English | Telugu

ఇల్లు కొని హైద‌రాబాదీ అయిన‌ మోనాల్!

హీరోయిన్‌గా తెలుగులో రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్‌ను బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది గుజ‌రాతీ అమ్మాయి మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె అఖిల్, అభిజిత్‌లతో క్లోజ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అభిజిత్‌తో గొడవలు, అఖిల్‌తో స్నేహం వంటి అంశాలతో మోనాల్ హాట్ టాపిక్ అయ్యేది. మొత్తానికి ఈ షోతో మోనాల్‌కి గ్లామర్ పరంగా క్రేజ్ ఏర్పడింది.

హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ వారికి టచ్‌లో ఉంటోంది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

వరుస ఆఫర్లు రావడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చాలని భావించిందట మోనాల్. దీనికోసం హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. హైదరాబాద్ లో తనకొక ఇల్లు దొరికిందని.. సో.. ఇప్పుడు తను కూడా అఫీషియల్ గా హైదరాబాదీ అయినట్లు చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.