English | Telugu

దీప చనిపోతుందా..? మ‌రి 'కార్తీక దీపం' క‌థ ఎలా న‌డుస్తుంది?

'కార్తీకదీపం' సీరియల్ లో దీప (ప్రేమి విశ్వనాధ్) పాత్ర ముగిసిపోయిందా..? ఇక సీరియల్ లో వంటలక్క కనిపించదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. దానికి కారణం నేటి ఎపిసోడే. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో దీప ఎలాంటి తప్పు చేయలేదని.. కవలలిద్దరూ తన కన్నబిడ్డలేననే విషయం కార్తిక్ కు తెలిసిపోవడం, దీప చావుబతుకుల మధ్య సౌందర్య చేతుల్లో ప్రాణాలు వదిలేయడం వంటి సన్నివేశాలను చూపించారు.

పైగా ఎప్పటికప్పుడు లొకేషన్ అప్డేట్స్ ఇస్తూ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు చేరువలో ఉండే ప్రేమి విశ్వనాధ్ కూడా పదిరోజుల క్రితమే కేరళ వెళ్లిపోవడం. ఇప్పటివరకు సీరియల్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో.. దీప నిజంగానే సీరియల్ లో చనిపోతుందా..? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇన్నాళ్లు కార్తిక్ నిజం తెలుసుకోకపోవడమనే పాయింట్ తో సీరియల్ నడిపిస్తోన్న దర్శకుడు ఈరోజు ఆ ట్విస్ట్ ను రివీల్ చేశాడు.

దీంతో నిజంగానే దీప పాత్ర ముగిసిపోతుందేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. టాప్ రేటింగ్స్ దూసుకుపోతున్న నంబర్ వన్ సీరియల్ 'కార్తీకదీపం'. ఇలాంటి సీరియల్ కు అప్పుడే ముగింపు వేస్తారనుకుంటే పొరపాటే. ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మరో మూడేళ్లపాటు కంటిన్యూ అవుతుందని దర్శకుడు చెప్పాడు. కానీ సీరియల్ లో దీప పాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి కథను నడిపించడమంటే సాహసమే. చూడాలి మరి ఏం జరుగుతుందో!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.