English | Telugu

30 ఏళ్ళు వచ్చాయి..ఇప్పుడు రిలేషన్ షిప్ ఏంటి..? పెళ్లి చేసుకుని పిల్లల్ని కను

బుల్లితెర మీద అష్షు రెడ్డి ఫుల్ ఫేమస్. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. అలాంటి అష్షు వాళ్ళ అమ్మతో కలిసి ప్రాంక్ వీడియో చేసింది. అది కూడా తన పెళ్లి, లివిన్ రిలేషన్ మీద. "అమ్మా నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి లివిన్ రిలేషన్ లో ఉండి అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా." అంది అష్షు. "సెట్ అవడం అంటే ఏంటి. సెట్ కాకపోతే ఎం చేస్తావ్.. ఒకవేళ పిల్లలు పుట్టేస్తే ఎం చేస్తావ్" అని అడిగింది అష్షు వాళ్ళ అమ్మ. "సెట్ అవకపోతే వదిలేస్తా. వేరే అతన్ని చూస్తా. ఒక వేళా పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఐదారు తరగతులకు వచ్చేవరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళ కలిసి వెళ్లి మా ఆయన్ని చేసుకుంటా" అని చెప్పింది.

"నా పిల్లల్ని నువ్వే పెంచాలి. మా ఆయన్ని నువ్వేం అనడానికి వీల్లేదు. ఐనా నువ్వు నాన్నతో లివిన్ లో లేకుండా ఎలా పెళ్లి చేసేసుకున్నావ్" అని అష్షు అడిగింది. " నీ పిల్లల్ని నేను పెంచాలా. ఎవడు నువ్వు సెట్ చేసుకునేవాడు చూపించు" అంటూ ఫైర్ అయ్యింది. " నేను పెళ్లి చేసుకున్నాను అంటే అది నమ్మకం. ఏంటి ఈ చెత్త లివిన్ రిలేషన్ లు. అసలు ఎవరు ఇలా చెప్తున్నాడు నీకు" అంది. "ఎదవా అని మా ఆయన్ని అనకు. ఆయన చాల మంచోడు" అని అష్షు అనేసరికి "ఎంత మంచోడో ఇప్పుడే తెలిసిపోతోంది అంది వాళ్ళ అమ్మ. "ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళండి ఇంకొకళ్ళు పిల్లల్ని చూసుకోండి" అని సలహా ఇచ్చేసరికి "ఎలా కుదురుతుంది ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఇల్లు గడవదు. నువ్వే వచ్చే మాకు వంట చేయాలి పిల్లల్ని చూడాలి అన్నీ నువ్వే చేయాలి" అంది అష్షు.

దానికి వాళ్ళ అమ్మ ఫుల్ ఫైర్ అయ్యింది. "ఇప్పుడు మనిషి మీద మనిషికి నమ్మకాలు లేవు అమ్మ. ఇప్పుడు అందరూ అలాగే నమ్మించి మోసం చేస్తున్నారు. నువ్వే వెనకబడిపోతున్నావు.ఫారెనర్ లా ఆలోచింహాలి " అంది అష్షు. "ఎటు వెళుతోంది అశ్విని మన సమాజం" అంది వాళ్ళ అమ్మ. ఇవన్నీ విన్నాక వాళ్ళ అమ్మ లేచి అష్షుని కొట్టేసింది. ఇక అష్షు అది ప్రాంక్ అని చెప్పేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చేస్తారా అని అడిగింది. ఫైనల్ గా అష్షు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద ప్రాంక్స్ చేయను మా అమ్మ కాళ్ళ మీద క్షమాపణ అడిగేసాను అని చెప్పింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.