English | Telugu

లాక్‌డౌన్‌.. ఆగిపోయిన సీరియల్ షూటింగ్స్!

కరోనా వైరస్ అన్ని ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది లాక్ డౌన్ విధించినప్పుడు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీని కారణంగా సినీ, టీవీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మెల్లగా షూటింగ్స్ మొదలవ్వడంతో ఇక పరిస్థితులు చక్కబడతాయని అందరూ భావించారు. సెకండ్ వేవ్ మొదలైనప్పుడు కూడా షూటింగ్స్ ఆగలేదు. ఇటు సినీ, అటు టీవీ దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరిపారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ అవుతుండడంతో రీసెంట్ గా తెలంగాణలో ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది.

అప్పటికే వైరస్ ప్రభావంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు షూటింగ్స్ ఆపేశారు. ఇప్పుడు టీవీ రంగానికి చెందిన నిర్మాతలు కూడా షూటింగ్స్ ను ఆపేశారు. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాక్ డౌన్ సమయంలో సీరియల్ నటీనటులు, నిర్మాతలకు షూటింగ్ ను ఆపేయాలని సూచించింది. ప్యాచ్ వర్క్ చేసుకునే సీరియల్స్ మినహా.. మిగిలిన షూటింగ్ అన్నీ ఆగిపోయాయి. ఈ నిర్ణయానికి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కూడా తమ మద్దతుని తెలియజేసింది.

ఈ విషయంపై స్పందించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విజయ్ యాదవ్.. ఎప్పుడైతే లాక్ డౌన్ అనౌన్స్ చేశారో అప్పటినుండి షూటింగ్స్ జరగడం లేదని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలో కూడా షూటింగ్స్ ఆపేశారని చెప్పారు. అయితే కొందరు షూటింగ్స్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయని.. దానికి కారణం ఛానెల్ నిర్మాతల ఒత్తిడే కారణమై ఉంటుందని అన్నారు. కొంద‌రు సీరియ‌ల్ నిర్మాత‌లు సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌గారిని క‌లిసి త‌క్కువ మంది క్రూతో షూటింగ్స్‌ను కొన‌సాగించుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ అడగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.