   హత్య చేసిన ఖైదీకి కూడా ఆరు నెలలు అవ్వగానే బెయిల్ ఇస్తారని, ఏ తప్పూ చేయని జగన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదని అంబటి అన్నారు. జగన్ జైలులో అడుగు పెట్టి రెండు వందల రోజులు పూర్తయిన కారణంగా శ్రీకాకుళం లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కుమ్మక్కు అయి, జగన్ ను జైలులో అంబటి ఆరోపించారు. కాంగ్రెస్ దిగజారుడు కార్యక్రమాలకు ఇది నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు. జగన్ ను అక్రమంగా జైలులో పెట్టారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అంబటి అన్నారు.   కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయని మంత్రి ఎవరున్నారని అంబటి ప్రశ్నించారు. మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అని ఆయన అన్నారు. జగన్ త్వరలోనే బయటకు వస్తాడని, ప్రజల కష్టాలు తీరుస్తారని అంబటి అన్నారు.

‘గ్రేటర్’ లో పాగా కు జగన్ ప్రయత్నాలు ?

      వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో సాధ్యమైనంత ఎక్కువ మంది కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.   దాదాపు 20 మంది కార్పోరేటర్లు జగన్ గూటిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నిన్న జైలులో జగన్ మోహన్ రెడ్డి ని కలిసారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ నుండి అంబర్ పేట్ శాసనసభ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.   ప్రస్తుతం ‘గ్రేటర్’ లో జగన్ పార్టీకి ఐదుగురు అసోసియేట్ సభ్యులు ఉన్నారు. నలుగు కాంగ్రెస్ కార్పోరేటర్లు, ఒక తెలుగు దేశం కార్పోరేటర్ జగన్ పార్టీలో చేరారు. మరో 20 మంది కార్పొరేటర్లను జగన్ పార్టీలోకి తెచ్చేందుకు వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   నగరంలో ఎదిగే కార్యక్రమంలో మొదటి దశగా కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

‘తెలంగాణా’ ఫై తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీనే

            ప్రత్యేక తెలంగాణా విషయంలో మొదటగా నిర్ణయం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనేనని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు వివరించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ముందుగా ఈ విషయంలో అభిప్రాయం చెప్పాల్సింది ఆ పార్టీనేనని బాబు అన్నారు.   కాంగ్రెస్ మొదట తన నిర్ణయం చెపితే, తాము అప్పటికప్పుడే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరో రోజు తన పాద యాత్ర చేస్తూ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలు నుండే తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారని చంద్ర బాబు ఆరోపించారు. తెలంగాణా విషయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేనని తేల్చాలని బాబు వ్యాఖ్యానించారు.   తెలంగాణా ఇవ్వకుండా తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ తమ నిర్ణయం చెప్పకుండా ప్రతిపక్ష పార్టీ నిర్ణయం చెప్పాలనడం ఎంత వరకూ సబబని బాబు అన్నారు. ఒకరు, ఇద్దరు ఉన్న పార్టీలు కూడా పత్రికలూ, చానళ్ళు పెడుతున్నాయని బాబు అన్నారు.

పురంధేశ్వరి వెనుక ఉన్న శకుని ఎవరు ?

    కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చంద్రబాబును విమర్శిస్తూ లేఖ రాయడం వెనుక ఓ మాజీ ఎంపీ ఉన్నాడని సమాచారం. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ శకుని మాటలు విని మోసపోవద్దని పురంధేశ్వరికి సలహా ఇచ్చారు. అసలు ఆ శకుని ఎవరని టీడీపీలో అంతా ఆరాతీస్తున్నారు. దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న ఓ మాజీ ఎంపీ ఈ లేఖ రాసేందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఈయన టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఇష్టం లేకపోయినా ఆయనకు పదవి ఇచ్చారని సమాచారం. ఆయన ఎంపీ అయ్యాక దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, హరికృష్ణ లకు సన్నిహితంగా మారినట్లు తెలుస్తోంది. కొంతకాలం తరువాత చంద్రబాబుకు వ్యతిరేకంగా మారి హరికృష్ణ తరపున కూడా ఈయనే సలహాదారుగా మారి లేఖలు రాసేవాడని తెలుస్తోంది. తాజాగా పురంధేశ్వరి తరపున ఇలాగే లేఖ రాయించి నందమూరి కుటుంబంలో తాజా చిచ్చు పెట్టాడని తెలుస్తోంది. ఈ లేఖ కారణంగా బాలకృష్ణ ఒకవైపు ఉంటే మిగిలిన నందమూరి వారసులు అంతా దాదాపు పురంధేశ్వరికే మద్దతుగా మాట్లాడుతున్నారు. హరికృష్ణ, జయకృష్ణలు బహిరంగంగానే ఈ విషయం తేల్చిచెప్పగా మిగిలిన వారు మౌనంగా ఉన్నారు.

సాహసోపేతంగా బాబు యాత్ర

          చంద్ర బాబు నాయుడు తన పాద యాత్ర ను ఎంతో సాహసోపేతంగా చేస్తున్నారు. కాళ్ళ ఫై బొబ్బలను, పెరుతున్న షుగర్ స్థాయిని కూడా పట్టించుకోకుండా బాబు యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో ఓ చిట్టడవి లో బాబు గత రాత్రంతా బస చేశారు.   ఈ జిల్లాలోని ఖానాపూర్ మండలం ఎక్బల్ పూర్ లో ఓ చిట్టడవికి కేవలం 15 కిలో మీటర్ల దూరంలో, జనావాసాలకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో వేసిన గుడారాల్లో బాబు ఓ రాత్రంతా బస చేశారు. ఈ ప్రాంతంలో నీరు తాగేందుకు అప్పుడప్పుడూ ఓ చిరుత వస్తుందని స్థానిక నాయకులు బాబుకు తెలిపినప్పటికీ, ఆయన ఎంతో సాహసోపేతంగా ఈ రాత్రిని అక్కడే ముగించారు. ఆ పులి ఈ మధ్య కాలంలో రెండు మేకలను, ఒక అవును చంపిందని స్థానికులు అంటున్నారు.   వీటితో పాటు, ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం, గతంలో ఓ సారి నక్సల్స్ తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాబు ఫై దాడి చేసి ఉండటంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.   ఏది ఎలా ఉన్నా, బాబు తన యాత్రను కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదేమో ?

మంత్రిని కాదంటున్న మంత్రివర్యులు జీతం మాత్రం...

  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమని గర్వంగా చెప్పుకొనే మనదేశంలో ‘ప్రజాస్వామ్యం పులిహోరలో కరివేపాకు వంటిదని’ మననేతలు తమ చేతలతో నిత్యం మనకి తెలియజేస్తూనే ఉంటారు. ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రతినిధి పదవీప్రమాణం చేస్తూ తనబాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రజలకి రాజ్యాoగం సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఒట్టేసి మరీ చెప్తాడు. గానీ, ఆచరణలో మాత్రం అందుకు పూర్తీ విరుద్దంగా వ్యవహరిస్తాడు.   తమ బాధ్యతలను విడిచి ‘తెలంగాణా ఉద్యమం’ అంటూ తిరుగుతున్న అనేకమంది మంత్రులతో బాటు, ‘రోడ్లు మరియు భవనాల శాఖామాత్యులు’ ధర్మానప్రసాదరావు గారి గురించికూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు. సి.బి.ఐ. ఛార్జ్ షీట్ లో తనపేరు జేర్చినందున అలిగిన అయన తన మంత్రిపదవికి రాజీనామా చేయడం, దానిని మన ముఖ్యమంత్రి తిరస్కరించడం మొదలయిన కధంతా మన౦ చూస్తూనే ఉన్నాము. ఏమయినప్పటికీ తాను మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించబోనని ఖరాకండిగా చెప్పడమేగాక ఇంతవరకు ఆయన తన కార్యాలయం మొహం చూడలేదు. అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ల పరిష్కార బాద్యత తన అధికారులకే వదిలివేశారు. అలాగని, ప్రభుత్వం ఆయన కిచ్చే జీతబత్యాలు చెల్లించడం ఆపేయనూలేదు, మంత్రిగా ఆయన ప్రోటోకాల్ ను నిలిపివేయను లేదు. వాటన్నిటినీ స్వీకరించడానికి ఆయనకి ఏ అభ్యంతరము లేనప్పుడు, మరి బాద్యతలు నిర్వర్తించడానికి ఎందుకు అభ్యంతరమో ఆయనే మరి చెప్పాలి.   నిన్న, విశాఖలో జరిగిన మంత్రుల మీటింగుకి హాజరయిన ఆయనని పత్రికలవారు “మీరు ఏ హోదాతో ఈ సభలో పాల్గొంటున్నారు?” అని నేరుగా అడిగినప్పుడు అయన కొంతతడబడుతూ “నేను మంత్రిగా ఇక్కడికి రాలేదు. కేవలం ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చెను. నా అనుభవాలను నా సహచరులతో పంచుకోవాలని మాత్రమె వచ్చెను. ప్రభుత్వం నా రాజినామని ఆమోదిన్చకపోయినప్పటికీ, నేను ఇప్పటికీ దానికే కట్టుబడివున్నాను. అయినప్పటికీ, ప్రభుత్వం నా ప్రోటోకాల్ ను మాత్రం రద్దు చేయలేదు.” అని ఆయనే స్పష్టం చేసారు.   పని చేయకపోయినా జీత బత్యాలు తీసుకొంటూ, ప్రభుత్వం అందించే సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రోటోకాల్ మర్యాదలు కూడా స్వీకరిస్తూ కూర్చొనే మంత్రివర్యులకి నాడు తానూ చేసిన ‘పదవి ప్రమాణాలు’ ఇప్పుడు గుర్తుకు లేవా? లేక అదొక ‘రొటీన్ తంతు’ మాత్రమె అని అయన భావిస్తున్నారా? ఒక సామాన్య ప్రభుత్వ గుమస్తా ఒక్కరోజు సెలవు పెడితేనే లెక్కలు అడిగి జీతం కోసేసుకొనే ప్రభుత్వం, మంత్రివర్యులు ‘నేను అసలు పనేచేయను పో!’ అంటున్నాకూడా అతనికి ప్రజాధనం అప్పనంగా ఎందుకు దారపోస్తోంది? ప్రజలు చెమటోడ్చి సంపాదించుకొంటున్న సొమ్మును రకరకాల పన్నులతో వారి గొళ్ళూడగొట్టి మరీ వసూలుచేస్తున్న ప్రభుత్వం, మరి ఇటువంటి బాద్యత స్వీకరించని మంత్రులకు ఎందుకు దానిని ఊరకనే ధారపోస్తోంది. ప్రస్తుతం, ప్రభుత్వంలో లెక్క జూస్తే ఇటువంటి పనిచేయని మంత్రులు, శాసన సభ్యులు మొదలయినవారు చాలా మందే లెక్క తేలుతారు.   కొందరు ‘ఉద్యమాల పేరు చెప్పుకొని’ బాద్యతలు ఎగ్గొట్టి తిరుగుతుంటే, మరి కొందరు ఇలాగ వేరే కారణాలు చెప్పుతూ తప్పించుకొంటారు. బాద్యతలు చేప్పటడం అసలు తనకు ఇష్టం లేదని ఆయన అంత స్పష్టంగా చెప్పిన తరువాతకూడా ఆయనని మంత్రివర్గంలో మంత్రిగా ఎందుకు కొనసాగించవలసి వస్తోంది? ఆ పని చేయగల మొనగాడు మరొకడు లేడనా? లేక అతనిని తొలగిస్తే ప్రభుత్వానికి చెప్పలేని చిక్కులేమయినా ఏర్పడతాయని బయపడుతోందా? ఇటువంటివన్నీ చూస్తుంటే విదేశీయులు మన దేశం గురించి నిత్యo చెప్పుకొనే ఒక మాట గుర్తుకు వస్తుంది ఎవరికయినా. ఇట్ హ్యపన్స్ ‘ఓన్లీ’ ఇన్ ఇండియా!

లోకేష్ వర్సెస్ జగన్: వారసత్వపు పోటీ

            రాష్ట్రంలో నేడు ఓ చిరస్మరణీయ వారసత్వపు పోటీ జరుగుతోంది.   నాడు చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర రెడ్డి లు ఇద్దరు దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవులను చేపట్టారు. తమ పార్టీల్లో అధ్యక్ష పదవులను కూడా వారు చేపట్టారు. రాజేకీయాల్లో సమ ఉజ్జీలుగా కూడా నిలిచారు. ప్రస్తుతం వారి వారసులు లోకేష్, జగన్ ల మధ్య కూడా అదే రకపు పోటీ జరగనుందా అనే విషయంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడానికి ఈ యువ నేతలు పావులు కదుపుతున్నారు.   తరాలు మారినా, రాజకీయ పరిణామాలు మాత్రం పునరావృతం అవుతాయని అనడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా మిగిలిపోనుందా ? ఒక వైపు జగన్ సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తుండగా, మరో వైపు లోకేష్ వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఆయన జగన్ ఫై చేసిన ఆరోపణలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వై ఎస్, బాబు ల మధ్య సాగిన రాజకీయ తరహా పోటీ ప్రస్తుతం వారి కుమారుల మధ్య కూడా సాగుతుందా అనేదానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

అబ్బ నీ వాల్-మార్ట్ దెబ్బ..యెంత సమ్మగా ఉంది రోయ్య్...దెబ్బా

    నిన్న మొన్నటి వరకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ యఫ్.డి.ఐ. బిల్లు పాస్ చేయించుకోవడానికి పడరానిపాట్లు పడింది. తిమ్మిని బమ్మిచేసి మొత్తం మీద ఎలాగో ఆ గండం గట్టెక్కి ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకోనేలోగానే, జాలిలేని విపక్షాలు ఎక్కడో అమెరికాలో వాల్-మార్ట్ అనే కంపెనీవాళ్ళు తమ ప్రభుత్వానికి సమర్పించుకొన్న ‘కంపెనీ ఆడిట్ కాపీలు’ చేతబట్టుకొచ్చి మళ్ళీ సభలో రభస ఆరంబించేసారు. యఫ్.డి.ఐ. బిల్లు దెబ్బకి ఇంకా కోలుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ విపక్షాలు తెచ్చి పెట్టిన ఈకొత్త గొడవకి తల పట్టుకోవలసి వచ్చింది. వాల్-మార్ట్ కూడా బహుళజాతి సంస్తేకావడం, అదికూడా యఫ్.డి.ఐ. సీరియల్ లో బ్రేక్ తరువాత మొదలయిన ఎపిసోడ్ లా కంటిన్యూ అయిపోవడం, మళ్ళీ అదికూడా ఒకవైపు గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న ఈ కీలకతరుణంలోనే మొదలవడం కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించింది.   “ఈ కుంభకోణాలకి ఇంక అంతే ఉండదా?” అని తానే నివ్వెరపోయేలా ఒకదాని వెనుక ఒకటిగా బయటపడుతున్న ఈ వరుస భాగోతాలనుచూసి కాంగ్రెస్ ఏం చేయాలో, వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక తల పట్టుకొంది. అయినా, తన పాత అలవాటు ప్రకారం ముందుగా విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. వాల్-మార్ట్ ఇటీవల అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన తన ఆడిట్ నివేదికలలో తమ కంపెనీ ఇండియాలో పాగా వేసేందుకు 2008 నుండి ప్రయత్నాలు ఆరంబించినట్లు, అప్పటినుండి 2012 వరకు మొత్తం రూ.120 కోట్లు లాబీయింగ్ (మన బాషలో సంబందిత అధికారులకు లంచాలు మేపడం)కోసం ఖర్చుచేసినట్లు తెలియజేసి ఇక్కడ అగ్గిరాజేసింది. అంతే గాకుండా కేవలం 2012 సం. లోనే 18 కోట్ల రూపాయలు ‘లాబీయింగ్’ కోసం భారత్ దేశంలో ఖర్చుచేసినట్లు కూడా సవివరంగా తమ ప్రభుత్వానికి తెలియజేసింది.   అంతే! తుంటిమీద కొడితే మూతిపళ్ళు రాలినట్లు, అమెరికాలో ఆ కంపెనీ సమర్పించుకొన్న ఆడిట్ వివరాలు ఇక్కడ మన పార్లమెంటులో మంటలు రేపాయి. విపక్షాలు పార్లమెంటు కమిటీ వేసి వాల్-మార్ట్ ముడుపుల కేసులో ఎవరెవరు ఎంత బొక్కేసేరో తెలియజేయాలని సభని స్తంబింపజేసాయి. అయితే, చేసిన తప్పుని ఒప్పుకొనే అలవాటు బొత్తిగా లేని కాంగ్రెస్ పార్టీ, యదా విధిగా నోరున్న తన సభ్యులద్వారా విపక్షాల నోళ్ళు నొక్కేయాలని చూసింది. ‘ఈ రోజుల్లో లాబీయింగ్ (లంచాలు) అనేవి చాల మామూలు విషయమే. ప్రపంచంలో అన్ని వ్యాపార సంస్తలు చేస్తున్నావే వాల్-మార్ట్ కూడా భారత్ లో అదేపని చేసింది,” అని వాల్-మార్ట్ మీద ఈగ వాలనీయకుండా చూడాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసింది పార్లమెంటులో. గానీ, విపక్షాల నోళ్లు మాత్రం మూయించలేకపోయింది.   ఇది ఇలా ఉంటె, మరో వైపు అక్కడ గుజరాత్ లో సరిగ్గా ఇప్పుడే ఎన్నికలు ముంచుకొచ్చేయి. పైగా, హైటెక్-నరేంద్రమోడీ తను అసలు ఏ సభలకి రాకపోయినా వచ్చినట్లు ప్రజలని బ్రమింపజేయగల తన సరికొత్త టెక్నాలజీ ‘హలో గ్రాం’ ప్రయోగంతో జనాన్ని అక్కట్టుకొంటూ, ఇక్కడ డిల్లీసభలో సూదిపడిన వెంటనే ఆ ‘సౌండ్’ గుజరాత్ లో తనకి అనుకూలంగా మారుమ్రోగెలా ఉదృతంగా తన ఎన్నికల ప్రచారంలో వాడేసుకొంటునాడు.   ఇప్పటికే, మానసికంగా ఓటమికి సిద్దం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు సభలో చేసే ఈ గొడవంతాకూడా ఆ హైటెక్-మోడీ తన కనువుగా ఎక్కడ మార్చేసుకొంటాడో అనే బెంగతో ఒక్కసారిగా మాట మర్చి, “నిజమే! వాల్-మార్ట్ ఇటువంటి లాబీయింగ్ (లంచగొండి వ్యహారాలు) మనదేశంలో కూడా మొదలు పెట్టడం మాకు కూడా చాలభాద కలిగించింది. అందుకే పదవి విరమణ చేసిన ఒక జడ్జితో ఒక కమిటీ నియమించి ఈ విషయంలో విచారణ చేయిస్తాము. ఈ విషయంలో నేరస్తులయిన వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా మేము ఉపేక్షించబోము,” అని కొన్ని పడికట్టు పదాలతో సభాముఖంగా నిన్న ప్రకటించింది.   ఆ ప్రకటన తో ఓటేయడానికి వెళ్ళబోతున్న గుజరాత్ ప్రజలు అందరూ తన బుట్టలో పడిపోతారని కాంగ్రెస్ పార్టీ ప్రగడ విశ్వాసం. ముందు వాల్-మార్ట్ ని వెనకేసుకొని వచ్చి తరువాత మాట మర్చి కమిటీ వేయడం మాత్రం ప్రజలు గమనించి ఉండరని కాంగ్రెస్ అనుకోవడం పిల్లి పాలు త్రాగుతూ కళ్ళు మూసుకొని తనని ఎవరూ గమనించలేదనుకోన్నట్లు ఉంది.   దేశంలో అడుగు పెడుతూనే “అబ్బ నీ వాల్-మార్ట్ దెబ్బ..యెంత సమ్మగా ఉంది రోయ్య్...దెబ్బా’ అని కాంగ్రెస్ చేత పాడించగలిగిందంటే రేపు ప్రజల చేత ఇంకెన్ని ఇటువంటి పాటలు పాడిస్తుందో కదా!

గుడి స్థలాన్ని మింగేసిన కాంగ్రెస్ ఎంఎల్ఏ !

          ఎలమంచిలి కాంగ్రెస్ ఎంఎల్ఏ రమణమూర్తి రాజు అలియస్ కన్నా బాబు భూకబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. ఇటీవల సీతమ్మధారలో ఆయన నిర్మించిన అత్యంత విలాసవంతమయిన భవనంలోని సగం భూమి సింహాచలం దేవస్థానానికి చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.   ఆయన ఆక్రమించిన భూమి విలువ సుమారు ఆరు కోట్లకు ఫైగానే ఉంటుందని సమాచారం. ఈ నాయకుడు భూమి కబ్జాకు పాల్పడ్డాడని జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో దీనిఫై సమగ్ర విచారణ చేపట్టాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిఫై ఆ శాఖ అధికారి నర్సింగరావు దర్యాప్తు చేయడంతో ఎంఎల్ఏ ఘనకార్యం రుజువైంది.   మరోవైపు కన్నా బాబు కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణఫై ఏసిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనేక క్రిమినల్ కేసులు కూడా కన్నా బాబు ఫై ఉన్నాయి.

తూచ్! మేము సిలిండర్లు ఇస్తామని అనలేదు.

  పుట్టుకతో వచ్చినబుద్ది పిడకలతోగాని పోదంటారు పెద్దలు. ఎలెక్షన్ కమీషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పుట్టుకతోవచ్చిన అలవాట్లను అంత తొందరగా వదులుకోలేక పోతోంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి నగదు బదిలీ పధకం, నిన్నటి సబ్సీడీ గ్యాస్ సిలండర్ల పెంపు ప్రకటనలు ఆ కోవలోకే వస్తాయి. దేశాన్ని ప్రగతిపదంలో నడిపించగలిగిననాడు, ఏ పార్టీకూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయనవసరంలేదు. తన పరిపాలన మీద తనకే నమ్మకం లేనప్పుడు మాత్రమె ఇటువంటివి అవసరమవుతాయి. మోడీ తన రాష్ట్రాన్ని అబివృద్దిపదంలో తీసుకు వెళుతుండబట్టే, ఆత్మ విశ్వాసంతో ముందుకుసాగుతూ ఒంటరి పోరుచేస్తున్నాడు. గానీ, 125 సం. చరిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రంవచ్చిననాటి నుండి దేశాన్ని పరిపాలిస్తునే ఉన్నపటికీ, అది దేశాన్ని ఉద్దరించింది ఏమి లేదు. సాధించిన ప్రగతి లేదు. అందుకే, ప్రజలను ఎప్పటికప్పుడు సరికొత్త నినాదాలతో, తాయిలాలతో మభ్యపెట్టి వోట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయిన, కేవలం ఇటువంటి వాటికి ప్రజలు, అందునా వ్యాపార వేత్తలుగారాణించే గుజరాతీలు పడిపోతారని అనుకోవడం కాంగ్రెస్ తెలివితక్కువతనానికికి అద్దం పడుతోంది. మళ్ళీ ఎలక్షన్ కమీషన్ చేత మొట్టికాయలు వేయించుకొన్న తరువాత కాంగ్రెస్ ప్రతినిది వయలార్ రవి ‘తూచ్! మేము సిలండర్లు ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పలేదు. కేవలం ఆ విషయం పరిశీలిస్తునామనే చెప్పాము. అది కేవలం ప్రతిపాదన మాత్రమె! అని గడుసుగా జవాబిచ్చి ఎలక్షన్ కమీషన్ ఆగ్రహానికి మరో మారు గురయ్యారు.

రాహుల్ కి మోడీ చురకలు

  గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ రధసారధిగా వెనుక సీటులో కూర్చొని సారద్యం చేస్తున్న రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ‘ప్రచారం చేయడానికి ఎందుకు రావడం లేదు’ అని సవాల్ విసిరే వరకు గుజరాత్ వైపు తొంగి చూడలేదు. బహుశః ఓటమి ఖాయమని తెలిసీ వెళ్లిపరువు తీసుకోవడం కన్నాఎన్నికలకి దూరంగాఉండి తనచేతికి మట్టిఅంటకుండా ముందు జాగ్రత్త పడుదామనుకుంటే, మోడీ సవాల్తో తప్పనిసరిగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచ్రారంలో పాల్గొనేందుకు గుజరాత్లో అడుగు పెట్టవలసి వచ్చింది రాహుల్ గాంధీకి. ప్రచారం ముగియబోయే ఆఖరిరోజున గుజరాత్లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ మోడీని ఆయన ప్రభుత్వాన్ని నోరార విమర్శించిన తరువాత, తానూ, తన పార్టీ మహాత్ముని అడుగుజాడలలోనడుస్తున్నామని ముగించి, మోడికి ఒక కొత్త అస్త్రం అందిచేడు. చురకలు వేయడంలో దిట్టగా పేరొందిన నరేంద్రమోడీ అయాచితితంగా దొరికిన ఈ అస్త్రాన్ని మళ్ళీ కాంగ్రేసు మీదకే సందిన్చేడు. “మహాత్ముని అడుగుజాడలలో నడిచేపార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని గొప్పలు చెప్పుకొనే మీరు, యఫ్.డి.ఐ.లను బలవంతంగా పార్లమెంట్ చేత ఆమోదింపజేసుకొని మరీ దేశంలోకి విదేశీయుల మార్గం సుగమం చేసేందుకు ఎందుకు అంతగా కష్టపడ్డారు పాపం. ఆనాడు గాంధీగారు విదేశీయులని దేసంలోంచి వేల్లగోట్టేందుకు స్వరాజ్యోద్యమం చేస్తే, ఈనాడు కాంగ్రెస్ విదేశీఉద్యమం చేస్తోందెందుకు? దేశానికి స్వతంత్రం రాగానే కాంగ్రేసుని రద్దు చేయమని మహాత్మా గాంధీగారు గట్టిగా చెప్పినా మీ పార్టీ ఇంకా ఎందుకు నడిపిస్తున్నారు? అంటూ ఎదురు దాడి చేసి రాహుల్ గాంధీకి సుతిమెత్తగా చురకలు అన్టించేడు నరేంద్ర మోడీ.

కొత్త బంగారులోకం కోసం కలలు కంటున్న కే.సి.ఆర్.

  తే.రా.స. అద్యక్షుడు కే.చంద్రశేకర్రావు ప్రసంగాలు వింటుంటే ఆయన తెలంగాణా రాష్ట్రంలో తనకి మరే ఇతర పార్టీపోటీ ఉండకూడదనే దోరణిలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణాలో పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిలలను ఉద్దేశించి అయన చేసిన ప్రసంగంలో సీమాంద్రులయిన వారిపార్టీలను తెలంగాణాలో బోయకాట్ చేయవలసి ఉందని చెప్పడం ద్వారా తెలంగాణాలో మరే ఇతర పార్టీ ఉండకూడదనే తన విపరీతఆలోచనను అయన ప్రసంగం ద్వారా బయటపెట్టుకొన్నారు. గానీ, అయన ఒకప్పుడు అదే పార్టీను సీమంద్ర పార్టీయని తెలిసికూడా ఎన్నికలలో పొత్తులుపెట్టుకొని ఆ నాయకులతో భుజంభుజం కలిపి రాసుకు తిరిగిన సంగతి మరిచిపోవడం చాల విడ్డూరం. అప్పుడు తప్పుగా కనిపించని పార్టీ ఇప్పుడు హట్టాతుగా తప్పుడు పార్టీలెలాయిపోయాయి ఆయనకి? అప్పుడు ఇదేపార్టీలో(తెలుగుదేశం) పనిచేసిన ఆయనకి తమ తెలంగాణా నీళ్ళని దొంగతనంగా ఎత్తుకుపోయిందని అప్పుడు తెలియదా, లేక తరువాత కాలంలో ఏర్పరుచుకొన్న ఎన్నికల పొత్తులరీత్యా చెప్పడం తనకి నష్టం కలుగుతుందని ఆ విషయాన్నీ అప్పుడు లేవననెత్తకుండా ఊరుకోన్నారా? ఆయనే చెప్పాలి.   ‘సీమాంద్రముద్ర’ వేసి బలంగా ఉన్న ఆ రెండు పార్టీలను బయటకి పంపగలిగితే, ఇక బలహీనమయిన కాంగ్రేసుగానీ, బి.జే.పి.గాని తనకు అడ్డుకాబోవని అయన లెక్క జూసుకొని ఈ విదంగా ప్రయత్నిస్తున్నారా? అయినా, ఇప్పుడు తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి తన పూర్తీ మద్దతు ప్రకటించడానికి సిద్దంగాఉన్న ఈతరుణంలో దానిని బయటకి తరమాలని ఆయన పదే పదే ఎందుకు కోరుకొంటున్నారు? ఆ పార్టీలు తెలంగాణాలో తన ప్రాభల్యాన్ని తగ్గిస్తాయని అయన బయపడుతూ ఆ విధంగా జనాన్ని రెచ్చ గోడుతున్నారా?   తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం మరియు ఇతర పార్టీలు కూడా తమ తెలంగాణా శాఖలను ఆరంబించి, వాటిని స్తానిక నేతలోతోనే కదా నడిపించాల్సి ఉంటుంది. ఆ శాఖలు ఉభయరాష్ట్రాల ఉమ్మడిపార్టీ నాయకత్వంలో పని చేయవలసిఉన్నపటికీ, తెలంగాణా సంబందించినంతనవరకు అవి అక్కడి ప్రయోజనాలకే పనిచేయవలసి ఉంటుంది కదా? అటువంటప్పుడు, ఇప్పుడు ‘సీమంద్ర’ ముద్ర వేసి పార్టీలను బయటకి పంపండని ఆయన పిలుపునివ్వడంలో ఔచిత్యం ఏమిటి?   ఇప్పటికే ఆయన పలుసభలు, సమావేశాలలో తానూ ఏ ఫైల్స్ మీద తొలిసంతకం పెట్టబోతున్నారో సెలవిచ్చేరు. అంతేగాక, మొన్న జరిగిన ఒక సభలో తాము పక్కనున్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి, కొంత మంది నిపుణులను పంపి అక్కడి విద్యుత్ కొనుగోలుకు అప్పుడే ప్రయత్నాలు ఆరంభించినట్లు కూడా తెలియజేసారు. అంటే, తనకు తానే అయన తెలంగాణా రాజ్యదికారం కట్టబెట్టేసుకొన్నట్లు అనుకోవాలి. ఇది ఎలా ఉందంటే ‘ఆలులేదు... చూలులేదు.. అల్లుడి పేరు..సోమలింగం’ అన్నరీతిలో ఉంది. రాష్ట్రం ఇంకా ఏర్పడనేలేదు. ఎన్నికలు జరగనూ లేదు. అయినా అప్పుడే అయన తానూ ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలుగంటూ, అదే స్తాయిలో ప్రజలకి వాగ్దానాలు కురిపిస్తున్నారు. తానూ అదే దారిలో పయనిస్తున్నందుకు ఋజువుగా రాబోయే ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకి తమ పార్టీ పోటీ చేయబోతోందని ప్రకటన కూడా చేసేసారు అప్పుడే. అంతే గాకుండా స్వామి గౌడ్ వంటి ఉద్యమంలో తనకి బాసటగా నిలిచినా నేతలకి ఏ ఏ మంత్రి పదవులీయనున్నారో కూడా ప్రకటించేసారు. మరి, తెలంగాణా ఏర్పడితే తోలి ముఖ్య మంత్రిగా ఒక దళితుడనే చేస్తామనే ఆయన మాట సంగతి ఏమిటి?   తెలంగాణా ఏర్పడితే ఎన్ని పార్టీలు ఉండాలో, ఎవరు అధికారం చేపట్టాలో కూడా ఆయనే నిర్ణయించడం యెంత వరకు సబబు, సాద్యం? ఒక ఉద్యమ పార్టీగా తే.రా.స.ను స్తాపించిన ఆయన ముందుగా తన గమ్యం అయిన తెలంగాణా సాధన కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప, ఈ విదంగా రాజ్యదికారం కోసం వెంపర్లాడకూడదు. రాజకీయంగా ఎదగాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. గానీ, ఇతరులేవ్వరూ తన రాజకీయ జీవితానికి పోటీ ఉండకూడదని అనుకోవడమే తప్పు. అంతగా వారిని తనఅడ్డు తొలగించుకోదలిస్తే ప్రజాస్వామ్య పద్దతిలో వారిని ఎన్నికలలో ఎదుర్కొని మట్టికరిపించి రాజ్యదికరం దక్కిన్చుకోవచ్చును.   ‘ప్రజలు మూర్ఖులు వారికీ తాను తెలియజేప్పితే తప్ప వారికి ఏమి అర్ధం కాదు’ అనే తన ధోరణి విడనాడి, ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకొంటున్నారో వారినే నిర్నయించుకోనీయడం ఉత్తమం. వారే గనుక ఈ సీమంద్రాపార్టీలను వద్దనుకొంటే అప్పుడు ఆయనకే వారు పట్టం కట్టి అధికారం అప్పగించవచ్చు. అదే ఆయనకి గౌరవప్రదం. ప్రజాస్వామ్య దేశంలో యెంత వారికయినా నియంత పోకడలు అభిలషణీయం కాదు.

75 అసెంబ్లీ, 15 ఎం పి సీట్లు మావే : కే సి ఆర్

            వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ 75 అసెంబ్లీ, 15 ఎం పి సీట్లు సాధిస్తుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్ర శేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ రోజు రోజుకు బలం పుంజుకుంటోందని ఆయన అన్నారు. అలాగే, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింతగా శ్రమిస్తే, మరో 25 స్థానాల్లో గెలుపు తమదేనని ఆయన అన్నారు.   వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిని కే సి ఆర్ అప్పుడే ప్రారంభించారు. ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరి చొప్పున పార్టీ సమన్వయకర్తలను నియమించిన కే సి ఆర్ వారితో నిన్న హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర డివిజన్ల ఇన్‌చార్జిలు కూడా పాల్గొన్నారు. అట్టడుగు స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని, స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లోనూ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి హాజరు కాని పార్టీ నాయకులఫై కే సి ఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.   ఒక వైపు తెలంగాణా విషయంలో ఢిల్లీ లో అతి త్వరలో అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో, ఆ అంశం కాకుండా, పార్టీని అన్ని రకాల ఎన్నికలకు సిద్దంచేసే పనిలో కే సి ఆర్ ఉన్నారు.

కాంగ్రేసులో ‘పంచె’ తంత్రం

  కాంగ్రెస్ అంటే ఒక మహా సముద్రం. కాంగ్రెస్ అంటే అనేక ముటాల సమూహం. కాంగ్రెస్ పార్టీకి అర్ధం ఎలా తిరుగ వ్రాసిన సమాధానం ఒకటే! సోనియా గాందీ+రాహుల్ గాంధీ=కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్=సోనియా గాందీ+రాహుల్ గాంధీ. ఇది తప్ప మరొక ఈక్వేషన్ ఉండదు ఆ పార్టీలో. అందువల్లే, కాంగ్రెస్ అంటే వారి వీరవిదేయుల ‘భజనమందిరం’ అని కూడా పేరుపడింది. కాంగ్రెస్ పాలిత ఏరాష్ట్రం లోనయిన ముఖ్యమంత్రి నుండి స్తానిక నేతల వరకు ‘అమ్మ’ పేరుతోనే తమ ప్రసంగం మొదలు పెట్టి ‘రాహుల్ బాబు’ పేరు స్మరించుకొంటూ ముగించడం ఒక తప్పనిసరి ఆనవాయితీ క్రింద పాటిస్తుంటారు. ఒకవేళ ఏ కిరణ్ కుమార్ లాంటి వారో కొంచెం దైర్యం చేసుకొని ‘ఏవో కిరణాలంటూ’ తమ సంక్షేమకార్యక్రమానికి పొరపాటున తనపేరు తగిలించుకొన్నా, వెంటనే అమ్మపేరు లేదనుకొంటూ మరు నిమిషంలోనే డిల్లీకి ఫ్యాక్స్ మేసేజులు రవాణా అయిపోతాయి. ఆ దెబ్బకి యెంత గుండె నిబ్బరం ఉన్న మనిషయినా లెంపలేసుకోక తప్పదు. అంతగా వారిరువురి ప్రభావం పార్టీ మీదుంది. అయితే, ఇప్పుడు ఈ సోదంతా (ఉపోద్ఘాతమంతా) ఎందుకంటె, కాంగ్రేసు పార్టీలో ఒక సామన్య కార్యకర్త కూడా కలలోకూడా ఉహించని, సాహసించని ఒక భయంకరమయిన దుర్వార్త ఒకటి ఇటీవల ఒక పత్రికలో వెలువడి కాంగ్రేసులో కలకలం రేపింది. డిల్లీ నుండి గల్లీ వరకు అందరు దాని గురించే చర్చోపచర్చలు చేస్తూ ‘ఔరా! ఎంత సాహసం ఉంటె ఇలాగ వ్రాయగలరూ?’ అని బుగ్గలు నొక్కుకొంటున్నారు.   అపార అనుభవజ్ఞుడు, గొప్ప ఆర్ధికవేత్తగా ప్రసిద్దుడు, మచ్చలేని ప్రధానిగా పేరొందిన డా.మన్మోహన్ సింగు గారు ఇంకా కుర్చీలోకూర్చొని ఉండగానే, ‘నేడో రేపో మిమ్మలిని దింపేసి ఆకుర్చీలో మా రాహుల్ బాబుని చూసుకోవాలనుకొంటున్నాము’ అని నిత్యం వినిపించే అవమానాలు భరిస్తు కూడా అయన ప్రశాంతంగా ‘కానున్నది కాక మానదు’ అనుకొంటూ ఒక నిర్వికార యోగి పుంగవుడిలా తనపని తానూ చేసుకు పోతూ, కనీసం 2014 వరకయిన తనని బలవంతంగా బయటకీడ్చేయలేనందుకు సంతోషపడుతూ, ఎన్నికల తరువాత రాహుల్ బాబుకి తనకుర్చీ అప్పగించచేసి పంజాబ్ వెళ్ళిపోవడానికి అయన మానసికంగా ఎప్పుడో సంసిద్దమయిపోయారు. కాంగ్రేసు మార్క్ రాజకీయలేప్పుడు అలానే ఉంటాయి. ఇక ‘రాహుల్ బాబు నేడో రేపో ప్రధానిగా కుర్చీలోకూర్చొని దేశాన్ని ముందుకు తీసుకుపోవడమే ఇక ఆలశ్యం’ అని అందరూ అనుకొంటున్న ఈ తరుణంలో ఒక పత్రిక అది కూడా లండన్ నుండి వెలువడేది బాంబు లాంటి ఒక వార్త పేల్చింది. ‘రాహుల్ బాబు కన్నా ప్రధానమంత్రి పదవికి అనుభవజ్నుడయిన బూరె బుగ్గల ఆర్ధికమంత్రి చిదంబరమే సరయినవాడు. మిన్ను విరిగి మీద పడినా కూడా చలించక పంచె కట్టుతో ఎల్లప్పుడు చిర్నవ్వులు చిందించే చిడంబరమే మన్మోహన్ సింగు కి దీటయిన వ్యక్తీ అంతఅనుభవం ఉన్నవాడు కాంగ్రేసులో అతనొక్కడే’ అంటూ లండన్ నుండి వెలువడే ‘ద ఎకనామిస్ట్’ అనే ప్రముఖ పత్రిక ఇటీవలే ఒక కధనం ప్రచురించింది. అంతే, ఆ వార్త దావగ్నిలా కాంగ్రెస్ వర్గాలను కమ్మేసింది. ఖండన ముండనాలు యధావిధిగా జరిగిపోయాయి. గల్లీ నుండి డిల్లీ వరకు అందరు ఏకగ్రీవంగా ఆ వార్తని ఖండిస్తూ ఆ పత్రికా యాజమాన్యాన్ని, అదే నోటితో చిదంబరాన్నికూడా తప్పుపట్టేరు, కొండొకచో నిరసనలు కూడా చేపట్టే ఉండిఉండవచ్చు. నాటి నుండి, ఆ కధనం రావడం వెనుక అతని పరోక్ష ‘హస్తం’ ఎమయినా ఉందా అని అందరూ చిదంబరం వైపు అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. అతనినుండీ వివరణ తీసుకోవడమే గాకుండా, ‘రాబోయే ఎన్నికల తరువాత మా రాహుల్ బాబే ప్రధానపదవిని పుచ్చుకొంటాడు’ అని మీడియా వారిని పిలిచి మరీ మరోమారు స్పష్టం జేసారు కొందరు కాంగ్రేసు పెద్దలు. అప్పటికి గాని వారి ఆవేశం తగ్గ లేదు. కలలో కూడా ఉహించని ఇటువంటి వార్తలని అసలు ఆ పత్రిక వారు ఎందుకు ప్రచురించేరో, ఆ వెనుక ఎవరెవరి ‘హ్యాండ్స్’ ఉన్నాయో ఇంకా తెలుసుకోవలసి ఉంది. దానికోసం ఒక కమిటీ కూడా వేయాలని వీరవిదేయ సోనియావాదులు ఎవరయినా డిమాండ్ చేసారో లేదో ఇంకా తెలియదు.