English | Telugu

బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు ఆదినా సుధీరా ? ఎంఎల్ఏగా ఆది ఆ జిల్లా నుంచి పోటీ

2025 కొన్ని రోజుల్లో బైబై చెప్పేయబోతోంది. డిసెంబర్ 31st రావడానికి ఎన్నో రోజులు లేదు. ఇక ఈ సందర్భంగా కం 2 ఢీ పార్టీ పేరుతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ జరపబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో జాఫర్ కనిపించాడు. లాస్ట్ లో ఆదిని, సుధీర్ ని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేసాడు. "ఆది ఒక్కోసారి షోలో వేసే పంచులు వలన అవతలి వారి మనోభావాలు దెబ్బతింటాయని తెలిసిన పట్టించుకోని పరిస్థితి ఉండదా" అని ఆదిని అడిగాడు. "అవన్నీ ఉండవండి మన దగ్గర" అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎంఎల్ఏగా ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు..ఆది నాకు ఆ సమాచారం ఉంది" అని అన్నాడు జాఫర్. జిల్లా పేరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన ఆది అన్నాడు జాఫర్. ఐతే ఇంతకు ఏ జిల్లా అనే పేరు మాత్రం ప్రోమోలో వినిపించనివ్వలేదు. "ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య రీజన్" అంటూ కావ్యని కూడా ఎన్కౌంటర్ చేసాడు.

ఇక ప్రోమో స్టార్టింగ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ జాఫర్ వచ్చి "ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ హూ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆదినా సుధీర్ ఆ అని" అడిగాడు. ఈ ప్రశ్నకు నెటిజన్స్ ఐతే సుధీర్ పేరును ఎక్కువగా మెన్షన్ చేశారు. అలాగే కొంతమంది సుధీర్ ని కొంతమంది ఆదిని ఉద్దేశిస్తూ రిప్లైస్ ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరి కంబినేషన్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్పాడు. "సుధీర్ అన్న యాంకర్ గా ఉన్నా అభిమానిస్తాం, హీరోగా ఉన్నా అభిమానిస్తాం, కమెడియన్ గా ఉన్నాఅభిమానిస్తాం, మాకు కావాల్సింది కేవలం సుధీర్ అన్న మాత్రమే, ఆది అన్న కామెడీ కింగ్' అంటూ నెటిజన్స్ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.