ఇండియా - చైనా మధ్య 12 ఒప్పందాలు
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రస్తుతం భారత పర్యటనలో వున్న విషయం తెలిసిందే. పర్యటనలో రెండోరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జిన్ పింగ్, నరేంద్రమోడీ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య 12 కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల మీద ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియా - చైనా మధ్య కుదిరిన ఒప్పందాలలో భారత - చైనా ఆర్థిక, వాణిజ్య ప్రణాళిక ఒప్పందం, సమాచార శాఖ ఒప్పందం, రైల్వేల అభివృద్ధిపై ఒప్పందం, భారత - చైనా మధ్య మానస సరోవర్ మార్గ నిర్మాణ ఒప్పందం, ముంబై - షాంఘై నగరాల అభివృద్ధి ఒప్పందాలు వున్నాయి.