English | Telugu

దీప చనిపోతుందా..? మ‌రి 'కార్తీక దీపం' క‌థ ఎలా న‌డుస్తుంది?

'కార్తీకదీపం' సీరియల్ లో దీప (ప్రేమి విశ్వనాధ్) పాత్ర ముగిసిపోయిందా..? ఇక సీరియల్ లో వంటలక్క కనిపించదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. దానికి కారణం నేటి ఎపిసోడే. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో దీప ఎలాంటి తప్పు చేయలేదని.. కవలలిద్దరూ తన కన్నబిడ్డలేననే విషయం కార్తిక్ కు తెలిసిపోవడం, దీప చావుబతుకుల మధ్య సౌందర్య చేతుల్లో ప్రాణాలు వదిలేయడం వంటి సన్నివేశాలను చూపించారు.

పైగా ఎప్పటికప్పుడు లొకేషన్ అప్డేట్స్ ఇస్తూ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు చేరువలో ఉండే ప్రేమి విశ్వనాధ్ కూడా పదిరోజుల క్రితమే కేరళ వెళ్లిపోవడం. ఇప్పటివరకు సీరియల్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో.. దీప నిజంగానే సీరియల్ లో చనిపోతుందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇన్నాళ్లు కార్తిక్ నిజం తెలుసుకోకపోవడమనే పాయింట్ తో సీరియల్ నడిపిస్తోన్న దర్శకుడు ఈరోజు ఆ ట్విస్ట్ ను రివీల్ చేశాడు.

దీంతో నిజంగానే దీప పాత్ర ముగిసిపోతుందేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. టాప్ రేటింగ్స్ దూసుకుపోతున్న నంబర్ వన్ సీరియల్ 'కార్తీకదీపం'. ఇలాంటి సీరియల్ కు అప్పుడే ముగింపు వేస్తారనుకుంటే పొరపాటే. ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మరో మూడేళ్లపాటు కంటిన్యూ అవుతుందని దర్శకుడు చెప్పాడు. కానీ సీరియల్ లో దీప పాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి కథను నడిపించడమంటే సాహసమే. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.