English | Telugu

"కొడుకు పుడితే నీలా పెంచుతా".. రవికృష్ణపై సావిత్రి ప్రేమ!

బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న తీన్మార్ సావిత్రి, సీరియల్ నటుడు రవికృష్ణల మధ్య ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయింది. రవిని తన సొంతింట్లో మనిషిలా ట్రీట్ చేస్తుంటుంది సావిత్రి. అతడికి కోవిడ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉండడంతో సావిత్రి తన ఇంటికి తీసుకెళ్లి సేవలు చేసిందని గతంలో ఓ షోలో చెప్పి ఎమోషనల్ అయ్యాడు రవికృష్ణ. సావిత్రి సొంత అక్క కంటే చాలా ఎక్కువ అని.. అమ్మలా చూసుకుంటుందని రవికృష్ణ సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూ ఉంటాడు.

ఇక ఈరోజు (జూన్ 9) పుట్టినరోజు జరుపుకుంటున్న రవికృష్ణకు సావిత్రి ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ''కొడుకు పుడితే నీలా పెంచాలి.. అంత ప్రేమ.. ఒక వేళ పుట్టకపోయినా ఏం కాదు నా కొడుకువి నువ్వు ఉన్నావ్ అన్న నమ్మకం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన రవి.. ''లవ్యూ అమ్మా'' అంటూ రిప్లై ఇచ్చాడు.

మరోపక్క రవికృష్ణ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నటి నవ్య స్వామి.చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే వీరి రిలేషన్ పై ఈ జంట పెద్దగా స్పందించింది లేదు. ఇదిలా ఉంటే రవికృష్ణ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి అతడితో కేక్ కట్ చేయించింది నవ్య. 'నువ్ కోరుకున్న ప్రతీదీ నీకు దక్కాలని.. ఈ ఏడాది మొత్తం నీకు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.