English | Telugu

టాప్‌లో 'కార్తీక దీపం'.. నెక్స్ట్ ఏ సీరియల్?

తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమయ్యే 'కార్తీక దీపం', 'గృహలక్ష్మీ', 'వదినమ్మ', 'దేవత', 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్స్ కి సంబంధించిన రేటింగ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. బుల్లితెరపై ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి సంబంధించి టాప్ 5 రేటింగులువిషయానికొస్తే .. 'దేవత' సీరియల్ ఐదో స్థానానికి పడిపోయింది.

గతవారం టీఆర్పీలో 'దేవత' సీరియల్ నాలుగో స్థానంలో ఉండేది. గతంలో 'దేవత' సీరియల్ మూడో స్థానానికి కూడా చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. 'దేవత' సీరియల్ కు 'గుప్పెడంత మనసు' సీరియల్ నుండి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక 'జానకి కలగనలేదు' సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో నాల్గో స్థానానికి వెళ్లింది. ఇటీవల మొదలైన ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

తాజా రేటింగ్స్ లో 'గుప్పెడంత మనసు' మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. 'గృహాలక్ష్మీ' సీరియల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక ఎప్పటిలానే 'కార్తీకదీపం' భారీ రేటింగ్స్ తో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. మలయాళం సీరియల్ 'కరుతముత్తు' ఆధారంగా ఈ సీరియల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.