English | Telugu

"మీలాంటి గాళ్‌ఫ్రెండ్ కావాలి".. సునీతకు షాకిచ్చిన బుడ్డోడు!

సింగర్ సునీత ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. 'డ్రామా జూనియర్స్' షోతో మళ్లీ తన అభిమానులకు దగ్గరవుతున్నారు. ఈ షోలో పిల్లలు చేసే స్కిట్లు చూసి సునీత బాగా నవ్వుతుంటారు. ఒక్కోసారి వారు చేసే స్కిట్లు, ఇచ్చే సందేశాలు చూసి ఎమోషనల్ అవుతుంటారు. అలా స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా సునీతకు ఓ బుడ్డోడు షాకిచ్చాడు. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ సునీతను అడిగేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సునీత రెండో పెళ్లి చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫాలోవర్లతో తరచూ టచ్ లో ఉంటున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వచ్చి పాటలను ఆలపిస్తున్నారు. ఆ విధంగా ప్రేక్షకులను కొంతవరకు ఆనందింప‌జేయొచ్చనేది సునీత ఆలోచన. ఇదిలా ఉండగా ఇప్పుడు సునీత 'డ్రామా జూనియర్స్' షోలో సందడి చేస్తున్నారు.

పిల్లలతో కలిసి సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ చిన్న‌పిల్లాడు ఆ షోలో 'మన్మథుడు' సినిమా స్పూఫ్ చేశాడు. ఆ స్కిట్ ను అందరూ ఎంజాయ్ చేశారు. స్కిట్ అనంతరం సునీత మాట్లాడుతూ.. ''నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఎలా ఉండాలో చెప్పు..?'' అంటూ ఆ బుడ్డోడిని ప్రశ్నించగా.. దానికి ఆ పిల్లాడు "మీలా ఉండాలి" అని చెప్పి షాకిచ్చాడు. ఆ తరువాత రేణు దేశాయ్ ఆ పిల్లాడితో కలిసి స్టేజ్ మీద డాన్స్ వేశాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.