English | Telugu

కాళ్ల‌కు మొక్కిన ఆర్టిస్టులు.. భావోద్వేగానికి గురైన రాశి!

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో 'స్టార్ట్ మ్యూజిక్' షో ఒకటి. బిగ్ బాస్ కంటెస్టెంట్లను, టీవీ ఆర్టిస్ట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చి వారితో రకరకాల టాస్క్ లు చేయిస్తూ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది సుమ. తాజాగా ఈ షోకి 'జానకి కలగనలేదు' టీమ్ వచ్చింది. ఈ సీరియల్ లో సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె భర్తగా, కొడుకుగా అలానే సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారు అతిథులుగా వచ్చారు.

'ఇస్మార్ట్ అమ్మ వర్సెస్ ఇన్నోసెంట్ అబ్బాయి' అంటూ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. గెస్ట్ లను తన ఫన్నీ పంచ్ లతో ఓ ఆట ఆడేసుకున్న సుమ.. ఆ తరువాత రాశిని ఉద్దేశిస్తూ.. 'మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అవుతుందండి' అని ప్రశ్నించింది. దానికి రాశి.. 'నా ఏజ్ ఎంతో అంత' అని చెప్పగా.. 'ఓ.. అయితే నా అంతే' అంటూ కౌంటర్ వేసింది సుమ.

అనంతరం రాశి ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. ఇదే షోలో సెలబ్రేషన్స్ చేశారు. ఆమె లాంటి ఆర్టిస్ట్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కో ఆర్టిస్ట్ లంతా ఆమె ముందు మోకాళ్లపై నుంచొని నమస్కారం పెట్టగా.. భావోద్వేగానికి గుర‌వుతూ వారిని ఆప్యాయంగా హత్తుకుంది రాశి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.