English | Telugu

భారీ-క్రేజీ సినిమాల‌న్నీ 'స్టార్ మా'కే!

ఈరోజుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు భారీ లాభాలను పొందుతున్నారు. ఓటీటీ హక్కుల్లో ఎంత పోటీ ఉందో శాటిలైట్ హక్కుల్లో కూడా అంతే పోటీ నెలకొంది. ఇక అందులో స్టార్ మా ఛానెల్ శాటిలైట్ హక్కులను అందుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో పాటు రాబోయే ఆసక్తికర సినిమా హక్కులను కూడా స్టార్ మా సొంతం చేసుకుంది.

ఒకప్పుడు సినిమా విడుదలైన చాలా కాలానికి టీవీల్లో వచ్చేది. కానీ ఈరోజుల్లో మాత్రం రెండు, మూడు వారాల తరువాత ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఆ తరువాత టీవీలలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మా సినిమాలపై పెట్టుబడులు గట్టిగానే పెడుతోంది. స్టార్ మా ముందుగా రెండు పాన్ ఇండియా సినిమాలను దక్కించుకోవడం విశేషం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు.

ఇక సూప‌ర్ క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా 'పుష్ప' హక్కులు, మ‌హేశ్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ ఫిల్మ్ 'స‌ర్కారువారి పాట' హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా 'అఖండ'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా హక్కులను కూడా దక్కించుకుంది 'స్టార్ మా'. వీటితో పాటు మీడియం బడ్జెట్ సినిమాలను కూడా స్టార్ మా వదలడం లేదు. 'ఖిలాడి', 'లవ్ స్టోరీ', 'టక్ జగదీశ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' హక్కులను కూడా దక్కించుకుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.