English | Telugu

ర‌మ్య‌కృష్ణ వ‌ల్లే ఆ షో నుంచి వ‌నితా విజ‌య్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చేసిందా?

విజ‌య్ టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌వుతోన్న డాన్స్ రియాలిటీ షో 'బీబీ (బిగ్ బాస్‌) జోడిగ‌ళ్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది వ‌నితా విజ‌య్‌కుమార్‌. ఆమె అలా ఆ షో నుంచి వ‌చ్చేయ‌డానికి కార‌ణం ర‌మ్య‌కృష్ణ అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ షోలో తాను ఓ సీనియ‌ర్ మ‌హిళ వ‌ల్ల వేధింపుల‌కు, బెదిరింపుల‌కు, అవ‌మానాల‌కు గుర‌య్యాన‌ని ఓ స్టేట్‌మెంట్‌లో వ‌నిత చెప్పింది. ఈ వివాదంపై ర‌మ్య‌కృష్ణ స్పందించారు.

'బీబీ జోడిగ‌ళ్' షోలో అవ‌మానాల‌కు గుర‌య్యాన‌ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ పోస్టులో తెలిపింది వ‌నిత‌. తాను వేధింపుల‌ను భ‌రించే మ‌నిషిని కాద‌నీ, అందుకే ఆ షో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌నీ ఆమె చెప్పింది. ఒక స్త్రీ మ‌రో స్త్రీని స‌పోర్ట్ చేయాలే కానీ, వాళ్ల జీవితాన్ని దుర్భ‌రం చేయ‌కూడద‌ని ఆమె రాసుకొచ్చింది.

ఈ షోకు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిలో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. వ‌నిత ప‌ర్ఫార్మెన్స్‌కు 10 మార్కుల‌కు గాను ర‌మ్య‌కృష్ణ ఇచ్చిన మార్కులు కూడా వ‌నిత‌ ఈ షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఒక కార‌ణం అంటున్నారు. దీనిపై 'సినిమా విక‌ట‌న్' అనే త‌మిళ ప‌త్రిక ప్ర‌శ్నించ‌గా, "నో కామెంట్స్" అని జ‌వాబిచ్చారు ర‌మ్య‌కృష్ణ‌. "మీరు 'బిగ్ బాస్ జోడిగ‌ళ్' షూటింగ్‌లో ఏం జ‌రిగిందో వ‌నిత‌ను అడిగితే బాగుంటుంది. నావ‌ర‌కు ఇద‌స‌లు ఒక స‌మ‌స్యే కాదు. ఆ కాంట్ర‌వ‌ర్సీపై నేను కామెంట్ చేయాల‌ని ఇప్ప‌టికీ మీర‌నుకుంటూ ఉంటే, నో కామెంట్స్ అనే చెప్తాను." అని ఆమె స్ప‌ష్టం చేశారు.

'బీబీ జోడిగ‌ళ్‌'కు ర‌మ్య‌కృష్ణతో పాటు న‌టుడు న‌కుల్ జైదేవ్ మ‌రో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మునుప‌టి త‌మిళ‌ 'బిగ్ బాస్' షోల‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారితో ఈ డాన్స్ రియాలిటీ షోను రూపొందిస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.