English | Telugu

లైవ్‌లో టీవీ యాక్ట‌ర్‌ ఆత్మహత్యాయత్నం..!

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఎందరో ప్రజాలు జీవనోపాధిని కోల్పోయారు. చాలా మంది పేద ప్రజలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక ఆకలి చావులకు గురవుతున్నారు. ఈ వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై కూడా పడింది.

షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బెంగాలీ నటుడు సువో చక్రవర్తి అవకాశాలు లేక ఆర్థిక‌ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. బెంగాలీలో 'మంగళ చాందీ', 'మానస' వంటి సీరియల్స్ తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన చక్రవర్తి రీసెంట్ గా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్నాడు.

లైవ్‌లో మాట్లాడుతూ సడెన్ గా ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగేశాడు. ఇది చూసిన ఆయన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సువో చక్రవర్తిని హాస్పిటల్‌లో చేర్పించి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.