సిగాచీ షేర్లు ఢ‌మాల్!

పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత  ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి.  3 రోజుల్లోనే  దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.  ఒక్కొక షేర్ పై దాదాపుగా రూ.14 నష్టం వచ్చింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడం, ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు, కంపెనీ సిబ్బంది మృత్యువాత పడటం తెలిసిందే. ఈ సంఘటన తరువాత ఆ కంపెనీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్ లో బారీగా పతనమైంది.  దీంతో  సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిన ప్రమాదం పై నేషనల్  స్టాక్ ఎక్స్చేంజ్ కి లేఖ రాసింది.  పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో  మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది.   ప్రమాదనికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందనీ, హైదరాబాద్ ప్లాంట్ లో మూడు నెలలపాటు   కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  దేశ వ్యాప్తంగా  సిగాచీకి  నాలుగు పరిశ్రమలున్నాయి. పాశమైలారంతో పాటు సుల్తాన్ పూర్, కర్ణాటకలోని రాయచూర్, గుజరాత్ లోని జగడియ, ధహేజ్ లలో మొత్తం 4 పరిశ్రమలు నడుస్తున్నాయి. సంస్థ‌కు వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది.  సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ  1989లో సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది.  2012లో వాణిజ్యపరంగా విస్తరించేందుకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. 2019లో స్టాక్ మార్కెట్ లో  లిస్ట్ కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రస్తుతం  ఈ ఇండ‌స్ట్రీకి సుమారుగా రూ.1680 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న‌ట్టు చెబుత‌న్నాయి కంపెనీ గ‌ణాంకాలు. ఈ కంపెనీ ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రమాదం జరిగిన పాశమైలారం యూనిట్లో- మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ పౌడర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేస్తోంది. వీటితోపాటు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ ఇంగ్రిడియంట్స్ ను  తయారు చేస్తోంది. ఇది బైండింగ్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది.  డ్రగ్ తయారీలో ఈ ఔషధాన్ని ఉపయోగించి మనం నిత్యం వినియోగించే ఔషధాలు తయారు చేస్తారు.  ఏడాదికి ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఎండీ క‌మ్  సీఈవోగా అమిత్ రాజ్  సిన్హా, చైర్మన్ గా రవీంద్ర ప్రసాద్ సిన్హా, వైస్ చైర్మన్ గా చిదంబరనాథన్  ఉన్నారు.  ప్రమాదం జరిగిన పాశమైలారం సిగాచి ప్లాంటు కార్యకలాపాలన్నీ వైస్  చైర్మన్ చిదంబరనాథన్ అధ్వ‌ర్యంలో జరుగుతాయని చెబుతున్నారు.

ఎలాన్ మ‌స్క్ యూటర్న్.. సొంత పార్టీ లేనట్టేగా?

ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు.  ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా? ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా ఎలాన్ మస్క్ ట్రంప్ ను పొగుడుతూ కామెంట్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు జనబాహుల్యం నుంచి ఉత్పన్నమౌతున్నాయి.   నిజానికైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన వెంట‌నే తాను ద అమెరికా పార్టీ  స్థాపించడం తథ్యమని మస్క్ తెగేసి చెప్పారు.  ఈ లోగా ట్రంప్ ఒక కామెంట్ చేశారు. అస‌లు మ‌స్క్ త‌న పెట్టేబేడా స‌ర్దుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుంది. మేము ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు అన్నేసి స‌బ్సిడీల‌ను ఇచ్చామ‌ని బాంబు పేల్చారు ట్రంప్. దెబ్బ‌కు జ‌డుసుకున్న మ‌స్క్ ట్రంప్ ని వెన‌కేసుకొచ్చారు. క్రెడిట్ ఇవ్వాల్సిన  చోట ఇవ్వాల్సిందే అన్నారు. ఇజ్రాయెల్ గాజాలో అర‌వై రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పుకుంద‌ని ట్రంప్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఆయ‌నీ ట్వీట్ పోస్ట్ చేశారు. ట్రంప్- మ‌స్క్ స్నేహ బంధం 2016 నాటిది. వీరిద్ద‌రూ ఈ తొమ్మిదేళ్ల‌లో ఎన్నో సార్లు విడిపోయి, క‌లిసిపోయిన చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రి గ‌రించి ద గార్డియ‌న్ ప‌త్రిక 2024లో  ఇద్ద‌రు సంప‌న్న మిత్రుల మ‌ధ్య గాఢ ప్రేమానుబంధంగా అభివ‌ర్ణిస్తూ ఓ వ్యాసం ప్రచురించింది. మ‌స్క్ కి ట్రంప్ కి ఉన్న గాఢ స్నేహానుబంధం ఎలాంటిదంటే.. ట్రంప్ ఒక ద‌శ‌లో ట్విట్ట‌ర్ ఖాతాను కోల్పోయారు. దీంతో ఆయ‌న జోబైడెన్ చేతుల్లో ఓడి పోవ‌ల్సి వ‌చ్చిందప్ప‌ట్లో. అయితే గ‌త ఎన్నిక‌ల నాటికి అదే ట్విట్ట‌ర్ ని కొని దానికి ఎక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి.. దానిలోని ట్రంప్ ఖాతాను రీ- జ‌న‌రేట్ చేశారు మ‌స్క్.  అంతేనా.. డెమోక్రాటిక్ అభ్యర్థి క‌మ‌లా హారిస్ మీద విరుచుకుప‌డ్డారు  కూడా.   ఆ ఎన్నికలపై ఇది తీవ్ర ప్ర‌భావం చూపించింది.   ఎట్ట‌కేల‌కు గెలిచాం కదా అనుకుంటే ట్రంప్ నుంచి మస్క్ కు ఆశించినంత  సాయం అందలేదు. ఎన్నో విష‌యాల్లో ట్రంప్ మ‌స్క్ కి మ‌స్కా కొట్టారు. ఇస్తాన‌న్న‌వేవీ ఇవ్వ‌క పోగా.. మ‌స్క్ కి ప‌బ్లిక్ లో తీవ్ర వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్ట క‌నిపించింది. డోజ్ ద్వారా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర‌స‌న‌గా.. త‌న టెస్లా షోరూములు ధ్వంసం కావ‌డం..  ఆపై షేర్ల ధ‌ర‌లు ప‌డిపోవ‌డం  అటుంచితే..  త‌న సంప‌ద వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర ఆవిర‌య్యింది. అంతేనా త‌న మిత్రుడిని నాసా చీఫ్ చేస్తాన‌న్న మాట కూడా మ‌రిచారు ట్రంప్.  ప్ర‌శాంతంగా కొత్త కొత్త ఐడియాల‌తో బిజినెస్ చేసుకోకుండా.. అన‌వ‌స‌రంగా విరాళ‌మిచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇలాంటి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా? అంటారు మస్క్ తండ్రి   ఎరోల్ మ‌స్క్.  ప్ర‌స్తుతం మావాడికేం పెద్ద వ‌య‌సు అయిపోలేద‌నీ.. న్యూరాలింక్ అనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడ‌నీ.. అదిగానీ క్లిక్ అయితే ద‌శ తిరిగిపోతుంద‌ని అంటారాయ‌న‌. కార‌ణం మస్క్ కొత్త ప్రాజెక్టు వెన్నుముక విరిగిన వారికి సంసార జీవితం, కంటి చూపులేని వారికి చూపు ప్ర‌సాదించే దివ్య ఔష‌ధం. అలాంటి ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ అయితే పోయిన సంప‌ద‌ అంతకు అంతగా మారి తిరిగి వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌స్క్ వ‌య‌సు 53 ఏళ్లు కాగా.. సంప‌ద విలువ 300 బిలియ‌న్ డాల‌ర్లు. ట్రంప్ లా లాస్ట్ స్టేజ్ లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ నెట్ ప్రాక్టీస్ గా ప‌డి ఉంటుంది లెమ్మ‌ని.. కాస్త ఎర్లీగానే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన మ‌స్క్.. ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా పార్టీ పెట్టేస్తా అన‌గానే అంద‌రూ షాక‌య్యారు. ఇప్పుడు చూస్తే పార్టీ లేదూ గీర్టీ లేదు తూచ్ అంటున్నారు. మ‌రి చూడాలి. ట్రంప్ తో ఈ చెలిమి కంటిన్యూ అవుతుందా లేక ఇద్ద‌రి మ‌ధ్యా మళ్లీ వివాదం మ‌రింత ముదిరి.. కొత్త పార్టీకి దారి తీస్తుందా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి

పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ వివారు కాటేదాన్ లోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.   పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడిసరుకు ఉండటం మంటలు వేగంగా వ్యాపింపిచ దట్టమైన పొగ అలుము కోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.  

ములుగు బిఆర్ఎస్ లో ముఠా తగాదాలు?!

ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ  జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో  బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.  పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సిన వ్యక్తే పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడడానికి కారకుడిగా మారుతున్నారంటూ పార్టీ వర్గాలే  బాహాటంగా చెబుతున్నాయి.  పార్టీ  శ్రేణుల సమాచారం మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వస్తుండటమే కాకుండా.. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ కు సహకరించవద్దంటూ పార్టీ క్యాడర్ కు హుకుం జారీ చేశారు. దీంతో  నియోజకవర్గ ఇన్చార్జి కేవలం ఒక్క మండలానికే పరిమితమైన పరిస్థితి.  దీంతో ములుగు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు. ములుగు జిల్లా లో ఒకే నియోజకవర్గం ఉండటం అదీ ఎస్టీ   నియోజకవర్గం.  ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీ చైర్మన్ మాజీ  బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బంధువు అయిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కాకులమారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.  గత ఎన్నికల్లో  ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  సీతక్క బరిలో నిలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచడంతో ములుగు నుంచి పోటీచేసిన జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమే నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.    అయితే ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కాకులమారి లక్ష్మీ నరసింహారావు తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఒక దశలో ఆయనను పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది.  అయితే  ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లాబీయింగ్ తో పార్టీ ఆయనను ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని అంటారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కాకులమారి లక్ష్మీనరసింహరావు తన ఒంటెద్దు పోకడలతో  పార్టీ బలహీనం కావడానికి కారకుడౌతున్నారని అంటున్నారు. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్  నాగజ్యోతితో విభేదాల కారణంగా  జిల్లా పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి.   గత ఎన్నికలలో పార్టీ  పరాజయం పాలై అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన నేపథ్యంలో.. సమైక్యంగా ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలో కూడా ములుగు జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలతో కూనారిల్లుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.  ములుగు జిల్లా అధ్యక్షుడిగా స్థానికంగా ఉండాల్సినకాకులమారి లక్ష్మీనరసింహరావు హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా అతిథిగా జిల్లాకు వస్తున్నారనీ, ఆయన అందుబాటులో లేకపోవడమే కాకుండా.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ తాను లేకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారనీ, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ చార్జి నాగజ్యోతికి సహకరించొద్దంటూ శ్రేణులకు హుకుం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో బడే నాగజ్యోతి పేరుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ అయినా కేవలం తన సొంత మండలం తాడ్వాయికే పరిమితమైన పరిస్థితి.    కాకులమారి లక్ష్మీనరసింహరావుకు మంత్రి సీతక్కతో సత్సంబంధాలు ఉండటం,  పారిశ్రామిక వేత్తగా ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా అధికార పార్టీకి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటం లేదనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై  పోరాటాలకు వెనుకంజ వేస్తున్నారనీ, మొత్తంగా ఆయన సీతక్కకు విధేయుడిగా ఉంటున్నారనీ  టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ములుగు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి కారణం జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తుపోకడలేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.    నాగజ్యోతికి ప్రజాబలం లేదు అని అధిష్టానం దగ్గర నిరూపించి, ఆమె స్థానంలో తన అనుచరుడిని తీసుకురావాలన్న యోచనతో కాకులమారి లక్ష్మీనరసింహరావు పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం ములుగు జిల్లాపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.  

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా దుష్ప్రచారం.. చర్యలు తప్పవన్న టీటీడీ

తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో  వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది.  టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .  తాజాగా జూన్ 29  మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు. అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా..  ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు  తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది.   అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.  

ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన సైనికుడికి గ్రామస్థులు ఘన స్వాగతం

  శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.  28ఏళ్లుగా దేశ రక్షణలో విధులు నిర్వహించి, సుబేధర్ గా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన సందర్బంగా  బాజా భజంత్రీలు, శ్రీ శివరామ డోలు సన్నాయి కళాకారులు, శ్రీ ఆసిరిపోలమ్మ కోలాట బృందం, శ్రీ కళ్యాణవెంకటేశ్వర కోలాట బృందం, శ్రీ దుర్గా పాండు రంగ స్వామి కోలాట బృందం కళాకారులచే కోలాట ప్రదర్శన నిర్వహించి ఘన సన్మానసభ నిర్వహించారు.  

తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

  టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్.. తిరుమలలోని ఆస్థాన మండపంలో ‘శ్రీనివాస కళార్చన’ పేరుతో రెండు రోజుల నాట్య ప్రదర్శనను నిర్వహిస్తానని చెప్పి శ్రీవారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారిక అనుమతి లేకుండానే తెలుగు రాష్ట్రాల్లోని 93 కళాబృందాలకు చెందిన 2,900 మంది కళాకారులను నమ్మించి మోసం చేశాడు.  వారి వద్ద నుంచి రూ.35 లక్షలు వసూలు చేశాడు. కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చాడు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అనుమతి లేదని, ఈ మొత్తం ప్రక్రియ ఒక మోసపూరితం అని గుర్తించి తిరుమల వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జులై 1న అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

జూబ్లీహిల్స్ పై చంద్రబాబు దృష్టి?

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్‌లో ఉన్న పాత టీడీపీ క్యాడర్‌కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది.  ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు డిస్మిస్

  ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ కస్టడీకి తీసుకుని వీరిని మరింతగా విచారించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  తమకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది.  బెయిల్ పిటిషన్లపై ఇటీవల న్యాయస్థానం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. మద్యం కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

చైనా అధ్యక్షుడు కనిపించుట లేదు

    చైనా అధ్యక్షుడు  జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకీ హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండడం వల్ల.. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చని భావించారు. జూలై 6,7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జింగ్ పింగ్ హాజరు కావడం లేదని చెప్పడంతో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నారు. తొలిసారిగా ఆయనీ బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరువుతున్నారు. జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కి జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ గానూ వ్యవహారిస్తున్నారు. చైనా లో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? అన్నదొక చర్చ. ప్రస్తుతం చైనాలో జనరల్ ఝాంగ్ యుజియానే అధికారం చెలయిస్తున్నట్టు తెలుస్తోంది. జనరల్ ఝాంగ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నారు. జనరల్ ఝాంగ్ 24 మంది సభ్యులు గల.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు. సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్స్ మద్దతు జనరల్ ఝాంగ్ యుజీయ కి బలంగానే ఉంది. సెంట్రల్ కమిటీ లో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో అనుచరులున్నారు. సెంట్రల్ కమిటీ లో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియా కి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు హు జింటావో మద్దతుదారులు కావడం వల్ల జింగ్ పింగ్ కి వీరంతా వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. చైనా లోని పాఠశాల విద్యార్థులకు జింగ్ పింగ్ పాఠాలు చెబుతున్నారు. చైనా పాఠశాల పుస్తకాల్లో జింగ్ పింగ్- ఆలోచనలు అనే పేరు మీద విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీ లోని సీనియర్ సభ్యులకి నచ్చడం లేదట. ఇప్పటికే మావో- ఆలోచనల పేరిట పాఠాలు చెబుతుండగా కొత్తగా ఈ జిన్ పింగ్ ఆలోచనలేంటన్నదొక ప్రశ్న.  అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకు సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవం, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని తన అనుచరులకే ఆయన కీలక బాధ్యతలు అప్పగించడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తుదుపరి చైనా అధ్యక్షుడిగా జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు.. గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదని అంటారు. వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదన్నది వీరి అభిప్రాయంగా తెలుస్తోంది.  

నెక్స్ట్ రెడ్ బుక్ టార్గెట్ ఎవరు?

    ఎట్టకేలకు వల్లభనేని వంశీకి  బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే  వంశీని జైలు జీవితం విడిపోతుందా!  లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా?  అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అనవసరంగా నోరు పారేసుకుని,  రెడ్ బుక్ బాధితులుగా మారిన అనేక మంది ,ఇప్పటికే కారాగారంలో ఊసలు లెక్కపెట్టి వచ్చారు.... అందులో సినిమా రంగానికి చెందినవారు, పత్రికారంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు అన్న తేడా లేకుండా, ఎవరీ లెక్కలు వాళ్ళకి అప్పజెప్తుంది రెడ్బుక్ ....అయితే అందరికన్నా అగ్ర తాంబూలం ఈ రెడ్ బుక్కులో ఎవరికి అందబోతుంది ....ఇప్పటికీ రేట్ బుక్ లో మొదటి పేజీ మాత్రమే చూస్తున్నారని చెబుతున్న టిడిపి కార్యకర్తల మాటల్లో ఆంతర్యం ఏంటి ? రెడ్ బుక్ లో తదుపరి పేజీల్లో ఎవరెవరి పేర్లు పొందుపరిచి ఉన్నాయి.   నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ...అనే సామెత ఉంది ....పెద్దవాళ్లు ఊరికే అనలేదా మాట ...ఎక్కడైతే అనవసరంగా నోరు పారేసుకుంటామమో ,అక్కడ మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది... అని పెద్దలు ముందే గమనించబట్టి ఈ సామెతలు కనిపెట్టి ఉంటారు.... అయితే ఇటీవల రాజకీయాల్లో ఈ మాటను ఎవరు వినడం లేదు  సరి కదా, పెడ చెవిన పెడుతున్నారు ... దీంతో వాళ్లు వీళ్ళు అని తేడా లేకుండా, ప్రతి ఒక్కరు సమస్యల్లో ఇరుకుంటున్నారు ..  అలాంటి బాపతే గడిచిన కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జైలలో కాలక్షేపం చేస్తున్న నాయకులు... మాజీ ఎంపీ నందిగం సురేష్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇప్పుడు తాజాగా 140 రోజులు జైలు జీవితానికి బెయిల్ తీసుకున్న వల్లభనేని వంశీ,,, వీరంతా వేరే వేరే కేసుల్లో జైలు జీవితం అనుభవించిన దీనంతటి సారాంశం అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్నారు అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియంది కాదు.... అయితే ఇప్పటికీ వల్లభనేని వంశీ జైలు జీవితం కథకు పుల్ స్టాప్ పడినట్లేనా లేక ఇతర వ్యవహారాల్లో మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం వల్లభనేని వంశీని వెంటాడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒక్క వల్లభనేని వంశీ నే కాదు,... ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారు వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం రుచి చూపించాలని ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతుంది ....అలాంటప్పుడు ఒళ్ళు ,నోళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి... ఈ హెచ్చరికలు విషయం పక్కనపెడితే, ఇప్పుడు రెడ్ బుక్ లోని మొదటి పేజీ నడుస్తుంది ....ఈ రెడ్బుక్ లోని మొదటి పేజీలో ఇంకెన్ని పేర్లు ఉన్నాయి? చివరి పేజీకి వచ్చేసరికి ఎంతమంది నాయకులు జైల్లో మగ్గాల్సి వస్తుంది అన్న చర్చ కూడా జరుగుతుంది ....ఇక తాజాగా వినిపిస్తున్న పేర్లు టిడిపి వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది... టిడిపి సోషల్ మీడియాలో కొందరి వైసీపీ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి....సీదిరి అప్పలరాజు నుండి ,కొడాలి నాని వరకు ఆ లిస్టులో పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు, సీదిరి అప్పలరాజు , రాంగోపాల్ వర్మ ,శ్రీరెడ్డి మాజీ మంత్రులు,పేర్ని నాని , జోగి రమేష్,  అంబటి రాంబాబు విడదల రజిని , మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ప్రముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.... అయితే ఇందులో ఇప్పటికే కొంతమందికి,కొన్ని  కేసులలో నోటీసులు వచ్చిన, తమకున్న టాలెంట్ ఉపయోగించి కోర్టులకు వెళ్లి కొంత ఉపశమనం పొందారు ...అయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ మరోసారి రెడ్బుక్ వ్యవహారాన్ని పరిచయం చేపించాలని టిడిపి శ్రేణులు ఉవ్విల్లు ఊరుతున్నట్లు తెలుస్తోంది.. . చంద్రబాబుకు మైండ్ పోయిందని ట్రీట్మెంట్ చేయించాలని, వయసును కూడా గౌరవించకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడిన మాజీ మంత్రి అప్పలరాజు, ఇప్పుడు రెడ్ బుక్ లోని మరో పేజీలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది  అంతేకాదు వల్లభనేని వంశీకి ఆత్మీయ మిత్రుడు, టిడిపికి గతంలో కొరకరాని కొయ్యగా మారి ఇప్పుడు చడిచప్పుడు లేకుండా అనారోగ్య సమస్యలతో హైదరాబాదులో మకం వేసి ఉంటున్న కొడాలి నాని కి , రెడ్ బుక్కు లో ప్రముఖ పేజీ ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది .... దీంతోపాటు టిడిపిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు తో పాటు ఇటీవల పోలీసులపై కూడా దూకుడు ప్రదర్శించిన, మాజీ మంత్రి అంబటి రాంబాబు, జగన్ పర్యటనలో ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారణమైన నాయకులకు త్వరలోనే కేసుల చిట్టా పరిచయం కాబోతుందని ప్రచారం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కారాగారంలో కాలక్షేపం చేసే నాయకులు వీళ్లేనా?  టిడిపి క్యాడర్ చేసుకుంటున్న,చర్చలో నిజం ఎంతో అబద్ధం ఎంతో టిడిపి నేతలకే తెలియాలి ....అయితే టిడిపి కార్యకర్తలు మాత్రం చేసిన తప్పుకే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కానీ,  టిడిపి వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదనేది చెబుతున్న మాట .... సరే ఎవరి మాట ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే,  ఒక పద్ధతి ప్రకారం రెడ్ బుక్ లో పేజీల్లో ఉన్న నాయకులకు ట్రీట్మెంట్ జరుగుతుందనేది వాస్తవం. మరి ఈ తదుపరి పేజీల్లో ఉండే తదుపరి నాయకులు ఎవరో కాలమే నిర్ణయించాలి

శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే జగన్ జైలు యాత్రలు : సోమిరెడ్డి

  శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. పిచ్చి వేషాలు వేద్దామనుకుంటే..పోలీసులు తాట తీస్తారు..జాగ్రత్త అని సోమిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా దుర్మార్గాలు, పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎల్లుండి రఫ్ఫా రఫ్పా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంటని ఆయన దుయ్యబట్టారు. రెంటపాళ్లలో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడని ఆయన అన్నారు.  మూడు కార్లు, 100 మంది జనానికి అనుమతి తీసుకుని 9 గంటల పాటు 80 కిలోమీటర్లు ర్యాలీ చేశాడని సోమిరెడ్డి వెల్లడించారు. 680 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించినా మూడు ప్రాణాలను తీసుకున్నాడని తెలిపారు. జగన్ రెడ్డి కారు కింద సింగయ్య ప్రాణం నలిగిపోతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లాలనే మానవత్వం కూడా చూపలేదని  చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నాని తెలిపారు. జైలు వద్దకు వెళ్లి గోవర్ధన్ రెడ్డి అందాలను పొగుడుకుని వెళితే మాకెలాంటి అభ్యంతరం లేదు..చీమకు నష్టం జరిగినా ఊరుకోబోమని ఆయన గుర్తుంచుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు అతిగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు

ఏపీలో ఆ జిల్లాల మధ్య విమాన సేవలు ప్రారంభం

  కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర  పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు రాకపోకలు సాగనున్నాయి. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ త్వరలోనే డ్రోన్ హబ్ కర్నూలుకు రాబోతోందని తెలిపారు. ఇందుకోసం కర్నూలు విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచుతామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు.

కుప్పంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు

  ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం  కుప్పంపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం నియోజకవర్గం తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని సీఎం తెలిపారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీళ్ల అందిస్తామని హామీ ఇచ్చారు.  కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు .కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చంద్రబాబు వెల్లడించారు. ఈవీ బస్సులు, ఆటోలు, ఇంటింటికీ సౌర విద్యుత్ తీసుకువస్తామని సీఎం తెలిపారు

జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా?

పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు..పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇది అయితే..  జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.  జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు.  అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జనసమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు ఆగడాలు, అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే జగన్ పరామర్శయాత్ర అంటూ బలప్రదర్శనకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. దీంతో శాతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రజా భద్రత ధ్యేయంగా తాము అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుందనీ, అందుకే నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు కు సూచించామనీ పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారన్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయిందనీ, నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకీ అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగా నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాణిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్ లో వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది.  పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సంద ర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్ పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్ కు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం కనుక నెల్లూరు పర్యటనను, కాకాణి పరామర్శనూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారనీ, అనుమతి ఇవ్వలేదనీ ప్రచారం చేసుకుంటున్నారు.  పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ కు స్థలం చూపామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.