English | Telugu

"అందం పోతుంద‌ని డ‌బ్బా పాలు పడుతున్నారా?".. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు హ‌రితేజ ఆన్స‌ర్ ఇదే!

బుల్లితెరపై సీరియల్స్ లో నటించి, ఆ తరువాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కనిపించింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో జనాలను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరిగింది. ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు కూడా పెరిగాయి. రీసెంట్ గా హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి ఇటీవల చెప్పుకొచ్చింది.

తనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. కానీ ఫైనల్ గా అంతా బాగానే జరిగిందని.. తమ పాప ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా హరితేజ త‌న‌ ఫాలోవర్లతో ముచ్చట పెట్టింది. చాలా రోజుల తరువాత ఆన్లైన్ లోకి వచ్చినా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలా మంది పాప యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు.

"అందం పోతుందని డబ్బా పాలు పడుతున్నారా..? లేక మీరే ఇస్తున్నారా..?" అని ప్రశ్నించాడు ఒక‌త‌ను. ఇది చూసిన హరితేజ.. ఒకింత వ్యంగ్యంగా నవ్వుతూ.. "ఏమిటో మీ అనుమానాలు?" అంటూ కౌంటర్ ఇచ్చింది. "వ్యాక్సిన్ వేసుకున్నారా..?" అని మరో నెటిజన్ అడగగా.. పాపకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ వేసుకోవాలో లేదో అనే విషయంలో తనకు కన్ఫ్యూజన్ ఉందని అసలు విషయం చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.