English | Telugu

బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు ఆదినా సుధీరా ? ఎంఎల్ఏగా ఆది ఆ జిల్లా నుంచి పోటీ

2025 కొన్ని రోజుల్లో బైబై చెప్పేయబోతోంది. డిసెంబర్ 31st రావడానికి ఎన్నో రోజులు లేదు. ఇక ఈ సందర్భంగా కం 2 ఢీ పార్టీ పేరుతో ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ జరపబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో జాఫర్ కనిపించాడు. లాస్ట్ లో ఆదిని, సుధీర్ ని కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేసాడు. "ఆది ఒక్కోసారి షోలో వేసే పంచులు వలన అవతలి వారి మనోభావాలు దెబ్బతింటాయని తెలిసిన పట్టించుకోని పరిస్థితి ఉండదా" అని ఆదిని అడిగాడు. "అవన్నీ ఉండవండి మన దగ్గర" అని ఆన్సర్ ఇచ్చాడు. "ఎంఎల్ఏగా ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు..ఆది నాకు ఆ సమాచారం ఉంది" అని అన్నాడు జాఫర్. జిల్లా పేరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన ఆది అన్నాడు జాఫర్. ఐతే ఇంతకు ఏ జిల్లా అనే పేరు మాత్రం ప్రోమోలో వినిపించనివ్వలేదు. "ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య రీజన్" అంటూ కావ్యని కూడా ఎన్కౌంటర్ చేసాడు.

ఇక ప్రోమో స్టార్టింగ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ జాఫర్ వచ్చి "ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్ హూ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆదినా సుధీర్ ఆ అని" అడిగాడు. ఈ ప్రశ్నకు నెటిజన్స్ ఐతే సుధీర్ పేరును ఎక్కువగా మెన్షన్ చేశారు. అలాగే కొంతమంది సుధీర్ ని కొంతమంది ఆదిని ఉద్దేశిస్తూ రిప్లైస్ ఇచ్చారు. అలాగే ఈ ఇద్దరి కంబినేషన్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్పాడు. "సుధీర్ అన్న యాంకర్ గా ఉన్నా అభిమానిస్తాం, హీరోగా ఉన్నా అభిమానిస్తాం, కమెడియన్ గా ఉన్నాఅభిమానిస్తాం, మాకు కావాల్సింది కేవలం సుధీర్ అన్న మాత్రమే, ఆది అన్న కామెడీ కింగ్' అంటూ నెటిజన్స్ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.