English | Telugu

ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు..పెద్దాళ్ళను చంపేవాళ్లు మృగాలే

టేస్టీ తేజ ఒక జబర్దస్త్ కమెడియన్ గా అలాగే ఫుడ్ వ్లాగర్ అందరికీ పరిచయమే. అలాంటి తేజ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. '90s జనరేషన్ కదా అప్పటికి ఇప్పటికీ నువ్వు గమనించిన మార్పులు ఏంటి" అంటూ హోస్ట్ అడిగేసరికి "మార్పులు ఏమీ లేవు కానీ ఒక మార్పు గట్టిగా కనిపిస్తోంది. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా అది మన జనరేషన్ తోనే ఎండ్.

అప్పటిలో మమ్మీస్ అంతరించిపోయారు అనేవాళ్ళు కదా అలా మన జనరేషన్ తోనే ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు. ఇన్నోసెంట్ మదర్స్ లేరు ఇన్నోసెంట్ ఫాదర్స్ లేరు. అందరూ ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు పుట్టే వాళ్ళు కంచులే. మనం ఇప్పటివరకు మా పేరెంట్స్ ఇన్నోసెంట్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ రేపటి పిల్లలు మాత్రం మా పేరెంట్స్ ముదుర్లు అని చెప్పుకుంటారు. ఇది మేజర్ డిఫరెన్స్ నేను గమనించింది. ఐతే కొన్నేళ్ల క్రితం నేను చూసింది పేరెంట్స్ ని ఇంట్లోంచి గెంటేయడం లేదంటే అనాధాశ్రమాల్లో వేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నెమ్మదిగా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. మమ్మల్ని కన్నారు పెంచారు కదా మేము చూడాలి కదా అనుకుంటున్నారు.

ఐతే ఆర్ధిక ఇబ్బందుల వలన అలా చేస్తున్నారు. కొంతమంది ఐతే పెద్దవాళ్ళు అడ్డుగా ఉంటున్నారని చంపేస్తున్నారు వాళ్ళను మృగాలు అనాలి. ఒకప్పుడు అవకాశాలు లేక అలా చేశారనుకుంటే ఇప్పడు అవకాశాలు పెరిగాయి. ఐనా కూడా చేస్తున్నారంటే ఏమీ చేయలేక లాస్ట్ ఆప్షన్ గా అలా చేస్తున్నారు అంటే అది దరిద్రం దారుణం ఇంకా వాళ్ళు మృగాలే." అని చెప్పాడు టేస్టీ తేజ.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.