English | Telugu

'అరుంధతి' స్పూఫ్‌తో అదరగొట్టిన లాస్య, రవి!

బుల్లితెర మీద రవి, లాస్యల కాంబినేషన్ అప్పట్లో పెద్ద హిట్. ఉదయం పాటల ప్రోగ్రాంతో పలకరించే ఈ జంట మరికొన్ని టీవీ షోలలో కూడా సందడి చేసేది. ఆ తరువాత వాళ్ల క్రేజ్ తగ్గింది. పైగా ఇద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. అలా దాదాపు ఐదేళ్లుగా వీరు విడిగానే ఉన్నారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఈ మధ్య మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు.

అంతేకాదు, ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'కామెడీ స్టార్స్' షోలో సందడి చేస్తున్నారు. రవితో కలిసి ఒకప్పటి మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది లాస్య. 'కామెడీ స్టార్స్' షోలో టాలీవుడ్ హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేస్తూ కామెడీ పండిస్తున్నారు. గతంలో 'ఉప్పెన', 'నరసింహ', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' వంటి సినిమాలను స్పూఫ్ చేసి కామెడీ పండించారు.

తాజాగా 'అరుంధతి' సినిమాను స్పూఫ్ చేశారు. అరుంధతిగా లాస్య‌.. పశుపతిగా ర‌వి వేషాలు వేశారు. రవి స్టేజ్ పైకి రాగానే 'లాస్య ఆంటీ అయిందే' అంటూ పంచ్ వేసేశాడు. ఆ తరువాత లాస్య నవ్వుని చూసుకుంటూ 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాట వేసుకున్నాడు రవి. ఐదేళ్లుగా నీకో విషయం చెబుదామనుకుంటున్నా అంటూ రవిపై సమాధి వేసి మూసేస్తూ 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ మెసేజ్ ఇచ్చింది లాస్య. ఆ త‌ర్వాత స‌మాధిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, "ఐదేళ్లు సమాధిలో కుళ్ల‌బెట్టిన నిన్ను ఈ రోజు వ‌ద‌ల బొమ్మాళీ".. అంటూ హ‌ల్‌చ‌ల్ చేశాడు ర‌వి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.