English | Telugu

సుధీర్ చెంప చెళ్లుమనిపించిన రష్మి.. వీడియో వైరల్!

బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జోడీకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెమెరా ముందు వీరు చేసే రొమాన్స్ ఓ రేంజ్ లో పడుతుంది. ఏ షో అయినా.. సుధీర్, రష్మీ జోడీ కనిపించిందంటే ఆ కిక్కే వేరు. అంతటి క్రేజ్ ఉన్న ఈ జోడీ తాజాగా విడుదలైన ఢీ ప్రోగ్రామ్ ప్రోమోలో ఊహించని షాకిచ్చింది. అందరి ముందే సుధీర్ చెంప చెళ్లుమనిపించింది ర‌ష్మి!

ముందుగా సుధీర్ కు రెండు ఇవ్వాలని ఉందంటూ వేదిక మీదకు వచ్చిన రష్మీ.. మొదట స్వీట్ హగ్ ఇచ్చి.. ఆ వెంటనే చెంపపై ఒక్కటి ఇచ్చింది. "ఫస్ట్ నీ పెర్ఫార్మన్స్ కు హగ్" అని చెప్పిన ఆమె.. సెకండ్, "నీ కాలు బాగాలేదు అయినా.. జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా సుధీర్ ఎప్పటికీ వెనుకాడడు." అంటూ సుధీర్ చెంపపై ప్రేమగా కొట్టింది. ఈ చర్యకు మొదట అందరూ షాక్ అయినప్పటికీ ఆ తరువాత తేరుకొని చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

చాలా కాలంగా ఈ జంట ప్రేమలో ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే ఈ జంటకు సంబంధించిన ఎప్పటికప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. తమ రిలేషన్ పై స్పందించిన సుధీర్, రష్మీ... తమ మధ్య నడిచేది వెండితెర కెమిస్ట్రీ తప్ప రియల్ లైఫ్ లో ఎలాంటి లవ్ ట్రాక్ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే వార్తలు హాట్ టాపిక్ అవుతుండడం చూస్తున్నాం.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.