English | Telugu

నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన 'కార్తీకదీపం' హిమ!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సినీ ప్రముఖులు కరోనాతో మరణిస్తున్నారు. మరికొందరు అనారోగ్య కారణాల వలన మృతువాత పడుతున్నారు. తాజాగా బుల్లితెరపై తీవ్ర విషాదం నెలకొంది. జీతెలుగులో ప్రసారమయ్యే 'నెంబర్ వన్ కోడలు' సీరియల్ నిర్మాత హరీష్ మృతి చెందారు. దీంతో ఆ సీరియల్ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణవార్త విని షాక్ అయినట్లు సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోన్న సుధా చంద్రన్ తెలిపారు.

ఉదయం లేవగానే షాకింగ్ న్యూస్ విన్నానని.. ప్రొడ్యూసర్ హరీష్ గారు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ మరణించారని.. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆయన.. త్వరగా వెళ్లిపోయారని ఎమోషనల్ అయ్యారు. హరీష్ గారు ఎంతో తక్కువగా మాట్లాడతారని.. సహృదయులు అని చెప్పారు. "మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం." అంటూ సుధా చంద్రన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

'కార్తీకదీపం' ఫేమ్ హిమ (సహృద) సైతం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సహృద నిర్మాత మరణంపై స్పందించింది. ''హరీష్ సర్ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం. నన్ను మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మీరు మా నుండి భౌతికంగా దూరమయ్యారేమో కానీ.. మా హృదయంలో ఎప్పుడూ మీరుంటారు. మిమ్మల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.