English | Telugu

సింగర్ సునీతతో అనుబంధం గురించి దర్శకుడి కామెంట్స్!

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా మంది హీరో, హీరోయిన్లను, సింగర్లను పరిచయం చేశారు. దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు చేశారు. ఇప్పుడు బుల్లితెరపై తొలిసారిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. జీ ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోలో ఎస్వీ కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు సింగర్ సునీత, రేణు దేశాయ్ కూడా జడ్జిలుగా ఉన్నారు.

వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సింగర్ సునీతతో ఉన్న పరిచయం, ఆమెతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. 'డ్రామా జూనియర్స్'లో పిల్లలు వేసిన ఓ స్కిట్ లో సునీత, రేణు దేశాయ్, కృష్ణారెడ్డిలను వాడేశారు. దీంతో ఆ స్కిట్ ముగిసిన తరువాత ముగ్గురు జడ్జిలు స్టేజ్ మీదకు వెళ్లి డాన్స్ చేశారు.

ఆ తరువాత సునీతతో మాట్లాడుతూ కృష్ణారెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఆయన్ను మొదటిసారి చూసినప్పుడే తండ్రిలా అనిపించారని సునీత అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఎగిరే పావురమా' సినిమాలో 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' అనే పాటను పాడారు సునీత. అప్పటినుండి వీరిద్దరి ప్రయాణం మొదలైంది. "ఈ పాట ఆడిషన్స్ జరిగే సమయంలో మొదటిసారి సునీత ఇంటికి అలా వస్తుంటే నా కూతురే నడిచి వస్తున్నట్లు అనిపించింది." అంటూ సునీతపై తనకున్న ప్రేమను బయటపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.