English | Telugu

నేను దేశానికి చేస్తున్న సేవ ఇదే.. మీరూ చేయండి!

ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతగా విజృభిస్తుందో తెలిసిందే. రోజుల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు బాగానే ఉండడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. మ‌రోవైపు వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్, బెడ్ల‌ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశం విఫలమైందని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా గెటప్ శ్రీను ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఆయన కొన్ని విషయాల గురించి మాట్లాడారు.

మన దేశ జనాభాను ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాలతో పోల్చి చెప్పారు. అమెరికా, రష్యా, జర్మనీ, టర్కీ, యూకే అంటూ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల జనాభా మొత్తం మన దేశ జనాభాకు సమానమని చెప్పారు. అలా ఇంత జనాభా ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్క భారతదేశ జనాభా 139 కోట్లు అని చెప్పిన జబర్దస్త్ శ్రీను.. కొవిడ్ ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఎంత పని చేస్తున్నాయో అంత పని ఇండియా ఒక్కటే చేస్తోంద‌ని అన్నారు.

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అనడం చాలా సులువు కానీ ప్రపంచదేశాలకు సాటిగా, ధీటుగా నిలబడడానికి నీ వంతు సహకారం అందించు అని ప్రజలను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. మీరు ఎలాంటి ఆర్ధిక సహాయం చేయక్క‌ర‌లేద‌నీ.. ఈ లాక్ డౌన్ ను విజయవంతం చేస్తే చాలనీ చెప్పుకొచ్చారు. "ఇంట్లోనే ఉంటూ.. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, ఇతరులను కాపాడండి.. ఇదే మీరు దేశానికి చేసే చిన్న సేవ." అంటూ గెటప్ శ్రీను ఓ పోస్ట్ పెట్టారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.