English | Telugu

అస‌లే చిట్టి స్కర్టు... ఇంకేం తగ్గించాలని వ‌ర్షిణి కౌంటర్!

టీవీ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ల లిస్టు తీస్తే... అందులో రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్‌రాజన్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో కనిపించేవారు. 'ఢీ' లేటెస్ట్ సీజన్‌లో వర్షిణిని పక్కనపెట్టి దీపికను తీసుకోవడంతో హాట్ యాంకర్ జోడీ ఒకే స్టేజిపై కనిపించి చాలా రోజులైంది. మళ్ళీ వీళ్ళిద్దర్నీ ఒక్క స్టేజి మీదకు తీసుకొచ్చాడు ఓంకార్.

ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' సీజన్4 అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో రష్మీ, వర్షిణి సందడి చేయనున్నారు. షోలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతునప్పుడు వర్షిణి మాట్లాడుతున్న సమయంలో 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ప్రకాష్ రాజ్ డైలాగ్ వేశారు. వెంటనే 'ఏం తగ్గించుకోవాలి? ఆల్రెడీ ఇంత తగ్గించుకుని వచ్చా. ఇంకేం తగ్గించాలి?' అని తాను వేసుకున్న స్కర్టు సైజును చూపిస్తూ వర్షిణి సెల్ఫ్ సెటైర్ వేసుకుంది. పక్కన ఉన్న రష్మీ ఒక్కసారిగా నవ్వింది.

లేటెస్టుగా ఈ ప్రోమో విడుదలైంది. అందులో చివరగా మాస్ డాన్స్ తో రష్మీ, వర్షిణి ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా చిట్టి స్కర్టులో వర్షిణి వేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.

'మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ...
చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ యమ్మీ
అందుకే మీరంటే అందరికీ ఇష్టం రష్మీ' అంటూ ఓంకార్ వినిపించిన కవిత కూడా హైలైట్.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.