English | Telugu

పదహారేళ్లు వ‌చ్చేదాకా నాకు ఫోన్ ఇవ్వ‌రు!

యాంకర్ రవి కూతురు వియాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. రవి చేసే వీడియోలతో పాటు తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్ లో వియా అల్లరి చేస్తుంటుంది. తన తండ్రి ప్రోత్సాహంతోనే యూట్యూబ్ ఛానెల్ పెట్టానని వియా చెప్పుకొచ్చింది. రీసెంట్ గా తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది వియా. ఈ క్రమంలో నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

సుధీర్ మామ, అనసూయ పిన్ని, లాస్య ఆంటీ అంటూ అందరి గురించి వియా మాట్లాడింది. తన వ్యక్తిగత విషయాలపై కూడా వియా కామెంట్స్ చేసింది. "ఈ సమాధానాలన్నీ నువ్వే చెబుతున్నావా..? లేక ఎవరైనా సాయం చేస్తున్నారా..?" అని ఓ నెటిజన్ అడగగా.. దానికి వియా బదులిస్తూ.. "మా అమ్మ ప్రశ్నలను చదివి వినిపిస్తుంటే నేను సమాధానాలు చెబుతున్నా." అని తెలిపింది.

మరో నెటిజన్ "నీకు సొంతంగా ఫోన్ ఉందా..?" అని ప్రశ్నించాడు. దానికి వియా.. తన దగ్గర ఫోన్ లేదని.. తనకు 16 ఏళ్లు వచ్చే వరకు ఫోన్ కొనివ్వరని పేరెంట్స్ చెప్పినట్లు వియా తెలిపింది. యాంకర్ రవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఫోన్ లేకపోయినా.. వియా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.