Read more!

English | Telugu

ఆ నిర్మాత న‌న్ను మోసం చేశాడు!

 

కమెడియన్ గా వెండితెరపై పలు సినిమాల్లో నటించిన అభి.. 'జబర్దస్త్' షోతో మరింత హాస్యాన్ని పండిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా 'జబర్దస్త్' షోలో కనిపిస్తోన్న అభి తన టీమ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. అలా వచ్చిన వారిలో హైపర్ ఆది టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అభి తన స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు లేకుండా క్లీన్ కామెడీ ఉండేలా చూసుకుంటాడు. 

మధ్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు. ఆ తరువాత హీరోగా మారాలని ప్రయత్నించాడు. కొన్నాళ్లక్రితం అతడు హీరోగా నటించిన సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ అభికి అంత క్రేజ్ ను తీసుకురాలేకపోయింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చాడు అభి. అతడితో పాటు రామ్ ప్రసాద్ కూడా వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అభి తనకు జరిగిన మోసాన్ని బయటపెట్టారు. 

అభి దర్శకుడిగా ఓ నిర్మాత ఐదు కోట్లు పెట్టి సినిమా చేయాలనుకున్నాడట. తన మీద అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నాడు కదా.. అలాంటిది తను కొంచెమైనా హెల్ప్ చేయాలని ఐదు లక్షల చెక్కు రాసిచ్చానని అభి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత డబ్బులు వెనక్కి రాలేదని, దానికోసం పోలీసుల దగ్గరకు కూడా వెళ్లానని తెలిపాడు. అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్ల‌డించ‌లేదు. అలానే తనకు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయని అన్నాడు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.