English | Telugu

అస‌లే చిట్టి స్కర్టు... ఇంకేం తగ్గించాలని వ‌ర్షిణి కౌంటర్!

టీవీ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ల లిస్టు తీస్తే... అందులో రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్‌రాజన్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో కనిపించేవారు. 'ఢీ' లేటెస్ట్ సీజన్‌లో వర్షిణిని పక్కనపెట్టి దీపికను తీసుకోవడంతో హాట్ యాంకర్ జోడీ ఒకే స్టేజిపై కనిపించి చాలా రోజులైంది. మళ్ళీ వీళ్ళిద్దర్నీ ఒక్క స్టేజి మీదకు తీసుకొచ్చాడు ఓంకార్.

ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' సీజన్4 అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో రష్మీ, వర్షిణి సందడి చేయనున్నారు. షోలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతునప్పుడు వర్షిణి మాట్లాడుతున్న సమయంలో 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ప్రకాష్ రాజ్ డైలాగ్ వేశారు. వెంటనే 'ఏం తగ్గించుకోవాలి? ఆల్రెడీ ఇంత తగ్గించుకుని వచ్చా. ఇంకేం తగ్గించాలి?' అని తాను వేసుకున్న స్కర్టు సైజును చూపిస్తూ వర్షిణి సెల్ఫ్ సెటైర్ వేసుకుంది. పక్కన ఉన్న రష్మీ ఒక్కసారిగా నవ్వింది.

లేటెస్టుగా ఈ ప్రోమో విడుదలైంది. అందులో చివరగా మాస్ డాన్స్ తో రష్మీ, వర్షిణి ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా చిట్టి స్కర్టులో వర్షిణి వేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.

'మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ...
చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ యమ్మీ
అందుకే మీరంటే అందరికీ ఇష్టం రష్మీ' అంటూ ఓంకార్ వినిపించిన కవిత కూడా హైలైట్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.