English | Telugu

తమ్ముడితో మేకప్ వేయించుకున్న శ్రీముఖి!

బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి.. బిగ్ బాస్ షోతో తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బుల్లితెరపై ఎలాంటి షోలు లేవు. ఒకప్పుడు వరుస షోలతో బిజీగా ఉండేది శ్రీముఖి. 'పటాస్' షోతో బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకుంది.

అనంతరం బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లింది. ఫైనల్స్ వరకు నిలిచి రన్నరప్ గా సరిపెట్టుకుంది. అయితే గతకొంతకాలంగా ఆమెకి ఏ షో దొరకడం లేదు. స్టార్ట్ మ్యూజిక్ షో సుమ చేతికి వెళ్లింది. 'బొమ్మ అదిరింది' షో ఏమైందో కూడా తెలియదు. ప్రస్తుతం సినిమా ఈవెంట్స్ ఏమీ జరగడం లేదు. దీంతో శ్రీముఖి ఖాళీగానే ఉంటోంది. సోషల్ మీడియాను వాడుకుంటూ నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది.

శ్రీముఖి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ లో పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. మొన్నామధ్య చేసి 'ఉమేనియా' అనే షో బాగా క్లిక్ అయింది. తాజాగా శ్రీముఖి ఓ వీడియో కోసం తన తమ్ముడిని వాడేసింది. సుశృత్ తనకు మేకప్ వేశాడని చెబుతూ ఆ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది శ్రీముఖి. అలా సుశృత్ లో ఉన్న టాలెంట్ ను అందరికీ పరిచయం చేసింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.